1 ENS Live Breaking News

హోమ్ గార్డ్ డీఎస్పీ గా ఏడుకొండలరెడ్డి

హోమ్ గార్డ్ డీఎస్పీ గా దుండి ఏడుకొండలరెడ్డి సోమవారం భాద్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 1991లో ఏఆర్పిసిగా పోలీస్  డిపార్ట్మెంట్ లో చేరిన ఆయన 1996లో ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఇటీవల జరిగిన బదిలీలలో విశాఖ హోమ్ గార్డ్ డీఎస్పీ గా నియమితులయ్యారు. ఈయన విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఆరు జిల్లాలకు ఆయన ఇంచార్జి గా వ్యవహరిస్తారు.  ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ మొదలగు రాష్ట్రాలలో విధినిర్వహణలో భాగంగా అడవులలో దాదాపుగా లక్ష కిలోమీటర్లపైగా నడిచిన వ్యక్తిగా ఏడుకొండలరెడ్డి పేరొందారు.

Visakhapatnam

2022-12-12 15:58:43

ఓటరు నమోదు, తొలగింపు పారదర్శకంగా చేయాలి

ఓటరు నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులు పక్కాగా, పారదర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహాయ ఎలెక్టోరల్ అధికారుల (తహసిల్దార్లు) ను ఆదేశించారు. సోమవరo కలెక్టరేట్ వీడియొ కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లాలోని తహసిల్దార్లు , సబ్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియొ కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ,  ఇప్పటి వరకు అందిన ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-6, తొలగింపులకు సంబంధించి ఫారం -7, బదిలీలకు సంబంధించి ఫారం -8 ల పై క్షేత్ర స్థాయిలో త్వరగా విచారణ  జరిపి పరిష్కరించాలని ఆదేశించారు.  అదేవిధంగా జూలై నుండి నవంబర్ వరకు అందిన శరఖాస్తులు కూడా పరిష్కరించాలన్నారు. తుది ఓటర్ల జాబితా జనవరి ఐదున ప్రచురించాల్సి ఉన్నందున పరిష్కార చర్యలు వేగవంతం చేయాలని, ఎత్తి  పరిస్తితులలోనూ, సరైన కారణం లేకుండా ధరఖాస్తు తిరష్కరణ చేయరాదని, ఓటరుగా తొలగించరాదని హెచ్చరించారు. 

జిల్లాలో 2,771 దరఖాస్తులు (ఫారం 6,7,8 లు) రాగా, 1,950 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ ధరఖాస్తులపై పది రోజుల్లోగా చర్యలు పూర్తీ చేయాలన్నారు.  పూర్తి చేసిన తరువాత వాటిని డిజిటలైజేషన్ చేసి పరిష్కారం చేయాలన్నారు. ఒక్కో మండలంలో సుమారు 500 దరఖాస్తులు ఉంటాయని,  ప్రతి మండలంలో కనీసం 40 నుండి 50 మంది బి.ఎల్.ఒలున్నందున ఒక్కో బి.ఎల్.ఓ ఫరిధిలో 10 దరఖాస్తులు మించి ఉండవని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరుకు ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్, వచ్చే నెలలో ఎలెక్షన్ కమిషనర్ వచ్చే అవకాశామున్నందున పరిష్కార చర్యలు, ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.  ఈ నెల 22 వ తేదీకి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.  అదేవిధంగా ప్రతి మండలO లో తప్పనిసరిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 

 ఓటరు విధులలో విఆర్ఎ లు ఉండరాదని,  ఎక్కడైనా ఉంటె వారి స్థానంలో వేరే వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియొ కాన్ఫరెన్సు లో ప్రధాన కేంద్రం నుండి శిక్షణా కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్నికల పర్యవేక్షకులు నాగ జ్యోతి,  మoడలాలనుoడి తహసిల్దార్లు, సబ్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-12-12 15:50:30

స్పందన అర్జీలపై తక్షణ స్పందన ఉండాలి..

స్పందన కార్యక్రమంలో  ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులు ఫిర్యాదులపై వెంటనే తగిన చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డి ఆర్ ఓ పి వెంకటరమణ దరఖాస్తులు స్వీకరించారు. డిఆర్ఓ వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. ఈరోజు స్పందనకు 176 అర్జీలు వచ్చాయన్నారు.

Anakapalle

2022-12-12 15:17:22

స‌ఖి గ్రూపుల‌ద్వారా సామాజిక మార్పు.. కలెక్టర్

స‌ఖి గ్రూపులకు వివిధ అంశాల‌ప‌ట్ల సంపూర్ణ‌ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా సామాజికంగా మార్పు తెచ్చేందుకు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. యునెసెఫ్ స‌హ‌కారంతో జిల్లా వైద్యారోగ్య‌శాఖ ఆధ్వర్యంలో స‌ఖి కౌమార బాలిక‌ల వ‌ర్కుషాపు స్థానిక ఎస్‌విఎన్ హొట‌ల్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. ఈ వ‌ర్క్‌షాపులో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, న‌డ‌వ‌డిక‌, విద్య‌, ఉపాధి, వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ‌, వివిధ ర‌కాల చ‌ట్టాలుపై అవగాహ‌న క‌ల్పించేందుకు స‌ఖి గ్రూపులు ఒక వేదిక‌గా ఉన్నాయ‌ని అన్నారు. ఈ గ్రూపుల‌ను ఆలంబ‌న‌గా చేసుకొని, స‌మాజ‌ దృక్ఫ‌థంలో మార్పును తీసుకురావాల‌ని కోరారు. దీనికోసం వివిధ రంగాల వ్య‌క్తులు, వివిధ శాఖ‌లు మేథోమ‌థ‌నం ద్వారా స‌రైన ప‌రిష్కారాల‌ను క‌నుగొనాల‌ని సూచించారు. ప్ర‌స్తుత స‌మాజంలో  బాలిక‌లు, మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌లకు ప‌రిష్కారాల‌ను క‌నుగొనేందుకు ఇటువంటి వ‌ర్కుషాపులు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఒకే వ‌య‌సు ఉన్న వారంద‌రినీ ఒక గ్రూపుగా  ఏర్పాటు చేయ‌డం ద్వారా, వారి వ్య‌క్తిగ‌త‌ స‌మ‌స్య‌లు సైతం బ‌య‌ట‌కు చెప్పే అవ‌కాశం క‌లుగుతుంద‌ని అన్నారు. బాల్య వివాహాల‌ను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, దీనికి స‌ఖి గ్రూపులు కృషి చేస్తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. బాలిక‌లు చ‌దువుకొని, వృద్దిలోకి రావ‌డానికి ఉన్న అపార అవ‌కాశాల‌ను గ్రూపు స‌భ్యుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. కేవ‌లం వైద్యం, ఇంజ‌నీరింగ్ మాత్ర‌మే విద్య‌ కాద‌ని, విస్తృతంగా ఉన్న విద్యావ‌కాశాల‌ను వివ‌రించాల‌ని కోరారు.  

                  ప్ర‌తీఒక్క‌రికీ శారీర‌క ధారుఢ్యం అవ‌స‌ర‌మ‌ని, దీనికోసం ఆట‌లాడ‌టం, ఎక్సైర్‌సైజులు, యోగా నేర్పించాల‌ని సూచించారు. మ‌న జిల్లాను వెన్నాడుతున్న ర‌క్త‌హీన‌త సికిల్ సెల్ ఎనీమియా, థాల‌సీమియా లాంటి వ్యాధుల‌ నివార‌ణ‌కు కృషి చేయాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు. దీనికోసం ఆరోగ్యం సూత్రాలు, పోష‌కాహారాన్ని తీసుకోవ‌డం అల‌వాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా అత్యుత‌న్న పోష‌కాహారం, అవ‌స‌ర‌మైన‌ మందులు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని, వాటి వినియోగంపై స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంద‌ని చెప్పారు. ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌పై ధౌర్జ‌న్యాలు త‌గ్గ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. బాలుర‌కు కూడా గ్రూపుల‌ను ఏర్పాటు చేసి, ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

                 జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ, స‌ఖి కార్య‌క్ర‌మ ఉద్దేశాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై అవ‌గాహ‌నతో పాటు భావ వ్య‌క్తీక‌ర‌ణ కూడా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, వాటి అమ‌లు వెనుక‌నున్న ల‌క్ష్యాల‌ను కూడా ప్ర‌జ‌లకు వివ‌రించిన‌ప్పుడే, పూర్తిస్థాయిలో స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు.

                మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బి.శాంత‌కుమారి మాట్లాడుతూ, త‌మ శాఖాప‌రంగా స‌ఖి కార్య‌క్ర‌మాల‌ను, జిల్లాలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క‌ళా జాతాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

               యునెసెఫ్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ శ్రీ‌ల‌త మాట్లాడుతూ, స‌ఖి గ్రూపుల‌ను బ‌లోపేతం చేయ‌డం, ర‌క్ష‌ణాత్మ‌క జీవన విధానాల‌ను తెలిపారు. కౌమార బాలిక‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఆరోగ్య‌ప‌ర‌మైన అంశాలు, వారి ర‌క్ష‌ణ కోసం ఉద్దేశించిన చ‌ట్టాల‌ను వివ‌రించారు.  

                ఉత్త‌మ స‌ఖి గ్రూపుల‌కు మొమోంటోలను క‌లెక్ట‌ర్‌ అంద‌జేశారు. పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు.  వ‌ర్కుషాపులో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి పి.బాలాజి, అద‌న‌పు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ రామేశ్వ‌రి ప్ర‌భు, యునెసెఫ్ క‌న్స‌ల్టెంట్ కె.శివ‌కిషోర్‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల జిల్లా కోఆర్డినేట‌ర్ అశోక్‌, ప‌లువురు డాక్ట‌ర్లు,  వివిధ శాఖ‌ల ప్ర‌తినిధులు, ఐసిడిఎస్‌ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-09 10:35:34

బాపట్ల కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం-8712655881

మాండోస్ తుఫాను నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలియజేశారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెం.8712655881 నెంబరును అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓల అన్ని ప్రభుత్వశాఖలకు తెలియజేశారు. అంతేకాకుండా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లా ప్రజలు ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు.

Bapatla

2022-12-09 08:56:10

రైతులు దగ్గరుండి భూములు సర్వే చేయించుకోవాలి

భూముల రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు రైతులు ద‌గ్గ‌రుండి త‌మ భూముల కొల‌త‌లు తీయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. రైతుల స‌మ‌క్షంలోనే వారి భూములను స‌ర్వే చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న భూముల రీ-స‌ర్వే ప్ర‌క్రియ ఒక సువ‌ర్ణావ‌కాశం లాంటిద‌ని, దీనిని రైతులంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.  దాదాపు వందేళ్ల త‌రువాత జ‌రుగుతున్న ఈ భూ స‌ర్వే ప్ర‌క్రియ పూర్త‌యితే, భూ స‌మ‌స్య‌ల‌కు, వివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని చెప్పారు.  జిల్లాలో రీ స‌ర్వే ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా జ‌రుగుతోంద‌ని ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24 మండ‌లాల్లోని 179 గ్రామాల్లో స‌మ‌గ్ర భూ స‌ర్వే పూర్త‌య్యింద‌ని,  సుమారు 11వేల మందికి వెబ్‌ల్యాండ్‌లో న‌మోదు చేయ‌డం ద్వారా, వారి భూముల‌పై స‌ర్వ హ‌క్కులను క‌ల్పించడం జ‌రిగింద‌ని తెలిపారు. రైతులు అపోహ‌లను విడ‌నాడి, అధికారుల‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తే,  స‌మ‌గ్ర భూ స‌ర్వేను మ‌రింత విజ‌య‌వంతంగా వేగంగా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. భూ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు, రైతులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ భూముల‌వ‌ద్ద ఉండి, ప్ర‌క్రియ‌ను పూర్తి చేయించుకోవాల‌ని, అక్క‌డే సందేహాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీనికోసం ముందుగానే ఆయా రైతులకు స‌మాచారం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

రీ సర్వేతో ఎన్నో ఉప‌యోగాలు
               స‌ర్వే వ‌ల్ల సాదా బై నామా ద్వారా జ‌రిపిన లావాదేవీల‌కు శాశ్వ‌త హక్కులు ల‌భిస్తాయని, ప్ర‌భుత్వ‌, దేవాదాయ భూముల‌కు ర‌క్ష‌ణ క‌లుగుతుందని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా రైతులు ఎదుర్కొంటున్న జీవితకాల స‌మ‌స్య‌ల‌కు ఈ స‌ర్వేద్వారా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఉద్ఘాటించారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు చుట్టూ రైతులు తిర‌గాల్సిన ప‌నిలేదని, పైసా ఖ‌ర్చు లేకుండా త‌న ఆస్తికి స‌ర్వ హ‌క్కులూ ల‌భిస్తాయని తెలిపారు. ఈ స‌ర్వే ప్ర‌క్రియ ద్వారా సాగుచేసుకుంటున్న పొలాల‌తో పాటు 4 లక్ష‌ల ఖాతాల‌కు సంబంధించిన‌ గ్రామ కంఠాల‌కు, సాదా బై నామా ద్వారా జరిగిన లావాదేవీల‌కు కూడా సంపూర్ణ హ‌క్కులు ల‌భిస్తాయని వివ‌రించారు. వారస‌త్వంగా వ‌చ్చిన భూముల‌కు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే చిటికెలో ప‌రిష్కారం ల‌భిస్తుందన్నారు. స‌రిహ‌ద్దు గొడ‌వులు.. పంప‌కాల చిక్కులు తొల‌గిపోతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్జానాన్ని ఉప‌యోగించి జ‌రుగుతున్న ఈ స‌ర్వే వ‌ల్ల భూముల‌కు సంబంధించి ప్ర‌త్యేక‌ ఎల్‌.పి.ఎం. నంబ‌ర్ ద్వారా అన్ని వివ‌రాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్త‌మై ఉంటాయని, దీంతో భ‌విష్య‌త్తులో  సంబంధిత‌ రైతుల అనుమతి లేకుండా పేర్లు గానీ, సరిహ‌ద్దులు గానీ మార్చ‌లేరని తెలిపారు. చివరికి రిజిస్ట్రేష‌న్ చేసేట‌ప్పుడు కూడా ఓటీపీ వ‌స్తే గానీ ప్ర‌క్రియ ముగియ‌దన్నారు. అత్యంత క‌చ్చిత‌త్వం, భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ 20వేల స‌ర్వే రాళ్ల‌ను రైతుల భూముల స‌రిహ‌ద్దుల్లో పాతడం జ‌రిగింద‌ని తెలిపారు.

త్వ‌ర‌లో భూహ‌క్కు ప‌త్రాల పంపిణీ
               జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్ర‌క్రియ‌లో భాగంగా మొద‌టి ద‌శ విజ‌య‌వంతంగా ముగిసిందని, మూడు రెవెన్యూ డివిజ‌న్ల ప‌రిధిలోని 24 మండ‌లాల్లో రీ-స‌ర్వే పూర్త‌యిందని తెలిపారు. దాదాపు 179 గ్రామాల్లోని 11వేల మంది రైతుల‌కు త్వ‌ర‌లోనే సంబంధిత భూ హ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింద‌ని తెలిపారు.  రెండో ద‌శ‌క్రింద‌ మ‌రో 150 గ్రామాల్లో స‌ర్వే చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని, ఫిబ్ర‌వ‌రి ముగిసే నాటికి మ‌రొక 75 గ్రామాల్లో  స‌ర్వే ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్టు క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-12-08 04:37:43

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చు

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  బుధవారం తహశీల్దార్ల, రెవన్యూ సిబ్బందితో భూ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
 ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ సూచనలిస్తూ భూహక్కు పత్రాలలో ఫోటో మిస్సింగు, వివరాలు నమోదులో తప్పులుంటే మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ హక్కు పత్రాలలో తప్పులున్నా, భూమి వివరాలు నమోదు కాకున్నా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మ్యుటేషను ధరఖాస్తు ద్వారా మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని రైతు లందరికీ విలేజ్ రెవిన్యూ అధికారులు తెలియజేయాలన్నారు. నోటీసులు రైతులందరికీ వ్యక్తిగతంగా అందజేసి, రశీదులు తీసుకొని రికార్డు చేయాలన్నారు..  భూ సర్వేకు సంబంధించిన మొత్తం రికార్డు భద్రపరచాలన్నారు.  రైతుల వివాదాలకు సంబంధించిన వారి వాదనలను, రికార్డులను,  మొబైల్ కోర్టు ఆర్డర్లను  భద్రపరచాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియ పక్కాగా అమలుచేయాలని అదికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు నూరుల్ కమర్,  జిల్లా రెవిన్యూ అదికారి జె. వెంకటరావు, జిల్లా సర్వే సెటిల్మెంటు అధికారి కె. రాజకుమార్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వి.ఆర్.ఒ.లు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-07 15:58:09

ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతికి తావుండకూడదు

అవినీతికి తావులేకుండా పథకాలు, కార్యక్రమాలు ల‌బ్ధిదారుల‌కు అందేందుకు అధికారులు కృషిచేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి.. క‌మిష‌న్ సభ్యులు జె.కృష్ణకిరణ్, పౌర స‌ర‌ఫ‌రాలు, ఐసీడీఎస్‌, విద్య త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. కాకినాడ అర్బన్ కచేరిపేటలో ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న తీరును ప‌రిశీలించారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపప్పు త‌దిత‌ర స‌రుకుల నాణ్యతను పరిశీలించారు. కాకినాడ జగన్నాథపురంలో ఎ.శ్రీనివాసరావుకు చెందిన చౌక ధరల దుకాణాన్ని, అన్నమ్మఘాటిలో ఎంవీవీ సత్యనారాయణ చౌక ధరల దుకాణాన్నిఛైర్మ‌న్ తనిఖీ చేశారు. 


కరప మండలం, పెనుగుదురు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరపలోని శ్రీ నక్కా సూర్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాలను, సరుకుల నాణ్యతను పరిశీలించి పాఠశాల విద్యార్థులకు ఫోర్టిఫైడ్ బియ్యం ప్రాధాన్యం, పోషక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వేలంగిలోని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింటును సందర్శించి బియ్యం బస్తాలు, కందిపప్పు నిల్వను పరిశీలించి హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురజానపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పౌష్టికాహారం అందించే ఈ కార్య‌క్ర‌మాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, మ‌ధ్యాహ్న భోజ‌నం పాఠ‌శాల‌లో చేయాల‌ని సూచించారు. చివరిగా జగన్నాధపురం సెంటర్లో ఉన్న బ‌చ్చు రామం న‌గరపాలక సంస్థ బాలికోన్న‌త పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు పోష‌క విలువ‌లు క‌లిగిన ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించారు.


ఈసంద‌ర్భంగా విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం-2013 ప‌రిధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఏర్ప‌డింద‌ని.. ఈ క‌మిష‌న్‌కు తాను రెండో ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. 2022, మార్చిలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 475 వ‌రకు కేంద్రాల‌ను సంద‌ర్శించిన‌ట్లు వెల్ల‌డించారు. పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ ఆహార ధాన్యాల పంపిణీ, మ‌ధ్యాహ్న భోజ‌నం, అంగ‌న్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మాతృ వంద‌న యోజ‌న (పీఎంఎంవీవై)పై క‌మిష‌న్ దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హిస్తూ లోటుపాట్ల‌ను గుర్తిస్తూ.. స‌రిదిద్దుతున్న‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవినీతి అనేది ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

 అధికారులు, సిబ్బంది నీతినిజాయితీల‌తో ప‌నిచేయాల‌ని విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం కాకినాడ జిల్లాలో ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంద‌ని గురువారం ఉద‌యం వ‌ర‌కు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఫుడ్ కమిషన్ ఛైర్మ‌న్ వెంట ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, సివిల్ స‌ప్ల‌య్స్ డీఎం డి.పుష్ప‌మ‌ణి, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.చాముండేశ్వరి, ఏఎస్‌వో టి.ప్రసన్న లక్ష్మీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియ‌ల్ రాజు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.డి.సలీమ్ త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2022-12-07 15:52:23

ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో సేవ‌లందేలా కృషిచేయాల‌ని.. ఫిర్యా దుల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీడీసీ) స‌మావేశం జ‌రిగింది. డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లాలో అమ‌లుతీరు, అందుబాటులో ఉన్న ఆరోగ్య మిత్ర‌లు, టీం లీడ‌ర్లు, అర్జీల స్వీక‌ర‌ణ‌, ప‌రిష్కార వ్య‌వ‌స్థ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ‌, నెట్‌వ‌ర్క్‌ ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్య సేవ‌లు అందించే వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రైనా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

 కాకినాడ జిల్లాలో 84 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వ‌ర్క్ కింద ఆమోదం పొంది ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 79 మంది ఆరోగ్యమిత్రలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆరోగ్య మిత్ర‌ల‌కు సంబంధించి ఖాళీలు ఏవైనా ఉంటే వెంట‌నే భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ చ‌ర్య‌ల ద్వారా ఆరోగ్య‌శ్రీ సేవ‌ల వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయొచ్చ‌న్నారు. ప్ర‌తి నెల మొదటి బుధవారం డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశాలు ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగేందుకు వీలుగా నెల‌వారీగా స‌వివర నివేదిక‌ల‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎంల‌కు ఆరోగ్య‌శ్రీ సేవ‌లు, ప్ర‌త్యేక యాప్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ ప్ర‌త్యేకంగా నోడ‌ల్ సిబ్బందిని నియ‌మించాల‌ని సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పోస్ట‌ర్ల రూపంలో ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. 104, స్పంద‌న‌, ఐవీఆర్ఎస్‌, వ్య‌క్తిగ‌త మార్గాల ద్వారా అందే ఫిర్యాదుల‌ను, అర్జీల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా గ్రీవెన్సుల ప‌రిష్కారం ఉండాల‌ని క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా స్ప‌ష్టం చేశారు. స‌మావేశానికి డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ‌, క‌మిటీ స‌భ్యులు డా. ఎస్.చక్రరావు, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ‌, ఆరోగ్య‌శ్రీ జిల్లా మేనేజ‌ర్ కె.న‌వీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-12-07 15:48:02

రోగుల కోసం కనీస సౌకర్యాలు మెరుగు పర్చాలి

ఉత్తరాంధ్ర జిల్లాలో  ప్రముఖ వైద్య శాలయిన  కె.జి.హెచ్ కు ప్రతి రోజు అనేక మంది  రోగులు వైద్యం కోసం వస్తుంటారని వారికి కనీస సౌకర్యాలు అందేటట్లు వైద్య సిబ్బంది  చూడాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  బుధవారం ఉదయం స్థానిక కె.జి.హెచ్ ఆసుపత్రిలో ఒపి  స్లిప్, కేస్ షీట్లు మంజూరు చేయు గదిని, క్యూలైన్లను  పార్కింగ్ ప్రదేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేస్ షీట్లు మంజూరు చేయు గదిని మరమ్మత్తులు చేయాలని అదే విధంగా రోగులు ఒపి  స్లిప్  లు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులతో పాటు వచ్చే వారికి కూడా  మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా  నిర్మించాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మెరుగు పర్చాలన్నారు .  ఓపి గేటు ఎదురుగా ఉన్న  మినీ పార్కును సుందరీకరించాలని ఆదేశించారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన  రోగులతో మాట్లాడి వారికి అందుతున్నవైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో  కె.జి.హెచ్ సూపరింటెండెంట్ మైథిలీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-07 13:00:01

జగనన్న పాలవెల్లువ తక్షణమే పూర్తిచేయాలి


జగనన్న పాలవెల్లువ కార్యక్రమం రెండో విడత ప్రారంభానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో  జగనన్న పాలవెల్లువ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో నరసాపురం , పాలకొల్లు,  యలమంచిలి మండలాలలోని 25 గ్రామాలలో పాలు సేకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాల సేకరణ చేయడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అన్నారు. ఏఎంసి సిబ్బందికి , ప్రమోటర్స్ కి సెక్రెటరీ అసిస్టెంట్ సెక్రటరీలకు శిక్షణ పూర్తి చేయాలన్నారు.బి ఎం సి యు లలో మిషన్లు ఏర్పాటు చేసి కాలిబ్రేషన్ చేయడంతో పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  బీ ఎం సీ యు లకు 2  భవనాలు గుర్తించాలని  ఆదేశించారు. ఈనెల 11వ తారీఖున నరసాపురం మండలంలో బీఎంసీ యు లో జగనన్న పాల వెల్లువ  కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

    జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద గతంలో ప్రారంభించిన 10 గ్రామాలలో  ప్రతిరోజు 1,769 లీటర్లు  పాలు సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు సేకరణ ఇంకా పెంచాలని కలెక్టర్ అన్నారు.   ఈ సమావేశంలో డిఆర్ డి ఏ పిడి వేణుగోపాల్  , పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ .మురళికృష్ణ , డి సి ఓ ఎం. రవికుమార్ , డిపిఓ ఎం. నాగలత,  మార్కెటింగ్ శాఖ అధికారులు  ,ల్యాండ్ సూపర్డెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-07 11:58:34

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

శ్రీకాకుళం జిల్లాలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ హెచ్చరించారు.  సమాజంలో ఉండే లింగ వివక్షకు శాశ్వతంగా ముగింపు పలికి, పురుషులతో సమానంగా సమాజంలో ముందుకువెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలంటే అబలలు కాదని, సబలలని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన ర్యాలీ ( మారథాన్ ) కార్యక్రమం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల వద్ద జరిగింది.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మారథాన్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటుచేసి మహిళల లైంగిక వేధింపుల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై గత నెల 26 నుండి ఈ నెల 10వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాప సురక్షితంగా ఉండాలని, వారు సమాజంలో ఉన్నపుడు అబల అనే భావన కాకుండా సబల అనే భావం రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైతే తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిచో పై అధికారులను సంప్రదించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడితే జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు. 

జిల్లాలో యస్.పి, డిఎంహెచ్ఓ, మహిళ, శిశు సంక్షేమాధికారులు మహిళలు కావడం మన అదృష్టమని, బాధితులు ఎవరైనా ఉంటే వారికి వివరంగా తెలియజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, చట్టాలకు లోబడి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. మహిళలు ప్రతి విషయంలో పురుషులతో సమానంగా ఉంటూ సమ సమాజంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళల లైంగిక వేధింపుల నివారణపై రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.  ఈ మారథాన్ కార్యక్రమంలో జిల్లా అదనపు యస్.పి టి.పి.విఠలేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా. డి.వి.విద్యాసాగర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖాధికారి కె.అనంతలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. బి.మీనాక్షి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట రామన్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-07 10:18:46

సాయుధ దళాల ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలందించండి

మాజీ సైనికులు, దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వానుల కుటుంబాల సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఉద్దేశించిన సాయుధ ద‌ళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ డా. కృతికా శుక్లా ప్ర‌జ‌ల‌కు, వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు. బుధవారం భార‌త సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ‌ కలెక్టర్ కార్యాలయంలో క‌లెక్ట‌ర్‌.. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వ నిధి-2022ని ప్రారంభించి, తొలి విరాళం అందించారు. ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేశ ర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లు కృషిచేసిన సైనికుల త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమ‌ర‌వీరుల కుటుంబాల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌న్న విష‌యాన్ని గుర్తుంచుకొని, ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలు అందించాల‌ని పిలుపునిచ్చారు. దాత‌లు నేరుగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్ర‌దించిగానీ లేదా Cheque /DD/Cash /Online Transfer చేయొచ్చ‌ని తెలిపారు.  సైనిక సంక్షేమ నిధి అకౌంట్   వివరాలు: ZILLA SAINIK WELFARE OFFICER,  STATE BANK OF INDIA, ZILLA PARISHAD BRANCH   A/C No-  6 2 0 6 4 0 6 0 6 2 3, IFSC CODE– SBIN0020974, MICR CODE – 533002028. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి సెక్షన్ 80 G అనుగుణంగా  మినహాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు.  కార్య‌క్ర‌మంలో భాగంగా  మాజీ సైనికులు సి.ఆర్.సి.ప్రసాద్, ఎం.పి. రామారావు, సీహెచ్ పవన్ కుమార్ (పవన్ కంప్యూటర్స్, కాకినాడ) విరాళాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్య ప్రసాద్, జిల్లాలోని పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-07 09:11:45

సాయుధ దళాల సేవలు నిరుపమానం.. కలెక్టర్

సాయుధ ద‌ళాలు దేశానికి అందిస్తున్న సేవ‌లు నిరుప‌మాన‌మ‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కొనియాడారు. వారి త్యాగాలు అమోఘ‌మ‌ని పేర్కొన్నారు. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగింది.  క‌లెక్ట‌ర్‌కు  ప‌తాక నిధి ఫ్లాగ్‌ను జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, సైనిక ద‌ళాల సేవ‌ల‌ను కొనియాడారు.  మంచు కొండ‌ల్లో, ప‌ర్వ‌తాల్లో, ఎడారుల్లో, సముద్రంలో, ఎంతో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మ‌ధ్య‌, సాయుధ ద‌ళాలు ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా, అనుక్ష‌ణం ప‌హారా కాస్తూ, దేశాన్ని ర‌క్షిస్తున్నాయ‌ని అన్నారు. వారి త్యాగాల ఫ‌లితంగానే, మ‌న‌మంతా దేశంలో ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నామ‌ని చెప్పారు.

ఉక్రెయిన్ యుద్ద ప‌రిస్థితుల్లో, వైద్య విద్యార్థుల‌ను దేశానికి తిరిగి ర‌ప్పించేందుకు ప‌డ్డ ప్ర‌యాస‌ను గుర్తు చేస్తూ,  దేశంలోని పౌరులు అనుభ‌విస్తున్న స్వేచ్చ‌ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. సాహ‌సోపేత వీర‌జ‌వాన్ల‌కు వంద‌నం స‌మ‌ర్పించేందుకు, వారి కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేందుకు సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా, పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి, వారి త్యాగాల‌ను గౌర‌వించాల‌ని  పిలుపునిచ్చారు. దేశ ర‌క్ష‌ణ‌లో అమ‌రులైన‌ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ, గోడ‌ప‌త్రిక‌ల‌ను క‌లెక్ట‌ర్‌ విడుద‌ల చేశారు.

            జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు మాట్లాడుతూ, పతాక దినోత్స‌వ నిధికి ఇచ్చే విరాళాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉద‌ని తెలిపారు. సైనికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున విరాళాల‌ను అందించాల‌ని కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి, విజ‌య‌న‌గ‌రం ఎస్‌బిఐ ఖాతా నెంబ‌రు 52065221666, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్‌0020931 కు గానీ, లేదా డైరెక్ట‌ర్‌, సైనిక్ వెల్ఫేర్‌, విజ‌య‌వాడ పేరుమీద చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా కూడా త‌మ‌కు విరాళాల‌ను అంద‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

           ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, కెప్టెన్ ఎం.స‌త్య‌వేణి,  కెప్టెన్ ఎ.క‌ల్యాణ్ ఆహోక్‌, లెఫ్టినెంట్ వి స‌న్యాసినాయుడు, హ‌వ‌ల్దార్ మ‌హ‌బూబ్ క‌ట్నాట్‌, మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయ‌కులు, ప‌లువురు విశ్రాంత సైనిక యోధులు, ఎన్‌సిసి కేడెట్లు, స‌చివాల‌య సిబ్బంది, బిఎల్ఓలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-07 08:50:54

ఆదర్శంగా నిలిచిన మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్

పార్వతీమన్యం జిల్లాకి ఆయన జాయింట్ కలెక్టర్..చిటికేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో కార్పోరేట్ వైద్యం కాళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది.. కానీ తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రికే పురుడు పోయడానికి తీసుకెళ్లారు.. అదీ తల్లీబిడ్డా వాహనంలోనే.. ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కటి కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందని.. దానిని 
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తానే స్వయంగా ఆసుపత్రి సేవలను వినియోగించుకున్నారు జెసి ఓ.ఆనంద్. ఆసుపత్రి సిబ్బంది కూడా పరిశుభ్ర వాతావరణంలో పురుడు పోసి చక్కగా మళ్లీ అధే వాహంలో ఇంటికి దగ్గర దించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే కార్పోరేట్ వైద్యం  ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా ప్రసవాల సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగించేసుకోవాలని సూచించారు. తల్లీ బిడ్డను ప్రభుత్వ తల్లీబిడ్డ వాహనంలో తీసుకువచ్చిన సిబ్బందిని జెసి ఈ సందర్భంగా అభినందించారు.

Parvathipuram

2022-12-07 08:40:56