1 ENS Live Breaking News

నెలాఖరులోగా ఈ-కెవైసి చేయించు కోవాలి: కలెక్టర్

పి.ఎం.కిసాన్ పథకం కింద వచ్చే జనవరి నెలలో విడుదల చేసే ప్రోత్సాహక మొత్తాలు రూ.2,000 పొందాలంటే రైతులు తప్పనిసరిగా  ఈ-కే.వై.సి చేయించు  కోవలసి వుంటుందని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి తెలిపారు. రైతులు ఇకేవైసి చేయించుకొనేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు వుందని  పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదు చేయించుకోని రైతులు వెంటనే తమ గ్రామంలోని రైతుభరోసా కేంద్రానికి వెళ్లి తమ వివరాలతో ఈ-కేవైసి నమోదు చేయించుకోవడం ద్వారా పి.ఎం. కిసాన్ పథకం ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. జిల్లాలో విజయనగరం రూరల్, భోగాపురం, గరివిడి, పూసపాటి రేగ, గుర్ల, నెల్లిమర్ల, వేపాడ, కొత్తవలస, చీపురుపల్లి, డెంకాడ, రామభద్రపురం, రాజాం తదితర 12 మండలాల్లో సుమారు 60 వేల మంది రైతులు ఇంకా ఈ-కేవైసి చేయించుకోవాల్సి వుందన్నారు. జిల్లాలో 2.48 లక్షల మంది రైతులకు గాను 1.67 లక్షల మంది రైతులు మాత్రమే ఇప్పటి వరకూ ఈ-కెవైసి చేయించు కున్నట్టు తెలిపారు.

Vizianagaram

2022-12-26 12:43:11

జనవరి 3నాటికి ఓటర్ల జాబితా సిద్ధం కావాలి

జనవరి 3 వ తేదీ నాటికి ఓటర్ల జాబితా సిద్ధం కావాలని ఓటర్ల జాబితా పరిశీలకులు పి.భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త ఓటర్లు, మార్పులు చేర్పులు పూర్తి చేయాలన్నారు.  క్షుణ్ణంగా పరిశీలించి సవరణలు చేయాలని, ఓటర్లకు నమ్మకం కలిగించేలా జాబితా సిద్ధం చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు సమర్పించిన రికార్డులను తరిచి చూడాలన్నారు.  ఓటర్లలో స్త్రీ పురుష నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి అన్ని పోలింగ్ కేంద్రాలలో రాష్ట్రస్థాయి నిష్పత్తికి దాదాపు సమానంగా ఉండాలన్నారు.  కొత్తగా చేరిన ఓటర్లు, తొలగింపు చేయవలసిన ఓటర్లను గుర్తించిన తరువాత దామాషా పద్ధతిని పరిశీలించాలన్నారు.  క్షేత్రస్థాయిలో అనుమానం ఉన్నచోట్ల క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల దాటిన కొత్త ఓటర్లు సుమారు 15 వేలు వచ్చారని, తొలగించవలసిన ఓట్లు సుమారు పదివేల వరకు ఉన్నాయన్నారు. ఫారం 7 క్లైములు 1208 కాగా 99 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు.  మృతి చెందిన ఓటర్లు, వలసపోయిన వారిని గూర్చి స్పష్టమైన ఆధారాలతో సరి చూసి తుది జాబితా తయారు చేస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి, జిల్లాలోని చోడవరం మాడుగుల అనకాపల్లి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గాల ఎన్నికల అధికారులు ఆయా నియోజకవర్గాలలోని మండలాల తాశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-12-25 06:38:17

ఆది శంకరాచార్యులు మార్గముతోనే అందరికి వేదం

అత్యంత పురాతనమైన, పవిత్రమైన వేద వాఙ్మ యాన్ని గ్రామగ్రామాన వినిపించేందుకు విశాఖ కు చెందిన సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన భారత దేశ పరిక్రమ యాత్ర వేదారథాన్ని పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి అహోబిల జీయర్ స్వామి బుధవారం వేదపాఠశాలలో ప్రారంభించి వేదపండితులకు మంగళశాసనములు అందించారు.  ఈ వేద పరాక్రమ యాత్రలో పాల్గొనే  25 మంది వేదపండితుల ద్వారా దేశ వ్యాప్తంగా వైదిక, దైవిక తరంగాలు ప్రసరిస్తాయని సింహాచలము దేవస్ధానం ధర్మ కర్తల మండలి సభ్యులు  గంట్ల శ్రీనుబాబు తెలియచేసారు. సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన వేద పాఠశాల పండితులు వేద భారత పరాక్రమ యాత్ర లో భాగంగా విశాఖ శంకర మఠం నుంచి ఆసీలు మెట్ట లోగల సంపత్ వినాయక గర్ ఆలయం వరకూ చేపట్టిన  పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ యాత్ర విషయాలను తెలుసుకుని, యువకులను అభినందించారు. ఈ యాత్ర ద్వారా ఆధ్యాత్మిక వైభవం తిరిగి దేశవ్యాప్తంగా ప్రసరింపచేయాలని ఆకాంక్షించారు. 
గత 70 ఏళ్ళ తర్వాత కాశ్మీర్ రాష్ట్రంలో వేదపారాయణం చేసిన ఘనత సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ దే నన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మాధవ శర్మ బృందం  ఈ ఏడాది శ్రీనగర్ లో వేద దివస్ ను వైభవంగా 4 రోజుల పాటు కాశ్మీర్ లో నిర్వహించడం విశాఖ కె గర్వకారణం అన్నారు.   
 
ఈ పాఠశాల నిర్వాహకులు మావళ్ళపల్లి మాధవశర్మ మాట్లాడుతూ ఆదిశంకరులు నడిచిన యాత్ర లోని ప్రాంతాలలో గత మూడేళ్లు గా పర్యటిస్తూ తాము నాలుగు వేదాలను పారాయణ చేస్తున్నామన్నారు. ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం పారాయణ తో పాటు, మహిళా సభ్యులచే శ్రీ లలితా సహస్రనామ పారాయణ, చిన్నారులచే కనకధారా స్తవం, 24 లక్షల గాయత్రీ జపం కూడా నిరాఘాతంగా పఠించడం జరుగుతుందన్నారు. 
 
వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేదపండితులు, మహిళలు, చిన్నారులు ఒక ప్రత్యేక బస్సులో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నెల 21 న విశాఖ నుంచి బయలు దేరిన ఈ భారత పరిశ్రమ యాత్ర జనవరి 20 , 2023 నాటికి తిరిగి విశాఖ చేరుకుంటుందని తెలిపారు. 

ఈ యాత్ర  విశాఖ నుంచి సింహాచలం, అన్నవరం, యానాం, మురుముళ్ల, అమలాపురం, రావులపాలెం, ఏలూరు, విజయవాడ, శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, కర్నూల్, అహోబిలం, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కాంచీపురం, శ్రీకాళహస్తి, తిరుపతి, అరుండరాంబరం, వెల్లూరు, పాలక్కాడ్, కాలడి, శృంగేరి, మురుడేశ్వర్, శివమొగ్గ, కొల్హాపూర్, మహాబలేశ్వర్, భీమశంకర్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, నిష్కల్ంక్ (భావనగర్), సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, ఉదయపూర్, జైపూర్, బ్రహ్మసరోవరం, కురుక్షేత్రం, జమ్మూ, శంకరల్ లాచార్య కొండలు , సింధూరివర్ ఖీర్ భవానీ ఆలయం, లాల్చౌక్, శృంగేరి నిర్మించిన ఆలయం, ధర్మశాల, హరిద్వార్, రిషికేశ్, జోషిమఠ్, జాగేశ్వర్, నైమిశారణ్య, అయోధ్య. ,ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్, వారణాసి, అమర్‌కంటక్, బిలాస్‌పూర్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోణార్క్, పూరి,
సోంపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విజయనగరం ల్లో పర్యటించి తిరిగి విశాఖపట్నం లోని సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ వేద పాఠశాల కు చేరుకుంటుంది.

Visakhapatnam

2022-12-21 15:02:47

చిన్న పిల్లలతో యాచకత్వం చేయిస్తే కఠిన చర్యలు

పిల్లలతో యాచకత్వాన్ని ప్రోత్సహించే వారిపై  కఠిన చర్యలు తప్పవని కార్యదర్శి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు హెచ్చరించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన స్టేట్ ప్లాన్ అఫ్ యాక్షన్ కి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, న్యాయ సేవా సదన్ లో పిల్లలలో యాచకత్వం నిరోధించే అంశముపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ, పిల్లలలో యాచకత్వాన్ని ప్రోత్సహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పిల్లలలో యాచకత్వాన్ని నిర్మూలించి వారిని మంచి 
బాధ్యత గల భావి భారత పౌరులుగా తయారు చేసే బాధ్యత భారత దేశ పౌరులు అందరి పైన ఉందన్నారు. యాచకత్వం చేసే పిల్లలు ఎవరైనా కనిపిస్తే సాధారణ పౌరులు కూడా పోలీసులకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి గాని వెంటనే సమాచారాన్ని ఇచ్చే భాద్యత తీసుకోవాలన్నారు.

 భారత దేశ భవిష్యత్తు బాలల చేతుల్లోనే ఉందని గుర్తించాలన్నారు. చాలామంది పేదరికం సాకు గా చెప్పి పిల్లల్ని యాచకత్వంలోకి దించుతున్నారని ఇటువంటి వారికి ప్రభుత్వం నిర్వహిస్తు్న్న అనేక శిక్షణ కార్యక్రమాలు ద్వారా ఆర్థిక స్వావలంబనకు సహాయం అందించవచ్చునని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా 
అందిస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాల్లో ఇలాంటి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి వారిని ఆర్థింగా నిలదొక్కుకునే స్థాయికి తేవడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశా డిఎస్పీ వాసుదేవరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.వి.రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు  శ్రీలక్ష్మి, ఎల్సిపిఓ తలే లక్ష్మణరావు, న్యాయవాది ఇందిరా ప్రసాద్ తోపాటు శ్రీకాకుళం జిల్లాలోని స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, అర్బన్ సెక్రటేరియట్ ల లోని ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు పొదుపు సంఘాల సూపర్వైజర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Srikakulam

2022-12-17 10:40:55

ఇచ్చాపురంలో అక్షయపాత్రకు స్థలమిస్తాం: కలెక్టర్

ఇచ్చాపురంలో అక్షయపాత్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం తరపున కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వద్ద గల అక్షయపాత్రను కలెక్టర్ శనివారం సందర్శించారు. శ్రీకాకుళం చుట్టుపక్కల గల నాలుగు మండలాల పరిధిలోని 24వేల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న సంగతి విదితమే. ఇదేవిధంగా ఇచ్చాపురంలో కూడా అక్షయపాత్రను ఏర్పాటుచేసి చుట్టుపక్కల మండలాల్లోని విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందుకు ఇచ్చాపురంలో అన్నిటికీ అనువుగా ఉండే ప్రాంతంలో  అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ అక్షయపాత్ర మేనేజర్ పి.వెంకటరాజుకు తెలిపారు.

 అయితే నిర్మాణం, అవసరమైన యంత్ర సామగ్రిని అక్షయపాత్రే సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్షయపాత్రలోని వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆహారం సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఇటీవల విద్యార్థుల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై 
అటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇచ్చాపురంలో అక్షయపాత్ర నిర్మాణంపై యాజమాన్యంతో మాట్లాడి తమకు తెలియజేయాలని కలెక్టర్ మేనేజర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ, అక్షయపాత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-17 10:25:37

SHRC చైర్మన్ ను కలిసిన కాకినాడ అడిషనల్ ఎస్పీ

ఎస్.హెచ్.ఆర్.సి. చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తిని జిల్లా అడిషనల్ ఎస్.పి. పి. శ్రీనివాస్ మర్యాదపూర్వంగా కలిశారు. శుక్రవారం కాకినాడ కు విచ్చేసిన ఆయనను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద కలిసారు.  ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్కను అందజేశారు. జిల్లాలో పోలీసుశాఖ ద్వారా అందజేస్తున్న సేవలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి.తో పాటు కాకినాడ డి.ఎస్.పి. పి. మురళీ క్రిష్ణా రెడ్డి, కాకినాడ 1వ పట్టణ సి.ఐ. వి.కృష్ణ, ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

Kakinada

2022-12-16 10:26:34

ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మనందరి మదిలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున అన్నారు.  గురువారం ఉదయం పొట్టి శ్రీరాములు  వర్థంతి సందర్భంగా కలెక్టరేట్  సమావేశ మందిరంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని ,తన త్యాగాల ఫలితంగా తెలుగు రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు.  ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని, ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. 

మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని తెలిపారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుడుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలసిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ .శ్రీనివాస్ మూర్తి,  , సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వి.మణిరామ్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-15 11:29:18

అమరజీవి పొట్టిశ్రీరాములు చిరస్మరణీయులు

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి  పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మదిలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కితాబిచ్చారు. గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్థంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు.  మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని, ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుడుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలసిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-15 11:16:39

ప్రభుత్వ భవనాలను సత్వరమే పూర్తిచేయాలి

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు త్వరగా పూర్తి చేసి ఆయా వసతులను అందుబాటులోకి తేవాలని, అదేవిధoగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలు వేగవంతం చేసి లబ్ధిదారుల చిరకాల వాంఛ సొంత ఇంటి కలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత ఇంజనీర్ల  ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల స్థితిగతులు, జగనన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్లు, గృహ నిర్మాణాల్లో పురోగతి, జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వే  స్పందన అర్జీలు నాణ్యతతో పరిష్కారం, అంశాల పురోగతిపై జిల్లాలు వారిగా జిల్లా  కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ తో సమీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా నీటి యజమాన్య సంస్థ జిల్లా పంచాయతీ అధికారులు పూర్తి సమన్వయంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త నుండి సంపత్తి తయారు చేసే నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ ఆరోగ్యకర సామాజిక స్థాపన దిశగా ముందడుగు వేయా లన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగం వారు రెవెన్యూ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా రి సర్వే పూర్తి నాణ్యత ప్రమా ణాలతో పారదర్శంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి భూ యజమానులకు హక్కుపత్రాల పంపిణీకి చర్యలు గైకొనాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో గర్భం దాల్చిన మహిళలలో రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందిస్తూ ప్రసవ తేదీకి వారం ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రుల లోని కాన్పు కొరకు వేచి ఉండు గదులలో ప్రవేశం కల్పించి సుఖప్రసవాలు నిర్వహించుకునే విధంగా ప్రసవ ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తూ మాతా శిశు సంరక్షణ దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ద్యానచంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, డిపిఓ వి కృష్ణకుమారి జిల్లా నీటి యజమాన్య సంస్థ పిడి ఎస్ మధుసూదన్ ఆర్డ బ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్. ఇ.లు కృష్ణారెడ్డి ,చంటిబాబు జిల్లా ఆర్థిక గణాంక అధికారి వెంకటే శ్వర్లు, గృహ నిర్మాణ సంస్థ పిడి సిహెచ్ బాబురావు డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, ఐసిడిఎస్ పిడి జీవి సత్యవాణి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి వి శివశంకర్ ప్రసాద్,  మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ జిల్లాస్థాయి  అధికారులు దళితులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-15 10:44:34

అమరజీవి ఆశయాలను ప్రతీఒక్కరూ ఆచరించాలి

అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల ఆశయాలను త్రికరణ శుద్ధిగా ఆచరించడమే వారికి అర్పించే ఘనమైన నివాళి అని  జిల్లా కలెక్టర్  హిమాన్సు శుక్లా పేర్కొన్నా రు. గురువారం అమరి జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ నందు  అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  పూలమాలలు అలంకరించి పుష్ప గుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి , అమరజీవి అయిన  మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రోజున ఆయనను స్మరించుకోవడం మన బాధ్యతని సూచించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడని, మహాత్మా గాంధీ బోధించిన సత్యo, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు  1901 మార్చి 16న మద్రాసులో జన్మించాడన్నారు. 

 సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మక మైనదని ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములని. ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం
అచెoచలమైనదన్నారు.  మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారని.చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష తీవ్రతరమై 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు,తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యా డని ఆయన త్యాగనిరతిని కొనియాడారు. చివరకు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను త్యాగం చేసి అమరజివిగా నిలిచాడన్నారు. 

తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ మహనీయుడు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం నిరుపమానమై నదన్నారు.  మహాత్మా గాంధీ అనుచరుడిగా గాంధేయ మార్గంలో ఆయన 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అమరులైయ్యా రని, ఆయన మరణించిన కొన్ని దినాలకే అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును ప్రకటిం చారన్నారు. పొట్టి శ్రీరాములు నిస్వార్థ ఆత్మ త్యాగంతో 1953 అక్టోబరు 1 వ తేదీన కర్నూలు రాజధానిగాను, తదుపరి తెలుగు భాష మాట్లాడే ప్రాంతలను కలిపి 1956 నవంబరు 1వ తేదీ నుండి హైదరాబాదు రాజధానిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవిం చిందన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు అమరజీవి నిస్వార్థ ప్రాణ త్యాగాన్ని తెలుగు జాతి ఎన్నటికీ మరువదన్నారు.

 ఆయన ఆశయాలు తెలుగు వారందరికీ  స్పూర్తిదాయకంగా నిలిచి ముందుకు నడిపిస్తాయన్నా రు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో తెలు గు మాట్లాడే ప్రజలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుందన్నారు. మహ నీయుడు పొట్టి శ్రీరాములు నిరుపమాన త్యాగానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని నిర్వహిస్తోం దన్నారు. అమరజీవి ఆకాంక్షల కనుగుణంగా ఆశయాల బాటలో  పేదల సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు కలెక్టరేట్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-15 10:38:37

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్యాలు చేరుకోవాలి

డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని అంతిమంగా ప్రజలకు మేలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులతో ఉమ్మడి జిల్లా నుండి ఉద్యోగుల విభజన, పెండింగ్ అంశాలపై మరియు కన్వర్జేన్సీ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విభజన జరిగి ఎనిమిది మాసాలు గడిచినప్పటికీ ఇంకా కాకినాడ నుండి సిబ్బంది విభజన, రికార్డులు అందుబాటు పెండింగ్ అంశాలపై స్పష్టతకు రావాల్సిన అవసరం ఉందని మీ శాఖలలో పెండింగ్లో ఉన్న అంశాలు నా దృష్టికి తెస్తే మీ యొక్క హెచ్ ఓ డీల తో సంప్రదించి పరిష్కారానికి చర్యలు గైకొనడం జరుగుతుం దన్నారు. ఇకపై పరిపాలన అనేది జిల్లా స్థాయిలోనే జరగాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సమన్వయం వహించాలని ఆదేశించారు.

 ప్రభుత్వం అనేక ప్రాధాన్యతా o శాలను త్వరితగతన పూర్తి చేయాలని నిత్యం సమీక్షలు నిర్వహిస్తోందని ఆ దిశగా అధికారి యంత్రాoగo పూర్తి సమన్వయం వహించి అంతిమంగా ప్రజలకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నిర్దేశం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలలో ఆశించిన పురోగతిని చూపాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి శాఖ కన్వర్జెన్సీ విధానంలోనే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు పౌష్టికాహార లోపం అనేది వైద్యులు నిర్ధారించాక మహిళా శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారం అందించి లక్ష్యాలను చేరుకోవడం జరుగు తుందన్నారు.ఆదేవిధంగా నవరత్నా లు పేదలందరికీ భాగంగా వివిధ శాఖలు కన్వర్జేన్సీ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వశాఖలలో సమన్వయo అనేది కీలకమైన పాత్ర పోషిస్తుం దన్నారు. 

 అధికారులు పూర్తి సమన్వయంతోనే ప్రజలకు అంతిమంగా ఆయా వసతులను సంక్షేమాలను చిట్టచివరి లబ్ధిదారుల వరకు అందించాల్సి ఉంటుందని ఆయన పునరు ద్ఘాటించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు చేపట్టే కార్యక్రమాలను ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ విశ దికరించారు  అదేవిధంగా సిబ్బంది సమస్యలు ఇతర శాఖాపరమైన విభజన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ద్యాన చంద్ర డిఆర్ఓ సత్తిబాబు జిల్లా స్టాయిఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-15 10:27:08

భూరక్ష రీసర్వే అత్యంత పారదర్శకంగా జరగాలి..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న భూ శాశ్వతహక్కు భూరక్ష రీసర్వే  పారదర్శకంగా చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి  నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీ సర్వే  సరిహద్దురాల్లు ఏర్పాటు గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ ముసాయిదా ఆర్ఓఆర్ ఫైనల్ ఆర్వార్ ,13 నోటిఫికేషన్  ఓ ఆర్ ఐ మ్యాపులతో సంబంధం లేకుండా సర్వేనిర్వహణ ముటేషన్లు పరిష్కారం, 22 ఏ ప్రకారం సర్వేలో దేవాదాయ గ్రామకంఠ భూములు తొలగింపు, నాలాపై వచ్చిన దరఖాస్తులు పరిష్కారం సర్వేలో ఉత్పన్నమైన ఫిర్యాదులు పరిష్కారం తదితర అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించి నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు చేరుకున్నది అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని. వైఎస్సార్ జగనన్న  భూ శాశ్వత హక్కు, భూరక్ష పథకం పేరిట సమగ్ర భూ సర్వేను ఆచరణ లోకి తెచ్చిం దని జిల్లా కలెక్టర్ తెలిపారు

దశల వారీగా సర్వే చేపట్టి భూ సమస్య లను పరిష్కరిస్తూ వివాదరహిత భూములను భావితరాలకు అందించేందుకు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయని వందేళ్ల క్రితం సర్వే వివరాలతో రూపొందించిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఇప్పటికీ అమలు చేస్తున్నారని. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్వహిం చిన సర్వే ఆధారంగా భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నా రని. ఒకే సర్వే నెంబర్లు పై పలుమార్లు లావాదేవీలు జరిగాయని. వార సులు భాగపంపిణీలు చేసుకోవడం. బహుమతిగా ఇవ్వడం, క్రయ విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా సబ్ డివిజన్ భూమి మీద జరగక పోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా రీసర్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారన్నారు. 

గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లోనమోదు చేయడం వంటి పనులు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు  గ్రౌండ్ వాల్యుయేషన్ గ్రౌండ్ త్రుతింగ్ సరిహద్దు రాళ్ల ఏర్పాటు తోపాటు, సర్వేలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా 22 గ్రామాలలో ఓ ఆర్ ఐ మ్యాపులు లేకుండా సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 గ్రామాలకు హక్కుపత్రాలు పంపిణీ కొరకు  సిద్ధం చేయడం జరిగిందన్నారు గ్రౌండ్ ట్రుతింగ్  గ్రౌండ్ వాల్యుయేషన్ . ప్రక్రియలు  సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు  హక్కుపత్రాల పంపిణీ ప్రక్రియ త్వరలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ద్యాన చంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు,సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ,కార్యాలయ సెక్షన్ అధికారులు రమణకుమారి,పి సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-15 10:20:35

అమరజీవి స్పూర్తితో లక్ష్యాలను సాధించాలి

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నుంచి ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం అమరజీవి పొట్టి శ్రీరాములు 70 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డిఆర్వో జీ. నరసింహులు, జిల్లా అధికారులు పి. జగదాంబ, పి. లక్ష్మణ రావు, కె. ప్రకాశరావు, కే ఎన్ జ్యోతి, పి ఎస్ రమేష్,  వి. శాంత మణి, పి. వీణాదేవి, తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Rajamahendravaram

2022-12-15 10:05:38

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్థంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.మహాత్మాగాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డిప్యూటీ డి ఎమ్ అండ్ హెచ్ ఓ దుర్గా కల్యాణి,  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-15 09:53:55

7రోజులు ముందుగా హైరిస్క్ గర్భిణీలను గుర్తించాలి

ప్రసవానికి ఏడు రోజులు ముందుగా హై రిస్క్ ఉన్న గర్భిణీలను  గ్రామాల్లో గుర్తించి జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలు,  పాఠశాలల్లో ఉన్న 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త హీనత లోపం లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హై రిస్క్ ఉన్న రోగులను గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించాలని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్రింద గ్రామాల్లో పారిశుధ్య మెరుగుకు ఇంటింటికీ చెత్త సేకరణ రోజువారీగా తప్పకుండా జరగాలన్నారు.

 చెత్త నుండి సంపద కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. క్లాప్ మిత్రా జీతభత్యాలు సకాలంలో చెల్లించాలని అన్నారు. జిల్లాలో జరుగుతున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్,  జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డిప్యూటీ డి ఎమ్ అండ్ హెచ్ ఓ దుర్గా కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-15 09:43:37