రైతు కుటుంబాలను ఆదుకోవడానికి నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలని వ్యవసాయాధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విత్తనాల పంపిణీ, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, ఈ క్రాప్ నమోదు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.. కరోనా సమయంలో చాలా కష్టం అనుభవించారని, వారిని ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రబీలో అవసరమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. వేరుశనగ, మినుగులు, పెసలు, రాగులు వంటి విత్తనాల సరఫరాపై సమీక్షించారు. మండలవారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారికి అవసరమైన విత్తనాల వివరాలను తెలుసుకుని సరఫరా చేయాలన్నారు. గ్రామ సచివాలయాలలో సంక్షేమ పథకాల వివరాలతో పాటు లబ్దిదారుల వివరాలను ప్రదర్శించాలని, అదే విధంగా రైతు భరోసా కేంద్రాలలో సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా వివరాలు, ఇ-క్రాపింగ్ నమోదు వివరాలను తప్పని సరిగా ప్రదర్శించాలని చెప్పారు. ఆర్.బి.కె.లలో కియోస్కులు సరిగా పనిచేయాలని అన్ని ఆర్.బి.కె.లలోను కియోస్కులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్.బి.కె.లను సక్రమంగా నిర్వహించాలని, వ్యనసాయాధికారులు ఆర్.బి.కె.లను సందర్శించాలని తెలిపారు. శతశాతం ఈ క్రాప్ పూర్తి కావాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు రిజిస్టర్ కావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిశంబరు మొదటి వారం నాటికి సిధ్ధం చేయాలన్నారు. తేమ శాతాన్ని పరీక్షించే యంత్రాలు, అవసరమైన పరికరాలతో సిద్ధం గా ఉంచాలన్నారు. ధాన్యం నిలువకు కావలసిన కెపాసిటీని పెంచడం జరిగుందన్నారు. ఒరిస్సా నుండి ధాన్యం రాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన అన్ని చర్యలతో ముందుగా నే కొనుగోలు కేంద్రాలను సిధ్ధం చాయాలన్నారు. అనంతరం, సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మాట్లాడుతూ, స్వఛ్ఛంద సంస్థలకు కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను అప్పగించడం జరిగిందని తెలిపారు. వారి పరిధిలోని కేంద్రాలకు అవసరమైన సామగ్రిని, పరికరాలను అందిస్తామని వాటిని సక్రమంగా నిర్వహించాలని జె.సి. తెలిపారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, విత్తనాభివృధి సంస్థ జిల్లా మేనేజర్, పి.సి.సి. ఇన్-ఛార్జ్ లు, ఎ.డి.ఎ.లు, ఏ.ఓ.లు, వెలుగు పి.ఎ.సి.ఎస్.లు, ఎఫ్.పి.ఓ.లు, స్వఛ్ఛంద డైరక్టర్లు ఎం.ప్రసాదరావు, భూదేవి, కైలాష్ తదితరులు హాజరైనారు.
రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేస్తున్నట్లు చెప్పారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని ఆయన పేర్కొంటూ సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన పంటకు 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల సహాయాన్ని అందించామని, అక్టోబరులో కురిసిన వర్షాలకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన రైతులకు రెండు నెలల లోపే పెట్టుబడి రాయితీగా రూ.132 కోట్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు. అమూల్ సంస్ధతో అనుసంధానం చేసి పాలసేకరణను ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు సి.యం ప్రకటించారు.
వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారు.
ఇచ్చాపురంకు చెందిన రైతు ఇసురు యాదవ్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెట్టుబడి రాయితీ లభించిందన్నారు. పంట నష్టపోయిన నెల రోజులు లోపు పెట్టుబడి సహాయం అందడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి మంచి దార్శనికుడని, రైతుల పక్షపాతి అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేసే ముఖ్య మంత్రి దొరకడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు.
కోటబొమ్మాళి మండలానికి చెందిన రోణంకి మల్లేశ్వర రావు మాట్లాడుతూ సున్నా వడ్డీ తనకు లభించిందన్నారు. రుణాలు తీసుకున్న వారికి లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ అమలు చేయడం మంచి పరిణామమని అన్నారు. రైతులను ప్రోత్సహించే ప్రభుత్వం అన్నారు. లక్షలాది రైతులకు ఇది భరోసాగా నిలుస్తుందని మల్లేశ్వర రావు అన్నారు. ముఖ్య మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి దీర్ఘకాలం పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా రైతులకు చెక్కులను పంపిణీ చేసారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఎడి బివి తిరుమల రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ కరిమి రాజేశ్వర రావు., దువ్వాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక వ్యవసాయ రూపకర్త రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో శాసన సభాపతి మాట్లాడుతూ దేశంలోనే ప్రత్యేక బడ్జెట్ ను రూపకల్పన చేయడం చారిత్రాత్మకమన్నారు. సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేయడం జరిగిందన్నారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం సంతోషదాయకమని కొనియాడారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం రైతులకు చెల్లింపు చేయడం విశేషమని పేర్కొన్నారు. రైతులకు మద్ధతు ధర ప్రకటన, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిడ్డంగుల సౌకర్యం, ధరల విశ్లేషణ, మార్కెంటింగు విశ్లేషణ వంటి అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. గ్రామీణ స్ధాయిలో రైతులకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రైతు కార్యక్రమాలను ప్రజలు చరిత్రలో మరిచిపోలేరని ఆయన ప్రశంసించారు. రైతుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.
రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడమే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా భావించే రోజును త్వరలో ముఖ్య మంత్రి తీసుకురానున్నారని చెప్పారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్న ముఖ్య మంత్రి రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా భారం కాకుండా సి.యం చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. జల కళ కార్యక్రమం ద్వారా పుష్కలంగా సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రైతుకు సాగు నీరు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం జలకళ అన్నారు. ఉచిత విద్యుత్ ను 9 గంటల పాటు అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడవడానికి రైతు అతి ముఖ్యమైన వ్యక్తి అని సి.యం భావిస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి నిలుస్తారని ఆయన అన్నారు.
విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన అవసరమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కరోనా భారీన పడకుండా వినూత్న ప్రయోగం చేసి డిజిటల్ ఐడి కార్డును శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస ఏపిబాలయోగి గురుకుల విద్యార్ధులు రూపొందించారు. ఈ కార్డును తయారు చేసిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నివాస్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. భౌతిక దూరం పాటించడం ద్వార వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్లో పరికరాలు వినియోగించి డిజిటల్ ఐడి కార్డు ను రూపొందించారు. టెక్నికల్ ట్రైనర్ శివ సంతోషకుమార్ పాణిగ్రాహి విద్యార్థుల మెదడుకు పదును పెట్టి తక్కువ ఖర్చుతో ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. తేలికపాటి బరువుతో నిత్యం మెడలో వేసుకునేలా డిజిట్ ఐడి కార్డును ఆ పాఠశాలలో 9వతరగతి చదువుతున్న యాగాటి యశ్వంత్ , పెయ్యల గిరి సహాకారంతో దీన్ని తయారు చేశారు. ఐడి కార్డుకు సరిపడే ఎల్ సిడి, డిఎస్ ప్లే, దూరం గుర్తించేందుకు అల్ట్రాన్ సోనిక్ సెన్సర్ , శబ్దం వచ్చేందుకు బ్యాటరీ , బజర్, ఎల్ ఇడిలను పాణిగ్రాహి వినియోగించారు. సరికొత్త టెక్నాలజీని రూపొందేంచే ఈకార్డు తయారీకి 200 రూపాయలు వినియోగించుకుని తయారు చేసారు. ఆరు అడుగుల దూరం కన్నా దగ్గరకి ఎవరైనా వస్తే ఈ ఐడికార్డులో ఉన్న సెన్సార్ దాన్ని గుర్తించి అలారం మోగుతుంది. డిజిటల్ కార్డులో ఉన్న ఎరుపు రంగు విద్యుత్ బల్బు వెలిగి వారిని హెచ్చరించేలా ఆటో మెటిక్గా మోగేలా ఏర్పాటు చేశారు. మెజరింగ్ ఐడీకార్డుగా నామ కరణం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఉన్న పరికరాలతోనే డిజిటల్ మెజరింగ్ ఐడీకార్డులు విద్యార్ధుల రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వేళ విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక్కోకార్డుకు రెండు వందల రూపాయలు ఖర్చుకాగా దీని భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరింత టెక్నాలజీ వినియోగించి డిజిటల్ కార్డు సైజ్ ను తగ్గించి తయారు చేయవచ్చుని శివసంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం జిల్లా సమన్వయ అధికారి వై.యశోదా లక్ష్మీ, ప్రిన్సిపాల్ డి.దేవేంద్ర రావు, సూపరింటెండెంట్ పి.చంద్రయ్య, కె.వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం మామిడిపల్లి గ్రామ సచివాలయ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ బి.సతీష్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ వార్డు, గ్రామ సచివాలయ విభాగం జేసీ డా.కె.శ్రీనివాసులు సోమ వారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇసుక తరలింపుకు సంబంధించిన వే బిల్లు ఎస్ 3 ఫారంను పంచాయతీ కార్యదర్శి మరియు డ్రాయింగ్ అధికారి అనుమతి లేకుండా జారీ చేయడమే కాకుండా, సంతకం ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. లబ్దిదారుల నుండి ఎస్ 3 ఫారం జారీ చేయుటకు కొంత సొమ్ము వసూలు చేసినట్లు నిర్ధారణ జరగింది. ఈ మేరకు క్రమశిక్షణా చర్యలలో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
క్రీడాకారుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పవర్ జిమ్ లు ఎంతగానో ఉపయోగపడాతయని ఈస్ట్ కోస్టు రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. సోమవారం ఆయన రైల్వేమహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షులు శాలినీ శ్రీవాస్తవ తో కలిసి నూతన జిమ్ ను ప్రారంభించారు. క్రీడాకారుల ఫిట్ నెస్ కోసం ఎయిర్ కండీషన్డ్ హైటెక్ జిమ్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ జిమ్ లోక్రాస్ ఫిట్, స్పిన్నింగ్, బాడీ కామండ్, ఏరోబిక్స్ సహా పలు బాడీ ఫిట్ నెస్ లు చేసుకోవడాని వీలుగా 2700 చదరపు మీటర్లలో దీనిని విస్తరించినట్టు పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన కవర్ డ్రైవ్ జిమ్ ప్రపంచ స్థాయి క్రీడాకారులకు, ఇక్కడ నిర్వహించే భారత శిబిరాలకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే క్రీడా విభాగం అధికారులు, సిబ్బంది, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన పై సత్వరం పరిష్కారం చూపించాలని సిబ్బందిని క్రైమ్ డియస్పి మురళీధర్ ఆదేశించారు. సోమవారం యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఈరోజు స్పందనలో జిల్లా యస్.పి కార్యాలయానికి 25 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియజేశారన్నారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి సమాచారం కూడా అందిస్తామన్నారు. ముఖ్య సమస్యలపై పోలీసు అధికారులను కూడా యస్.పి స్పందన కార్యక్రమానికి పిలిపించి ఇక్కడే స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు డిఎస్పీ వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురము జిల్లాలో రేపు (17.11.2020) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలను కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాకి వివరించారు. ఆయా కేంద్రాల ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆ కరోనా పరీక్షలు కేంద్రాలు వివరాలు తెలుసుకుంటే..1. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురం, 2. హమాలీ కాలనీ యూపిహెచ్ సి, 3. మారుతీ నగర్ (మంగలవారి వీధి) యూపిహెచ్ సి, 4. నాయక్ నగర్ యూపిహెచ్ సి, 5. నీరుగంటి వీధి యూపిహెచ్ సి, 6. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 7. పెనుకొండ డివిజన్, 8. కదిరి డివిజన్, 9. అనంతపురం డివిజన్,10. కళ్యాణదుర్గం డివిజన్,11. ధర్మవరం ఇలా ప్రకటించిన డివిజన్ లలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మాస్కుధారణ, సామాజిక దూరం పాటిస్తూనే, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలన్నారు. అదేసమయంలో కరోనా భారిన పడిన వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులు ఐసోలేషన్ ఉండి బలవర్ధక ఆహారం తీసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు సూచిస్తున్నారు.
విశాఖజిల్లాలో జనవరి 1 , 2021 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ERO) , సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(AERO) తో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ - 2021 పై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్డు ప్రకారం ఈ రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని కోరారు. ఈ రోజు నుంచి డిసెంబరు 15వ తేది వరకు ముసాయిదా ఓటర్ల జాబితా పై ఫిర్యాదులను స్వీకరించాలని ఈ.ఆర్.ఒ., ఎ.ఈ,ఆర్.ఒ లను ఆదేశించారు. నవంబరు 28, 29 తేదీలలో , డిసెంబరు 12,13వ తేదీలలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించి పోలింగ్ బూత్ స్థాయిలో అభ్యంతరాలు, ఫిర్యాదులపై ధరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. కొత్తగా ఓటర్ల నమోదు మొదలుకొని మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం నిర్ణీత ప్రొఫార్మాలయిన 6,7,8, 8ఎ లలో బూత్ లెవెల్ అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలకు ఈ సమాచారాన్ని అందించాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కూడా కోరారు. బూత్ లెవల్ అధికారులు స్థానికంగా అందుబాటులో వుండి అవసరమైన ఫ్రొఫార్మాలను సిద్థంగా వుంచుకోవాలని కోరారు. తొలగింపులపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో వుంచాలని అన్నారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహించాలని తెలిపారు. “ KNOW YOUR B.L.O” ప్రచారం నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారుల వివరాలు అందరికీ తెలియజేయాలని కోరారు. ఆన్ లైన్ లో www.nvsp.in నందు నమోదు చేసుకోవడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతపురం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ లలో 85 - 90 శాతం సర్వీసులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి మాత్రమే వస్తున్నాయని, అలాకాకుండా సచివాలయాలకు వచ్చే వాటిలో ఇతర శాఖలకు చెందిన సర్వీస్ రిక్వెస్టులు మరిన్ని పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని 1 & 4 సచివాలయాలను, కొర్రపాడు -2 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 540 సర్వీస్ రిక్వెస్ట్ లను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అన్ని శాఖలకు సంబంధించిన సర్వీసులు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువ రిక్వెస్ట్ లు రాగా, ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి రిక్వెస్ట్ లు వస్తున్నాయని, విద్యుత్ శాఖ నుంచి కూడా సర్వీసులు పెంచేలా చూడాలన్నారు. ప్రజలకు వాలంటీర్ల ద్వారా సచివాలయాల సేవలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సచివాలయాలకు అన్ని శాఖల సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గడువు తీరిన సర్వీసులు ఒకటి కూడా పెండింగ్ ఉంచడానికి వీలు లేదని, ఎప్పటికప్పుడు అన్ని సర్వీసులను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బుక్కరాయసముద్రం 1 & 4 గ్రామ సచివాలయాలలో ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఏయే సర్వీసులు ఎక్కువగా వస్తున్నాయి, ఇతర శాఖలకు సంబంధించి ఎందుకు సర్వీసులు తక్కువగా వస్తున్నాయి అనే విషయాలపై సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, సిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన గురించి చైర్మన్ కు వివరించారు. శ్రీసిటీ ప్రణాళిక, అభివృద్ధి పట్ల భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికులకు, ముఖ్యంగా మహిళలకు తగినన్ని ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. వెనుకబడిన ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా మార్చడంలో శ్రీసిటీ యాజమాన్యం కృషిని ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పర్యటనలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసి పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు. ఎవర్టన్ టీ పరిశ్రమను సందర్శించి, అక్కడ కార్మికులతో చర్చించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ సందర్శన పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ఈ ప్రాంత అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో ఆయనకు వున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియచేస్తుంది చెవిరెడ్డి పేర్కొన్నారు.
శ్రీకాకుళం సహకార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని డివిజనల్ సహకార అధికారి ఎ.వి.రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డివిజనల్ సహకార అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సహకార పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన సహకార సంస్థల శిక్షణ వలన కలిగే ప్రయోజనాలు గురించి సిబ్బందికి వివరించారు. సిబ్బంది తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. జిల్లా సహకార అధికారి కె.మురళీకృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్థ యొక్క వ్యాపారాలను పెంచి, సంస్థలో ఉన్న సిబ్బందికి పనికల్పించడమే కాకుండా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. రాజమండ్రి సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా శిక్షణ మరియు విద్య పునశ్ఛరణ అనే అంశంపై వివరించారు. సంఘ డైరక్టర్ పి.లక్ష్మణరావు మాట్లాడుతూ సంఘ పూర్వపరాలను తెలుసుకోవడం వలన తదుపరి కాలంలో సంస్థ అభివృద్ధికి ఏ విధంగా కృషిచేయాలనే విషయం తెలుస్తుందని , ఆ దిశగా సిబ్బంది పనిచేయాలని కోరారు. సంఘ బిజినెస్ మేనేజర్ గంగు లక్ష్మణకుమార్ మాట్లాడుతూ సంఘం యొక్క వ్యాపార అభివృద్ధి వివరాలను తెలియజేస్తూ సంఘం చేపడుతున్న వ్యాపార కార్యకలాపాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని, అందులో లోటుపాట్లను గమనించి వాటిని నివృత్తి చేసుకునే విధంగా సిబ్బంది పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిష్టర్ కె.రాము, యస్.భూషణరావు, సంఘ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 84 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు సోమవారం 84 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రామీణ ముఖ చిత్రం మారే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అయిన సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 పూర్తి కావడమే లక్ష్యంగా నరేగా అనుబంధ శాఖలతో సమీక్ష నిర్వహించామని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నరేగా అనుసంధాన శాఖలతో వివిధ పనుల పురోగతిపై సమీక్ష అనంతరం ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి తో కలసి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లు కేటాయించి సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, బి ఎం సి యు లు , వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలు సాగాలని ముఖ్యమంత్రి సూచించారని త్వరగా పూర్తిచేస్తే అభివృధ్ధి పనులకు మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారాని అన్నారు. జిల్లాలో నిర్మాణాలు ఆశాజనకంగా వున్నా రాష్ట్రంలో మెదటి స్థానం రావాలని సూచించమని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఈ నిర్మాణాలు పూర్తి అయితే ప్రజలకు పౌర సేవలు వైద్యం, పశువైద్యం, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటు, పాలసేకరణ కేంద్రాలతో గ్రామ స్థాయిలోనే అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గతం ప్రభుత్వంలో చేసిన పనులకు రూ.5 లక్షలలోపు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి అయి అభియోగాలు లేకుండా వున్న పనులకు సమబంధించిన బకాయిలు త్వరలో చెల్లించనున్నామని, మరికొన్ని కోర్టులలో వున్నాయని తెలిపారు.