1 ENS Live Breaking News

ఆ 8మండలాలు అప్రమత్తంగా ఉండాలి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 8 మండలాలు వరద ముంపు ప్రభావానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత జిల్లాలో వరదల సమయంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.  తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత తూర్పు గోదావరిలో నాలుగు మండలాలు, పశ్చిమ గోదావరిలో ఉన్న నాలుగు మండలాలు వరద ప్రభావానికి గురి అయ్యే అవకాశం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలోని పలు లంక గ్రామాలపై వరద నీరు వలన ముంపుకు గురవుతాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే నేను, హోం మంత్రి , జిల్లా ఎస్పీ ముంపుకు గురి అయ్యే లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరడం జరిగిందన్నారు. జిల్లాలో ఆరు లంక గ్రామాలు ఉన్నాయని, వాటికి రహదారి మార్గం తో అనుసంధానం ఉందన్నారు. ముంపు గ్రామాలను మిగిలిన వారు కూడా తరలి రావలని స్పష్టం చేశామన్నారు. . ఆ గ్రామ ప్రజలు 1986 వరదల సమయంలో కూడా తమ గ్రామాల్లోకి వరద నీరు చేరలేదని తమకు చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రికి తెలిపారు. అయినప్పటికీ ఈసారి వరద వుదృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరోసారి ఈరోజు ఎస్పితో కలిసి ఆ లంక గ్రామానికి వెళ్ళడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ముంపుకు గురవుతాయి అనే గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షితం గా తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు పునరావాస కేంద్రాల్లో రేషన్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఆయిల్ వాటి నిత్య సరుకులు ఉంచామని తెలిపారు. మెడికల్ క్యాంపు లుకుడా  ఏర్పాటు చేసి నట్లు వివరించారు. రెవెన్యూ సచివాల సిబ్బంది ని ముంపు గ్రామాల వద్ద నుంచి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 123 కిలోమీటర్లు గోదావరి బండ్ అనుకుని రహదాలు ఉన్నాయని వీటిని పర్యవేక్షించేందుకు 47 మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ బి అధికారులతో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చేయాల్సిన పనులు పై సమీక్షించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాండ్ బ్యాగులను తరలించి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధం చేశామన్నారు.  జిల్లాలో 32 ఘాట్లు ఉన్నాయని, అక్కడ  మెట్ల పై వరకు నీళ్లు వచ్చినందున వాటిని తాత్కాలికంగా బారిగెట్లు  ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా నియంత్రించడం జరుగుతుందన్నారు.

Rajamahendravaram

2022-07-15 15:01:50

ఓఎన్జీసీ సేవలు ఆదర్శ ప్రాయం

చమురు, సహజ వాయువుల సంస్థ ఓఎన్‌జీసీ పేద వర్గాలకు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్‌ కె. రమేష్‌ పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్‌ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు, డ్రైవర్లు 1200 మందికి రూ. 9.6 లక్షల విలువైన నిత్యావసర సరుకులు ఓఎన్‌జీసీ అందజేసింది. ఈ కార్యక్రమానికి ఓఎన్‌జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, అసెట్‌ మేనేజర్‌ ఆదేశ్‌కుమార్‌ అధ్యక్షతన వహించారు. సమావేశంలో కమీషనర్‌ మాట్లాడుతూ గతంలో కూడా ఓఎన్‌జీసీ సంస్థ పారిశుధ్ద్య కార్మికుల కోసం విధి నిర్వహణలో ఉపయోగించే వస్తువులను సమకూర్చిందన్నారు. కోవిడ్‌ సమయంలోనూ సంస్థ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగించిందన్నారు. ఇప్పుడు కూడా కార్మికులకు సంస్థ అండగా నిలబడటం అభినందనీయమని ప్రశంసించారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుటికీ ప్రతీ ఒక్కరికీ ఈ సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ఓఎన్‌జీసీ ఈడీ ఆదేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కోవిడ్‌ సమయంలో విశేష సేవలందించిన కార్మికులకు సేవ చేసే అవకాశం దొరకడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వరకు జరుగుతున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా అక్కడకు విచ్చేసిన కార్మికులు, ఉద్యోగులతో కమీషనర్‌ రమేష్‌ పరిశుభ్రతా ప్రతిజ్ఞ చేయించారు. వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రత పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమీషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు, ఓఎన్‌జీసీ సీజీఎం సూర్యనారాయణ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఆర్‌. శంకర్, కార్పోరేషన్‌ ఆరోగ్య అధికారి డాక్టర్‌ పృధ్వీచరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-15 14:59:38

పెట్టుబడులే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ

పెట్టుబడులే లక్ష్యం..బంధం బలోపేతమే ధ్యేయంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పశ్చిమ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కాబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. జూలై 16వ తేదీ శనివారం విశాఖపట్నంలోని 'రాడిసన్ బ్లూ' హోటల్ వేదికగా "వ్యూహాత్మక భాగస్వామ్యం" దిశగా ఏపీ, ఆస్ట్రేలియా కలిసి పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  పరిశ్రమలు, నైపుణ్యం, శిక్షణ , మెరైన్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్, మైనింగ్ ,మాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఆంధ్రప్రదేశ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరస్పర అంగీకారం ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి స్పష్టం చేశారు. సోదర రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గనులు, ఖనిజాలు, విద్య, శిక్షణ పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకోసం రెండు ప్రభుత్వాలు "అవకాశాల మార్గం"లో కలిసి పని చేస్తాయన్నారు. 

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటికే సోదర రాష్ట్ర ఒప్పందం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ 

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారం , నైపుణ్యం అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా సంసిద్ధతతో ఉందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సోదర రాష్ట్ర ఒప్పందం ఉందన్నారు. ఆ బంధం ఏపీతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రభుత్వ మంత్రులు సహా మరో 90మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు కరికాల వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక, నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు,ఐ.టీ,వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ , పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. 

Visakhapatnam

2022-07-15 14:48:04

ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ వ్ర‌తం టికెట్లను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు.

Tirupati

2022-07-15 13:48:16

వరద బాధితులకు సౌకర్యాలు కల్పించండి

రాష్ట్రంలో వర్షాలు , వరదలు  ప్రభావం ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా  చేయవలసిన  ఏర్పాట్లు పై  జిల్లా కలెక్టర్లకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తగు అదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్య మంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి  శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వీడియో కన్ఫరెన్స్ లో యలమంచిలి తహశీల్దారు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి, యస్ పి  యు. రవి ప్రకాష్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. ఎలమంచిలి , ఆచంట,  నరసాపురం మండలాల్లోని 30 గ్రామాలకు వరద ప్రభావం ఉందని ,  ఇప్పటికే 28 రిలీప్ క్యాంపులు ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  సెక్రటేరియట్ స్టాప్ , పంచాయతీ సిబ్బంది అందరూ గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు .  గర్భిణీలు  ,  బాలింతలు  , చిన్నపిల్లలను  ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆమె అన్నారు. అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  పశువులకు పది రోజులకు సరిపడా మేతను  పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.  ఎక్కడైనా ఏటిగట్లకు లీకేజీలు ఏర్పడితే వాటిని వచ్చేందుకు  28 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు.  ఆచంట మండలం కోడేరు రేపు నుండి జిల్లా జాయింటు కలెక్టర్ జె వి మురళి  , ఆచంట శాసనసభ్యులు  చెరుకువాడ. శ్రీరంగనాథరాజు ,  భీమవరం కలెక్టర్ కార్యాలయం నుండి, డిఆర్ఓ  కె. కృష్ణవేణి ,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-07-15 12:59:06

దేశంలోనే ఆద‌ర్శ గోశాల‌గా ఎస్వీ గోశాల

టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌ను మ‌రో ఏడాదిన్న‌ర‌లోగా దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన గోశాల‌గా అభివృద్ధి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌ను శుక్ర‌వారం సాయంత్రం ఈవో ప‌రిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌, నెయ్యి త‌యారీ కేంద్రం ప‌నుల‌ను ప‌రిశీలించారు.  అలాగే గోవ‌స‌తి షెడ్లు, అందులో గోవుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు ఇసుక‌తో ఏర్పాటుచేసిన మైదానం, ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి గోశాల‌కు తీసుకొచ్చిన కాంక్రీజ్‌, ఘిర్‌, సాహివాల్ జాతుల గోవుల‌తోపాటు పుంగ‌నూరు, ఒంగోలు జాతుల గోవుల‌ను ప‌రిశీలించి వాటి సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గోవ‌స‌తి షెడ్ల‌లో గోవుల‌కు ఆహ్లాదం క‌లిగించేలా ఏర్పాటుచేసిన సంగీతం బాగుంద‌ని, ఇక్క‌డ గోవుల‌కు నిరంత‌రం మేత, నీరు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 18 షెడ్ల‌కు గాను 4 షెడ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన 14 షెడ్ల నిర్మాణం వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. ఫీడ్‌మిక్సింగ్ ప్లాంట్ ప‌నులు డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గోశాల‌ను అందంగా ఉంచేందుకు, గోశాల‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులకు ఆహ్లాదక‌ర వాతావ‌ర‌ణం ఉండేలా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

           తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో దీపారాధ‌న‌, నైవేద్యాల త‌యారీకి అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి ఉత్ప‌త్తి చేసేందుకు సుమారు 600 గోవులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పారు. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు 100కు పైగా వివిధ దేశీయ‌జాతుల గోవుల‌ను స‌మ‌కూర్చుకున్నామ‌ని, మిగిలిన గోవుల‌ను దాత‌ల ద్వారా స‌మీక‌రించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యంతోపాటు దాని ప‌రిధిలోని క‌ళాశాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఎస్వీ గోశాల‌లో ఇంట‌ర్న్‌షిప్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనివ‌ల్ల విద్యార్థులకు ప‌రిజ్ఞానం పెర‌గ‌డంతోపాటు గోశాల‌కు వారి సేవ‌లు అందే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. జెఈవో  వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ప‌శువైద్య వ‌ర్సిటీ విస్త‌ర‌ణ సంచాల‌కులు డాక్ట‌ర్ వెంక‌ట‌నాయుడు పాల్గొన్నారు.

Tirumala

2022-07-15 12:48:08

ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలు, కాటన్ బ్యారేజీ ప్రాంతం వరద నీటితో మొత్తం జలమయం అయ్యాయి. ఎగువ గోదావరి నుంచి వరద నీరు దవళేశ్వరం కాటన్ బ్యారేకి రావడంతో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుండి ఏరియల్ సర్వే ద్వారా ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కలెక్టర్లు, జెసి, ప్రభుత్వానికి వరదలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి జరిపిన ఏరియల్ సర్వేలో వెంట రాష్ట్ర హోం మంత్రి  తానేటి వనిత తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-15 12:44:06

సీఎం వైఎస్.జగన్ కు ఆత్మీయ వీడ్కోలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం  ప్రత్యేక విమానంలో  విశాఖపట్నం చేరుకుని జగనన్న వాహాన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.  కార్యక్రమం అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి... ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటి మరియు పారిశ్రామిక శాఖ మాత్యులు గుడివాడ అమర్ నాథ్ , టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ,  నెడ్ క్యాప్ ఛైర్మన్ కె కె రాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్  సి. హెచ్. శ్రీకాంత్, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.  అనంతరం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో  ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్ చార్జ్ మంత్రి , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజనీ, సిఎంఒ కార్యదర్శి రేవు ముత్యాల రాజు తదితరులు బయలుదేరి వెళ్లారు. 

Visakhapatnam

2022-07-15 12:30:25

పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని భారీ వరదత నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని జెసి. జె వి మురళి కోరారు. లంక గ్రామాలు,లోతట్టు గ్రామాలు ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని  అన్ని వసతులు సమకూర్చడం జరిగిందని జిల్లా జాయింటు  కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఆచంట మండలం పలు గ్రామాలు ,పునరావాస కేంద్రాలను శుక్రవారం జిల్లా జాయింటు కలెక్టరు అధికారులతో కలసి పరిశీలించారు. యన్ డి ఆర్ యఫ్,యస్ డి ఆర్ యఫ్ , ఫైర్  సిబ్బంది సామాగ్రితో ఆచంట మండలంలోనే 35 మంది తమ సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రజలు  అధికారులు సూచనలు , సలహాలు పాటించి సహకరించాలని ప్రజలకు జాయింటు కలెక్టరు ధైర్యం చెప్పారు. ప్రజల ఇబ్బంది పడకుండా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఆచంట మండలంలో 15 గ్రామాలలో, ఆచంట మండలంలో పెద్దమల్లం లంక గ్రామానికి సంబంధించి పెద్దమల్లం చర్చి వద్ద రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, అనగారిలంక గ్రామానికి సంబంధించి ఎం పీ యు పి  స్కూల్ అనగారినిలంక,  పల్లిపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్ పల్లిపాలెం , అయోధ్య లంకకు సంబంధించి అయోధ్య లంక హరిజన పేట చర్చ్ అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి లో   పుచ్చలంక గ్రామానికి  సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనంలోనూ,   రావి లంక గ్రామానికి సంబంధించి రావిలంక కమ్యూనిటీ హాల్ లోను,  మర్రి మూల గ్రామానికి సంబంధించి మర్రిమూల ఎంపీ యు పీ స్కూల్ , చర్చిలోను ,  బద్దెవారిపేట లోని యం పి యు పి స్కూల్ లోను , నక్కిడిలంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్ నక్కిడిలంకలోను,  కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్  భీమలాపురం గ్రామంలోని రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని జాయింటు  కలెక్టరు  తెలిపారు. రిలీఫ్ కెంపులో ఉన్నకుటుంబానికి వెళ్ళేటప్పుడు  రూ.2,000 ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింటు కలెక్టరు కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో దాసి రాజు, తహశీల్దారు నజీ మున్నిసాకు,యం పి డి ఓ కె కన్నం నాయుడు, వివిధ శాఖలు అధికారులు ,తది తరులు పాల్గొన్నారు.

Achanta

2022-07-15 12:29:36

100ఏళ్లలో ఇంత భారీ వరదలు చూడలేదు

100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు ఉబయ గోదావరి జిల్లాల్లో గత 100 సంత్సరకాలంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున వరద నీరు వొచ్చే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేస్తున్నామని.. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి,సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియాల్ సర్వే లో భాగంగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, వరద తీవ్రత హెచ్చరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, ప్రజలను ముందస్తు చర్యలలో భాగంగా లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు సహకారం అందించి, స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం తక్షణ సహాయంగా 10 కేజీలు బియ్యం, ఇతర అత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో మందులు, త్రాగునీరు, దుప్పట్లు ఇతర సదుపాయలు కల్పించామన్నారు.

గతంలో ఎన్నో వరదలను చూసాము, మాకు ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దని, ఏ రాత్రి సమయంలో నైనా ఎవ్వరికీ అంచనాకు రాని స్థాయి లో వరద నీరు రావచ్చు నని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. త్రాగునీటి విషయంలో కాచి వడబోసిన నీటినే తాగలన్నారు. భద్రాచలం వద్ద 70 అడుగులు మించి నీరు ప్రవహిస్తోందన్నారు. ఇప్పటికే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, పశువుల కు గ్రాసం సిద్దం చేశామని తెలిపారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపు ప్రాంతాలలో దేవిపట్నం, చింతూరు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వరద నష్టాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధికారులు అంచనా వేసి, ఒక అంచనాకు వొచ్చి తదుపరి తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.

Rajamahendravaram

2022-07-15 10:11:33

ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ

తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతకంతకూ  వరద ప్రవాహం పెరుగుతుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ జేశారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 19.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తక్షణ సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ , కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అటు వరదల్లో చిక్కుపోయిన వారికి ఆహారాన్ని అందించేందుకు డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.


Rajamahendravaram

2022-07-15 06:34:50

కమిషనర్ ను మెప్పించిన ఎమినిటీ కార్యదర్శి

విధి నిర్వహణలో  ఓ సచివాలయ ఉద్యోగి చూపించిన అంకితభావం  అధికారుల ప్రశంసలు అందుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను పూర్తి చేయాలన్న  అతని తపన సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు తెలుసుకుంటే.. ఆర్.ఈశ్వర్ కాకినాడలోని 5A సచివాలయంలో ఎమినిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పండూరు లేఅవుట్ లో జియో టాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం లేదు. జియో టాగింగ్ చేయాలంటే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఓవైపు ఎడతెరిపిలేని వర్షం.. మరోవైపు ఆ వర్షం కారణంగా కేటాయించిన స్థలాల్లో నీరు నిలిచిపోవడం వంటి  ప్రతికూల పరిస్థితులు ఎదురుపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో బురద నీటిలోనే వెళ్లి జియోటాగింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన సమాచారం, ఫోటో అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ కే. రమేష్ ఏమినిటీ కార్యదర్శి ఈశ్వర్ ను ప్రత్యేకంగా అభినందించారు. పదిమందికీ ఆదర్శంగా నిలిచిన ఈశ్వర్ తరహా లోనే మిగిలిన ఉద్యోగులు కూడా కష్టించి పనిచేయాలని కమిషనర్ రమేష్ కోరారు.  ముఖ్యంగా లబ్ధిదారులు కూడా ముందుకు వచ్చి వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

Kakinada

2022-07-14 10:09:41

వరద పరిస్థితికి అనుగుణంగా ఏర్పాట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరంలో ప్రస్తుతం రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని,  మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే ఆచంట మండలంలోని 9 గ్రామాలు,  నర్సాపురం మండలంలోని 3  గ్రామాలు,  యలమంచిలి మండలంలోని 15 గ్రామాలకు వరద ప్రభావం  ఉండే అవకాశం ఉందని తెలిపారు.  7 ఎన్డిఆర్ఎఫ్ టీంలు, 5 ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ లను సిద్ధంగా ఉంచడం జరిగిందిన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఆచంట మండలంలో  పెద్దమల్ల లంకలో చర్చి, అనగారి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయుపి  స్కూల్,  పల్లెపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్,  అయోధ్య లంకకు సంబంధించి హరిజన పేట చర్చ్, అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి,  పుచ్చలంక గ్రామానికి  సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనం,  రవిలంక గ్రామానికి సంబంధించి  కమ్యూనిటీ హాల్,  మర్రి మూల గ్రామానికి సంబంధించి ఎంపీ యు పీ స్కూల్,  చర్చి ,  నక్కిడి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్,  కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్  భీమలాపురం గ్రామంలో  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్  తెలిపారు.

    అలాగే నరసాపురం మండలానికి సంబంధించి కొత్త నవరసపురం ఎంపీపీ స్కూల్,  పాత నవరసపురం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  లక్ష్మనేశ్వరం గ్రామానికి సంబంధించి రాజులంక డ్వాక్రా భవనంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  అలాగే ఎలమంచిలి మండలానికి సంబంధించి కనకాయలంక  ఆర్యవైశ్య కళ్యాణ మండపం తాటిపాక,  ఎంపీపీ స్కూల్ సాకలి పాలెం పి గన్నవరం మండలం, పెదలంకకు సంబంధించి జడ్పీహెచ్ఎస్ స్కూల్,  ఎంపీపీ స్కూల్ తాటిపాక రాజోలు మండలం, దొడ్డిపట్ల గ్రామానికి సంబంధించి జెడ్ పి హెచ్ స్కూల్, అబ్బిరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  బడవ గ్రామానికి సంబంధించి వైవి లంకలోని ఓల్డ్ ఏజ్ హోమ్,  ఏనుగుల వాని లంకకు సంబంధించి వైవి లంకలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్ ,  ఎలమంచిలి లంకకు సంబంధించి ఎంపీయుపీ స్కూల్,  లక్ష్మీ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, గంగడుపాలెం కు సంబంధించి ఎంపీపీ స్కూల్,  కట్టుపాలెం సంబంధించి ఎంపీయుపీ స్కూల్, బూరుగుపల్లి గ్రామానికి సంబంధించి ఎంపీయుపీ స్కూల్ ,  కేఎస్ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, నారిన మేరక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  వడ్డీ లంక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  సిరగాలపల్లి గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్ స్కూల్ లోను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివరించారు.

Bhimavaram

2022-07-14 09:59:33

శ్రీవారి వైభ‌వోత్స‌వాలకు విస్తృత ఏర్పాట్లు

నెల్లూరులో ఆగ‌స్టు 16 నుండి 20వ తేదీ వ‌ర‌కు 5 రోజుల పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో గురువారం వైభ‌వోత్స‌వాల ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు వైభ‌వోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఆక‌ట్టుకునేలా పైక‌ప్పుతో కూడిన వేదిక‌, భ‌క్తులు కూర్చునేందుకు గ్యాల‌రీలు, క్యూలైన్లు, ప్ర‌సాదాల కౌంట‌ర్లు, ల‌డ్డూ విక్ర‌య‌ కౌంట‌ర్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు, పోటు, సైన్‌బోర్డులు త‌దిత‌ర ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ‌లు, ప్ర‌త్యేక లైటింగ్‌, ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు, ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాల‌ని సివిఎస్వోను కోరారు. టిటిడిలో ఇటీవ‌ల చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌పై ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌ని కోరారు. ఈ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో జెఈఓలు స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో  ష‌ణ్ముఖ‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-14 09:35:23

భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తి గరిమెళ్ల

భారత స్వాతంత్రోద్యమానికి తన గేయాలతో శత్తువ తీసుకువచ్చి ప్రజల్లో దేళభక్తిని పెంపొందించిన చైతన్య స్ఫూర్తి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోథులు గరిమెళ్ల నత్యనారాయణ అని వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం గరిమెళ్ల 129వ జయంతి శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీ గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్‌మనోవార్‌నాయుడు మాట్లాడుతూ, జిల్లాకు చెందిన గరిమెళ్ల  స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పిలువునందుకొని తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. కవి, రచయిత, జర్నలిస్టుగా గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్ర్యకాంక్షను ప్రజల్లో రేకెత్తించే దిశగా మాకొద్దీ తెల్లదొరతనమంటూ నినదించారని కొనియాడారు. గరిమెళ్ల మన జిల్లాలో జన్మించడం అదృష్టమని పేర్కొన్నారు. భావితరాలకు స్వాతంత్రోద్యమ చరిత్రను అందించే దిశగా గాంధీమందిరం, స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనం ఎంతో చక్కగా రూపుదిద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వంద అడుగుల ఎత్తులో వ్రతిష్టించనున్న జాతీయ జెండా పనులను ఆయన పరిశీలించారు. తొలుత జాతిపిత మవోత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహ దాతలు, కొంక్యాన చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మురళీధర్‌, వేణుగోపాల్‌తో పాటు గాంధీ మందిర కమిటీ నిర్వాహకులు నటుకుల మోహన్‌, నిక్కు అప్పన్న మహిబుల్త్లాఖాన్‌, మెట్ట అనంతభట్లు, వందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, ఆచంట రాము, పొన్నాడ రవికుమార్‌, తర్జాడ అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు సాధు వైకుంఠం, మెకానిక్‌ మోహన్‌, కరమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-14 08:25:37