1 ENS Live Breaking News

అనంతలో యోధులకు వందనం..

అనంతపురం జిల్లాలో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం 'యోధులకు వందనం' కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో 'యోధులకు వందనం' పేరుతో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కరోనా సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు, అధికారులు, సిబ్బంది రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళి మనుగడ మొదలయినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, సమస్యల కు వ్యతిరేకంగా పోరాడి బ్రతికి బయటపడ్డామని, అందులో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ గా తీసుకుని కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ఆర్డీటీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, అధికారులు అంతా జిల్లాను కరోనా నుంచి బయటపడేసేందుకు చాలా కష్టపడి పని చేశారన్నారు. జిల్లాలో కరోనా వచ్చిన మొదట్లో మాస్కులు, పిపి ఈ కిట్లు కూడా లేవని,  ఒక టెస్టింగ్ కూడా చేయలేని, ఒక ల్యాబ్ లేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి నుంచి మనమే సొంతంగా మాస్కులు తయారు చేసుకోవడం, పిపి ఈ కిట్లు సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవడం, ఒక టెస్టు చేయలేని పరిస్థితి నుంచి రోజుకు 10,000 టెస్టులు చేసే పరిస్థితికి ఎదిగమన్నారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని సిద్ధం చేసుకోగలిగామని, జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలలో సదుపాయాలు, ఆక్సిజన్ సప్లై, అవసరమైన సిబ్బంది నియామకం చేసుకున్నామన్నారు.  అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం : అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో చాలావరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.  కరోనా ను ఎదుర్కోవడంలో రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ప్రతి శాఖ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారందరికీ మనం సన్మానించాల్సిన అవసరం ఉందని, కరోనా నేపథ్యంలో అందరూ బాగా పని చేసినా అందులో కొంతమందిని ఆయా శాఖల తరపున సన్మానిస్తున్నట్లు తెలిపారు. కరోనా వచ్చిన ప్రారంభంలో పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఛాలెంజ్ గా తీసుకుని అనంతపురం జిల్లా మిగతా జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు, దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.  స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్ లను కుట్టించడం మన జిల్లాలోనే మొదలుపెట్టామని, దానిని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లు ఇవ్వాలని చెప్పి రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించారన్నారు. కరోనా వచ్చిన పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆస్పత్రిలో ఉన్న సమయంలో పాజిటివ్ రోగులు అనరాదని వారిని కరోనా పాజిటివ్ వచ్చిన వారిగా పిలవాలని చెప్పామని, పాజిటివ్ వచ్చిన వారికి ప్రశాంతత కోసం మన జిల్లాలోనే ముందుగా యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వచ్చిన వారు ఆస్పత్రులలో ఉంటె వారి వద్దకు వెళ్లి ధైర్యం నింపే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఎన్జీవోల సహాయంతో ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసి వర్కర్లకు, బీదవారికి, వలసకూలీలకు 15 లక్షల భోజనాల అందజేయడం లాంటి సదుపాయం కల్పించామన్నారు. కరోనాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా సమయంలో ఉపాధి లేకపోగా, ఉపాధి హామీ పథకం కింద ఎక్కువమందికి పని కల్పించి దాదాపు 15 కోట్ల రూపాయలను ప్రతినిత్యం కూలీలకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉన్న సమయంలో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తుల రవాణా కోసం కిసాన్ రైలు తీసుకువచ్చి రైతులకు మేలు చేయడం జరిగిందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఆదర్శంగా పని చేయడం జరిగిందన్నారు. అలాగే పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతివారం స్ఫూర్తి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.  కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారి యొక్క శ్రమను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకోసమే యోధులకు వందనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కింది స్థాయిలో అట్టడుగున ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్, వి ఆర్ ఓ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రెటరీ, వాలంటీర్, ఆశావర్కర్లు, ఏ ఎన్ఎంలు ఇలా ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న వారి కోసం యోధులకు వందనం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఏ కుటుంబంలో అయితే వారి ఆప్తులను కోల్పోయారో వారికి ఆర్థిక స్వాంతన ఇవ్వడానికి ఆర్థిక సహాయం ఏర్పాటు చేశామని, దాతల ద్వారా ఒక కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో కూడా ఆర్థిక సహాయం అందించేలా చూస్తున్నామని తెలిపారు. కరోనా అన్నది పూర్తిగా సమసిపోలేదని, ప్రజలందరూ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనల్ని మనం ఉత్తేజం పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలలో యోధులకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మనలో మరింత స్ఫూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందికి యోధులకు వందనం కార్యక్రమంలో సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, వైద్య శాఖ, పారిశుద్ద్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి పలువురు కరోనా సమయంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు తెలియజేశారు.  అనంతరం కరోనాతో మరణించిన కుటుంబాల సభ్యులకు ఐదు మందికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. తదనంతరం స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులైన ఆర్డిటి ఈడి అన్నే ఫెర్రర్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రత్నాకర్ తరఫున డైరెక్టర్ గురుమూర్తి, ఆర్డీటీ ఏకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సత్యబాబు బోస్, అనంతపురం సాయి ట్రస్ట్ డైరెక్టర్ విజయ్ సాయి కుమార్ లకు శాలువా కప్పి ప్రశంసా పత్రంలను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే  వైద్య శాఖ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి ఎంపిక చేసి వారికి జిల్లా కలెక్టర్ శాలువా కప్పి ప్రశంసా పత్రం, డ్రెస్ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రి దేవి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభా స్వరూపారాణి, డి పి ఓ పార్వతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-13 16:43:31

భవిష్యత్ తరాల అవసరాలు తీర్చాలి..

గ్రంధాలయాలు భవిష్యత్‌ ‌తరాల అవసరాలను తీర్చే దిశగా పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ డాక్టర్‌ ‌వి.ఎస్‌ ‌క్రిష్ణా గ్రంధాలయంలో నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా వీసీ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆకాంక్షలు, అవసరాలు గుర్తించి తదనుగుణంగా గ్రంధాలయాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ గ్రంధాలయం ఎందరో విద్యావంతులను, నిపుణులను తీర్చిదిద్దిందన్నారు. వీరంతా దేశ విదేశాలలో స్థిరపడ్డాన్నారు. నేటి తరం యువత పుస్తకాన్ని పక్కనపెట్టి ఫేస్‌బుక్‌కు అంకితమైపోతున్నారన్నారు. డిజిటల్‌ ‌లైబ్రరీలు, పుస్తకాల డిజిటలైజేషన్‌ ఎం‌తో కీలకమన్నారు. విద్యార్థులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉండాలన్నారు. గ్రంధాలయాధికారి ఆచార్య కె.విశ్వేస్వర రావు మాట్లాడుతూ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రాధాన్యతను వివరించారు. వారోత్సవాలలో భాగంగా ఆన్‌లైన్‌లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఆన్‌లైన్‌ ‌సదస్సులో గ్రంధాలయ సిబ్బంది మాధవరావు, రమాదేవి, హైమావతి, రామలక్ష్మి, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-11-13 16:28:13

విశాఖ వికాసానికి సీఎం జగన్ విశేష కృషి..

 విశాఖ వికాసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శుక్రవారం  బీచ్‌ ‌రోడ్డులో నిర్వహించిన వుయ్‌ ‌సపోర్ట్ ‌వైజాగ్‌ ‌వాకథాన్‌లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా విశాఖ నగరం నిలుస్తుందని ఆయన అన్నారు. పెద్దసంఖ్యలో  ఇంజనీరింగ్‌ ‌కళాశాలల అధ్యాపకుల  వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‘‌వాక్‌ ‌విత్‌ ‌జగన్‌ ‌గ్రూప్‌’  ‌సభ్యులు ఎం.పి. విజయ సాయి రెడ్డికి స్వాగతం పలికి ఆయనతో కలసి వాకథాన్‌లో పాల్గొన్నారు. అనంతరం వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. పరిశుభ్ర, ప్రశాంత విశాఖను నిర్మించే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. పరిపాలనా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో యువత భాగం కావాలన్నారు. భవిష్యత్తులో నిర్వహించే బీచ్‌ ‌క్లీనింగ్‌, ‌పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలలో ఏయూ జాతీయ సేవా పథకం వలంటీర్లు ముఖ్యభూమిక పోషిస్తారన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆయన దార్శినిక నిర్ణయాలు భవిష్యత్తులో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతాయన్నారు. ఏయూ అనుబంధ ఇంజనీరింగ్‌ ‌కళాశాలల అధ్యాపకుల బృందం గతంలో 2018 సంవత్సరంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఇంజనీర్స్‌డే వేడుకలను పురస్కరించుకుని వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి గారితో యాత్రలో కలసి పాల్గొన్నారు. అదే బృందం నేడు వాకథాన్‌ ‌కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.కార్యక్రమంలో వర్సిటీ పాలక మండలి సభ్యులు జేమ్స్ ‌స్టీఫెన్‌ , ‌డీన్‌ ఆచార్య టి.షారోన్‌ ‌రాజు తదితరులు పాల్గొన్నారు.

RK Beach

2020-11-13 16:21:12

పర్యావరణ రహిత దీపావళినే జరుపుకుందాం..scrwa

కారోనా మహమ్మారి ప్రభావం ఇంకా ప్రమాదకరంగానే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని   స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిక కార్యక్రమంలో జర్నలిస్టులకు దీపావళి పండుగను పురస్కరించుకుని  స్వీట్లు, హేండ్ మేడ్ కొవ్వొత్తులు, ప్రమిదులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వ్యాపారవేత్త  లంకలపల్లి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ బంగారు అశోకుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ లోని సభ్యులైన జర్నలిస్టుల ప్రతి ముఖ్య సంధర్భంలోనూ వారి కుటుంబాల్లోని సభ్యులందరికీ ఆనందం పంచే విధంగా ఏర్పాటు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయం అన్నారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతో పాటు ఇతర ముఖ్య సందర్భాల్లోను జర్నలిస్టుల కోసం వారి సంక్షేమం కోసం ఏదో విధంగా బాసటగా ఉండాలనే తలంపుతో కూడిన ఆరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. సమాజం కోసం నిత్యం వార్తా సమీకరణలో బిజీగా తిరిగే జర్నలిస్టుల సంక్షేమం కూడా బాగా ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం కారోనా వైరస్ ప్రమాదకరంగా ఉన్నందున దీపావళి బాణా సంచా వెదజల్లే కాలుష్యం ఊపిరితిత్తులకు చేటు చేసే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నందున ఈ ఏడాది అత్యంత జాగ్రత్తగా దీపావళి జరుపుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీపావళి పండుగ కుటుంబ సభ్యులకు ప్రమాదకారి కాకూడదని భావించారు. గతంలో హుదూద్ తుఫాను వచ్చి విళయం ప్రళయం సృష్టించి వెళ్ళాక అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు కేవలం దీప కాంతుల దీపావళికే పరిమితం అయ్యి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన విశాఖ ఈ కారోనా పరిస్థితుల్లోను ఆదే అప్రమత్తత, పర్యావరణ హితకర దీపావళి జరుపుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని చెబుతూ జర్నలిస్టుల సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటేనే, సమాజం కోసం ఆరాటపడే వారి ఆశయం, లక్ష్యం నెరవేరలని ఆశించారు. వారు పాటించడంతో పాటు ప్రజలు కూడా పర్యావరణ హితకర దీపావళిని జరుపుకునేలా చైతన్యవంతులని చేయగలరని   పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బంగారు అశోకుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం 2016వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ఎప్పటికప్పుడు సౌజన్యముర్తుల సహాయంతో అసోసియేషన్ లోని సభ్యులైన జర్నలిస్టుల సంక్షేమం చేస్తున్నట్లుగా వివరించారు. గతంలో కంటే ఇప్పుడు సభ్యుల సంఖ్య కూడా ఇతోధికంగా పెరుగుతుండడం ఆనందదాయకం అన్నారు. కేవలం నగరం వరకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల జర్నలిస్టులు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యులయ్యేందుకు ఆసక్తిని కనబరుస్తున్ననందున ప్రత్యేక డ్రైవ్ గా ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న సభ్యులు కొత్త సభ్యుల నమోదు లో ముఖ్యభూమిక వహించడం, సహృద్భావంతో  అందరము కలిసికట్టుగా మనందరి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తలపెట్టే కార్యక్రమంల్లో భాగస్తులు కావాలని అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బంగారు అశోక్ కుమార్ ఆహ్వానించారు. కరోనా కారణముగా ఈ ఏడాది సంక్షేమ కార్యక్రమాలకు కొంత విరామం వచ్చిందన్నారు. తిరిగి దీపావళి నుంచి యధావిధిగా సభ్యులైన వారందరికీ గతంలో కంటే మిన్నగా సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసోసియేషన్ ముందుకు నడిపించడంలో భాగస్తులవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పీవీబీ కుమార్, బీఎస్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ, కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్), రిషి, రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి పద్మజా తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-11-13 16:12:33

పరిశ్రమల్లో భద్రత ప్రామాణాలు పాటించాల్సిందే..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌త విష‌య‌మై ప్ర‌భుత్వం నిర్దేశించిన ప్ర‌మాణాల మేరకు అన్ని ప‌రిశ్ర‌మ‌లు ప్ర‌మాదాల‌కు అవ‌కాశాల‌కు లేకుండా త‌గిన భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు అన్నారు. జామి మండ‌లం అన్నంరాజుపేట‌లోని శ్రీ‌చ‌క్ర సిమెంటు ప‌రిశ్ర‌మ‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ జె.వెంక‌ట‌రావు నేతృత్వంలోని అధికారుల బృందం సంద‌ర్శించింది. పారిశ్రామిక భ‌ద్ర‌త విష‌యంలో ప్ర‌భుత్వం రాజీలేని ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని, ఆయా ప‌రిశ్ర‌మ‌లు త‌మ ప‌రిశ్ర‌మ‌ల్లో చేప‌ట్టిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై త‌మ కమిటీకి నివేదిక ఇవ్వాల‌న్నారు. శ్రీ‌చ‌క్ర సిమెంట్స్‌లో చేప‌ట్టిన భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై ప‌రిశ్ర‌మ అధికారులు జాయింట్ క‌లెక్ట‌ర్‌కు, బృందం స‌భ్యుల‌కు వివ‌రించారు. ఈ బృందంలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కోట ప్ర‌సాద‌రావు, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఇంజనీర్ బి.సుద‌ర్శ‌నం, జిల్లా అగ్నిమాప‌క అధికారి జె.మోహ‌న‌రావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2020-11-13 16:01:46

సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి..

మహావిశాఖ నగరవాసులు సురక్షిత, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రముఖ సంఘసేవకులు సాన రాధ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో చాలా మంది ప్రజలకు ఎంతో నష్టపోయారని ఇలాంటి సమయంలో దీపావళి పండుగను అసలైన దీపాల సమూహంతోనే నిర్వహించుకోవాలన్నారు. ఒక వేళ టపాసులతో దీపావళి చేసుకున్నప్పటికీ కాలుక్ష్యం తక్కువగా వుంటే పటాలసుతో దీపావళి జరుపుకోవాలన్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్టు దీపావళి చేసుకునే సమయంలో అంతా పరిశుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి తప్పితే ఎవరూ శానిటైజర్లు ఉపయోగించకూడదన్నారు. శానిటైజర్లలో మండే స్వభావం కలిగిన ఆల్కాహాలు ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా వుంటాయన్నారు. అంతేకాకుండా దీపావళి జరుపుకునే సమయంలో అందరూ కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. ఎక్కువగా దీపాల సమూహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకొని అసలైన దీపావళిని జరుపుకోవడానికి అంతా ముందుకు రావాలని సాన రాధ పిలుపునిచ్చారు.

Visakhapatnam

2020-11-13 15:58:45

కోవిడ్ నిబంధనలతోనే దీపావళి...

శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణహిత దీపావళి జరుపుకోవడానికి జిల్లా ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సామగ్రి విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంను శుక్ర వారం కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సామగ్రి విక్రయం అనంతరం మైదానాన్ని శుభ్రం చేయాలని, అందుకు అవసరమైతే వినియోగ ఛార్జీలను వసూలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న విక్రయాలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ  దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం పాటించాలని, దీపావళి సామగ్రి కొనుగోళుకు వచ్చే వ్యక్తులు భౌతిక దూరం పాటించుటకు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసారు. ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే మైదానంలో అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని లాటరీ విధానంలో కేటాయింపు చేస్తారని తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్) మాత్రమే అనుమతించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళి సామగ్రిని 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విక్రయించుటకు అనుమతించినట్లు కలెక్టర్ చెప్పారు. సామగ్రి కొనుగోళుకు వచ్చే వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. దీపావళి వేడుకలను 14వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావళి వేడుకలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షిత చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కోవిడ్ కాలంలో శానిటైర్ల వినియోగం అలవాటు ఉందని, అయితే శానిటైజర్లు పూసుకుని టపాసులు వెలిగించే ప్రయత్నం చేయరాదని సూచించారు. దీపావళి రోజున ప్రజలు ఇంటివద్దనే ఉన్నందను సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు.   ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు వై.వి.ప్రసాద్, పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-13 15:32:08

కళాశాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి..

శ్రీకాకుళం జిల్లాలో కళాశాలలు కోవిడ్ నింబంధనలు పాటిస్తూ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలకు ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసారు. ప్రతి పాఠశాల, కళాశాల ప్రవేశ ద్వారం వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ “ హోర్డింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులoదరికీ కరోనాపై జాగ్రత్తలు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా  మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రత పై పోస్టర్లు లేదా ఫ్లెక్స్ లను అసెంబ్లీ పాయింట్ వద్ద, తరగతి గదుల లోపల అతికించాలని అన్నారు. క్లాసు రూoలను సోడియం హైపోక్లోరైడ్ తో పరిశుభ్రపరచాలని,  మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడరుతో పరిశుభ్రపరచాలని ఆయన స్పష్టం చేసారు. జూనియర్ కాలేజీలో 50 శాతం విద్యార్థుల వరకు మాత్రమే హాజరు కావాలని, ప్రతి తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని ఆయన సూచించారు. డిగ్రీ కాలేజీలో 33 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని, 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున నెలలో 3 బ్యాచ్ లుగా విద్యార్థులను విభజించి తరగతులు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని అన్నారు. ఇతర విద్యార్థులకు ఆన్ లైన తరగతులు నిర్వహించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులoదరూ జగనన్న విద్యా కానుకగా యిచ్చిన ఏకరూప దుస్తులు, బూట్లు విధిగా తప్పని సరిగా ధరించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలలకు హాజరుయ్యే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు హాజరుయ్యే సిబ్బంది, విద్యార్ధులు ఎవరికైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తదితర ఆరోగ్య సమస్య ఉంటే సమీప వార్డ్ సచివాలయ హెల్త్ సెక్రెటరీకి గానీ, వైద్యునికి గారికి గానీ వెంటనే సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేసారు. కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాత ఎవరికైనా “ కరోనా పాజిటివ్ “ గా నిర్ధారణ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, హెల్త్ సెక్రెటరీ లేదా వైద్యుడికి తెలియజేసి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ హోమ్ ఐసోలేషన్ కిట్లను పొంది ఉపయోగించాలని అన్నారు.  

Srikakulam

2020-11-13 15:12:52

కోవిడ్ నిబంధనలతో దీపావళి..

శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణహిత దీపావళి జరుపుకోవడానికి జిల్లా ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సామగ్రి విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంను శుక్ర వారం కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సామగ్రి విక్రయం అనంతరం మైదానాన్ని శుభ్రం చేయాలని, అందుకు అవసరమైతే వినియోగ ఛార్జీలను వసూలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న విక్రయాలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ  దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం పాటించాలని, దీపావళి సామగ్రి కొనుగోళుకు వచ్చే వ్యక్తులు భౌతిక దూరం పాటించుటకు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసారు. ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే మైదానంలో అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని లాటరీ విధానంలో కేటాయింపు చేస్తారని తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్) మాత్రమే అనుమతించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళి సామగ్రిని 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విక్రయించుటకు అనుమతించినట్లు కలెక్టర్ చెప్పారు. సామగ్రి కొనుగోళుకు వచ్చే వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. దీపావళి వేడుకలను 14వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావళి వేడుకలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షిత చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కోవిడ్ కాలంలో శానిటైర్ల వినియోగం అలవాటు ఉందని, అయితే శానిటైజర్లు పూసుకుని టపాసులు వెలిగించే ప్రయత్నం చేయరాదని సూచించారు. దీపావళి రోజున ప్రజలు ఇంటివద్దనే ఉన్నందను సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు.         ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు వై.వి.ప్రసాద్, పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

2020-11-13 14:27:52

ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి..

ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌ను నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలోగా పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న‌, ప్ర‌తిపాదిత ప‌లు సాగునీటి ప్రాజెక్టులు, మినీ రిజ‌ర్వాయ‌ర్లు, భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌పై సంబంధిత రెవెన్యూ, నీటిపారుద‌ల‌శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.     సాగునీటి ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌కు సంబంధించి ఇటీవ‌ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన కొత్త జీఓ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై అధికారుల‌కు ముందుగా అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం జిల్లాలోని ప్రాజెక్టుల‌ భూసేక‌ర‌ణ‌కు సంబంధించిన వివ‌రాలు, ప్ర‌స్తుత ప‌రిస్థితిని ఆయా ప్రాజెక్టుల వారీగా జెసి కిశోర్‌ అడిగి తెలుసుకున్నారు. తోట‌ప‌ల్లి, వెంగ‌ళ‌రాయ‌సాగ‌ర్‌, గుర్ల‌గెడ్డ‌, కంచర‌గెడ్డ‌, అడారుగెడ్డ‌, గ‌డిగెడ్డ‌, గుమ్మిడిగెడ్డ ప్రాజెక్టుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌వ‌ర‌కు భూ సేక‌ర‌ణ జ‌రిగిందీ, ఇంకా సేక‌రించాల్సిన భూమి, భూసేక‌ర‌ణ‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. సిఎఫ్ఎంఎస్ విధానం కార‌ణంగా, భూసేక‌ర‌ణ‌కు సంబంధించిన కొన్ని వివాదాలను ప‌రిష్క‌రించ‌డంలో సాంకేతిక స‌మ‌స్య‌లు ఉత్పన్నం అవుతున్నాయ‌ని రెవెన్యూ అధికారులు జెసికి తెలిపారు. భోగాపురం విమానాశ్ర‌యం కోసం ఇంకా మిగిలిఉన్న భూసేక‌ర‌ణ‌ను, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని ఏర్పాటు చేసుకొని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. ఇక్క‌డి నిర్వాసితుల‌కోసం నిర్మిస్తున్న లేఅవుట్ల‌ను, ఇళ్ల నిర్మాణాన్ని, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ను వేగ‌వంతం చేసి, వారికి అప్ప‌గించాల‌ని జెసి ఆదేశించారు.           ఈ స‌మావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, భూసేక‌ర‌ణ ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, కెబిటి సుంద‌రి, హెచ్‌వి జ‌య‌రామ్‌, సాల్మ‌న్ రాజు, వివిధ ప్రాజెక్టుల ఇంజ‌నీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-12 22:24:49

రైస్ కార్డుల జారీ వేగం పెంచాలి..

విజయనగరం జిల్లాలో రైస్ కార్డుల జారీలో వేగం పెంచాలని, నిరీక్షణ జాబితా సంఖ్య తగ్గించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను జేసీ కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్ష చేశారు. నిరీక్షణ జాబితా ఎక్కువుగా ఉంటుందని, దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు. సచివాలయంలో నమోదు అయిన వెంటనే పరిశీలించి త్వరితగతిన కార్డు జారీ చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు వీఆర్వోలను ఫీల్డ్ కి పంపిస్తూ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అందరూ తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి దీపావళి పండుగలో ఎటువంటి   అపశృతి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్ లో ఆయనతో పాటు, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేఖర్, విజయనగరం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-11-12 22:22:28

ఆ కుటుంబాలకు ముందే వచ్చిన దీపావళి పండుగ..

ఒక‌టిరెండూ కాదు ఏకంగా 234 కుటుంబాల్లో దీపావ‌ళి పండుగ మూడురోజులు ముందే వ‌చ్చింది. ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు రావ‌డంతో వారి ఇళ్ల‌లో ఒక్క‌సారిగా ఆనందం వెళ్లివిరిసింది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోని రెండో విడ‌త‌ ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ఇటీవ‌లే ప్ర‌భుత్వం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల కంటే ముందుగా 234 మంది ప‌శువైద్య స‌హాయ‌కుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్  నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఎట్టిప‌రిస్థితిలోనూ దీపావ‌ళి పండుగ‌కంటే ముందుగానే, అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలివ్వాల‌న్న క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ అధికారులు అభ్య‌ర్థుల‌కు హుటాహుటిన ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి, మెరిట్ ప్ర‌కారం ఖాళీల‌ను భ‌ర్తీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 234 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌గా, అర్హులు లేక‌పోవ‌డంతో ఇంకా 148 ఖాళీలు మిగిలిపోయాయి. ఉద్యోగాలు పొందిన‌వారికి త‌న ఛాంబ‌ర్‌లో గురువారం నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేసిన క‌లెక్ట‌ర్‌, ప్ర‌తీఒక్క‌రూ అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు, డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ క‌న్నంనాయుడు, ప‌శువైద్యులు డాక్ట‌ర్ రామ‌కృష్ణ‌, డాక్ట‌ర్ సాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-12 22:18:32

ఇంటి ముంగిటే న్యాయాన్ని అందిస్తాం..

ఇంటి ముంగిటికే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు.  గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమీషన్ సంయుక్తంగా  మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం  జిల్లా న్యాయ సేవాధికార అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా కలెక్టర్ జె నివాస్ తో కలసి ఐ సి డి ఎస్ రూపొందించిన పిల్లల దత్తతకు సంబంధించిన  పోస్టర్ ను  విడుదల చేసారు.  ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,  ఇంటి వద్దకే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, మండల ప్రధాన కేంద్రాలు, గ్రామ స్థాయిలలోని మూరుమూల ప్రాంతాలలో సైతం మహిళా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.  హిందూ వివాహ చట్టంపైన, ఎస్.సి, ఎస్.టి.  అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కులు తదితర  అంశాలను క్షుణ్ణంగా వివరించారు. 18 సం.ల లోపు వయస్సు గల ఆడపిల్లలను వివాహం చేసుకున్న 21 సం.లు దాటిన మగపిల్లవాడు కూడా శిక్షార్హుడని తెలిపారు.  పుట్టుకతోనే ఆడపిల్లకు ఆస్తిహక్కు సంక్రమిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు చట్టాలపై అవగాహన లేకపోవడం ద్వారా హక్కులు, న్యాయాన్ని పొంద లేక పోతున్నారన్నారు. ఎస్ సి ఎస్. టి అట్రాసిటీ కేసులో బాధితులకు కంపెన్సేషన్ వస్తుందని చెప్పారు. ముందుగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకోవాలని, ఆతేదీ నుండి నష్టపరిహారాన్ని పొందవచ్చునని తెలిపారు.  బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస వంటి చట్టాలపై అవగాహన కలిగివుండాలన్నారు.   న్యాయాన్ని ఎవరి ద్వారా పొందాలి, ఎక్కడ పొందాలి అనే విషయాలు  ముందుగా తెలుసు కోవాలన్నారు.  మహిళల  పరిరక్షణ  కోసం   గ్రామ స్థాయిలో  ని మహిళా పోలీస్ ల నియమించడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో   బాగా పని చేస్తున్నారని  కరోనాను అరికట్టడంలో మహిళలు ప్రముఖపాత్ర వహించారని తెలిపారు. జిల్లాలో   70 శాతం మహిళలు మంచి సేవలందించారని తెలిపారు. సంయుక్త కలెక్టర్  సుమీత్ కుమార్ మాట్లాడుతూ, దిశా చట్టం మహిళా పోలీస్ లు మహిళల రక్షణకు ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు  తెలిపారు. మండల స్థాయిలో  మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో ఫ్యామిలీ లా కి  సంబంధించిన విషయాలపై అడ్వకేట్ కమ్ రిసోర్స్ పర్సన్ డి. విజయ లక్ష్మి  అవగాహన కలిగించారు. మహిళా రక్షణ, రాజ్యాంగం, క్రిమినల్ లా, సివిల్ రైట్స్ అంశాలపై అడ్వకేట్ కం రిసోర్స్ పర్సన్  డి. సరళ కుమారి అవగాహన కలిగించారు. వైద్య పరమైన అంశాలపై డా. రామ్ మోహన్ రావు, డా. జ్యోత్స్న, డా. ఇందిర అవగాహన కలిగించగా,  ఐ సి డి ఎస్   పి డి  జయదేవి దిశా చట్టం, వన్ స్టాప్ సెంటర్, తదితర అంశాలు వివరించారు.  ఇచ్చాపురం సి.డి.పి.ఓ. నాగరాణి మాట్లాడుతూ, తన కార్యాలయంలో పనిచేస్తున్న  వర్కర్ కు మూగ. చెవిటి పిల్లవాడు పుట్టడంతో ఆమెను ఆమె భర్త  వదిలివేసాడని, ప్రస్తుతం ఇల్లు గడవడం కష్టంగా వుందని, ఆమెకు న్యాయ సహాయం అందించే విధానంపై సలహాను అడిగారు.  ప్రధాన న్యాయమూర్తి స్పందించి, మండల స్థాయిలోని న్యాయ  సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. రణస్థలం సి.డి.పి.ఓ. జి.లక్ష్మి మాట్లాడుతూ, తమ కార్యాలయపు వర్కరుకు కేన్సర్ వచ్చిందని, ఆమె భర్త ఆమెను వదిలివేసేడని, ఆమెకు ఒక బిడ్డ వున్నాడని, ఆమెకు న్యాయ సహాయంపై సలహా అడిగారు.  జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని ఉచిత న్యాయాన్ని పొందవచ్చునని, ప్రభుత్వం నుండి  ఆమె వైద్య ఖర్చులను పొందవచ్చునని ప్రధాన న్యాయ మూర్తి తెలిపారు.    కార్యక్రమంలో జిల్లా సెకెండ్ అడిషనల్ జడ్డ్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్.పి. విఠలేశ్వరరావు, లోక్ అదాలత్ శాశ్వత అధ్యక్షులు సత్యన్నారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, , ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఛైల్డ్ ప్రోటెక్షన్ అధికారి రమణ, సి.డి.పిఓ.లు  రిసోర్స్ పర్సన్ లు  తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2020-11-12 22:06:24

ప్రభుత్వ భవనాల సంఖ్య పక్కాగా ఇవ్వండి..

కర్నూలు జిల్లాలో రీఆర్గనైజేషన్/కొత్త జిల్లాల ఏర్పాటు కోసం  అందుబాటులో ఉన్న భవనాలు, మౌలిక సదుపాయాల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నంద్యాలలో సుడిగాలి పర్యటన చేసి కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడబోయే నంద్యాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ , జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటు కోసం వివిధ భవనాలను పరిశీలించారు. ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ గారి వెంట భవనాల పరిశీలనలో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండి  సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి లను వెంటబెట్టుకుని కొత్త కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించేందుకోసం నంద్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల భవనాల సముదాయాన్ని, కోర్టు భవనాల సముదాయన్ని, తాలూకా ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, ఎక్సయిజ్ ఆఫీసు,  నూనెపల్లె, టెక్కే లలో ఉన్న మార్కెట్ యార్డుల భవనాలను, ఎస్.ఆర్.బీ.సీ. కాలనీ, విక్టోరియా రీడింగ్ రూమ్, జీఎం కాలేజీ, స్టేడియం, పశుసంవర్ధక శాఖ సెమెన్ బ్యాంక్ భవనాలు, ఆర్.ఏ.ఆర్.ఎస్, స్పిన్నింగ్ మిల్ తదితర వివిధ భవనాలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. అనంతరం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న  వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, వాటి విస్తీర్ణం, స్థితి గతులపై సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్లు, మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ,  డిఎస్పీ చిదానంద రెడ్డి తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప లు చర్చించారు. సమీక్ష సందర్భంగా,  నంద్యాల కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోసం ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్న అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వాటి చుట్టు కొలతలు, భవనాల స్థితిగతుల వివరాల అసెట్స్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించడానికి వీలుగా వెంటనే తనకు సబ్మిట్ చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి,  ఆర్&బి ఎస్ఈ జయరామి రెడ్డి లను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం, నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గడివేముల మండలం ఘని గ్రామంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన 13 మంది రైతులకు రూ.1.57 కోట్ల ఆర్థిక పరిహారపు బ్యాంకు చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పంపిణీ చేశారు.

Nandyala

2020-11-12 21:40:24

సోలార్ ప్లాంట్ బాధితులకు చెక్కులు పంపిణీ..

సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయిన రైతులకు కు1.57 కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మీడియాతో  మాట్లాడుతూ,  గడివేముల మండలం గని గ్రామ రైతులు సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయారని ఈ 13 మంది రైతులకు1.57 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుందన్నారు. అందులోభాగంగానే..ఈ మొత్తం పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా SP డా..పక్కిరప్ప. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల సబ్ కలెక్టర్  కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

Nandyala

2020-11-12 21:37:50