1 ENS Live Breaking News

అప్పన్నను దర్శించుకున్న మంత్రి బుగ్గన

విశాఖలోని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)ని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  పూర్ణకుంభంతో ఈఓ, అర్చక స్వాముల తో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి గోదాదేవి సన్నిధిలో అర్చకుల మంగళహారతులు స్వీకరించారు. బేడామండపమలో మంత్రిని అర్చకులు ఆశీర్వదించారు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను మంత్రి కి ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Simhachalam

2022-07-16 07:54:08

పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితి పై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తో  సమీక్షించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద వరద ఉదృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ బృందాలతో క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రస్తుత వరద పరిస్థితి ని మంత్రికి వివరించారు.  ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరడం జరిగిందని, కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధపడటం లేదని, ముంపుకు గురికాము అనే ధీమా తో ఉన్నట్లు తెలిపారు. వరద పరిస్థితి కి అనుగుణంగా అవసరమైన పక్షంలో ప్రతి ఒక్కరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ ఈ నరసింహరావు గోదావరి బండ్ల పరిస్థితి, వాటి పటిష్టత కోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Dowleswaram Barrage

2022-07-16 07:42:39

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు.  శనివారం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు మంత్రి  వీడ్కోలు పలికారు. ఉదయం 8:00 గంటలకు ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. వీడ్కోలు పలికిన వారిలో ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. బాగ్చి, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా,  కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రమణ్యం రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఉన్నారు.

Gannavaram

2022-07-16 07:20:04

వరదల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్..

తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాజమండ్రి లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రత్యేక అధికారి హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తో కలిసి స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కంట్రోల్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కాల్ ను రిజిస్ట్రేషన్ చేయ్యాలన్నరు. ప్రజల నుంచి ఏ విధమైన ఫిర్యాదులు అందుతున్నాయో తెలుసుకున్నారు.  కంట్రోల్ రూం నంబర్ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసర సేవలు, సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్ కు స్పందించి సంబందించిన అధికారులకు సమాచారం తెలిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తూన్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా , డివిజన్ స్థాయి లో కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ 8977935609,  డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు  088132 31488 లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ కె .మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్వో బి. సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-16 07:14:28

బాధితుల సహాయం కోసం రూ.2కోట్లు

వరద బాదితుల సౌకర్యార్థం ముంపు ప్రాంతాల్లోని 4 జిల్లా ల్లో జిల్లా కి  2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి విడు దల చేశారని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం మద్దూరు లంక గ్రామం లో 393 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యాసం సరుకులు పంపిణీ చేసి ముఖ్యమంత్రి అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు కల్పిస్తున్నామని ఈసారి వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సుమారు 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఆకాశం ఉందని గతంలో మా ప్రాంతాలు మురగలేదని అనుకోవద్దని ఏదైనా ప్రమాదం జరిగితే చింటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ముంపు గ్రామాల ప్రజలు కుటుంబాలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కుటుంబానికి 2000 వ్యక్తిగత ఉన్నవారికి ₹1000 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఆపదలో అది కోవడానికి ప్రజలు సహకరించి అధికారులు చేసే సూచనలను పాటించాలని మంత్రి కోరారు. మద్దూరు లంక గ్రామంలో ప్రతి ఇంటికి మంత్రి, ఇతర ప్రజా ప్రతినిదులతో వెళ్ళడం జరిగింది.  ఈ సందర్బంగా ఎంపి మార్గని భరత్ రామ్, మాట్లాడుతూ 4 జిల్లా ల కలెక్టర్ లతో ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారన్నారు.  వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.  బలహీనంగా ఉన్న గోదావరి గట్ల  పటిష్టత కు 40 వేల ఇసుక మూటలను సిద్ధం చేసామన్నారు. ఈ  కార్యక్రమం లో ఎం ఎల్ ఏలు జక్కంపూ డి రాజా,  జి. శ్రీనివాస నాయు డు, యం. పి. పి. కాకర్ల సత్య నారాయణ, మండల తాహి సీల్దార్, బి. నాగరాజు నాయక్ ప్రత్యేక అధికారి, గితాంజలి తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-15 15:55:10

ఆ 8మండలాలు అప్రమత్తంగా ఉండాలి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 8 మండలాలు వరద ముంపు ప్రభావానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత జిల్లాలో వరదల సమయంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.  తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత తూర్పు గోదావరిలో నాలుగు మండలాలు, పశ్చిమ గోదావరిలో ఉన్న నాలుగు మండలాలు వరద ప్రభావానికి గురి అయ్యే అవకాశం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలోని పలు లంక గ్రామాలపై వరద నీరు వలన ముంపుకు గురవుతాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే నేను, హోం మంత్రి , జిల్లా ఎస్పీ ముంపుకు గురి అయ్యే లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరడం జరిగిందన్నారు. జిల్లాలో ఆరు లంక గ్రామాలు ఉన్నాయని, వాటికి రహదారి మార్గం తో అనుసంధానం ఉందన్నారు. ముంపు గ్రామాలను మిగిలిన వారు కూడా తరలి రావలని స్పష్టం చేశామన్నారు. . ఆ గ్రామ ప్రజలు 1986 వరదల సమయంలో కూడా తమ గ్రామాల్లోకి వరద నీరు చేరలేదని తమకు చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రికి తెలిపారు. అయినప్పటికీ ఈసారి వరద వుదృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరోసారి ఈరోజు ఎస్పితో కలిసి ఆ లంక గ్రామానికి వెళ్ళడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ముంపుకు గురవుతాయి అనే గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షితం గా తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు పునరావాస కేంద్రాల్లో రేషన్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఆయిల్ వాటి నిత్య సరుకులు ఉంచామని తెలిపారు. మెడికల్ క్యాంపు లుకుడా  ఏర్పాటు చేసి నట్లు వివరించారు. రెవెన్యూ సచివాల సిబ్బంది ని ముంపు గ్రామాల వద్ద నుంచి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 123 కిలోమీటర్లు గోదావరి బండ్ అనుకుని రహదాలు ఉన్నాయని వీటిని పర్యవేక్షించేందుకు 47 మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ బి అధికారులతో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చేయాల్సిన పనులు పై సమీక్షించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాండ్ బ్యాగులను తరలించి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధం చేశామన్నారు.  జిల్లాలో 32 ఘాట్లు ఉన్నాయని, అక్కడ  మెట్ల పై వరకు నీళ్లు వచ్చినందున వాటిని తాత్కాలికంగా బారిగెట్లు  ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా నియంత్రించడం జరుగుతుందన్నారు.

Rajamahendravaram

2022-07-15 15:01:50

ఓఎన్జీసీ సేవలు ఆదర్శ ప్రాయం

చమురు, సహజ వాయువుల సంస్థ ఓఎన్‌జీసీ పేద వర్గాలకు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్‌ కె. రమేష్‌ పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్‌ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు, డ్రైవర్లు 1200 మందికి రూ. 9.6 లక్షల విలువైన నిత్యావసర సరుకులు ఓఎన్‌జీసీ అందజేసింది. ఈ కార్యక్రమానికి ఓఎన్‌జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, అసెట్‌ మేనేజర్‌ ఆదేశ్‌కుమార్‌ అధ్యక్షతన వహించారు. సమావేశంలో కమీషనర్‌ మాట్లాడుతూ గతంలో కూడా ఓఎన్‌జీసీ సంస్థ పారిశుధ్ద్య కార్మికుల కోసం విధి నిర్వహణలో ఉపయోగించే వస్తువులను సమకూర్చిందన్నారు. కోవిడ్‌ సమయంలోనూ సంస్థ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగించిందన్నారు. ఇప్పుడు కూడా కార్మికులకు సంస్థ అండగా నిలబడటం అభినందనీయమని ప్రశంసించారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుటికీ ప్రతీ ఒక్కరికీ ఈ సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ఓఎన్‌జీసీ ఈడీ ఆదేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కోవిడ్‌ సమయంలో విశేష సేవలందించిన కార్మికులకు సేవ చేసే అవకాశం దొరకడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వరకు జరుగుతున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా అక్కడకు విచ్చేసిన కార్మికులు, ఉద్యోగులతో కమీషనర్‌ రమేష్‌ పరిశుభ్రతా ప్రతిజ్ఞ చేయించారు. వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రత పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమీషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు, ఓఎన్‌జీసీ సీజీఎం సూర్యనారాయణ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఆర్‌. శంకర్, కార్పోరేషన్‌ ఆరోగ్య అధికారి డాక్టర్‌ పృధ్వీచరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-15 14:59:38

పెట్టుబడులే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ

పెట్టుబడులే లక్ష్యం..బంధం బలోపేతమే ధ్యేయంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పశ్చిమ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కాబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. జూలై 16వ తేదీ శనివారం విశాఖపట్నంలోని 'రాడిసన్ బ్లూ' హోటల్ వేదికగా "వ్యూహాత్మక భాగస్వామ్యం" దిశగా ఏపీ, ఆస్ట్రేలియా కలిసి పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  పరిశ్రమలు, నైపుణ్యం, శిక్షణ , మెరైన్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్, మైనింగ్ ,మాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఆంధ్రప్రదేశ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరస్పర అంగీకారం ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి స్పష్టం చేశారు. సోదర రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గనులు, ఖనిజాలు, విద్య, శిక్షణ పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకోసం రెండు ప్రభుత్వాలు "అవకాశాల మార్గం"లో కలిసి పని చేస్తాయన్నారు. 

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటికే సోదర రాష్ట్ర ఒప్పందం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ 

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారం , నైపుణ్యం అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా సంసిద్ధతతో ఉందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సోదర రాష్ట్ర ఒప్పందం ఉందన్నారు. ఆ బంధం ఏపీతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రభుత్వ మంత్రులు సహా మరో 90మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు కరికాల వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక, నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు,ఐ.టీ,వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ , పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. 

Visakhapatnam

2022-07-15 14:48:04

ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ వ్ర‌తం టికెట్లను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు.

Tirupati

2022-07-15 13:48:16

వరద బాధితులకు సౌకర్యాలు కల్పించండి

రాష్ట్రంలో వర్షాలు , వరదలు  ప్రభావం ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా  చేయవలసిన  ఏర్పాట్లు పై  జిల్లా కలెక్టర్లకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తగు అదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్య మంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి  శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వీడియో కన్ఫరెన్స్ లో యలమంచిలి తహశీల్దారు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి, యస్ పి  యు. రవి ప్రకాష్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. ఎలమంచిలి , ఆచంట,  నరసాపురం మండలాల్లోని 30 గ్రామాలకు వరద ప్రభావం ఉందని ,  ఇప్పటికే 28 రిలీప్ క్యాంపులు ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  సెక్రటేరియట్ స్టాప్ , పంచాయతీ సిబ్బంది అందరూ గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు .  గర్భిణీలు  ,  బాలింతలు  , చిన్నపిల్లలను  ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆమె అన్నారు. అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  పశువులకు పది రోజులకు సరిపడా మేతను  పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.  ఎక్కడైనా ఏటిగట్లకు లీకేజీలు ఏర్పడితే వాటిని వచ్చేందుకు  28 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు.  ఆచంట మండలం కోడేరు రేపు నుండి జిల్లా జాయింటు కలెక్టర్ జె వి మురళి  , ఆచంట శాసనసభ్యులు  చెరుకువాడ. శ్రీరంగనాథరాజు ,  భీమవరం కలెక్టర్ కార్యాలయం నుండి, డిఆర్ఓ  కె. కృష్ణవేణి ,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-07-15 12:59:06

దేశంలోనే ఆద‌ర్శ గోశాల‌గా ఎస్వీ గోశాల

టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌ను మ‌రో ఏడాదిన్న‌ర‌లోగా దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన గోశాల‌గా అభివృద్ధి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌ను శుక్ర‌వారం సాయంత్రం ఈవో ప‌రిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌, నెయ్యి త‌యారీ కేంద్రం ప‌నుల‌ను ప‌రిశీలించారు.  అలాగే గోవ‌స‌తి షెడ్లు, అందులో గోవుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు ఇసుక‌తో ఏర్పాటుచేసిన మైదానం, ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి గోశాల‌కు తీసుకొచ్చిన కాంక్రీజ్‌, ఘిర్‌, సాహివాల్ జాతుల గోవుల‌తోపాటు పుంగ‌నూరు, ఒంగోలు జాతుల గోవుల‌ను ప‌రిశీలించి వాటి సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గోవ‌స‌తి షెడ్ల‌లో గోవుల‌కు ఆహ్లాదం క‌లిగించేలా ఏర్పాటుచేసిన సంగీతం బాగుంద‌ని, ఇక్క‌డ గోవుల‌కు నిరంత‌రం మేత, నీరు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 18 షెడ్ల‌కు గాను 4 షెడ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన 14 షెడ్ల నిర్మాణం వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. ఫీడ్‌మిక్సింగ్ ప్లాంట్ ప‌నులు డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గోశాల‌ను అందంగా ఉంచేందుకు, గోశాల‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులకు ఆహ్లాదక‌ర వాతావ‌ర‌ణం ఉండేలా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

           తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో దీపారాధ‌న‌, నైవేద్యాల త‌యారీకి అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి ఉత్ప‌త్తి చేసేందుకు సుమారు 600 గోవులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పారు. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు 100కు పైగా వివిధ దేశీయ‌జాతుల గోవుల‌ను స‌మ‌కూర్చుకున్నామ‌ని, మిగిలిన గోవుల‌ను దాత‌ల ద్వారా స‌మీక‌రించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యంతోపాటు దాని ప‌రిధిలోని క‌ళాశాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఎస్వీ గోశాల‌లో ఇంట‌ర్న్‌షిప్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనివ‌ల్ల విద్యార్థులకు ప‌రిజ్ఞానం పెర‌గ‌డంతోపాటు గోశాల‌కు వారి సేవ‌లు అందే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. జెఈవో  వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ప‌శువైద్య వ‌ర్సిటీ విస్త‌ర‌ణ సంచాల‌కులు డాక్ట‌ర్ వెంక‌ట‌నాయుడు పాల్గొన్నారు.

Tirumala

2022-07-15 12:48:08

ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలు, కాటన్ బ్యారేజీ ప్రాంతం వరద నీటితో మొత్తం జలమయం అయ్యాయి. ఎగువ గోదావరి నుంచి వరద నీరు దవళేశ్వరం కాటన్ బ్యారేకి రావడంతో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుండి ఏరియల్ సర్వే ద్వారా ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కలెక్టర్లు, జెసి, ప్రభుత్వానికి వరదలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి జరిపిన ఏరియల్ సర్వేలో వెంట రాష్ట్ర హోం మంత్రి  తానేటి వనిత తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-15 12:44:06

సీఎం వైఎస్.జగన్ కు ఆత్మీయ వీడ్కోలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం  ప్రత్యేక విమానంలో  విశాఖపట్నం చేరుకుని జగనన్న వాహాన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.  కార్యక్రమం అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి... ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటి మరియు పారిశ్రామిక శాఖ మాత్యులు గుడివాడ అమర్ నాథ్ , టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ,  నెడ్ క్యాప్ ఛైర్మన్ కె కె రాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్  సి. హెచ్. శ్రీకాంత్, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.  అనంతరం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో  ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్ చార్జ్ మంత్రి , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజనీ, సిఎంఒ కార్యదర్శి రేవు ముత్యాల రాజు తదితరులు బయలుదేరి వెళ్లారు. 

Visakhapatnam

2022-07-15 12:30:25

పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని భారీ వరదత నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని జెసి. జె వి మురళి కోరారు. లంక గ్రామాలు,లోతట్టు గ్రామాలు ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని  అన్ని వసతులు సమకూర్చడం జరిగిందని జిల్లా జాయింటు  కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఆచంట మండలం పలు గ్రామాలు ,పునరావాస కేంద్రాలను శుక్రవారం జిల్లా జాయింటు కలెక్టరు అధికారులతో కలసి పరిశీలించారు. యన్ డి ఆర్ యఫ్,యస్ డి ఆర్ యఫ్ , ఫైర్  సిబ్బంది సామాగ్రితో ఆచంట మండలంలోనే 35 మంది తమ సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రజలు  అధికారులు సూచనలు , సలహాలు పాటించి సహకరించాలని ప్రజలకు జాయింటు కలెక్టరు ధైర్యం చెప్పారు. ప్రజల ఇబ్బంది పడకుండా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఆచంట మండలంలో 15 గ్రామాలలో, ఆచంట మండలంలో పెద్దమల్లం లంక గ్రామానికి సంబంధించి పెద్దమల్లం చర్చి వద్ద రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, అనగారిలంక గ్రామానికి సంబంధించి ఎం పీ యు పి  స్కూల్ అనగారినిలంక,  పల్లిపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్ పల్లిపాలెం , అయోధ్య లంకకు సంబంధించి అయోధ్య లంక హరిజన పేట చర్చ్ అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి లో   పుచ్చలంక గ్రామానికి  సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనంలోనూ,   రావి లంక గ్రామానికి సంబంధించి రావిలంక కమ్యూనిటీ హాల్ లోను,  మర్రి మూల గ్రామానికి సంబంధించి మర్రిమూల ఎంపీ యు పీ స్కూల్ , చర్చిలోను ,  బద్దెవారిపేట లోని యం పి యు పి స్కూల్ లోను , నక్కిడిలంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్ నక్కిడిలంకలోను,  కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్  భీమలాపురం గ్రామంలోని రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని జాయింటు  కలెక్టరు  తెలిపారు. రిలీఫ్ కెంపులో ఉన్నకుటుంబానికి వెళ్ళేటప్పుడు  రూ.2,000 ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింటు కలెక్టరు కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో దాసి రాజు, తహశీల్దారు నజీ మున్నిసాకు,యం పి డి ఓ కె కన్నం నాయుడు, వివిధ శాఖలు అధికారులు ,తది తరులు పాల్గొన్నారు.

Achanta

2022-07-15 12:29:36

100ఏళ్లలో ఇంత భారీ వరదలు చూడలేదు

100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు ఉబయ గోదావరి జిల్లాల్లో గత 100 సంత్సరకాలంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున వరద నీరు వొచ్చే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేస్తున్నామని.. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి,సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియాల్ సర్వే లో భాగంగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, వరద తీవ్రత హెచ్చరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, ప్రజలను ముందస్తు చర్యలలో భాగంగా లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు సహకారం అందించి, స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం తక్షణ సహాయంగా 10 కేజీలు బియ్యం, ఇతర అత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో మందులు, త్రాగునీరు, దుప్పట్లు ఇతర సదుపాయలు కల్పించామన్నారు.

గతంలో ఎన్నో వరదలను చూసాము, మాకు ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దని, ఏ రాత్రి సమయంలో నైనా ఎవ్వరికీ అంచనాకు రాని స్థాయి లో వరద నీరు రావచ్చు నని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. త్రాగునీటి విషయంలో కాచి వడబోసిన నీటినే తాగలన్నారు. భద్రాచలం వద్ద 70 అడుగులు మించి నీరు ప్రవహిస్తోందన్నారు. ఇప్పటికే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, పశువుల కు గ్రాసం సిద్దం చేశామని తెలిపారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపు ప్రాంతాలలో దేవిపట్నం, చింతూరు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వరద నష్టాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధికారులు అంచనా వేసి, ఒక అంచనాకు వొచ్చి తదుపరి తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.

Rajamahendravaram

2022-07-15 10:11:33