1 ENS Live Breaking News

ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ

తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతకంతకూ  వరద ప్రవాహం పెరుగుతుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ జేశారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 19.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తక్షణ సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ , కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అటు వరదల్లో చిక్కుపోయిన వారికి ఆహారాన్ని అందించేందుకు డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.


Rajamahendravaram

2022-07-15 06:34:50

కమిషనర్ ను మెప్పించిన ఎమినిటీ కార్యదర్శి

విధి నిర్వహణలో  ఓ సచివాలయ ఉద్యోగి చూపించిన అంకితభావం  అధికారుల ప్రశంసలు అందుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను పూర్తి చేయాలన్న  అతని తపన సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు తెలుసుకుంటే.. ఆర్.ఈశ్వర్ కాకినాడలోని 5A సచివాలయంలో ఎమినిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పండూరు లేఅవుట్ లో జియో టాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం లేదు. జియో టాగింగ్ చేయాలంటే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఓవైపు ఎడతెరిపిలేని వర్షం.. మరోవైపు ఆ వర్షం కారణంగా కేటాయించిన స్థలాల్లో నీరు నిలిచిపోవడం వంటి  ప్రతికూల పరిస్థితులు ఎదురుపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో బురద నీటిలోనే వెళ్లి జియోటాగింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన సమాచారం, ఫోటో అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ కే. రమేష్ ఏమినిటీ కార్యదర్శి ఈశ్వర్ ను ప్రత్యేకంగా అభినందించారు. పదిమందికీ ఆదర్శంగా నిలిచిన ఈశ్వర్ తరహా లోనే మిగిలిన ఉద్యోగులు కూడా కష్టించి పనిచేయాలని కమిషనర్ రమేష్ కోరారు.  ముఖ్యంగా లబ్ధిదారులు కూడా ముందుకు వచ్చి వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Kakinada

2022-07-14 10:09:41

వరద పరిస్థితికి అనుగుణంగా ఏర్పాట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరంలో ప్రస్తుతం రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని,  మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే ఆచంట మండలంలోని 9 గ్రామాలు,  నర్సాపురం మండలంలోని 3  గ్రామాలు,  యలమంచిలి మండలంలోని 15 గ్రామాలకు వరద ప్రభావం  ఉండే అవకాశం ఉందని తెలిపారు.  7 ఎన్డిఆర్ఎఫ్ టీంలు, 5 ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ లను సిద్ధంగా ఉంచడం జరిగిందిన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఆచంట మండలంలో  పెద్దమల్ల లంకలో చర్చి, అనగారి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయుపి  స్కూల్,  పల్లెపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్,  అయోధ్య లంకకు సంబంధించి హరిజన పేట చర్చ్, అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి,  పుచ్చలంక గ్రామానికి  సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనం,  రవిలంక గ్రామానికి సంబంధించి  కమ్యూనిటీ హాల్,  మర్రి మూల గ్రామానికి సంబంధించి ఎంపీ యు పీ స్కూల్,  చర్చి ,  నక్కిడి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్,  కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్  భీమలాపురం గ్రామంలో  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్  తెలిపారు.

    అలాగే నరసాపురం మండలానికి సంబంధించి కొత్త నవరసపురం ఎంపీపీ స్కూల్,  పాత నవరసపురం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  లక్ష్మనేశ్వరం గ్రామానికి సంబంధించి రాజులంక డ్వాక్రా భవనంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  అలాగే ఎలమంచిలి మండలానికి సంబంధించి కనకాయలంక  ఆర్యవైశ్య కళ్యాణ మండపం తాటిపాక,  ఎంపీపీ స్కూల్ సాకలి పాలెం పి గన్నవరం మండలం, పెదలంకకు సంబంధించి జడ్పీహెచ్ఎస్ స్కూల్,  ఎంపీపీ స్కూల్ తాటిపాక రాజోలు మండలం, దొడ్డిపట్ల గ్రామానికి సంబంధించి జెడ్ పి హెచ్ స్కూల్, అబ్బిరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  బడవ గ్రామానికి సంబంధించి వైవి లంకలోని ఓల్డ్ ఏజ్ హోమ్,  ఏనుగుల వాని లంకకు సంబంధించి వైవి లంకలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్ ,  ఎలమంచిలి లంకకు సంబంధించి ఎంపీయుపీ స్కూల్,  లక్ష్మీ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, గంగడుపాలెం కు సంబంధించి ఎంపీపీ స్కూల్,  కట్టుపాలెం సంబంధించి ఎంపీయుపీ స్కూల్, బూరుగుపల్లి గ్రామానికి సంబంధించి ఎంపీయుపీ స్కూల్ ,  కేఎస్ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, నారిన మేరక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  వడ్డీ లంక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  సిరగాలపల్లి గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్ స్కూల్ లోను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివరించారు.

Bhimavaram

2022-07-14 09:59:33

శ్రీవారి వైభ‌వోత్స‌వాలకు విస్తృత ఏర్పాట్లు

నెల్లూరులో ఆగ‌స్టు 16 నుండి 20వ తేదీ వ‌ర‌కు 5 రోజుల పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో గురువారం వైభ‌వోత్స‌వాల ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు వైభ‌వోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఆక‌ట్టుకునేలా పైక‌ప్పుతో కూడిన వేదిక‌, భ‌క్తులు కూర్చునేందుకు గ్యాల‌రీలు, క్యూలైన్లు, ప్ర‌సాదాల కౌంట‌ర్లు, ల‌డ్డూ విక్ర‌య‌ కౌంట‌ర్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు, పోటు, సైన్‌బోర్డులు త‌దిత‌ర ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ‌లు, ప్ర‌త్యేక లైటింగ్‌, ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు, ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాల‌ని సివిఎస్వోను కోరారు. టిటిడిలో ఇటీవ‌ల చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌పై ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌ని కోరారు. ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో జెఈఓలు స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో  ష‌ణ్ముఖ‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-14 09:35:23

భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తి గరిమెళ్ల

భారత స్వాతంత్రోద్యమానికి తన గేయాలతో శత్తువ తీసుకువచ్చి ప్రజల్లో దేళభక్తిని పెంపొందించిన చైతన్య స్ఫూర్తి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోథులు గరిమెళ్ల నత్యనారాయణ అని వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం గరిమెళ్ల 129వ జయంతి శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీ గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్‌మనోవార్‌నాయుడు మాట్లాడుతూ, జిల్లాకు చెందిన గరిమెళ్ల  స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పిలువునందుకొని తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. కవి, రచయిత, జర్నలిస్టుగా గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్ర్యకాంక్షను ప్రజల్లో రేకెత్తించే దిశగా మాకొద్దీ తెల్లదొరతనమంటూ నినదించారని కొనియాడారు. గరిమెళ్ల మన జిల్లాలో జన్మించడం అదృష్టమని పేర్కొన్నారు. భావితరాలకు స్వాతంత్రోద్యమ చరిత్రను అందించే దిశగా గాంధీమందిరం, స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనం ఎంతో చక్కగా రూపుదిద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వంద అడుగుల ఎత్తులో వ్రతిష్టించనున్న జాతీయ జెండా పనులను ఆయన పరిశీలించారు. తొలుత జాతిపిత మవోత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహ దాతలు, కొంక్యాన చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మురళీధర్‌, వేణుగోపాల్‌తో పాటు గాంధీ మందిర కమిటీ నిర్వాహకులు నటుకుల మోహన్‌, నిక్కు అప్పన్న మహిబుల్త్లాఖాన్‌, మెట్ట అనంతభట్లు, వందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, ఆచంట రాము, పొన్నాడ రవికుమార్‌, తర్జాడ అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు సాధు వైకుంఠం, మెకానిక్‌ మోహన్‌, కరమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-14 08:25:37

ఈ సృష్టి లో గురువును మించిన దైవం లేదు

ఈ సృష్టి లో గురువును మించిన దైవం, సంపద లేదని,  గురువులును  గౌరవించడం పూజించడం మన కనీస ధర్మమని  సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు అన్నారు. విశాఖలోని మురళీ నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా  రెండు రోజుల పాటు నిర్వహించిన పలు పూజాది కార్యక్రమాలకు గంట్ల శ్రీనుబాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీను బాబును ఘనంగా సత్కరించింది. అనంతరం శిరిడి సాయి నాధుని జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయం ప్రతియేటా కూడా అనేక ఆధ్యాత్మిక  కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. అంతేకాకుండా విశేష పూజలు జరిపిన , దేవతా మూర్తుల  కల్యాణాలు జరిపిన ఘనత కూడా ఈ ఆలయ కమిటీకి దక్కుతుందన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం అదృష్టము గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి నగర్ షిరిడి సాయి బాబా ఆలయకమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, ప్రధాన  కార్యదర్శి  సనపల వరప్రసాద్ ,ప్రధానార్చకులు గోపి స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-14 06:19:11

వరద ఉద్రుతిపై అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలం వద్ద వరద నీరు విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా గురువారం సాయంత్రానికి 18 నుంచి 20 లక్షల క్యూసక్కుల నీరు ధవళేశ్వరం కు చేరుకునే అవకాశం ఉందన్నందున హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు   సమన్వయంతో పనిచేయాలని  జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,  వరదలు కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని అన్నారు.  ఒక్క ప్రాణ నష్టం కానీ, జంతువుల నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో   ఉన్న కుటుంబాలను అవసరమైతే బలవంతంగా నైనా తరలించాలని పేర్కొన్నారు.  వాస్తవ పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని పకడ్బందీ గా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ముఖ్యమంత్రి స్పష్టం గా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.  రిలీఫ్ క్యాంపు ల వద్ద ఆహారం, త్రాగునీరు, దుప్పట్లు, మందులు తగినంత ముందస్తుగా సిద్దం చేసుకోవాలని, బడ్జెట్ కు ఎటువంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ఇరిగేషన్, హెడ్ వర్క్సు అధికారులు వరద నీరు వచ్చే  స్థాయి పై పూర్తి గా అంచనాతో ఉండాలని, గంట గంటకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  జిల్లాలో బోబ్బర్లంక, సీతానగరం, మునికొడు, ములకల్లంక, మద్దూరులంక  ప్రాంతాల్లో బండ్స్ ను తనిఖీ చేయ్యాలన్నరు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిస్థితి ని అంచనా వెయ్యలన్నారు. రహదారులకు , విద్యుత్ సరఫరా కు ఎటువంటి ఆటంకం లేకుండా సంబందించిన అధికారులు చర్యలు చేపట్టలని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జేసీ శ్రీధర్ , ఆర్డీవో మల్లిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-13 14:56:40

జ్వరాల సమాచారం అందించండి

మన్యం జిల్లాలో  మలేరియా, డెంగ్యూ జ్వరాలను అరికట్టుటకు వాటికి సంబంధించిన సమాచారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు తెలిపారు. జ్వరాలు నివారణ చర్యలు, ప్రైవేటు ఆసుపత్రుల సహకారంపై  బుధవారం  ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, లాబరేటరీ టెక్నీషియన్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాదులు విజృంబిస్తున్నాయని వాటిని నియంత్రించుటకు ప్రైవేటు ఆసుపత్రులు సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు వస్తున్న మలేరియా, డెంగ్యూ పాజిటివ్ కేసుల వివరాలను దగ్గరలో గల పి.హెచ్.సి. కి తెలియజేయాలని తెలిపారు.  ఆయా కేసులు వచ్చిన గ్రామాలలో తక్షణ నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి  వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి చికిత్స అందించటం జరుగుతుందని, తద్వారా ముందుగానే వ్యాదులు ప్రబలకుండా అరికట్టుటకు అవకాశం ఉంటుందన్నారు.  టి.బి. కేసుల వివరాలు కూడా తెలియజేస్తే వారికి ఉచితంగా మందులు, చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 

ప్రైవేటు  ఆసుపత్రులు, స్కానింగు సెంటర్లు రిజిస్ట్రేషను చేయించుకోవాలని, రిజిస్ట్రేషను గల ఆసుపత్రులు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. స్కానింగు సెంటర్లలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించకూడదని, చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగనిర్దారణ వ్యతిరేక చట్టం ప్రకారం త్వరలోనే జిల్లా స్థాయి కమిటీ నియామకం జరుగుతుందన్నారు.  డెలివరీలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఆరోగ్యరక్ష ద్వారా  డబ్బులు చెల్లిస్తున్నదని అందుకొరకు డెలివరీ  వివరాలు సంబంధిత యాప్స్ నందు తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. ప్రజలు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనేలా అవగాహన కల్పించాలని అన్నారు. 

బలిజపేట మండలం పినపెంకి గ్రామంలో ఫైలేరియా కేసులు సుమారు పదిహేను వందలు  ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా గ్రామస్తులు బాధపడుతున్నారని గుర్తించడం జరిగిందని, దీనిపై  ప్రణాళిక తయారుచేసుకొని రక్తపరీక్షలు నిర్వహించుట, చికిత్స, గ్రామంలో దోమలు నివారణ, పరిసరాల పరిశుభ్రత మొదలైన అంశాలపై ఒకేసారి చర్యలు చేడతామని తెలిపారు. ఐ.ఎం.ఎ. సెక్రటరీ డా. శేషగిరిరావు మాట్లాడుతూ ప్రజలు సరియైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలననే వ్యాదులబారిన పడుతున్నారని, మంచి ఆహారం తీసుకోనుట వలన వ్యాధినిరోదకత పెరిగి వ్యాదుల రావని,  తక్కువ మందులు వినియోగంతో వ్యాదులను తగ్గించుకోవచ్చని తెలిపారు. కావున ప్రజలు బలవర్దకమైన పౌష్టికాహారం తీసుకొనేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారిణి డా. వాగ్దేవి,   ఎ.పి.ఎన్.ఎ. ప్రెసిడెంట్ డా. డి.రామమోహన్ రావు, జిల్లా మలేరియా అధికారి డా. కె.పైడిరాజు, డిప్యూటీ డి.ఎం .హెచ్.ఒ.లు డా. సి. దుర్గాకళ్యాణి, డా. బి. నివాసరావు,, ప్రైవేటు ఆసుపత్రులు డాక్టర్లు, లేబరేటరీ టెక్నీషియన్లు పాల్గొన్నారు.   

Parvathipuram

2022-07-13 14:35:30

సచివాలయాలతో అద్భుత ఫలితాలు

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన ప్రజలకు చేరవేయడం లో సచివాలయ వ్యవస్థ  పనితీరు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయాని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అనపర్తి నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం ను స్థానిక శాసన సభ్యులు సత్తి సూర్య నారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు కోసం ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అవ్వడం ద్వారా లక్ష్యాలను సాధించడానికి సానుకూలత సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ములకల్లంక గ్రామం లో నిన్నటి రోజున జరిగిన సంఘటన పై మాట్లాడుతూ, గతంలో వరదలు, ప్రకృతి విపత్తులు వొచ్చిన సమయంలో గ్రామ స్థాయి లో అధికారులకు, సిబ్బందికి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేస్తే పనిచేసే వారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మానవ వనరుల పెరగడం వల్ల ప్రజలకు అందుబాటులో అధికారులు సిబ్బంది ఉండి ప్రభుత్వ సహాయం తక్షణమే వారికి చేరడం సాధ్యం అవుతోందని పేర్కొన్నారు.  నియోజక వర్గంలో అభివృద్ధి ప్రతి ఒక్కరి అటూ ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, ఇప్పటికే ఆదిశలో పురోగతి సాధించాగలిగామని చెప్ప వచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. వెల్ నెస్ కేంద్రాలు ద్వారా గ్రామంలోనే తక్షణ వైద్య సహాయం కోసం ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ పనులు మరో నూతన అధ్యాయం గా కలెక్టర్ అభివర్ణించారు.

అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయ భవనాలు 59 కు గాను 39 పూర్తి అయ్యాయని రైతు భరోసా కేంద్ర భవనాలు 59 కి గాను 18 వెల్నెస్ సెంటర్స్ 50 కి గాను 11 నిర్మించుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా సచివాలయ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు.  దీని ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగవంతంగా నిర్మించాలన్నారు. శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ  అనపర్తి నియోజకవర్గం లో అనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాల్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన కల్పించి ఇల్లు నిర్మాణాలు గ్రౌండ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ఇప్పటికే జిల్లాలో రాజానగరం నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందని రెండవ స్థానంలో అనపర్తి నియోజకవర్గం నిలిపేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయాలు, ఆర్ బి కే, వెల్నెస్ సెంటర్ల భవనాలను నిర్మించేందుకు సహకరించిన  పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సర్పంచ్లను కలెక్టర్ సన్మానించారు. స్థానిక నియోజక వర్గం లోని ప్రజా ప్రతినిదులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

East Godavari

2022-07-13 13:52:25

బిజిలీ ఉత్సవాలు విజయవంతం కావాలి

ఈ నెల 26,30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న బిజిలీ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని, జిల్లా నోడ‌ల్ అధికారి, సింహాద్రి ఎన్‌టిపిసి డిప్యుటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ ఆనంద్‌బాబు కోరారు. ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై స్థానిక ఇపిడిసిఎల్ కార్యాల‌యంలో బుధ‌వారం స‌మావేశాన్నినిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా విద్యుత్ రంగంలో, ఈ 75 ఏళ్ల కాలంలో దేశం సాధించిన విజ‌యాల‌ను, ప్ర‌గ‌తిని మ‌న‌నం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన ల‌క్ష్యాలు, ప్ర‌గ‌తిపై చ‌ర్చించేందుకు ఉజ్జ్వ‌ల భార‌త్ - ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్ పేరుతో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు  తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లు, పంపిణీ సంస్థ‌లు ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ ఉత్స‌వాల్లో ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ త‌దిత‌ర సంస్థ‌లు కూడా పాల్గొంటాయ‌ని తెలిపారు.

               మ‌న జిల్లాలో ఎన్‌.టి.పి.సి.(నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌- సింహాద్రి యూనిట్‌)తో క‌ల‌సి జిల్లా యంత్రాంగం, ఈ నెల 26న బొబ్బిలి వెల‌మ సామాజిక భ‌వ‌నంలో, 30న క‌లెక్ట‌రేట్‌లో ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు. విద్యుత్ రంగంలో దేశం సాధించిన ప్ర‌గ‌తిని, పున‌రుత్పాదక ఇంధ‌న రంగంలో సాధించిన ప్ర‌గ‌తిని కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించేలా, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనిలో భాగంగా విద్యుత్  వినియోగ‌దారుల‌తో ముఖాముఖి, విద్యుత్ అవ‌స‌రాలు, స‌హ‌జ ఇంధ‌న వ‌న‌రుల వినియోగం అంశాల‌పై సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. గ్రామాల శ‌త‌శాతం విద్యుదీక‌ర‌ణ‌, గృహ విద్యుత్‌, విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం పెంపుద‌ల‌, ఒకే దేశం - ఒకే గ్రిడ్‌, విద్యుత్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌డం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌నరుల రంగంలో సాధించిన అసామాన్య ప్ర‌గ‌తి, వినియోగ‌దారుల హ‌క్కులు వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు ప్రాంతీయ భాష‌ల్లో రూపొందించిన‌ త‌క్కువ నిడివిగ‌ల షార్టు ఫిల్మ్‌లను ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను, వివిధ సంస్థ‌ల స్టాళ్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.  ఈ స‌మావేశంలో  పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా బిజిలీ ఉత్స‌వాల నోడ‌ల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం జెఎస్ఎన్‌పి ప్ర‌సాద్‌, ఎపిఇపిడిసిఎల్ విజ‌య‌న‌గ‌రం ఇఇ(ఆప‌రేష‌న్స్‌) కృష్ణ‌మూర్తి, బొబ్బిలి ఇఇ (ఆప‌రేష‌న్స్‌) పి.హ‌రి, ఇఇ టెక్నిక‌ల్ ఎం.ధ‌ర్మ‌రాజు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-13 13:49:48

పరిశ్రమల ఏర్పాటుకి ఇదే మంచి తరుణం

విజ‌య‌న‌గ‌రం జిల్లా భౌగోలికంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు, అన్ని ర‌కాల వ‌న‌రుల‌కు అనుకూల‌మైన ప్రాంత‌మ‌ని, ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్ప‌టం ద్వారా ఆశించిన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పాల‌నుకునే వారికి ఇదే మంచి త‌రుణ‌మ‌ని, అంద‌రూ ముందుకు వ‌చ్చి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని కొత్తకొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పాల‌ని సూచించారు. సుదీర్ఘ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్లో వివిధ కంపెనీల‌ పారిశ్రామిక‌వేత్త‌లు, జిల్లా స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో పైమేర‌కు ఆమె స్పందించారు. ఇక్క‌డ అన్ని వ‌న‌రులూ స‌మృద్ధిగా ఉన్నాయ‌ని, ఇక్క‌డ నుంచి వ‌స్తువుల‌ను కూడా ఇత‌ర ప్రాంతాల‌కు సుల‌భంగా ఎగుమ‌తి చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. జిల్లాలో నూత‌న ఔత్సాహికులు ముందుకు వ‌చ్చేలా కొత్త ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేలా అధికారులు అన్ని విధాలా స‌హాయ‌, స‌హ‌కారాలు అందించాల‌ని హిత‌వు ప‌లికారు. ఇక్క‌డ ఉత్ప‌త్తైన స‌ర‌కుల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు సుల‌భంగా త‌ర‌లించేందుకు మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చాల‌ని సూచించారు. దీనిలో భాగంగా జిల్లా ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ ద్వారా వివవ‌రించారు. 

ఎగుమ‌తుల్లో వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌కు ప్రాధాన్యం

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌, స్కిల్ డెవలెప్మెంట్, ఇత‌ర అధికారుల‌తో జ‌రిగిన సమావేశంలో ఆమె ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. జిల్లాకు అన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసే ప‌రిశ్రమ‌లు రావాల‌ని ఆకాంక్షించారు. ఆ దిశ‌గా జిల్లా అధికారులు కృషి చేయాల‌ని, ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జిల్లాలో స‌మృద్ధిగా ల‌భించే వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌ను గుర్తించి ఇత‌ర ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని, సంబంధిత కంపెనీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ రంగ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసేందుకు రూ.40 కోట్ల‌తో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని, ముందుగా వీటికి సంబంధించిన ప్రతిపాద‌న‌లు పంపించాల‌ని ప‌రిశ్ర‌మల శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. మామిడి, మొక్క‌జొన్న పంట‌ల సాగు ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి వాటిని ప్రాసెస్ చేసి ఎగుమ‌తి చేసే ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని చెప్పారు. జీడి పిక్క‌ల ప్రాసెస్ యూనిట్లకు కూడా త‌గిన ప్రోత్సాహం అందించాల‌ని సూచించారు. మామిడిలో సువ‌ర్ణ ర‌కానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పారు. ఉత్ప‌త్తుల ఎగుమ‌తికి సంబంధించిన పరిశ్ర‌మ‌లు నెలకొల్పేవారికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ 60 . 40 నిష్ప‌త్తిలో ఉంటాయ‌ని ఆమె వివ‌రించారు.

క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రాంపై అవ‌గాహ‌న‌

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ‌న్వ‌యంతో అమ‌ల‌వుతున్న సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు రూపొందించిన క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ప్రోగ్రాం నిబంధ‌న‌ల్లో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఔత్సాహికులు ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఒకే ర‌కానికి చెందిన ప‌ది ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే 90 శాతం రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క్ల‌స్ట‌ర్ డెవ‌లప్మెంట్ ప్రోగ్రాంలో మారిన నిబంధ‌న‌ల‌ను తెలియ‌జేస్తూ ముందుకు వ‌చ్చే ఔత్సాహికుల‌కు దానిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సూచించారు. ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల‌కు లేదా ఇత‌ర క‌ళాశాల‌ల‌కు వెళ్లి విద్యార్థుల‌తో మ‌మేకం అవ్వాల‌ని, ఆసక్తి ఉన్న వారిని పరిశ్ర‌మ‌లు నెల‌కొల్పేలా ప్రోత్స‌హించాల‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా చీపురుప‌ల్లిలో క్యాజూ క్ల‌స్ట‌ర్ని, రేగిడి ఆముదాల వ‌ల‌స‌లోని ఉంగ‌రాడంపేట పాప‌డ్ క్ల‌స్ట‌ర్ని, మెర‌క‌ముడిదాం మండ‌లంలోని బూద‌రాయివ‌ల‌స గ్రామంలో ఏర్పాటు చేసిన బ్రాస్‌, బెల్ మెట‌ల్స్ క్ల‌స్ట‌ర్ల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశ్ర‌మల శాఖ జీఎం వెల్ల‌డించారు. స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ జీఎం పాపారావు, ఏపీఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ య‌తిరాజులు, డీపీవో వ‌ర్ధ‌న్‌, ఎం.ఎస్‌.ఎం.ఇ. డి.ఐ., వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు క‌రుణా కుమార్, టి.టి. రాజు, డి. శ్రీ‌నివాస‌రాజు, శంక‌ర్ రెడ్డి, శంక‌ర్ రావు, సాంబ‌శివ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-13 13:48:50

ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలి

సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి పిలుపునిచ్చారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి శ్వేత, ఒడిశా కు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లకు శ్వేతలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజైన బుధవారం సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శరీరం, మనసు యాంత్రికంగా మారిన నేటి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలీకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి ,ఆలోచన అవసరమని ఆమె వివరించారు. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందని అన్నారు.  జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ జీ ఒత్తిడిని జయించే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని  కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని అన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన  మంగళ నరాయణి జీ, శ్వేత సంచాలకురాలు  ప్రశాంతి పాల్గొన్నారు.

Tirumala

2022-07-13 13:19:52

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన..

విశాఖలో ఈనెల 15వ తేదీన జిల్లాలో నిర్వహించు వాహన మిత్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ .మల్లికార్జున అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రాక సందర్భముగా బుధవారం ఉదయం కలెక్టర్ , పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తో  కలిసి ఏ ఎస్ ఎల్ నిర్వహించారు . ముందుగా ఎయిర్ పోర్ట్ లో పోలీస్ ,రెవెన్యూ ,ఎయిర్ పోర్ట్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎయిర్ పోర్టులో  ముఖ్యమంత్రి రాకకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము చేపట్టవలసిన ఏర్పాట్లను చర్చించారు . తదుపరి విమానాశ్రయం వెలుపల చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు . అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు . ముఖ్యమంత్రి రాక , స్టాల్స్,  ఫోటో సెషన్ , స్టేజి తదితర ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు గావించారు. అనంతరం కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు త్వరత గతిన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 25 వేల మంది  పాల్గొంటారని వెల్లడించారు. వర్షం వచ్చినా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు  తెలిపారు.  ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు,  ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

Visakhapatnam

2022-07-13 11:48:10

తిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్షసంకల్పం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త  రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారన్నారు.  అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.  శ్రీవారి ఆలయ మహ‌ద్వారం వ‌ద్ద టిటిడి ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,  చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం పెద్దజీయర్‌ మఠంలో  పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవోను శాలువతో సన్మానించారు. 

Tirumala

2022-07-13 11:30:40