1 ENS Live Breaking News

ఈ సృష్టి లో గురువును మించిన దైవం లేదు

ఈ సృష్టి లో గురువును మించిన దైవం, సంపద లేదని,  గురువులును  గౌరవించడం పూజించడం మన కనీస ధర్మమని  సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు అన్నారు. విశాఖలోని మురళీ నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా  రెండు రోజుల పాటు నిర్వహించిన పలు పూజాది కార్యక్రమాలకు గంట్ల శ్రీనుబాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీను బాబును ఘనంగా సత్కరించింది. అనంతరం శిరిడి సాయి నాధుని జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయం ప్రతియేటా కూడా అనేక ఆధ్యాత్మిక  కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. అంతేకాకుండా విశేష పూజలు జరిపిన , దేవతా మూర్తుల  కల్యాణాలు జరిపిన ఘనత కూడా ఈ ఆలయ కమిటీకి దక్కుతుందన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం అదృష్టము గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయకమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, ప్రధాన  కార్యదర్శి  సనపల వరప్రసాద్ ,ప్రధానార్చకులు గోపి స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-14 06:19:11

వరద ఉద్రుతిపై అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలం వద్ద వరద నీరు విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా గురువారం సాయంత్రానికి 18 నుంచి 20 లక్షల క్యూసక్కుల నీరు ధవళేశ్వరం కు చేరుకునే అవకాశం ఉందన్నందున హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు   సమన్వయంతో పనిచేయాలని  జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,  వరదలు కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని అన్నారు.  ఒక్క ప్రాణ నష్టం కానీ, జంతువుల నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో   ఉన్న కుటుంబాలను అవసరమైతే బలవంతంగా నైనా తరలించాలని పేర్కొన్నారు.  వాస్తవ పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని పకడ్బందీ గా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ముఖ్యమంత్రి స్పష్టం గా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.  రిలీఫ్ క్యాంపు ల వద్ద ఆహారం, త్రాగునీరు, దుప్పట్లు, మందులు తగినంత ముందస్తుగా సిద్దం చేసుకోవాలని, బడ్జెట్ కు ఎటువంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ఇరిగేషన్, హెడ్ వర్క్సు అధికారులు వరద నీరు వచ్చే  స్థాయి పై పూర్తి గా అంచనాతో ఉండాలని, గంట గంటకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  జిల్లాలో బోబ్బర్లంక, సీతానగరం, మునికొడు, ములకల్లంక, మద్దూరులంక  ప్రాంతాల్లో బండ్స్ ను తనిఖీ చేయ్యాలన్నరు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిస్థితి ని అంచనా వెయ్యలన్నారు. రహదారులకు , విద్యుత్ సరఫరా కు ఎటువంటి ఆటంకం లేకుండా సంబందించిన అధికారులు చర్యలు చేపట్టలని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జేసీ శ్రీధర్ , ఆర్డీవో మల్లిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-13 14:56:40

జ్వరాల సమాచారం అందించండి

మన్యం జిల్లాలో  మలేరియా, డెంగ్యూ జ్వరాలను అరికట్టుటకు వాటికి సంబంధించిన సమాచారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు తెలిపారు. జ్వరాలు నివారణ చర్యలు, ప్రైవేటు ఆసుపత్రుల సహకారంపై  బుధవారం  ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, లాబరేటరీ టెక్నీషియన్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాదులు విజృంబిస్తున్నాయని వాటిని నియంత్రించుటకు ప్రైవేటు ఆసుపత్రులు సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు వస్తున్న మలేరియా, డెంగ్యూ పాజిటివ్ కేసుల వివరాలను దగ్గరలో గల పి.హెచ్.సి. కి తెలియజేయాలని తెలిపారు.  ఆయా కేసులు వచ్చిన గ్రామాలలో తక్షణ నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి  వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి చికిత్స అందించటం జరుగుతుందని, తద్వారా ముందుగానే వ్యాదులు ప్రబలకుండా అరికట్టుటకు అవకాశం ఉంటుందన్నారు.  టి.బి. కేసుల వివరాలు కూడా తెలియజేస్తే వారికి ఉచితంగా మందులు, చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 

ప్రైవేటు  ఆసుపత్రులు, స్కానింగు సెంటర్లు రిజిస్ట్రేషను చేయించుకోవాలని, రిజిస్ట్రేషను గల ఆసుపత్రులు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. స్కానింగు సెంటర్లలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించకూడదని, చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగనిర్దారణ వ్యతిరేక చట్టం ప్రకారం త్వరలోనే జిల్లా స్థాయి కమిటీ నియామకం జరుగుతుందన్నారు.  డెలివరీలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఆరోగ్యరక్ష ద్వారా  డబ్బులు చెల్లిస్తున్నదని అందుకొరకు డెలివరీ  వివరాలు సంబంధిత యాప్స్ నందు తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. ప్రజలు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనేలా అవగాహన కల్పించాలని అన్నారు. 

బలిజపేట మండలం పినపెంకి గ్రామంలో ఫైలేరియా కేసులు సుమారు పదిహేను వందలు  ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా గ్రామస్తులు బాధపడుతున్నారని గుర్తించడం జరిగిందని, దీనిపై  ప్రణాళిక తయారుచేసుకొని రక్తపరీక్షలు నిర్వహించుట, చికిత్స, గ్రామంలో దోమలు నివారణ, పరిసరాల పరిశుభ్రత మొదలైన అంశాలపై ఒకేసారి చర్యలు చేడతామని తెలిపారు. ఐ.ఎం.ఎ. సెక్రటరీ డా. శేషగిరిరావు మాట్లాడుతూ ప్రజలు సరియైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలననే వ్యాదులబారిన పడుతున్నారని, మంచి ఆహారం తీసుకోనుట వలన వ్యాధినిరోదకత పెరిగి వ్యాదుల రావని,  తక్కువ మందులు వినియోగంతో వ్యాదులను తగ్గించుకోవచ్చని తెలిపారు. కావున ప్రజలు బలవర్దకమైన పౌష్టికాహారం తీసుకొనేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారిణి డా. వాగ్దేవి,   ఎ.పి.ఎన్.ఎ. ప్రెసిడెంట్ డా. డి.రామమోహన్ రావు, జిల్లా మలేరియా అధికారి డా. కె.పైడిరాజు, డిప్యూటీ డి.ఎం .హెచ్.ఒ.లు డా. సి. దుర్గాకళ్యాణి, డా. బి. నివాసరావు,, ప్రైవేటు ఆసుపత్రులు డాక్టర్లు, లేబరేటరీ టెక్నీషియన్లు పాల్గొన్నారు.   

Parvathipuram

2022-07-13 14:35:30

సచివాలయాలతో అద్భుత ఫలితాలు

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన ప్రజలకు చేరవేయడం లో సచివాలయ వ్యవస్థ  పనితీరు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయాని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అనపర్తి నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం ను స్థానిక శాసన సభ్యులు సత్తి సూర్య నారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు కోసం ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అవ్వడం ద్వారా లక్ష్యాలను సాధించడానికి సానుకూలత సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ములకల్లంక గ్రామం లో నిన్నటి రోజున జరిగిన సంఘటన పై మాట్లాడుతూ, గతంలో వరదలు, ప్రకృతి విపత్తులు వొచ్చిన సమయంలో గ్రామ స్థాయి లో అధికారులకు, సిబ్బందికి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేస్తే పనిచేసే వారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మానవ వనరుల పెరగడం వల్ల ప్రజలకు అందుబాటులో అధికారులు సిబ్బంది ఉండి ప్రభుత్వ సహాయం తక్షణమే వారికి చేరడం సాధ్యం అవుతోందని పేర్కొన్నారు.  నియోజక వర్గంలో అభివృద్ధి ప్రతి ఒక్కరి అటూ ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, ఇప్పటికే ఆదిశలో పురోగతి సాధించాగలిగామని చెప్ప వచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. వెల్ నెస్ కేంద్రాలు ద్వారా గ్రామంలోనే తక్షణ వైద్య సహాయం కోసం ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ పనులు మరో నూతన అధ్యాయం గా కలెక్టర్ అభివర్ణించారు.

అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయ భవనాలు 59 కు గాను 39 పూర్తి అయ్యాయని రైతు భరోసా కేంద్ర భవనాలు 59 కి గాను 18 వెల్నెస్ సెంటర్స్ 50 కి గాను 11 నిర్మించుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా సచివాలయ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు.  దీని ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగవంతంగా నిర్మించాలన్నారు. శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ  అనపర్తి నియోజకవర్గం లో అనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాల్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన కల్పించి ఇల్లు నిర్మాణాలు గ్రౌండ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ఇప్పటికే జిల్లాలో రాజానగరం నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందని రెండవ స్థానంలో అనపర్తి నియోజకవర్గం నిలిపేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయాలు, ఆర్ బి కే, వెల్నెస్ సెంటర్ల భవనాలను నిర్మించేందుకు సహకరించిన  పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సర్పంచ్లను కలెక్టర్ సన్మానించారు. స్థానిక నియోజక వర్గం లోని ప్రజా ప్రతినిదులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

East Godavari

2022-07-13 13:52:25

బిజిలీ ఉత్సవాలు విజయవంతం కావాలి

ఈ నెల 26,30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న బిజిలీ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని, జిల్లా నోడ‌ల్ అధికారి, సింహాద్రి ఎన్‌టిపిసి డిప్యుటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ ఆనంద్‌బాబు కోరారు. ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై స్థానిక ఇపిడిసిఎల్ కార్యాల‌యంలో బుధ‌వారం స‌మావేశాన్నినిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా విద్యుత్ రంగంలో, ఈ 75 ఏళ్ల కాలంలో దేశం సాధించిన విజ‌యాల‌ను, ప్ర‌గ‌తిని మ‌న‌నం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన ల‌క్ష్యాలు, ప్ర‌గ‌తిపై చ‌ర్చించేందుకు ఉజ్జ్వ‌ల భార‌త్ - ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్ పేరుతో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు  తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లు, పంపిణీ సంస్థ‌లు ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ ఉత్స‌వాల్లో ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ త‌దిత‌ర సంస్థ‌లు కూడా పాల్గొంటాయ‌ని తెలిపారు.

               మ‌న జిల్లాలో ఎన్‌.టి.పి.సి.(నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌- సింహాద్రి యూనిట్‌)తో క‌ల‌సి జిల్లా యంత్రాంగం, ఈ నెల 26న బొబ్బిలి వెల‌మ సామాజిక భ‌వ‌నంలో, 30న క‌లెక్ట‌రేట్‌లో ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు. విద్యుత్ రంగంలో దేశం సాధించిన ప్ర‌గ‌తిని, పున‌రుత్పాదక ఇంధ‌న రంగంలో సాధించిన ప్ర‌గ‌తిని కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించేలా, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనిలో భాగంగా విద్యుత్  వినియోగ‌దారుల‌తో ముఖాముఖి, విద్యుత్ అవ‌స‌రాలు, స‌హ‌జ ఇంధ‌న వ‌న‌రుల వినియోగం అంశాల‌పై సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. గ్రామాల శ‌త‌శాతం విద్యుదీక‌ర‌ణ‌, గృహ విద్యుత్‌, విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం పెంపుద‌ల‌, ఒకే దేశం - ఒకే గ్రిడ్‌, విద్యుత్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌నరుల రంగంలో సాధించిన అసామాన్య ప్ర‌గ‌తి, వినియోగ‌దారుల హ‌క్కులు వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు ప్రాంతీయ భాష‌ల్లో రూపొందించిన‌ త‌క్కువ నిడివిగ‌ల షార్టు ఫిల్మ్‌లను ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను, వివిధ సంస్థ‌ల స్టాళ్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.  ఈ స‌మావేశంలో  పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా బిజిలీ ఉత్స‌వాల నోడ‌ల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం జెఎస్ఎన్‌పి ప్ర‌సాద్‌, ఎపిఇపిడిసిఎల్ విజ‌య‌న‌గ‌రం ఇఇ(ఆప‌రేష‌న్స్‌) కృష్ణ‌మూర్తి, బొబ్బిలి ఇఇ (ఆప‌రేష‌న్స్‌) పి.హ‌రి, ఇఇ టెక్నిక‌ల్ ఎం.ధ‌ర్మ‌రాజు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-13 13:49:48

పరిశ్రమల ఏర్పాటుకి ఇదే మంచి తరుణం

విజ‌య‌న‌గ‌రం జిల్లా భౌగోలికంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు, అన్ని ర‌కాల వ‌న‌రుల‌కు అనుకూల‌మైన ప్రాంత‌మ‌ని, ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్ప‌టం ద్వారా ఆశించిన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పాల‌నుకునే వారికి ఇదే మంచి త‌రుణ‌మ‌ని, అంద‌రూ ముందుకు వ‌చ్చి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని కొత్తకొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పాల‌ని సూచించారు. సుదీర్ఘ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్లో వివిధ కంపెనీల‌ పారిశ్రామిక‌వేత్త‌లు, జిల్లా స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో పైమేర‌కు ఆమె స్పందించారు. ఇక్క‌డ అన్ని వ‌న‌రులూ స‌మృద్ధిగా ఉన్నాయ‌ని, ఇక్క‌డ నుంచి వ‌స్తువుల‌ను కూడా ఇత‌ర ప్రాంతాల‌కు సుల‌భంగా ఎగుమ‌తి చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. జిల్లాలో నూత‌న ఔత్సాహికులు ముందుకు వ‌చ్చేలా కొత్త ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేలా అధికారులు అన్ని విధాలా స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌ని హిత‌వు ప‌లికారు. ఇక్క‌డ ఉత్ప‌త్తైన స‌ర‌కుల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు సుల‌భంగా త‌ర‌లించేందుకు మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చాల‌ని సూచించారు. దీనిలో భాగంగా జిల్లా ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ ద్వారా వివవ‌రించారు. 

ఎగుమ‌తుల్లో వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌కు ప్రాధాన్యం

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, స్కిల్ డెవలెప్మెంట్, ఇత‌ర అధికారుల‌తో జ‌రిగిన సమావేశంలో ఆమె ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. జిల్లాకు అన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసే ప‌రిశ్రమ‌లు రావాల‌ని ఆకాంక్షించారు. ఆ దిశ‌గా జిల్లా అధికారులు కృషి చేయాల‌ని, ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జిల్లాలో స‌మృద్ధిగా ల‌భించే వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌ను గుర్తించి ఇత‌ర ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని, సంబంధిత కంపెనీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసేందుకు రూ.40 కోట్ల‌తో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని, ముందుగా వీటికి సంబంధించిన ప్రతిపాద‌న‌లు పంపించాల‌ని ప‌రిశ్ర‌మల శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. మామిడి, మొక్క‌జొన్న పంట‌ల సాగు ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి వాటిని ప్రాసెస్ చేసి ఎగుమ‌తి చేసే ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని చెప్పారు. జీడి పిక్క‌ల ప్రాసెస్ యూనిట్లకు కూడా త‌గిన ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. మామిడిలో సువ‌ర్ణ ర‌కానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పారు. ఉత్ప‌త్తుల ఎగుమ‌తికి సంబంధించిన పరిశ్ర‌మ‌లు నెలకొల్పేవారికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ 60 . 40 నిష్ప‌త్తిలో ఉంటాయ‌ని ఆమె వివ‌రించారు.

క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రాంపై అవ‌గాహ‌న‌

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ‌న్వ‌యంతో అమ‌ల‌వుతున్న సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు రూపొందించిన క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రాం నిబంధ‌న‌ల్లో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఔత్సాహికులు ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఒకే ర‌కానికి చెందిన ప‌ది ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే 90 శాతం రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క్ల‌స్ట‌ర్ డెవ‌లప్మెంట్ ప్రోగ్రాంలో మారిన నిబంధ‌న‌ల‌ను తెలియ‌జేస్తూ ముందుకు వ‌చ్చే ఔత్సాహికుల‌కు దానిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సూచించారు. ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌కు లేదా ఇత‌ర క‌ళాశాల‌ల‌కు వెళ్లి విద్యార్థుల‌తో మ‌మేకం అవ్వాల‌ని, ఆసక్తి ఉన్న వారిని పరిశ్ర‌మ‌లు నెల‌కొల్పేలా ప్రోత్స‌హించాల‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా చీపురుప‌ల్లిలో క్యాజూ క్ల‌స్ట‌ర్ని, రేగిడి ఆముదాల వ‌ల‌స‌లోని ఉంగ‌రాడంపేట పాప‌డ్ క్ల‌స్ట‌ర్ని, మెర‌క‌ముడిదాం మండ‌లంలోని బూద‌రాయివ‌ల‌స గ్రామంలో ఏర్పాటు చేసిన బ్రాస్‌, బెల్ మెట‌ల్స్ క్ల‌స్ట‌ర్ల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశ్ర‌మల శాఖ జీఎం వెల్ల‌డించారు. స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ జీఎం పాపారావు, ఏపీఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ య‌తిరాజులు, డీపీవో వ‌ర్ధ‌న్‌, ఎం.ఎస్‌.ఎం.ఇ. డి.ఐ., వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు క‌రుణా కుమార్, టి.టి. రాజు, డి. శ్రీ‌నివాస‌రాజు, శంక‌ర్ రెడ్డి, శంక‌ర్ రావు, సాంబ‌శివ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-13 13:48:50

ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలి

సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి పిలుపునిచ్చారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి శ్వేత, ఒడిశా కు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లకు శ్వేతలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజైన బుధవారం సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శరీరం, మనసు యాంత్రికంగా మారిన నేటి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలీకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి ,ఆలోచన అవసరమని ఆమె వివరించారు. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందని అన్నారు.  జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ జీ ఒత్తిడిని జయించే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని  కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని అన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన  మంగళ నరాయణి జీ, శ్వేత సంచాలకురాలు  ప్రశాంతి పాల్గొన్నారు.

Tirumala

2022-07-13 13:19:52

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన..

విశాఖలో ఈనెల 15వ తేదీన జిల్లాలో నిర్వహించు వాహన మిత్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ .మల్లికార్జున అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రాక సందర్భముగా బుధవారం ఉదయం కలెక్టర్ , పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తో  కలిసి ఏ ఎస్ ఎల్ నిర్వహించారు . ముందుగా ఎయిర్ పోర్ట్ లో పోలీస్ ,రెవెన్యూ ,ఎయిర్ పోర్ట్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎయిర్ పోర్టులో  ముఖ్యమంత్రి రాకకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము చేపట్టవలసిన ఏర్పాట్లను చర్చించారు . తదుపరి విమానాశ్రయం వెలుపల చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు . అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు . ముఖ్యమంత్రి రాక , స్టాల్స్,  ఫోటో సెషన్ , స్టేజి తదితర ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు గావించారు. అనంతరం కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు త్వరత గతిన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 25 వేల మంది  పాల్గొంటారని వెల్లడించారు. వర్షం వచ్చినా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు  తెలిపారు.  ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు,  ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

Visakhapatnam

2022-07-13 11:48:10

తిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్షసంకల్పం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త  రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారన్నారు.  అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.  శ్రీవారి ఆలయ మహ‌ద్వారం వ‌ద్ద టిటిడి ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,  చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం పెద్దజీయర్‌ మఠంలో  పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవోను శాలువతో సన్మానించారు. 

Tirumala

2022-07-13 11:30:40

దేశంలోనే ఉత్త‌మంగా ఎస్వీ పాఠ‌శాల

శ్రీ‌వారి పాదాల చెంత గ‌ల ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు స‌హ‌కారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్న‌త‌మైన విద్యాసంస్థ‌ల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతామ‌ని, గురుపూజ దినోత్స‌వం రోజు ఈ కార్య‌క్ర‌మానికి నాంది ప‌లక‌డం సంతోష‌క‌ర‌మ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో బుధ‌వారం ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌లలోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌క్క‌టి మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని, ఇక్క‌డ ఉన్న‌త‌మైన ప్రమాణాల‌తో కూడిన విద్య అందుతోంద‌ని, విద్యార్థులు మంచి ప్ర‌తిభ క‌న‌బరుస్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌కు విచ్చేసే ప్ర‌ముఖులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందుగానీ, త‌రువాత గానీ ఈ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాల‌ని కోరారు. రేమాండ్స్ గ్రూపు ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థుల కోసం ప‌లు ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తున్నార‌ని, వీటిలో దేశంలోనే అత్యుత్త‌మ నాణ్య‌త ప్ర‌మాణాలను పాటిస్తున్నార‌ని చెప్పారు. ఇందుకోసం సింఘానియా పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌లు రాష్ట్ర‌ప‌తి అవార్డులు సైతం అందుకున్నార‌ని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను అక‌డ‌మిక్స్ ప‌రంగా అభివృద్ధి చేయాల‌ని శ్రీ గౌత‌మ్ సింఘానియాను కోర‌గా స‌మ్మ‌తించార‌ని తెలిపారు. సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల‌ ఉపాధ్యాయుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందిస్తుంద‌ని, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హించి విద్యార్థుల ప్ర‌గ‌తిని చ‌ర్చిస్తార‌ని చెప్పారు. పాఠ‌శాల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులను టిటిడి క‌ల్పిస్తుంద‌న్నారు. భ‌గ‌వంతుడు అంద‌రినీ ఒకేవిధంగా సృష్టించార‌ని, ఎవ‌రికైతే మంచి శిక్ష‌ణ అందుతుందో వారు రాణించ‌గ‌లుగుతార‌ని చెప్పారు.

            రేమండ్స్ గ్రూపు సిఎండి  గౌత‌మ్ సింఘానియా మాట్లాడుతూ ముంబ‌యిలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించే అపూర్వ‌మైన అవ‌కాశం త‌మకు ద‌క్కింద‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన టిటిడి బోర్డుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 47 సంవ‌త్స‌రాలుగా తాను తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నాన‌ని, తిరుమ‌ల యాత్ర‌ త‌న జీవితంలో ఒక భాగంగా మారింద‌ని చెప్పారు. 52 ఏళ్ల క్రితం అప్ప‌టి రేమండ్ గ్రూప్ ఛైర్మ‌న్ స‌తీమ‌ణి  సులోచ‌నాదేవి సింఘానియా కెన‌డాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందార‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌మాద ఇన్సూరెన్స్ మొత్తం ఒక ల‌క్ష రూపాయ‌లు అందింద‌ని చెప్పారు. అయితే వారి కుటుంబ స‌భ్యులు ఈ మొత్తాన్ని ఏదైనా ఒక సామాజిక హిత కార్య‌క్ర‌మానికి ఖ‌ర్చు పెట్టాల‌ని కోరార‌న్నారు. ఈ విధంగా ఒక ల‌క్ష రూపాయ‌ల మూల‌ధ‌నంతో సులోచ‌నా దేవి సింఘానియా పాఠ‌శాల‌ స్థాప‌న ప్రారంభ‌మైంద‌న్నారు. సులోచ‌నా దేవి సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు చ‌దువుతున్నార‌ని, ప్రిన్సిపాల్  రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ పాఠ‌శాల ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తోంద‌ని చెప్పారు.

              త‌మ గ్రూపున‌కు సంబంధించిన ఫ్యాక్ట‌రీలు ఉన్న ప్రాంతంలో కార్మికుల పిల్ల‌ల కోసం మొద‌ట‌గా ఈ పాఠ‌శాల‌ను ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఇక్క‌డ మంచి విద్య‌ను అందించి కార్మికుల పిల్ల‌లను ఉన్న‌తస్థానాల‌కు చేర్చుతున్న‌ట్టు చెప్పారు. ఏడాదికి ల‌క్ష మంది పిల్ల‌ల‌కు విద్య‌ను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఇందులో భాగంగా నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ పాఠ‌శాల‌తో క‌లిపి 5 పాఠ‌శాల‌ల్లోని సుమారు 20 వేల మందికి విద్య‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. విద్య‌ద్వారా మంచి పౌరుల‌ను త‌యారుచేసి జాతి నిర్మాణంలో భాగ‌స్వాముల‌ను చేస్తామ‌న్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన ఉత్త‌మ పాఠ‌శాల‌లుగా సింఘానియా పాఠ‌శాల‌ల‌కు గుర్తింపు ద‌క్కింద‌న్నారు. మొద‌ట‌గా ఎస్వీ ఉన్న‌త‌ పాఠ‌శాల‌ను విద్యప‌రంగా అభివృద్ధి చేస్తామ‌ని, ఆ త‌రువాత టిటిడిలోని ఇత‌ర పాఠ‌శాల‌ల‌ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.

             శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు మాట్లాడుతూ తాను  ఈ పాఠ‌శాల విద్యార్థినేన‌ని చెప్పారు. విన‌యంతో కూడిన విద్య అవ‌స‌ర‌మ‌ని, స్వామివారి ఆశీస్సుల‌తో విద్యార్థులంద‌రూ వృద్ధి చెందాల‌ని కోరారు. ముందుగా ఈఓ  ఎవి.ధ‌ర్మారెడ్డి,  గౌతం సింఘానియా క‌లిసి పాఠ‌శాల‌లో పూజ‌లు నిర్వ‌హించి కంప్యూట‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంత‌రం పాఠ‌శాల ప్రాంగ‌ణంలో సంపంగి మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్రమంలో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌)  స‌దా భార్గ‌వి, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  ద్యాశాఖాధికారి  గోవింద‌రాజ‌న్‌, డెప్యూటీ ఈవో  రామారావు, సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల ప్రిన్సిపాల్  రేవ‌తి శ్రీ‌నివాస‌న్‌, విజివో  బాలిరెడ్డి, ప్ర‌ధానోపాధ్యాయులు  కృష్ణ‌మూర్తి, సింఘానియా ట్ర‌స్టు ప్ర‌తినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-13 11:27:18

లేఅవుట్లలోని గృహాలు శతశాతం పూర్తికావాలి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల 14 లేఅవుట్లలో  చేపడుతున్న గృహ నిర్మాణాలన్నీ శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ గృహ నిర్మాణాలపై ప్రత్యేక అధికారులు, నగరపాలక సంస్థ కమీషనర్, ఇంజినీరింగ్ అధికారులు, వార్డు సంక్షేమ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలని, వచ్చే మాసానికి శతశాతం లక్ష్యాలు సాధించాలని అన్నారు. వారంలోగా లబ్ధిదారుల జాబితా కార్యదర్శులకు అందజేయాలని, మ్యాపింగ్ జరగని 4వేల గృహాలు తక్షణమే ప్రారంభంకావాలని కలెక్టర్ ఆదేశించారు.    అన్ని లేఅవుట్లలో పనులు ప్రారంభం కావాలని, వారంలో పురోగతి సాధించాలని సూచించారు. 14 లేఅవుట్లలో గల ఒక  లేఅవుట్ లో కార్పొరేషన్ నిధులతో  మోడల్ కాలనీని రూపొందించాలని కలెక్టర్ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 14లేఅవుట్లలో 10,867 గృహాలు మంజూరు చేయడం జరిగిందని, అందులో 8,865 గృహాలు రిజిష్టర్ అయినప్పటికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 2002 గృహ లబ్ధిదారులు వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ లబ్దిదారులు ముందుకు రాకపోతే వారిని రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్డు సచివాలయాల్లో అతి పెద్ద వ్యవస్థ ఉందని, సుమారు వేయి మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వారిని ఉపయోగించుకొని గృహనిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. 14 లేఅవుట్లకు చెందిన లబ్ధిదారులు జాబితాలను వార్డు సంక్షేమ కార్యదర్శులకు అందజేయాలని కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యదర్శులు వారి పరిధిలో గల లబ్ధిదారుల జాబితాల ఆధారంగా లబ్ధిదారులను చైతన్యపరచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చేలా చేయాలన్నారు. 

అలాగే రిజిస్ట్రేషన్ చేసుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులు తక్షణమే గృహానిర్మాణాలు ప్రారంభించుకునేలా చైతన్యపరచాలని ఆదేశించారు. గృహానిర్మాణాలకు అవసరమైన సిమెంట్,ఇసుక,ఐరన్,నీటి సరఫరా తదితర సమస్యలు ఉంటే వాటిని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సమాచారాన్ని అందజేయాలని అన్నారు. నిర్మాణాల బిల్లులు ఎప్పటికపుడు మంజూరుచేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఈ కార్యక్రమానికి ఇస్తుందని, కావున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి లే అవుట్లలో తాగునీరు, విద్యుత్, రహదారులు,కాలువలు, ప్లాంటేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని సూచించారు. గృహ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుందని, ఇందుకు నిధుల కొరత లేదని, అవసరమైతే జిల్లా నిధుల నుండి మంజూరుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. 14 లేఅవుట్లలో ఒక మోడల్ కాలనీని  నిర్మించి, లబ్ధిదారులకు చూపించడం ద్వారా వారు మరింత ముందుకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తారని కలెక్టర్ సూచించారు. లేఅవుట్ పూర్తయితే అక్కడ ఉండేవి గృహాలు కావని, ఊరుగా మారబోతుందనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూనే, పనిచేయని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. విధులు నిర్వహణలో బాధ్యతా రాహిత్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత లేఅవుట్ల వారీగా చేపట్టిన పనులపై ఆరాతీసిన కలెక్టర్ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. 

ఇళ్లు కట్టడానికి ముందుకు రాని లబ్ధిదారుల నుండి తగు కారణాలను పూర్తి వివరాలతో వ్రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. వాటి స్థానంలో కొత్త లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. గృహనిర్మాణలకు సంబందించి చాలా వెనుకబడి వున్నారని, ప్రభుత్వం నవరత్నాలలో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవానికి ఇళ్లు కార్యక్రమంపై ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడం సరికాదన్నారు. డి-లింక్ అయి మూడు మాసాలైనా ఇంకా రిజిస్ట్రేషన్  కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4బి చేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని, సెక్రటరీ పరిధిలో ఉన్న లబ్ధిదారుల జాబితా ఇచ్చి పనులు చేపట్టేలా చూడాలన్నారు. తగిన కారణం లేకుండా 372 గృహాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంపై వార్డుల వారీగా సమీక్షించిన ఆయన వార్డుల వారీగా జాబితాలు తయారు చేసి వార్డు సెక్రటరీ లకు అందించి శత శాతం రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు చేసిన సమీక్షలు అర్థరహితమని, ఆన్ని పనులు గ్రూప్ లో సెండ్ చేస్తే జరగబోవని, సమావేశాలు నిర్వహిస్తూనే పనుల పురోగతిని ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారులు సమావేశానికి హాజరయ్యేలా చూదాలని, నిర్మాణాలకు సంబంధించిన పనులను పరిశీలించి అక్కడి అవసరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉండి మంజూరైన 10,867 గృహాలకు సంబంధించి 820 గృహ నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉండడం పై ఆరాతీసిన కలెక్టర్ నివేదికలు అన్ని వార్డు సెక్రటరీ ల పరిధిలో తయారు చేసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి  1955 మంది లబ్ధిదారులకు మెప్మా ద్వారా రుణం మంజూరు అయినప్పటికీ 820 మంది మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని మెప్మా పథక సంచాలకులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే మాసంలో మరలా గృహనిర్మాణాలపై సమీక్షిస్తామని, రోజు వారీ సాధించిన ప్రగతితో సిద్ధంగా ఉండాలని, లక్ష్యాలు సాధించని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. మ్యాపింగ్ జరగని 4వేల గృహాలకు తక్షణమే మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది శాఖల వారీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని, అందువలన అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని కోరారు. అనుకున్న సమయానికి అప్పగించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.     

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి,నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు, ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి ఎమ్.త్రినాథరావు, గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎం.గణపతి రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, తహశీల్దార్ కె.వెంకటరావు, కార్య నిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకరరావు, వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-13 09:55:27

విజయనగరంలో 16న మోటార్ సైకిళ్లు వేలం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ కేసుల్లో ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న మూడు మోటార్ సైకిళ్ల‌ను ఈ నెల 16న‌ వేలం వేయ‌నున్న‌ట్లు,  స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజ‌య‌న‌గ‌రం-1 స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూప‌రింటిండెంట్ డి.శైల‌జారాణి  ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ వేలం ప్ర‌క్రియ‌,  విజ‌య‌న‌గ‌రం, ఎస్ఇబి-1 స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని తెలిపారు. హీరో హెచ్ఎఫ్‌ డీల‌క్స్‌ (2017 మోడ‌ల్‌), హీరో గ్లామ‌ర్‌ (2018 మోడ‌ల్‌), హీరో హెచ్ఎఫ్‌ డీల‌క్స్‌ (2007 మోడ‌ల్‌) మోటార్ సైకిళ్ల వేల‌యం వేయ‌డం జ‌రుగుతుంద‌ని, ఆస‌క్తి ఉన్న‌వారు ఈ వేలంలో పాల్గొనాల‌ని కోరారు. 

Vizianagaram

2022-07-12 16:03:19

ప్రసాద వితరణ సేవలో ఎమ్మెల్సీ వంశీ

సింహగరి ప్రదక్షిణను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో 32 కిలోమీటర్ల నడిచి  దేవదేవుడు సింహాద్రి అప్పన్న  దర్శనం చేసుకుంటారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అన్నారు. మంగళవారం గిరిప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని హనుమంతువాక జంక్షన్ ,పందుల ఫామ్, పైనాపిల్ కాలనీ , దీన దయాళ్ పురం, స్కిల్ డెవలప్మెంట్, వెంకోజిపాలెం తదితర  ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అప్పన్న స్వామి కొలువుతీరిన సింహగిరి చుట్టూ ప్రదర్శన చేస్తే  పుణ్యం సిద్ధిస్తుందన్నారు.  ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అప్పన్న స్వామి ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నట్టు చెప్పారు. భక్తులకు అందించే ప్రసాదాన్ని పరిశీలించి, వారితో కాసేపు పనిచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-12 15:47:30

సమ్మెవల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు

పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన రామకృష్ణారావుపేట, చిన్నమార్కెట్, మెయిన్‌రోడ్డు, కలెక్టరేట్, జీజీహెచ్, ఈట్‌స్ట్రీట్, రమణయ్యపేట ప్రాంతాల్లో పర్యటించి సమ్మె నేపద్యంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్కడి శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ సమ్మె నేపద్యంలో చెత్త, కూరగాయల వ్యర్థాలతో చెత్త అధికంగా ఉత్పత్తి అవుతుందని, అక్కడి వ్యాపారులు సొంతంగా అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకుని రోడ్డుపక్కన వేయకుండా సహకరించాలని కోరారు. మెయిన్‌రోడ్డులోని వ్యాపారులు కూడా ఇదే రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. హూపర్‌టిప్పర్‌ వాహనాలు, కంపాక్టర్లు యధావిధిగా ఇళ్ళకు వస్తాయని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా వాహనాల వద్దకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెవల్ల చెత్త సేకరణకు అంతరాయం కలగకుండా ఇప్పటికే 80v మందిని అదనపు కార్మికులను ఏర్పాటు చేశామని, మరో 60 మందిని కూడా తీకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేటర్రోకళ్ల సత్యనారాయణ, సానిటరీ ఇన్స్పెక్టర్లు జిలాని, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

Kakinada

2022-07-12 15:19:54