1 ENS Live Breaking News

క్రిష్ణ మెడికల్ సెంటర్ స్టాపర్స్ వితరణ..

రాజాం నగర పంచాయతీలో రోజు రోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, అలాగే కోవిడ్ కర్ఫ్యూ సమయంలోనూ కృష్ణా మెడికల్ సెంటర్ అందించిన ట్రాఫిక్ స్టాపర్స్ పోలీసులకు కు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని రాజాం సీఐ పి.శ్రీనివాసరావు  చెప్పారు.  
వైఎస్ఆర్సీపీ యువనేత, రేడియాలజిస్ట్, డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య సారధ్యంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో శ్రీకాకుళం, విశాఖలో సేవలందిస్తున్న కృష్ణా మెడికల్ సెంటర్ (కేఎంసీ) ద్వారా శుక్రవారం సాయంత్రం రాజాం పోలీసు స్టేషన్ కు స్టీల్ స్టాపర్స్ డివైడర్స్ని బహుకరించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్ నిధులతో) పటిష్ఠమైన విశాఖ స్టీల్ తో తయారు చేసిన ఈ డివైడర్లపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సెల్ఫోన్లో మాట్లాడుతూ. డ్రైవింగ్ చేయడం నేరం.. అతివేగం అనర్ధదాయకం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. తదితర నినాదాలను రాయించారు. రాజాం ప్రధాన కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణామెడికల్ సెంటర్ సీఇఓ ఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ వి శరత్ చంద్, ఎం చంద్రశేఖరరావు (చందు), కృష్ణా మెడికల్ సెంటర్ సిబ్బంది తెలుగు తరుణ్, కె బలరాం, సూరపు జయరామ్ తదితరులు పాల్గొన్నారు.

Razam

2021-06-11 12:20:27

పిల్లల తల్లులు తప్పక వేక్సిన్ వేయించుకోవాలి..

0-5 లోపు పిల్లల తల్లులు అపోహలు వీడి కోవిడ్ వేక్సిన్ తప్పక వేయించుకోవాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు. గురువారం శంఖవరం కోవిడ్ కేంద్రం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిన వివరాలతో జాబితా సిద్దం చేశామన్నారు. వాటి ఆధారంగా టీకాలు వేయిస్తున్నామని చెప్పారు. తల్లులంతా టీకా నమోదుకి అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించాలన్నారు. వేక్సిన్ కేంద్రాల వద్ద తల్లులంతా  తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఏ పనిచేసినా ముందు తరువాత చేతులు సబ్బుతో కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

Sankhavaram

2021-06-11 10:43:24

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

కరోనా సనయంలో దాతలు ముందుకు రావడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుపడుతుందని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాని పేర్కొన్నారు. శుక్రవారం   అత్యవసర వైద్యసేవలకు ఉపయోగించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉప ముఖ్యమంత్రి  వైద్యాధికారులకు పంపిణీ చేసారు. జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో వాటిని వైద్యులకు అందించారు. చిన్నమేరంగి, కురుపాం, భద్రగిరి, సాలూరు సామాజిక వైద్య కేంద్రాలకు, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో వినియోగానికై వీటిని ఉప ముఖ్యమంత్రి అందజేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనమేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సహకారంతో  ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 30 కాన్సన్ట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని వైద్యశాలల కోసం అందించినట్లు ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి తెలిపారు. వీటిలో 15 కాన్సన్ట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, భద్రగిరి, చిన్నమేరంగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఇస్తూ మిగిలిన వాటిలో సాలూరు సీ.హెచ్.సీకి 5, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 10 చొప్పున కాన్సన్ట్రేటర్లను అందించామన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించడానికి సహకరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి, ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కు ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో  పార్వతీపురం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వాగ్దేవి, డిప్యుటీ డిఎంహెచ్ఓ రవికుమార్ రెడ్డి, డా.కమల కుమారి(చిన్నమేరంగి), డా.ఉదయ్ కుమార్(భద్రగిరి), డా.గౌరీశంకర్ (కురుపాం) తదితరులు పాల్గొన్నారు.

జియ్యమ్మవలస

2021-06-11 08:51:31

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీస మేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణకు చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు ఎన్వీ రమణకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు
      చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు
     శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివకుమార్, శ్రీ డిపి అనంత , పార్థ సారధి రెడ్డి,సివి ఎస్వో  గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

    శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు అఖిలాండం వద్ద  కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ తో ఆయన మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి పని చేస్తానని ఆయన తెలిపారు.

Tirumala

2021-06-11 06:55:38

11.30వరకూ సత్యదేవుని దర్శనాలు..

అన్నవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రేపటి నుంచి ఉదయం 6గంటల నుంచి 11.30 గంటల వరకూ స్వామి దర్శనాలకు అనుమతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామి దర్శనాలతోపాటుుు కేశ ఖండన శాల కూడా పనిచేస్తుందన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనాలు చేసుకోవచ్చునన్నారు. శ్రీ స్వామివారి ఆర్జిత సేవల వ్రతములు, కల్యాణములు మొదలగు యధావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.

Annavaram

2021-06-10 14:21:51

అపోహలు వీడి టీకా వేయించుకోవాలి..

అపోహలకు లోను కాకుండా పిల్లల తల్లులు కోవిడ్ టీకా వేయించు కోవాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. గురువారం పెద్దాపురం డివిజన్ లోని రౌతులపూడి   కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వే లో పిల్లలకు కరోన వచ్చే అవకాశం ఉందని పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారం రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా  జిల్లాలో వైద్యపరంగా కరోనా ని ఎదుర్కొనేందుకు  అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా ఆరు నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు ఈ రోజు నుండి కరోనా టీకా వేయడం మొదలైందని చెప్పారు.  తప్పనిసరిగా తల్లులు టీకా వేయించుకొని తద్వారా వారి  పిల్లలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లుల పై ఉందని అన్నారు.   ఫస్ట్, సెకండ్  కరోనా కేసులలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి వీటిని జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా  ఎదుర్కోగలిగే మని కలెక్టర్ చెప్పారు. థర్డ్ వే లో కరోనా చంటి పిల్లలకు వచ్చే అవకాశం ఉందని సమాచారంతో  తల్లులు,వారి పిల్లలను  కాపాడుకోవడానికి ప్రతి తల్లులు టీకాలు వేయించుకోవాలని దీనిలో భాగంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యగా గైనకాలజిస్ట్, చంటి పిల్లల వైద్యుల వైద్యులు సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి, జిల్లాలో 25 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ను ఏరియా ఆసుపత్రిలో 30 పడకల, 50 పడకల కు సంబంధించి ప్రతి పడకు కు ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ద్వారా, ఆగస్టు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు   అదేవిధంగా వీటికి సంబంధించిన మందులు పరికరాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యసేవలు సంతృప్తి పరిచిందని చెప్పారు.  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తే , జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల  భారం తగ్గుతుందని అన్నారు   . జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు . టీకా వేయించుకోవడం వల్ల కరోనా రాకుండా ఉండడమే ,కాకుండా ఒకవేళ వస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను అనుసరించి కరోనాను అరికట్టడానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ముందు కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి వార్డులో  రోగులను కలిసి  వైద్య సేవలపై ఆరా తీశారు .
ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్ ఆస్పత్రి వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రౌతులపూడి

2021-06-10 10:23:06

సంక్షేమానికి చిరునామా సీఎం వైఎస్ జగన్..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంగళవారం యర్రగొండపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాడి రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను జవాబు దరితనముతో ఆమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఆమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబుల్, ఖురాన్ ,భగవద్గీతగా ముఖ్యమంత్రి తలచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎన్నికల్లో చెప్పినదాని కంటే పది రేట్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్ట్ ను వేగవంతం గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్కాపురం లో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం చర్యలు చేపట్టామాన్నారు. దోర్నాల లో గిరిజనుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ,మాతా శిశు వైద్య శాల ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండ పాలేం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తి రెడ్డి, దొంతా కిరణ్ గౌడ్, వై.సి.పి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Ongole

2021-06-08 13:19:31

100 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో మంగళవారం 100 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ చేస్తున్నామన్నారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-06-08 10:37:40

జూట్ మిల్ సమస్యను సత్వరమే పరిష్కరించాలి..

విజ‌య‌న‌గ‌రం జూట్ మిల్లు యాజ‌మ‌న్య ప్ర‌తినిధుల‌ను రప్పించి నెల్లిమ‌ర్ల జూట్ మిల్లు స‌మ‌స్య‌పై జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటుచేసి ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ను ఆదేశించారు. జూట్ మిల్లు స‌మ‌స్య ప‌రిష్కారం విష‌య‌మై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు జూట్ మిల్లు కార్మిక సంఘం నాయ‌కులు పి.అప్పారావు త‌దిత‌రులు మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌సయ్య క్యాంపు కార్యాల‌యంలో విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ డా.కిషోర్ కుమార్‌, కార్మిక‌శాఖ ఉప క‌మిష‌న‌ర్ పురుషోత్తంల‌ను అడిగి స‌మ‌స్య వివ‌రాల‌ను మంత్రి తెలుసుకున్నారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావుల‌తో క‌ల‌సి జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, ఇత‌ర అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య ప‌రిష్కారం జ‌రిగేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. ఇక్క‌డ ప‌రిష్కారం సాధ్యం కాని ప‌రిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.
జిల్లాలో నిర్మాణాల‌కు ఇసుక స‌ర‌ఫ‌రా సుల‌భ‌త‌రం చేసే ప‌ద్ధ‌తుల‌ను అన్వేషించాల‌ని మంత్రి బొత్స జాయింట్ క‌లెక్ట‌ర్ డా.కిషోర్‌ను ఆదేశించారు. ప్ర‌స్తుతం ఇసుక స‌ర‌ఫ‌రా అవుతున్న విధానంకంటే మ‌రింత మెరుగైన, సుల‌భ‌ రీతిలో ఇసుక పొందేలా విధానాలు రూపొందించే విధానాల‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తున్నామ‌ని, ఒక‌టి లేదా రెండు రోజుల్లో త‌యారు చేస్తామ‌న్నారు.
స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్‌, డి.సి.ఎల్‌.పురుషోత్తం త‌దిత‌రులు పాల్గొన్నారు.

2021-06-08 06:28:12

బలవర్థక ఆహారంతో మెరుగైన ఆరోగ్యం..

ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తుని మున్సిపల్ చైర్ పర్శన్ సుధ పిలుపునిచ్చారు. సోమవారం కోటనందూరు లోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ పద్మావతితో కలిసి వీటిని గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాకుండా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సరుకులన్నీ ఖచ్చితంగా వినియోగించి గర్భిణీలు, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. సీడిపీఓ పద్మావతి మాట్లాడుతూ, అమ్మ కడుపులో బిడ్డ తయారయ్యే సమయంలోనే ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా అందిస్తుందన్నారు. వీటితోపాటు పాలు, ఖర్చూరం, పల్లీ చిక్కీ, రాగిమాల్డ్, కోడిగ్రుడ్లను అందజేస్తున్నామన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ ను ద్రుష్టిలో పెట్టుకొని తల్లులు, పిల్లలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేసిన సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సర్పంచ్ శ్రీను, మహిళా పోలీసులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

Tuni

2021-06-07 13:19:47

పేదలను కష్టకాలంలో ఆదుకునేది సీఎం వైఎస్ జగన్ మాత్రమే..

నిరుపేదలను కష్టకాలంలో ఆదుకునేది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు అన్నారు  ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని క్యాంపు కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 41 మంది అనారోగ్య బాధితుల‌కు రూ.32,06,500 మేర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతోమందికి ఆప‌ద స‌మ‌యంలో ఆస‌రాగా నిలుస్తోందని, ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధపడుతున్న వారికి ఈ నిధి గొప్ప భ‌రోసా క‌ల్పిస్తోంద‌ని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం స‌హాయ నిధి ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ల‌బ్ధిచేకూరేలా కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు అందుతున్న అర్జీల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించి, స‌హాయం అందించేందుకు సీఎంఆర్ఎఫ్‌కు సిఫార్సు చేసేందుకు ప‌టిష్ట యంత్రాంగం రాష్ట్రంలో ప‌నిచేస్తోంద‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు.

2021-06-07 10:46:02

రెండు లేయర్ల మాస్కుల ధారణ శ్రేయస్కరం..

కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రెండు లేయర్లు ఉన్న నాణ్యమైన మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని సిడిపీఓ బి.ఊర్మిళ సూచిస్తున్నారు. సోమవారం ఈ మేరకు శంఖవరంలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలు ఎప్పటికప్పుడు గర్భిణీస్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య విషయంలో తల్లులకు కరోనా వైరస్ పైట్ల జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేయాలన్నారు. ఖచ్చితంగా బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బయటకు రావొద్దని, ఏ అవసరం వున్నా అంగన్వాడీల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.  కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు ఎక్కడా గుంపులు గుంపులుగా చేరి సమావేశాలు పెట్టుకోకూడదన్నారు.  ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని ఊర్మిళ సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-06-07 05:24:42

20 మందికి కోవిడ్ 19 వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో శనివారం 20 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా జారీచేసిన టోకెన్లను ఆన్ లైన్ చేసిన తరువాత వేక్సిన్ నేషన్ పూర్తిచేసినట్టు చెప్పారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-06-05 12:28:24