1 ENS Live Breaking News

అనకాపల్లి జిల్లాలో 6,718 కొత్త పింఛన్లు

అనకాపల్లి జిల్లాలో 2లక్షల 18 వేల 531 మందికి పెంచిన పింఛన్లు వివిధ కేటగిరీలలో రూ.2750 ల చొప్పున మొత్తం రూ 60 కోట్ల 9 లక్షల 60 వేల 250 లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సభలో  పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.  కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ తో అధికారులు లబ్ధిదారులు తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెంచిన పింఛన్   చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  6,718 మందికి వివిధ కేటగిరీ పింఛన్లు కొత్తగా మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో పింఛన్ల పెంపును పొందిన వారిలో వృద్ధులు 1,43,141 మంది వితంతువులు 60,337 ఒంటరి మహిళలు 5,780 మత్స్యకారులు 3,265 చేనేత పనివారు 2,623 కల్లుగీత పనివారలు 2,328 మంది కాగా 1057 మంది సాంప్రదాయ చర్మకారులకు వర్తించిందని తెలిపారు. 

Anakapalle

2023-01-03 14:02:11

ఈనెల 8న ఏపీపీఎస్సీ గ్రూప్-1 పక్కాగా నిర్వహించాలి

ఎపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షను ఈ నెల 8 న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఈ పరీక్షను  విజయనగరం పట్టణం లో 13  కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 8న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించే ఈ పరీక్షకు  5530 మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలిపారు.  సక్రమ నిర్వహణ కోసం ప్రతి కేంద్రానికి  సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించామని, వీరంతా ఆయా కేంద్రాలను తనిఖీ చేసి  పరీక్ష నిర్వహణకు అవసరమగు వసతులు, సౌకర్యాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ నివేదికనివ్వాలన్నారు. 
ప్రతి రూమ్ లో సరైన గాలి వెలుతురు ఉండేలా  చూడాలన్నారు. సున్నిత  ప్రాంతాలను గుర్తించి,  కేంద్రం వద్ద 144 సెక్షన్ కు అవసరమగు సిబ్బందిని ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ను, రూట్ వారీగా   అవసరమైన బస్ లను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి వారికి ఆదేశించారు.  సెంటర్ లో డైరెక్షన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు ఆదేశించారు. నిరంతర విద్యుత్తు, అత్యవసర వైద్యాన్ని అందించే మెడికల్  కాంప్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 6 న ఏపీపీఎస్సీ ప్రతినిధుల సమక్షంలో మరో సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అభ్యర్థులకు అవసరమగు సూచనలను వెల్లడిస్తారని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గణపతి రావు,  లైజన్ అధికారులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-03 13:45:25

కారుణ్య నియామకాల ఖాళీలు వెంటనే సమర్పించాలి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో మృతిచెందిన వారి వివరాలు, కారుణ్యనియామకాలు చేపట్టాల్సిన వారి వివరాలను తక్షణమే అందజేయాలని జాల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను తెలియజేయ డం ద్వారా కారుణ్య నియామకాలు సత్వరమే చేపట్టడానికి ఆస్కారం వుంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Srikakulam

2023-01-02 16:19:55

గడువులోపు స్పందన అర్జీలను పరిష్కరించాలి

స్పందన గ్రీవెన్స్ కు వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  రవిపట్టన్ శెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా 110 అర్జీలను ప్రజల నుంచి  స్వీకరించారు.  జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వెంకట రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Anakapalle

2023-01-02 13:27:50

వృత్తి నిబద్ధత కలిగిన అధికారిని సీతామహాలక్ష్మి

మహిళా శిశు సంక్షేమ అధికారిగా పనిచేసిన ఉప కలెక్టర్ నందూరి సీతామహాలక్ష్మి   పనిచేసిన ప్రతిచోట తన ప్రజ్ఞతో వృత్తిపట్ల నిబద్ధతతో పదవికే వన్నె తెచ్చేవారని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి ప్రశంసించారు.  డిసెంబర్ 31వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీతామహాలక్ష్మికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా 
అధికారుల సంఘం ఆమెకు సన్మానసభ ఏర్పాటుచేశారు.  ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఆమెను చూసి సమయపాలన, చట్టాల పట్ల పరిజ్ఞానం నేర్చుకోవాలన్నారు.  కలెక్టర్లకు ఆమె తలలో నాలుకల వ్యవహరించే వారన్నారు. ఆమె స్పందన కార్యక్రమంలో కూడా పాల్గొని అనేకసమస్యల ను పరిష్కరించరించ డం గుర్తుకు తెచ్చారు. ఎన్.సీతామహాలక్ష్మి మాట్లాడుతూ, కృషి పట్టుదల ఉంటే ఏ కార్యాన్నైనా సాధించవచ్చ ని చిన్నతనంలోనే నేర్చుకున్నానని చెప్పారు. ఏ శాఖలో పనిచేసిన సహ ఉద్యోగులు, పైఅధికారుల సహాయ సహకారాలతోనే విజయం సాధించానన్నారు. మంచి ఆలోచనలతో కష్టపడి పని చేస్తే పదిమందికి మేలు చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ హేమంత్ డ్వామా పిడి సంపత్ డిహెచ్ఓ ప్రభాకర్ రావు జిఎం డిఐసి శ్రీధర్ డిపిఓ శిరీష రాణి డిఎల్డివో మంజులవాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు సిపిఓ రామారా వు స్వాగతం పలుకగా కార్యదర్శి మత్స్యశాఖ డిడి లక్ష్మణరావు వందన సమర్పణ చేశారు.

Anakapalle

2023-01-02 13:01:34

అప్పన్నను దర్శించుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సింహాచలం అప్పన్న ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిం చి అప్పన్నను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవస్థానం అధికారులు స్వామీజీకి అప్పన్న దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో అధికారులు, పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణుని దర్శించుకున్న పర్వదినమే ముక్కోటి ఏకాదశి అని తెలిపారు. పీఠం 27వ వార్షిక ఆహ్వాన పత్రిక స్వామిముందుంచారు.

Simhachalam

2023-01-02 06:08:17

మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా సేవలందించాలి

విజయనగరం జిల్లాలో మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా విఎఫ్ఏలు, మత్స్యశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలు అందించాలని ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతూ, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా జిల్లాని మత్స్యశాఖ పరంగా ముందుంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందించడంతోపాటు, ప్రభుత్వ లక్ష్యాలను కూడా సకాలంలో అదిగమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ చాందిని, కార్యాలయ సిబ్బంది, విఎఫ్ఏలు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-01 17:49:39

కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మత్స్యశాఖ

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకు మారి, ఇతర సిబ్బంది ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు పూల బొకేలు కాకుండా నిరుపేద విద్యార్ధుల కోసం పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఒక కిట్ గా తయారు చేసి వాటితో కలెక్టర్ కు శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఏడాది ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు మరింతగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిడితోపాటు ఎఫ్డీఓ చాందిని, విఎఫ్ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-01 17:39:36

ఇంటింటికీ వెళ్ళి పించన్లు ఇచ్చిన కలెక్టర్..

కొత్తగా పెంచిన పెన్షన్లు పంపిణీ వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆదివారం చీరాల మున్సిపాలిటీ లోని 2వ వార్డులో జనవరి1నుండి పెంచిన పెన్షన్లు జిల్లా కలెక్టర్ పెన్షన్ దారులకు స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం గతంలో పెన్షన్ దారులకు ఇచ్చే రూ.2500 ను రూ.2750కి పెంచారన్నారు. కొత్తగా పెంచిన పెన్షన్లు పంపిణీ వారోత్సవాలు 1వ తేదీ నుండి7వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎ పీడీ అర్జున్, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య,తహసీల్దార్ ప్రభాకర్,పాల్గొన్నారు.     

Chirala

2023-01-01 09:26:14

జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేసిన గంట్ల

నూతన సంవత్సరం 2023లో జర్నలిస్టులు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి అన్నింటా మంచి జరగాలని సింహాద్రి అప్పన్నను వేడుకున్నట్టు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు తెలియజేశారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, తన జీవితం జర్నలిస్టుల సంక్షేమానికే అంకితం చేస్తున్నానన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకి సాగుతున్నానన్నారు.

Visakhapatnam

2023-01-01 06:03:52

నగరాభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది

మహా విశాఖ నగరాభివృద్ధిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరువలేనిదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఇక్కడ సీతమ్మ ధార విజేఎఫ్  వినోద వేధికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2023 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను పలువురు అతిథులతో కలిసి మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విశాఖ అగ్రగామి గా నిలిచింది అంటే అందుకు జర్నలిస్టుల సహకారమే ప్రధానమన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్ లో మహావిశాఖకు నాలుగో రాంక్ రావడంలో కూడా  మీడియా ప్రధాన పాత్ర పోషించింది అన్నారు. గౌరవ అతిథిలుగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,
వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ అక్కర మాని విజయనిర్మల, పి సి పి ఐ ఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ, జి సి సి  కార్పొరేషన్ చైర్మన్ శోభ స్వాతిరాణి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రమాదేవ లు  పాల్గొని మాట్లాడుతూ, సమాజము లో మీడియా వల్లే అన్ని విషయాలు ప్రజలకూ తెలియ చేయగలుగుతున్నామన్నారు.

  సభ్యుల  సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం  చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమన్నారు.. ప్రతీ పండుగను  క్రమము తప్పకుండా నిర్వహించడం, జర్నలిస్టులకు క్రీడలతో పాటు అనేక సంక్షేమ ఫలాలు అందించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఆనందమయ జీవనం గడపాలని వీరంతా ఆకాంక్షించారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శీను బాబు మాట్లాడుతూ గడిచిన ఏడాదిలో తమ సభ్యుల కోసం ఎంతగానో శ్రమించి అనేక కార్యక్రమాలను విజయవంతం చేసామన్నారు. దసరా, దీపావళి పండుగలు నిర్వహించడము తో పాటు మీడియా అవార్డుల ప్రధానోత్సవం కూడా అత్యంత ఘనము గా నిర్వహించామన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. తమ కార్యవర్గం హయాంలో కేవలం సభ్యుల వైద్య సదుపాయాలు కోసం సుమారు 22లక్షలు వెచ్చించామన్నారు..

నూతన సంవత్సర వేడుకలతో పాటు జనవరి 3 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబరాలు ప్రారంభం కానున్నాయన్నారు.  ఫోరం కార్యదర్శి దాడి రవికుమార్ . ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్ లు మాట్లాడుతూ అందరి సహకారం తోనే ఆయా కార్య క్రమాలు విజయ వంతం చేయ గలుగు తున్నా మన్నారు.  సభ్యులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించా యీ. కార్య క్రమంలో ఫోరమ్ కార్య వర్గ సభ్యులు ఐరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, పి. వరలక్ష్మి, దొండ గిరిబాబు, డేవిడ్, శేఖర మంత్రి,తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-31 15:33:41

టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, జేఈవో

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం  తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలను శనివారం జిల్లాకలెక్టర్  వెంకటరమణా రెడ్డి, టీటీడీ జేఈవో  సదాబార్గవి పరిశీలించారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బారికేడ్లను వారు పరిశీలించారు. ఈ కేంద్రాలవద్ద పోగయ్యే చెత్త ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుధ్య కార్మికులను 
నియమిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చెప్పారు. టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారులు, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేక విధులకు నియమించిన టీటీడీ అధికారులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పని చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మరుగుదొడ్ల నిర్వహణ , తాగునీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు. 

ప్రతి కౌంటర్ వద్ద భక్తులకు టిఫిన్, అన్నప్రసాదాలు, టీ,కాఫీ, తాగునీరు నిరంతరంగా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జేఈవో సదా భార్గవి కలెక్టరుకు  తెలియజేశారు. జనవరి 1 నుండి టోకెన్ల జారీ ప్రారంభించి కోటా పూర్తి అయ్యేవరకు నిరంతరంగా జారీ చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించామని ఆమె వివరించారు. రామచంద్ర పుష్కరిణి, ఇందిరామైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసుల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీటీడీ అధికారులకు సూచించారు.

ఈ విషయమై జిల్లా ఎస్పీ ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.  నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా, టోకెన్లు ఏ తేదీ ఏ సమయానికి జారీ చేస్తున్నారనే వివరాలు భక్తులకు తెలిసేలా ఏర్పాటు చేసిన ఎల్ఈ డి స్క్రీన్లు సక్రమంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ ఈ వెంకటేశ్వర్లు ,విజివో మనోహర్, డిప్యూటీ ఈవోలు  గోవిందరాజన్, సుబ్రహ్మణ్యం, డీఈవో భాస్కర్ రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, ఐటి జిఎం  సందీప్,
ఈఈ లు మనోహర్,  మురళి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 భక్తుల సదుపాయం కోసం అన్ని టోకెన్ల జారీ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో భక్తుల సౌకర్యం కోసం క్యూఆర్ కోడ్ సదుపాయం ఏర్పాటు చేశారు.. భక్తులు తమ మొబైల్ లో  క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఎలా వెళ్ళాలో సూచిస్తుంది. బ్రహ్మోత్సవవాల సందర్బంగా తిరుమలలో ఏర్పాటు చేసిన ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో తిరుపతిలో కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని టిటిడి కోరింది.

Tirupati

2022-12-31 06:49:12

అన్నవరం శ్రీసత్యదేవుడూ ఇంటిపన్ను ఎగవేతదారుడే

ప్రపంచంలోనే ఎంతో పేరున్న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి పరువును దేవదాయశాఖ కావాలనే తీసి రోడ్డున పడేసేలా చేస్తున్నది. దానికి దేవస్థాన అధికారులు తోడవ్వడంతో అది కాస్త తరచూ వార్తలకెక్కుతూ స్వామివారి గౌరవానికి, కీర్తికి బంగం కలిగేలా చేస్తున్నది. పన్ను ఎగవేత దారుల జాబితాలోకి ఇపుడు సత్యదేవుని ఇల్లు(ఆలయం) వచ్చి చేరింది. తరచూ నోటీసుల తీసుకుంటూ పన్ను ఎగవేతదారునిగా సత్యదేవుడు మచ్చపడ్డాడు. ఎక్కడైనా దేవతా మూర్తులు భక్తుల నుంచి ముడుపులు అందుకుంటారు. కానీ సత్యదేవుడు మాత్రం పన్ను ఎగవేత దారునిగా ఏడేళ్లుగా పన్ను బకాయి నోటీసు అందుకుంటూనే ఉన్నాడు.. తామన్నీ నిబంధనల ప్రకారం చేస్తామని బీరాలు పోయే దేవాదాయశాఖ, ఇందులోని అధికారులు 2015-16 నుంచి  2022-23 వరకూ రూ.81.92 లక్షల ఇంటిపన్ను ఎగ్గొట్టారు.

 పంచాయతీ నుంచి ఎన్ని నోటీసులు ఇస్తున్నా అన్నవరం దేవస్థానం అధికారులుగానీ, రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లుగానీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్వామి వారికి వచ్చే ఆదాయం నుంచి కొద్ది కొద్దిగా చెల్లించినా సత్యదేవుని ఆలయం ఇంటిపన్ను బకాయి తగ్గేది. పన్నుఎగ్గొట్టింది సరికదా 2016లో హై కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకుంది దేవదాయశాఖ. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రముఖ దేవస్థానాలు టెంపుల్ సిటీ, దాని పరిధిలోకి వచ్చే పంచాయతీలకు క్రమంతప్పకుండా ఇంటి పన్ను చెల్లిస్తుంటే స్వామివారి పరువును కోర్టు వరకూ తీసుకెళ్లారు అన్నవరం దేవస్థానం అధికారులు.

 అంతేకాదు దేవస్థాన పరిధిలోకి వచ్చే పంచాయతీకి గానీ, ఇక్కడి సర్పంచ్ గానీ, ప్రోటోకాల్ కూడా ఇవ్వడం మానేశారు. ఇదేమంటే తమ శాఖ ముఖ్య అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ధీమాగా సమాధానం చెబుతున్నారు. ఓ పక్క సీఎం వైఎస్.జగన్మోహ నరెడ్డి నిష్పక్షపాతంగా పరిపాలన చేపట్టాలని అన్ని 75 ప్రభుత్వశాఖల అధిపతులకు నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతున్నా.. దేవాదాయశాఖ అధికారులు మాత్రం అటు సీఎం మాటను పరిగణలోకి తీసుకోకుండా..ఇటు సత్యదేవుని పరువుకి బంగం కలిగే విధంగా పన్నులు చెల్లించకుండా వ్యవహరిస్తున్నారు. నిత్యం అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో టెండర్లు, రూమ్ లు బుకింగ్, దర్శనాలు అన్నీ దేవస్థానం అధికారులు,  సిబ్బంది అందరూ అడ్డదారిలో అస్మదీయులకు ఆమ్యామ్యాలు పుచ్చుకొని చాలా గౌరవంగా చేస్తారనే అతిచెడ్డ మంచి పేరు ఉంది. తీరా పరిపాలనా వ్యహరాల విషయంలో మాత్రం తమ పై అధికారులు చెబితే తప్పా... ఆ ఒక్కటీ అడక్కు అంటూ భీష్మించుకు కూర్చుకుంటున్నారు.

దేవస్థాన ఇంటి పన్ను బకాయి విషయం మంత్రి దృష్టికి
అన్నవరం దేవస్థానంలో సుమారు ఏడేళ్ల నుంచి పేరుకుపోయిన రూ.18లక్షల ఇంటి పన్ను బయిలు దేవస్థానం చెల్లించకపోవడంతో ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణకు విన్నవించినట్టు అన్నవరం సర్పంచ్ కుమార్ రాజా మీడియాకి తెలియజేశారు. ఆ తరువాత ఇదే విషయమై దేవాదాయశాఖ అధికారులను మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినా నేటికీ అతీ గతీ లేదని పేర్కొన్నారు. స్వామివారి ఇంటి పన్ను నోటీసులు పదే పదే ఇవ్వడాని బాధ కలుగుతుందన్నారు. తిరుపతి లాంటి దేవస్థానాలు దేవస్థాన పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తున్న విషయాన్ని ఉటంకించారు. అదే సమయంలో ఇటు దేవస్థాన ఈఓ కూడా తమ శాఖ నుంచి ఆదేశాలొస్తే అమలు చేసి ఇంటి పన్ను బకాయిలు కొద్ది కొద్దిగా తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

రాజ్యం బాగుండాలంటే రాజు పరిపాలన బాగుండాలంటారు..అదేవిధంగా దేవస్థానాలు అభివృద్ధి చెందాలన్నా, పేరు ప్రఖ్యాతలు పెరగాలన్నా దేవాదాయశాఖలోని ముఖ్య అధికారుల పరిపాలన సక్రమంగా ఉండాలి. లేదంటే దేవుళ్ల ఇళ్లకు, దేవస్థానాలకు ఇలా అన్నవరం గ్రామ పంచాయతీలు జారీచేసినట్టు ఇంటి పన్ను నోటీసులు జారీచేయించుకొని.. దేవుడే తప్పుచేసినట్టు అధికారు వ్యవరించే తీరుకి భక్తుల ముందు పన్ను ఎగవేత దారునిగా రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి దేవుని ఆలయం ఇంటి పన్ను బకాయిలు అన్నవరం పంచాయతీకి చెల్లించడంతోపాటు, గ్రామాభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Annavaram

2022-12-31 05:30:42

ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి

అనకాపల్లి జిల్లాలో ప్రతీ ఒక్కరూ ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పటాన్ శెట్టి రవి శుభాష్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో ఆధార్ మోనిటరింగ్ కమిటీ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు మీ ఆధార్ ని 10(2010 నుండి 2015 మధ్యలో చేసుకున్న వారు డాక్యుమెంట్ అప్ డేట్ చేసుకోవాలని లేదంటే ప్రభుత్వ పథకాలు వర్తించవని చెప్పారు. సంవత్సరాల క్రితం పొంది మరియు దానిని ఎప్పుడూ అప్డేట్ చేయలేకపోతే అప్ డేట్ చేసుకోవాలన్నారు. 5 సంవత్సరాలు దాటిన వారు కొత్తగా నమోదు 
చేయాలని, తిరిగి 15 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు.  అప్డేట్ చేసిన ఆధార్-శక్తివంతమైన ఆధార్ జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. 

ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చున్ని వివరించారు.  ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయడం వలన బ్యాంకు ఖాతా తెరవడం సులభతరమని చెప్పారు. దాదాపు 1000 ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాల ప్రయోజనాలను నివాసితులు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. ఆధార్ ను ఉపయోగించి మొబైల్ సిమ్ పొందడం సులభతరమన్నారు. వివిధ స్కాలర్షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యమన్నారు. తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయితే, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ ను సులభంగా ఇ-వెరిఫై చేయవచ్చని తెలిపారు.  ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటరమణ, జియస్డబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్ గిరిధర్, సిఎస్సి మేనేజర్ జగదీష్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-12-30 15:57:04

3న సావిత్రిబాయి ఫూలే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

జ‌న‌వ‌రి 3వ తేదీన సావిత్రిబాయి ఫూలే విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని, రాష్ట్ర శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ప్ర‌క‌టించారు. క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని మ‌హాత్మా జ్యోతిభా ఫూలే విగ్ర‌హం ప్ర‌క్క‌న‌, సావిత్రిభాయి ఫూలే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగ‌ణాన్ని సుమారు రూ.43.75ల‌క్ష‌ల‌తో ఆధునీక‌రించి, గ్రానైట్‌తో, రంగుల విద్యుత్ దీపాల‌తో, వాట‌ర్ ఫౌంటెన్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఈ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను కోల‌గ‌ట్ల శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ ఎస్‌వివి రాజేష్ మాట్లాడుతూ, వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి ఫూలే జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా, జ‌న‌వ‌రి 3వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు, విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ రోజు వైఎస్ఆర్ జంక్ష‌న్ నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని, అనంత‌రం విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పారు.  ఈ ప‌రిశీల‌నా కార్య‌క్ర‌మంలో  మున్సిప‌ల్ ఇన్‌ఛార్జి క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, ఎంఇ శ్రీ‌నివాస‌రావు, తాశీల్దార్ సిహెచ్ బంగార్రాజు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, జోన‌ల్ ఇన్‌ఛార్జిలు, పార్టీ నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-30 14:16:17