1 ENS Live Breaking News

ప్రభుత్వ విప్ గా కరణం ధర్మశ్రీ నియామకం

చోడవరం ఎమ్మెల్యే,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించారు. పార్టీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ తన శక్తి వంచన లేకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతూ వైఎస్సార్సీపీ అభివృద్దే  ధ్యేయంగా  పనిచేస్తున్న ధర్మశ్రీ ని గుర్తించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ విప్ గా  నియమించారు. అమరావతి నుండి గురువారం ఉదయం చోడవరం నియోజకవర్గానికి ఆయన  రానున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించడం పట్ల జిల్లా కేడర్ లో నూతన ఆనందం వ్యక్తం అవుతుంది. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేతోపాటు జిల్లా అధ్యక్షులుగా వున్న ధర్మశ్రీకి ప్రభుత్వ విప్ పదవితో జిల్లాలో పార్టీ మరింతగా అభివ్రుద్ధి చెందే అవకాశాలున్నాయి.

Chodavaram

2022-07-19 16:37:34

క‌చ్చిత‌త్వంతో ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ‌

రైతు సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వైఎస్సార్ రైతు భ‌రోసా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి వాటితో పాటు పంట ఉత్ప‌త్తుల కొనుగోలుకు కూడా ఈ-క్రాప్ డేటా ఆధార‌మ‌వుతున్నందున ఈ ప్ర‌క్రియను స‌జావుగా పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం రాత్రి వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య విశాఖ‌ప‌ట్నం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ‌, ఉద్యాన శాఖ‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. వీసీ అనంత‌రం క‌లెక్ట‌ర్‌.. జిల్లా అధికారుల‌తో మాట్లాడుతూ అత్యంత పారద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంలో ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. కొత్త యాప్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని.. అత్యంత క‌చ్చిత‌త్వంతో పంట వివ‌రాల న‌మోదుకు ఈ యాప్ వీలుక‌ల్పిస్తుంద‌ని వివ‌రించారు. గ‌తంలో ఒక్క గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు (వీఏఏ) మాత్ర‌మే డేటా సేక‌రించేవారని.. ఈసారి వీఏఏ, వీఆర్‌వో, విలేజ్ స‌ర్వేయ‌ర్ల‌ ఉమ్మ‌డి బృందం ఈ ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామ్యమ‌వుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆర్‌బీకే యూనిట్‌గా ఈ-క్రాప్ జ‌రుగుతున్నందున వాటితో రెవెన్యూ గ్రామాల అనుసంధాన ప్ర‌క్రియ జ‌ర‌గాల‌న్నారు. స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య‌కుమార్‌, ఉద్యాన‌శాఖ అధికారి బీవీ ర‌మ‌ణ‌, ఏడీ(ఏ) జీవీ ప‌ద్మ‌శ్రీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-19 15:25:51

గృహ నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళిక

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో చేపట్టిన జగన్న కాలనపీల్లో ఇళ్ళ గ్రౌండింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గృహనిర్మాణానికి అవసరమైన వ్యయంలో రూ.1.80లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా అందిస్తున్నాయన్నారు. మిగిలిన సొమ్మును పైవేటు ఆర్థిక సంస్థలు, ఇతర మార్గాలు ద్వారా సమకూర్చేందుకు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. మరో వైపు గతంలో టిడ్కో గృహాల కోసం రూ.25వేలు నుంచి రూ.లక్ష వరకు సొమ్ములు చెల్లించిన దాదాపు 1052 మంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు కాలేదని, వీరందరంతా జగనన్నకాలనీల్లో ఇళ్ళు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు రూ.35వేలు అందించేలా  బ్యాంకులతోఎప్పటికప్పుడు మాట్లాడి సమన్వయం చేయాలని సూచించారు. ఇళ్ళు గ్రౌండింగ్‌ కాకపోతే రద్దయ్యే అవకాశం ఉన్నందున వెంటనే ఇళ్ళు ప్రారంభించేలా ప్రత్యేకాధికారులు చూడాలన్నారు. నగరపాలక సంస్థ ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు నిర్థిష్ట ప్రణాళికతో సచివాలయ కార్యదర్శుల సహకారంతో ప్రణాళిక బద్ధంగా గ్రౌండింగ్‌ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు, గృహనిర్మాణశాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-19 15:08:11

ఈ క్రాప్ నమోదు ద్వారా లబ్ధి చేకూరాలి

రాష్ట్రంలో ప్రతి రైతుకు ఈ క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ ఫలాలు అందాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా  జిల్లా కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్లు,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన, పట్టుపరిశ్రమ మరియు  రెవిన్యూ అధికారులతో ఈ క్రాప్ నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యవసాయదారుడు కి పండించే ప్రతి పంట ఇ-క్రాపు ద్వారా నమోదు చేయాలని సంబంధిత అధికారులను  ఆదేశించారు. దీనికి సంబంధించి చేయవలసిన కార్యాచరణ పై పలు సూచనలను తెలియజేశారు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులందరికీ కూడా ఇ-క్రాప్ ఫలాలు అందాలని వెల్లడించారు. కౌలు రైతులకు ఇ-క్రాప్ నమోదు సమయంలో భూ యజమానులు ఎటువంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని తెలియజేశారు. భూమి యాజమాన్య హక్కులు సంబంధిత భూయజమానికి మాత్రమే చెందుతాయని, కేవలం పంట నష్టం పరిహారం మాత్రమే కౌలు రైతులకు  అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 
ఇ పంట నమోదు చేసినట్లయితే వై.ఎస్.ఆర్.సున్నావడ్డీ పంట రుణాలు, వై.ఎస్.ఆర్ ఉచిత పంటల భీమా పథకం, పంట నష్ట పరిహారంతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేసుకోవచ్చని తెలియజేసారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను రెవెన్యూ గ్రామాలకు  అనుసంధానం చేయాలన్నారు . గ్రామాల నుండి వి.ఎ.ఎ/వి.ఆర్.ఓ పంటలు నమోదు చేయాలని, మండలాల నుండి   తహసిల్దార్లు/మండల వ్యవసాయ అధికారులు వి.ఎ.ఎ/వి.ఆర్.ఓలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి డా. ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, డిఆర్ఓ శ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-19 14:50:49

గర్భిణీలకు ఆరోగ్య తనిఖీలు ఆవశ్యం

గర్భిణీల ఆరోగ్య తనిఖీ ఆవశ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి. జగన్నాథ రావు అన్నారు. మాతృ మరణాలు నివారణపై  పార్వతీపురం ఎన్ జి ఒ హోంలో జిల్లా  వైద్య ఆరోగ్య శాఖాధికారి జగన్నాథరావు అద్యక్షతన ఎమ్.డి.ఎస్.ఆర్ శిక్షణ కార్యక్రమం మంగళ వారం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్  గైనకాలజిస్టులు డా. శోభారాణి,  డా. సాగరిక లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వైద్యాధికారులు వారి పరిధిలో ఉన్న వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ గర్భిణీలకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు.  గర్భిణీల ఆరోగ్య తనిఖీలు ఆసుపత్రిలో పి.ఎమ్.ఎస్.ఎం.ఎ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా జరగాలని ఆయన ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తద్వారా మాతృ మరణాల నివారణకు కృషి చేయాలని జగన్నాథరావు సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలు జరగకుండా ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా  సి. దుర్గా కళ్యాణి, ప్రోగ్రాం అధికారులు డా. జగన్మోహన్ , డా. అనిల్ , డా. సందీప్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-19 13:15:56

సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికం

ద్వైవార్షిక ప్రభుత్వ పథకాల మంజూరు కార్యక్రమం ఐ.టి.డి.ఎ సమావేశ మందిరంలో మంగళ వారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హత ఉన్నప్పటికీ పెండింగులో ఉండటం, ఇప్పటి వరకూ మంజూరు కాని లబ్దిదారులకు మంజూరు చేశారు. జిల్లాలో 1382 మందికి 92 లక్షల రూపాయలు మేర ఆర్థిక సహాయ పథకాలు, పింఛనులు ఇతర పథకాల క్రింద 6573 మందికి రూ.1.97 కోట్లు పంపిణి చేయడం జరిగింది. పింఛన్లు, జగనన్న చేదోడు, ఇ బిసి నేస్తం, ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, వై.ఎస్.ఆర్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం, సున్నా వడ్డీ తదితర పథకాల క్రింద లబ్దిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసారు. 

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానంలో లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని, కులం, మతం, పార్టీ,వర్గం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ సంక్షేమ పధకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏటా జూలై, డిశంబరు మాసాల లో వివిధ పధకాలకి అర్హులై ఉండి పలురకాల టెక్నికల్ ఇబ్బందుల వలన పధకాలు రాని వారిని గుర్తించి ద్వైవార్షిక  మంజురు చేస్తున్నామని అన్నారు.  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యం నాయుడు, గ్రామ, వార్డు సచివాలయ సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, సంభందిత శాఖల అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-19 12:58:53

ఎన్.జి.ఓల సహకారంతో హెచ్.ఐ.వి తగ్గుముఖం

పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో హెచ్.ఐ.వి తీవ్రత తగ్గుముఖం పట్టిందని పార్వతీపురం మన్యం జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (క్షయ, లెప్రసీ, హెచ్.ఐ.వి) డా. సి.హెచ్.విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు పాత్ ఎన్.జి.ఓ సహాకారంతో 3 రోజుల వర్క్ షాప్ ను విజయనగరం ఎస్.వి.ఎన్ లేక్ ప్యాలిస్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండవ రోజు విజయ కుమార్ పాల్గొని మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్  పై గత ఐదు సంవత్సరముల నివేదికలను ఎ.ఆర్.టి., ఐ.సి.టి.సి., ఎస్.టి.ఐ., బ్లడ్ బ్యాంకులు, స్వచ్చంద సంస్థల నుండి తీసుకొని జిల్లాల్లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్ ప్రభావము ప్రాంతాలు, సమూహాలు, వయాస్సుల వారిగా ఎవరికి  సోకుతుందో తెలుసుకోవడానికి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తద్వారా ఆయా విభాగాల్లో కార్యక్రమాలు చేపట్ట వచ్చని ఆయన తెలిపారు.  వర్క్ షాప్ లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నియంత్రణకు డేటా అనాలసిస్ చేసి జన సమూహాలలో వ్యాధి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు,  కార్యక్రమాలు నిర్ణయించాలని చెప్పారు.  

  ఈ కార్యక్రమంలో సిడిసి సంస్థ ప్రతినిధి డా. ఉపమ శర్మ, పాత్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి హరీష్ పటేల్, ఏపీడిమాలజిస్ట్ డా. ఉజ్వల్, డబ్యు.హెచ్.ఓ. కన్సల్టెంట్ సుకుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులు, జిల్లాలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఎ.ఆర్.టి., ఎస్.టి.ఐ., ఐ.సి.టి.సిల ఉద్యోగులు పాల్గొన్నారు.

పార్వతీపురం

2022-07-19 11:49:31

బాలింతలకు అంగన్వాడీలోనే వండి పెట్టాలి

గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రంలో లే వండి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా  ఏ ఏ కేంద్రం పరిధిలో ఎంత మంది నమోదయ్యారు, ఎంత మంది కేంద్రానికి వస్తున్నారు అనే విషయాన్ని సీడీపీఓ వారీగా టీమ్స్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం కలెక్టర్ సమీక్షించారు.  ఎన్.ఆర్.సి లో శిక్షణ పొందిన సూపర్వైసర్లు గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కలిగించాలన్నారు.  6 నెలల కె శిశువులకు సెమి సాలిడ్ ఆహారాన్ని అందించాలని, 10 నెలల వరకూ అందించకపోవడం వలనే పోషణ సరిపడక సామ్, మామ్ పిల్లల సంఖ్య పెరుగుతోందని అన్నారు.  అన్నం జావ గా చేసి పెట్టాలని, పళ్ళు, రాగి జావ తదితర పదార్ధాలను 6 నెలల నుండే పెట్టాలని అన్నారు. 
ప్రతి సీడీపీఓ వారం లో కనీసం 10 అంగన్వాడీ కేంద్రాలనైన తనిఖీ చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులను కూడా కలవాలని, వారితో కూడా గృహాల సందర్శన లో అవగాహన కల్పిస్తే చెప్పిన అంశాలను త్వరగా పాటిస్తారని తెలిపారు. కేంద్రాల్లో పోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని, నాన్ పోర్టిఫైడ్ తీసుకోవద్దని సూచించారు. రెండు ప్రసవాలు తర్వాత తప్పకుండా కుటుంబ నియంత్రణ చేసుకునేలా అవగహన కలిగించాలన్నారు. 3వ బిడ్డ పుడితే బిడ్డకు, తల్లికి సమస్యలు వస్తాయని తెలపాలన్నారు. అదే విధంగా సీసారిన్లను తగ్గించాలని, అత్యవసరం అయితే తప్ప సీసారిన్ కు వెళ్లకూడదని ఈ విషయాలన్నీ అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యనంగా ఆశ, అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం ల మధ్య సమన్వయం  ఉండాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పిడి శాంత కుమారి, సిడిపిఓ లు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-19 11:34:31

చెరకు రైతులకు సర్కారు తీపి కబురు

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం ఎన్.సి.ఎస్ సుగర్ రైతులకు రూ.3.87 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతానగరం చెరకు రైతులకు రూ.16.85 కోట్లు మొత్తం బకాయి ఉండగా మే 20వ తేదీన రూ.9.10 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్.సి.ఎస్ సుగర్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసిన ధాత్రి రియల్ ఎస్టేట్ మరో రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని దీంతో నిల్వ ఉన్న నగదును కలిపి ఇంకా బకాయి ఉన్న రూ. 7.75 కోట్ల మొత్తానికి గాను 50 శాతం బకాయిలను అందుబాటులో ఉన్న మొత్తం నుండి రూ.3.87 కోట్లు విడుదల చేయడం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో 1,111 మంది రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వివరించారు.                       

Parvathipuram

2022-07-19 09:33:00

లబ్దిదారులకు ద్వై వార్షిక నగదు జమ

అర్హులై ఉండి  వేర్వేరు కారణాలతో గతం లో సంక్షేమ పధకాలు అందని లబ్దిదారులకు ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి  లబ్దిదారుల  ఖాతాలలో మంగళవారం జమ చేసారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్షేమం, ప్రతి ఒక్కరి ముఖం లో సంతోషం చూడాలనే ఉద్ద్వేశ్యం తో సంక్షేమ పధకాలను పారదర్శకంగా అమలుజేస్తున్నామని అన్నారు. పేదల్ని వెదుక్కుంటూ  సంక్షేమ పధకాలే వెళ్లి వారి తలుపు తడుతున్నాయని,  అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వర్చువల్ గా జరుగగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి , శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఏ పి.డి కళ్యాణ చక్రవర్తి, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామరావు, మత్స్య శాఖ డి డి ఎన్. నిర్మలా కుమారి  తదితరులు హాజరైనారు. అనంతరం లబ్దిదారులకు మెగా చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ  పలు  సాంకేతిక కారణాలతో  గతం లో లబ్ది పొందని వారికీ డాక్యుమెంట్లను సరిచేసి  జిల్లాలో 15,153 మంది లబ్దిదారులకు 5.80 కోట్ల రూపాయలను  జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో అధికంగా వై.ఎస్.ఆర్ పించన్ కానుక క్రింద 11,848 మంది లబ్ది దారులకు 2.96 కోట్ల లబ్ది జరిగిందని అన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత, ఈ.బి.సి నేస్తం, కాపు నేస్తం, జగనన్న చేతోడు, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్ మత్స్యకార భరోసా, వాహన మిత్ర, సున్నా వడ్డీ, (ఖరీఫ్, రబీ) ఇన్పుట్ సబ్సిడీ తదితర పధకాల క్రింద లబ్దిదారుల ఖాతాల్లోనికి నగదు జమ చేయడం జరిగిందన్నారు. 

గడప గడపకు  ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు :  శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య 
 రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలు తీరును పరిశీలించడానికి , లబ్ది దారులతో ముఖా ముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోడానికి గడప గడపకు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని, ఇందులో భాగంగా శాసన సభ్యులు, ప్రజా ప్రతినిదులంతా ఇంటింటికీ వెళ్ళడం జరుగుతోందని శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య  తెలిపారు. ఎవ్వరికైనా ఎలాంటి సమస్య ఉన్న ప్రజా ప్రతినిధులతో చెప్పాలని అన్నారు.  ముఖ్య మంత్రి ఆదేశాలను తప్పక పాటిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ వారి సంక్షే మానికి  కృషి చేస్తున్నామని అన్నారు.  ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్య మంత్రి జాతి, కుల , మత , పార్టీ బేధం లేకుండా గతం లో పొందలేని లబ్దిదారులకు అందరికీ  సంవత్సరం  లో రెండు సార్లు ప్రత్యేకంగా పధకాలను అందజేస్తున్నారని కొనియాడారు.  అంతే కాకుండా నవరత్నాలు క్రింద అర్హులైన  ప్రతి ఒక్కరికీ ఈ పధకాలు అందుతున్నాయని, నేడు విద్యా వ్యవస్థ ఇంతగా మార్పు చందడానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, నాడు-నేడు తదితర కార్యక్రమాలేనని స్పష్టం చేసారు. 

Vizianagaram

2022-07-19 08:19:22

ఇంటర్న్ షిప్ తో నైపుణ్యాలు పెరగాలి

డిగ్రీ విద్యార్థులకు కల్పించే ఇంటర్న్ షిప్ కార్యక్రమంతో విద్యార్థులలో నైపుణ్యాలు పెరగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఇంటర్న్ షిప్ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, శ్రీకాకుళం డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.హెచ్. ఏ.రాజేంద్ర ప్రసాద్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులుగా తయారు కావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అందుకు గల అన్ని అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన అన్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు పడాలని పేర్కొన్నారు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టే నాటికి ఆరు నెలల ఇంటర్న్ షిప్ కార్యక్రమం పూర్తి కావాలని, అదే సమయంలో స్వయం ఉపాధి పొందుటకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉండాలని వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్న్ షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. బి.ఏ, బి.కాం, బి.ఎస్సీ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు ఆయా విభాగాల్లోని సంస్థలు, పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ ఏర్పాటు చేయుటకు అవసరమైన సంస్థలు గుర్తించి కళాశాలలు, సంబంధిత శాఖలు జాబితాలను ఇచ్చి పుచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇంటర్న్ షిప్ పై విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని తద్వారా ఆసక్తితో హాజరుకావడం వలన ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి పి. సీతారాము, డిగ్రీ కళాశాలల ప్రధాన అధ్యాపకులు డా.తమిరి రాధాకృష్ణ, ఏ.తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.                           

Parvathipuram

2022-07-19 08:05:37

రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి సాసైటీల దాత్రుత్వం

శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మసీదు ఇమామ్‌ జలాలుద్దీన్‌ పది నెలల కుమార్తె సిద్రాఫిర్లోజీకి లివర్‌ ప్లాంటేషన్‌కు రూ.28 లక్షలు అవసరమని చెన్నై రేలా ఆనుపత్రి యాజమాన్యం పేర్కొంది. దీనితో శివశ్రీ నృత్య కళానికేతన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘుపాత్రుని శ్రీకాంత్‌, శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పైడి రజని, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ ట్రన్ఫు చైర్మన్‌ కొంక్యాన మురళీధర్‌, ముస్లిం మైనార్టీ నాయకులు బహుదూర్‌ భాషా, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, జలాలుద్దీన్‌ కుమార్తె ఆవరేషన్‌కు దేశంలోను, ఇతర దేశాల్లో ఉన్న మిత్రులు, స్నేహితులు ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి అందించారు. కిట్టో యాప్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా మరికొంత విరాళాన్ని సేకరించారు.  దీనితో చిన్నారి ఆపరేషన్‌ విజయవంతమై ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆపరీషన్‌ జరిగిన నాటి నుంచి పెద్ద అయ్యేంతవరకు చిన్నారికి వైద్య ఖర్చులు, తనిఖీ నిమిత్తం నెలకు రూ.10 వేలు అవనరం అవుతుంది. ఓ మసీదులో కేవలం రూ.10 వేలు గౌరవవేతనానికి పనిచేసే జలాలుద్దీన్‌ రూ.10 వేలు ఖర్చు పెట్టి మందులు కొనుగోలు చేయడం సాధ్యం కాని వ్యవహారం.

 ఈ విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి 15 నూత్రాల కమిటీ నభ్యుడు బవాదూర్‌ భాషా, రెడ్‌క్రాస్‌ లైఫ్‌ మెంబర్‌ కొంక్యాన వేణుగోపాల్‌,  జలాలుద్దీన్‌ కుటుంబాన్ని ఆదుకొనేందుకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, సీవీ నాగజ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ మూర్తిలను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందించి చెరో ట్రన్టు నుంచి రూ.4 వేలు చొప్పున రూ.8వేలు ఏడాది పాటు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధి డాక్టర్‌ నిక్కు అప్పన్న నెలకు వెయ్యి చొప్పున జలాలుద్దీన్‌కు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శాంతా కళ్యాణ్‌ అనురాగ నిలయంలో జలాలుద్దీన్‌కు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, నాగజ్యోతి ఫౌండేషన్‌, రెడ్‌క్రాస్‌ సీనియర్‌ ఆడిటర్‌ కనుగుల దుర్గా శ్రీనివాస్‌, డాక్టర్‌ నిక్కు అప్పన్న అందజేశారు. తమ అభ్యర్థనపై వెనువెంటనే స్పందించి జలాలుద్దీన్‌ కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల కొంక్యాన వేణుగోపాల్‌, బహుదూర్‌భాషా, రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి వెల్ఫేర్‌ సాపైటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాది పాటు చిన్నారికి వా నంస్థల ద్వారా సవాయమందుతుందని, భవిష్యత్తులో ఇతర సంస్థల ద్వారా అయినా సహాయమందించేందుకు కృషి చేస్తామని వేణుగోపాల్‌, భాషా పేర్కొన్నారు.           

Srikakulam

2022-07-19 08:01:05

కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టం అమ‌లు చేయండి

తిరుమలలో గదులు పొందిన భక్తులకు అక్క‌డ ఏవైనా సమస్యలు ఉత్ప‌న్న‌మైతే వాటిని త్వ‌రితగ‌తిన‌ పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టం సత్ఫలితాలనిస్తోందని టీటీడీఈవో ఎవి. ధర్మారెడ్డి చెప్పారు. ఇదే విధానాన్ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవింద‌రాజ‌స్వామి సత్రాల్లోని రిసెప్షన్ విభాగంలో కూడా ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం ఈవో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో  ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుపతి గోశాల‌లో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణం ప‌నులు ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణం పనులను ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో పరిశుభ్రతను మ‌రింత పెంచి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించడానికి  ఆలిండియా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి సహకారం తీసుకోవాలని ఆరోగ్యాధికారికి సూచించారు.
 
       టీటీడీ ఆలయాలతో పాటు, ఇటీవల విలీనం చేసుకున్న ఆలయాల్లో కూడా గోపూజ నిర్వ‌హణ‌పై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం తిరుమలకు వెళ్ళే భక్తుల లగేజి ర‌వాణాకు సంబంధించి జిఎంఆర్ ప్రతినిధులతో ఈవో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమ‌ల‌కు వెళ్ళే భక్తుల లగేజి రవాణా చేసి త్వరగా సులభరీతిలో తిరిగి పొందేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. లగేజీ కౌంటర్ల నిర్వహణపై సివిఎస్వో  నరసింహ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సమావేశంలో జెఈవోలు సదా భార్గవి,  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఈవో  షణ్ముఖ కుమార్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-18 15:46:30

వరదల ప్రాంతాల్లో విస్త్రుత ఏర్పాట్లు

ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా వరద తాకిడి ప్రాంతాలలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ వరద చర్యలు కొనసాగింపుపై ఒక ప్రకటనలో వివరిస్తూ వరదలు, అధిక వర్షాలు కారణంగా జిల్లాలోని మూడు మండలాల్లో 31 గ్రామాలు వరద తాకిడికి గురికాగా ఆయా ప్రాంతాల్లో 23,130 మంది నివాసం ఉంటున్నారని తెలిపారు. 13,468 మంది కలిగిన 2,358 కుటుంబాలను కాళీ చేయించడం జరిగిందన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 16 టీం లను, 49 మంది ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ 135 మంది, ఫైర్ సర్వీస్ 29 సిబ్బందిని రంగంలోనికి దించడం జరిగిందన్నారు. అలాగే 123 బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  32 పునరావాస కేంద్రాలను ఏర్పాటు 11,589 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రభుత్వపరంగా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరద ప్రాంతాల్లో 31 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతోపాటు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు.  1,48,132 ఆహార పొట్లలను, 10,59,000 వాటర్ ప్యాకెట్లను, 31.25 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 24 మెట్రిక్ టన్నుల కందిపప్పును, 7 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలను, 37.26 మెట్టుకు టన్నుల పంచదారను, 10,527 లీటర్ల పామాయిల్ ను, 7 మెట్టుకు టన్నుల ఉల్లిపాయలను, 6,693 లీటర్ల పాలను ఇప్పటివరకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

  బట్టలు, వంట పాత్రలు అందించేందుకు రు.64.6 లక్షలను ఖర్చు చేయడం జరిగిందన్నారు.  ఒక్కొక్క కుటుంబానికి ఒక లీటర్ పాలు, పిల్లలు కలిగి ఉన్న కుటుంబానికి రెండు లీటర్ల చొప్పున పాలు  అందజేయడం జరుగుతున్నది అన్నారు.  పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయనికి సంబంధించి ఎనిమిది మండలాల్లో 209 హెక్టార్లలో,  ఉద్యానవన పంటలకు సంబంధించి 253.60 హెక్టార్లలో వరద తాకిడి ప్రభావం ఉందన్నారు.  599 ఉద్యానవన రైతులకు సుమారు రూ.7.15 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.  24 గంటలకు పైబడి  7,497 ఇల్లు వరద నీటిలో ఉన్నాయన్నారు.  3 గుడిసెలు పాక్షింగా దెబ్బతిన్నాయన్నారు.   5 కచ్చా ఇల్లు పూర్తిగా దెబ్బతినడం వలన ఒక లక్ష 15 వేల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. ఒక వ్యక్తి కనిపించకుండా పోయారని, అలాగే ఒక మైనర్ బాలుడు పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. జిల్లాలో 97 రోడ్లు దెబ్బతినగా  4 437.47  కిలోమీటర్ల మేర రోడ్లు ఉపరితలం దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు 34,528 లక్షల విలువైన రోడ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ కి సంబంధించిన 1,129 లక్షల విలువైన 26 రోడ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 882 వలలు, 171 బోట్లు దెబ్బతిన్నాయన్నరు.  అలాగే నీటిపారుదల వనరులు కూడా దెబ్బతిన్న వాటిలో ఉన్నాయన్నారు.

Narsapur

2022-07-18 15:16:26

కాలనీల్లో రహదారి నిర్మాణాలు వేగం పెంచాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని జగనన్న కాలనీల్లో రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మునిసిపల్, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సోమ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముమ్మరంగా నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లో రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాలనీల్లో రహదారుల నిర్మాణం ప్రగతిలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణానికి ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సొంత స్థలాల్లో నిర్మాణాల పైనా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు గృహ నిర్మాణాలకు రూ.35 వేల రుణం మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అమృత్ సరోవర్ కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను ఆగస్టు 14 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అమృత్ సరోవర్ చుట్టు ప్రక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆగష్టు 15వ తేదీ నాటికి అమృత్ సరోవర్ ను ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులను పంచాయితీ వారీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. వర్షాలు కురిసినా పనులకు ఆటంకం ఉండని పనులు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమానికి లక్ష్యాలకు చేరువలో వేతనదారులు ఉండాలి ఆయన పేర్కొన్నారు. 

అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. కనీసం 10 వేల క్యూబిక్ మీటర్ల నీరు నిలువ ఉండాలని, చెరువు చుట్టూ తుప్పలను తొలగించాలని, నాలుగు వైపులా చెరువు గట్టును నాలుగు మీటర్ల ఎత్తున దశల వారీగా చదునుగా వేయాలని ఆయన చెప్పారు. చెరువుకు బోర్డును ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. చెరువు గట్టుపై నాలుగు వైపులా వ్యాహ్యాలికి అనుగుణంగా తయారు చేయాలని, చుట్టూ మొక్కలు నాటాలని, దగ్గరలో జాతీయ జెండా ఎగుర వేయుటకు అనువుగా నిర్మాణం చేయాలని, దాతల సహకారంతో బెంచీలు ఏర్పాటు చేయాలని, చెరువు వినియోగదారుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగుర వేయాలని ఆయన ఆదేశించారు. మ్యుటేషన్ నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలో బలిజిపపేట, జియ్యమ్మ వలస తదితర మండలాల్లో పూర్తి కావడం లేదని, రెవిన్యూ డివిజనల్ అధికారులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. 

మునిసిపల్ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు పడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు ఏంటి లార్వా ఆపరేషన్ తక్షణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సచివాలయం శానిటేషన్ సెక్రటరీ ప్రత్యేక బాధ్యత వహించాలని ఆయన ఆదేశించారు. రానున్న మూడు నెలలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. వరదలపై ప్రతి రోజూ మండల, డివిజన్ కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సోమ, శుక్ర వారాల్లో 18 సంవత్సరాలు దాటిన వారికి సచివాలయాలలో కోవిడ్ మెగా వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని అదేశించారు. 
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి ఎం.వి.జి. క్రిష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస రావు, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-18 13:29:35