ఇష్టంతో చదివితే విజయం మీదేనని జిల్లా కలెక్టర్ నిశాంత్ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మండలం పెద బొండపల్లి పాఠశాలలో మంగళ వారం విద్యా శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంతో చదువాలని అప్పుడు పేదరికం, ఆకలి అనే ఏది ఆటంకంగా నిలువలేవన్నారు. శ్రమ నీ ఆయుధం కావాలని... అప్పుడు విజయం నీ వెన్నంటి నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఉన్నత లక్ష్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ఆశయాలు ఉండాలి... వాటిని సాధించాలని ప్రేరణ కల్పించారు. చదువుతో కుటుంబ సామాజిక, ఆర్థిక హోదా మారుతుందని ఆయన అన్నారు. పేదరికం నుండి బయట పడాలంటే చదువు ద్వారా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. చదువుతో విజ్ఞానం, సామాజిక స్పృహ కలుగుతుందని ఆయన పేర్కొంటూ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తుందని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.
పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పోటీతత్వం అలవరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగా నాడు నేడు పనులు కింద పాఠశాలలో ఆధునీకరణ, పేద విద్యార్థికి విద్యను అందించే విధంగా అమ్మఒడి పథకం, జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులకు ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కష్ట తరంగా ఉండేదని, కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తోనే సాధ్యమైందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సాఫ్టు స్కిల్స్, బృంద చర్చలు అలవరచి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సుమారు రూ.931 కోట్ల జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయగా జిల్లాలో విద్యార్థులకు రూ.20 కోట్ల విలువైన కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థికి దాదాపు రూ.2వేలు విలువైన జగనన్న విద్యా కానుక క్రింద పాఠశాల తెరచిన రోజు నుండే ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం క్రింద మూడు జతల బట్టలు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, రెండు జతర సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, జత బూట్లు, డిక్షనరీలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బలిజిపేట మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 56 పాఠశాలల్లోని 4,635 మంది విద్యార్థులకు, భామిని మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 66 పాఠశాలలలోని 5,355 మంది విద్యార్థులకు, గుమ్మలక్ష్మీ పురం మండలంలో 9 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 172 పాఠశాలల్లోని 9,023 మంది విద్యార్థులకు, గరుగుబిల్లి మండలంలో ఐదు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 57 పాఠశాలల్లోని 4,612 మంది విద్యార్థులకు, జియ్యమ్మ వలస మండలంలో ఏడు స్కూలు కాంప్లెక్స్ ల కింద 95 పాఠశాలల్లోని 5,284 మంది విద్యార్థులకు, కొమరాడ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల కింద 127 పాఠశాలల్లోని 6,093 మంది విద్యార్థులకు, కురుపాం మండలంలో పది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 7,835 మంది విద్యార్థులకు, మక్కువ మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 80 పాఠశాలల్లోని 5,458 మంది విద్యార్థులకు, పాచిపెంట మండలంలో తొమ్మిది స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 121 పాఠశాలల్లోని 7,496 మంది విద్యార్థులకు, పాలకొండ మండలంలో ఏడు స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 60 పాఠశాలల్లోని 5,822 మంది విద్యార్థులకు, పార్వతీపురం మండలంలో 11 స్కూల్ కాంప్లెక్స్ లో కింద 116 పాఠశాలల్లోని 10,493 మంది విద్యార్థులకు, సాలూరు మండలంలో 12 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 177 పాఠశాలల్లోని 11,849 మంది విద్యార్థులకు, సీతంపేట మండలంలో 15 స్కూల్ కాంప్లెక్స్ ల క్రింద 163 పాఠశాలల్లోని 10,076 మంది విద్యార్థులకు, సీతానగరం మండలంలో ఆరు స్కూల్ కాంప్లెక్స్ కింద 64 పాఠశాలల్లోని 4,445 మంది విద్యార్థులకు, వీరఘట్టం మండలంలో ఆరు స్కూలు కాంప్లెక్స్ ల క్రింద 62 పాఠశాలల్లోని 5,407 మంది విద్యార్ధులకు వెరసి 121 స్కూల్ కాంప్లెక్స్ కింద 1593 పాఠశాలల్లోని 1,03,883 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయడం జరిగింది. ఇందులో 52,195 మంది బాలురు, 51,668 మంది బాలికలు ఉన్నారని వివరించారు.
శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక చిన్నారులకు వరం అన్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు తీసిపోని విధంగా చిన్నారులు తరగతులకు హాజరు కావాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అన్నారు. అందుకే ఎనిమిది వస్తువుల కలయికతో కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. టై, బూట్లు, బ్యాగుతో సహా అందించడం జరుగుతుందని దానితో పిల్లవాని రూపు రేఖలు మారిపోతుందని అన్నారు. బిడ్డలను చూసి తల్లులు మురిసిపోతున్నారని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న అశ్వని అనే బాలిక మాట్లాడుతూ జగనన్న కానుక కిట్లు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాన్వెంట్లకు వెళ్ళే పిల్లలను చూసి బాధ పడే వారమని అయితే ఇప్పుడు సంతోషంగా జగనన్న ఉంచుతున్నారని చెప్పారు. అమ్మ ఒడి వస్తుందని, చదువు ఎలా అని బెంగ లేదని, విద్యా కానుక తో పుస్తకాలు వచ్చాయని, బూట్లు, టై లేవనే బాధ లేదని పేర్కొన్నారు.