1 ENS Live Breaking News

ఉపాది పనులతో గిరిజనులకు లబ్ది..

విశాఖ మన్యంలోని అన్ని గిరిజన గ్రామాల్లో ఉపాది పనులతో గిరిజనులకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం వంట్లమామిడిలో ఉపాధి హామి పధకం క్రింద వంట్ల మామిడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేపట్టిన వ్యవసాయ భూమి చదును పనులు 15 ఎకరాల విస్తీర్ణంలో జరుగుచున్న పనులను ఆయన పరిశీలించారు. అక్కడ వున్న ఉపాధి కూలీలతో మాట్లాడుతూ  SSS గ్రూపు లతో వున్నవారంతా పనులకు హాజరు కావలసినదిగా కోరారు. అనంతరం ఉద్యానవన తోటల పెంపకానికి సంబంధించి జీడి తోటలను క్షేత్ర స్థాయిలో స్వయంగా ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇఇ ట్రైబల్ వెల్ఫేర్ కుమార్,డిడి విజయ్ కుమార్ డిఇ అనుదీప్,ఎటిడ్ల్యు రజని తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2021-06-19 15:30:25

పీహెచ్సీలో వైద్యసేవలు మెరుగుపరచాలి..

విశాఖ ఏజెన్సీలోని అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా గరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందాలని ఐటిడిఏ పీఓరోణంకి గోపాలకృష్ణ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం పీఓ  మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వున్న పిహెచ్సి డా. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంతవరకు మండలంలోని ఎన్ని గ్రామాలవారికి కోవిడ్ టీకా లు వేసారని ఆరా తీశారు. ఇంతవరకూ 4,000 మందికి వేసామని డాక్టర్ పీఓకి వివరించారు. హాజరు పట్టిక చూసి ఈ రోజు విధులకు ఎంతమంది వచ్చారో వారిని పేరు పేరునా పిలచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ, గిరిజనులకు వైద్యసేవలు అందించడంతోపాటు, పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల గిరిజనులకు, 0-5 పిల్లల తల్లులకు వేక్సిన్ అందించాలన్నారు. ఈ విషయంలో స్థానిక సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు.

Minumuluru

2021-06-19 15:25:14

ఐటిడిఏ పీఓకి శస్త్ర చికిత్స..

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి కూర్మనాధ్ కు ఉదయం ఏరియా ఆసుపత్రిలో డి.సి.హెచ్.ఎస్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆర్.కూర్మనాథ్ ప్రోజెక్ట్ అధికారికి వీపు పై ఫెవిషి యష్ సిస్త (చిన్న కాయ) సుమారు 30 నిమిషాల పాటు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆధికారి మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో  శస్త్ర చికిత్స నిర్వహించేందుకు ఆధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని, చాలా త్వరగా శస్త్ర చికిత్స  నిర్వహించారని, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు సేవలు అందించు నిమిత్తం ఉన్న ఆధునాతన పరికరాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు  అందుబాటులో ఉన్నాయని సామాన్య ప్రజలు ఈ సేవలను వినియోగించు కావాలని హితవు పలికారు.

Parvathipuram

2021-06-19 14:51:15

6వరకూ బంగారమ్మ తల్లి దర్శనాలు..

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థాన ఉపాలయం  బంగారమ్మఅమ్మవారి వార్షిక గ్రామ పండగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల వరకూ దర్శనాలు కల్పిస్తామని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు  దర్శనం కల్పించాలని  నిర్ణయించామన్నారు. శనివారం ఈ మేరకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఈఓ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడుతూ, పండగ రోజు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున  క్యూలైన్ల పర్యవేక్షణకు అవసరమయ్యే  సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కరోనా కేసులు అధికంగా వున్నందున భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ఈఓ తెలియజేశారు.

Simhachalam

2021-06-19 14:40:01

భూరక్షణ పథకంతో రైతులకి మేలు..

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పధకంతో రైతులకు మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, దేవరపల్లి అగ్రహారం గ్రామంలోని భూముల రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 114 ఏళ్ళ క్రితం బ్రిటీషు వారి పాలనలో  భూములను సర్వే చేశారన్నారు. ప్రస్తుతం రైతుల పొలాల హద్దుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో భూముల రీసర్వేపై ఫైలెట్ ప్రాజెక్ట్ కింద దేవరపల్లి అగ్రహారం గ్రామాన్ని తీసుకోవడం జరిగింద న్నారు. ఈ గ్రామ రైతులు భూముల రీసర్వే ఫైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమానికి  సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మొత్తం 165 ఎకరాల పొలం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు. ప్రభుత్వ భూమి సుమారు 20 ఎకరాల మేరకు కెనాల్ రహదారులు, డొంక, స్మశాన వాటిక భూములు  ఉన్నాయన్నారు. గ్రామ కంఠం కింద 2ఎకరాల 50 శెంట్లు, రైల్వే లైనుకింద 08.94 ఎకరాలు, ఆర్ అండ్ బి రహదారులకు 03.21 ఎకరాలు ఉన్నాయని అన్నారు.  గ్రామ హద్దుల కింద 53 రాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల కింద 55 హద్దు రాళ్ళను వేసినట్లు పేర్కొన్నారు. గ్రామ కంఠం కింద 10 రాళ్ళు వేశారన్నారు. ఈ గ్రామంలో మొత్తం 75 ఇల్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు కొందరు స్థానికంగా ఉన్న సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  డిప్యూటి కలెక్టర్ కె.ఆర్.ఆర్.సి ప్రాజెక్ట్ అధికారి టి.భాస్కరనాయుడు, దుర్గిరాల తహాశీల్ధారు కె. మల్లేశ్వరి, డిప్యూటి సర్వేయర్ టి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Duggirala

2021-06-19 14:18:51

బ్యాంక్ ఆఫ్ బరోడా కాన్సంట్రేటర్ల వితరణ..

కోవిడ్ రెండోద‌శ‌లో రోగుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో సామాజిక బాధ్య‌త‌గా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా జిల్లాకు అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం క‌లెక్ట‌రేట్‌లో బ్యాంకు ప్ర‌తినిధులు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి దాదాపు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అంద‌జేశారు. కోవిడ్ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న బాధితుల‌కు ప్రాణ‌వాయువును అందించేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (గృహ నిర్మాణం) ఎ.భార్గ‌వ్ తేజ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం యూనిట్ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ ఎంవీఎస్ సుధాక‌ర్, చీఫ్ మేనేజ‌ర్ పి.ప‌కీర్‌, క్రెడిట్ మేనేజ‌ర్ ఎం.కృష్ణ‌మోహ‌న్‌, మేనేజ‌ర్లు ఎం.చిన్నారావు, పి.ర‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.
(స‌మాచార శాఖ జారీ)

........................
.........................
ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌
కాకినాడ‌, జూన్ 19, 2021

రాక్ సిరామిక్స్ సంస్థ జిల్లాకు సామాజిక బాధ్య‌త‌గా నాలుగు ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సంస్థ ప్ర‌తినిధులు శ‌నివారం ఉద‌యం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిసి కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. కోవిడ్ రోగుల‌కు చికిత్స స‌మ‌యంలో ఆక్సిజ‌న్‌ను అందించేందుకు ఉపయోగ‌ప‌డే కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన రాక్ సిరామిక్స్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. రూ.5 లక్ష‌ల వ్య‌యంతో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తో పాటు పీపీఈ కిట్లు, హ్యాండ్ శానిటైజ‌ర్లు, సోడియం హైపో క్లోరైట్ తదిత‌రాల‌ను అందించిన‌ట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, సంస్థ వైస్ ప్రెసిడెంట్-ఆప‌రేష‌న్స్ ఎస్ఎస్ యాద‌వ్‌, హెచ్ఆర్ హెడ్ నీర‌జ్ కుమార్‌, ఈహెచ్ఎస్ మేనేజ‌ర్ పి.బాలాజీ, పీఆర్ మేనేజ‌ర్ వీజీఎస్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-19 09:54:32

వాట్సప్ సందేశానికి స్పందించిన కలెక్టర్..

ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం ఎన్నొ సంవత్సరాలుగా  ఇబ్బందులు పడుతున్న మానసిక వికలాంగురాలుకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చొరవతో మండలస్థాయి అధికారులు వికలాంగురాలు ఇంటికే వెళ్ళి ఒక్క రోజులోనే  సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే దాచేపల్లి మండలం నారాయణ పురం గ్రామంలో∙బొడ్డు చిన్నా (28) పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. మంచానికే పరిమితమైన బొడ్డు చిన్నా అక్క శాంతి లక్ష్మీ అన్నీ బాగోగులు చూసుకుంటుంది. చెల్లెలు బొడ్డు చిన్నాకు ఆధార్ కార్డు ఎన్రోల్ చేసినప్పటికీ ఆధార్ కార్డు  సాంకేతిక కారణంగా జారీ కాలేదు.  ఆధర్ కార్డు యాక్సిస్ కానందున ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా ఉంది.   ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం  అక్క శాంతి లక్ష్మీ  గ్రామం సమీపంలోని  ఆధార్ సెంటర్లుకు ఎన్నో సార్లు తీసుకు వెళ్లినా సెంటరు నిర్వహకులు ఆధార్ కార్డు నమోదుకు తిరస్కరించారు. ఈ విషయమై సహాయం చేయాల్సిందిగా  శాంతి లక్ష్మీ శుక్రవారం (18.06.2021) ఉదయం  సామాజిక మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారి దృష్టికి తీసుకు రావటం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బొడ్డు చిన్నా ఆధార్ కార్డు  సాంకేతిక సమస్యను పరిష్కరించాలని దాచేపల్లి మండలం రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం దాచేపల్లి మండల ఇన్చార్జి  తహశీల్దారు వెంకటేశ్వర నాయక్ రెవెన్యు నారాయణపురం గ్రామంలోని బొడ్డు చిన్నా ఇంటికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగురాలు బొడ్డు చిన్నాను సమీప మీ సేవా కేంద్రానికి తీసుకువెళ్ళి ఆధార్ ఆధార్ కార్డు ఎన్రోల్ చేయటం జరిగింది. పది చేతివేళ్ళుకు గాను తొమ్మిది చేతి వేళ్ళు క్యాప్చర్ చేయబడింది. ఈ సందర్భంగా అక్క శాంతి లక్ష్మీ మాట్లాడుతూ తన చెల్లెలి  ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం 2013 సంవత్సరం నుంచి  గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎంతో మంది అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా,  ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి శుక్రవారం ఉదయం సామాజిక మాధ్యమం ద్వారా సమస్యను తెలియచేసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మానవతా దృక్పథంతో అధికారులనే ఇంటికి పంపి మా చెల్లెలు ఆధార్ కార్డు సమస్యను పరిష్కరించినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

Guntur

2021-06-18 15:57:11

శుక్రవారం చందన లభ్యత 29 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా శుక్రవారం మొత్తం 29 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించిన తరువాత  ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

Simhachalam

2021-06-18 15:49:42

పైడి తల్లమ్మతల్లికి రూ.50 విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థాన ఉప ఆలయం పైడితల్లమ్మ అమ్మవారికి సింహాచలానికి చెందిన భక్తులు రూ.50వేలను విరాళంగా ఇచ్చారు. బుడిమధ్య రామకృష్ణ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అమ్మవారికి అందించినట్టు దాతలు తెలియజేశారు. ఆ మొత్తాన్ని ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళకు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. దాతల విరాళంతో అమ్మవారి ఆలయాన్ని అభివ్రుద్ధి చేస్తామని ఈఓ తెలియజేశారు.

Simhachalam

2021-06-18 14:28:51

ఆక్వాహబ్ ల ఏర్పాటుకి ఆహ్వానం..

మత్స్య ఉత్పత్తి, స్థానిక తలసరి వినియోగాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఆక్వాహబ్ ల ఏర్పాటుకి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు  మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. గురువారం ఈ మేరకు తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ ఉత్పత్తులు మాదిరిగానే ఇపుడు మత్స్య ఉత్పత్తులను కూడా ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నారు. దీనికోసం రిటేల్ ఔట్ లెట్లు, ఫిష్ కియోస్క్, ఆక్వాహబ్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ల ను ఏర్పాటు చేయనున్నామన్నారు.   ఆన్ లైన్ లో  https://ematsyakar.com/efisher/retailunits ను సందర్శించి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అటు వీటికి సంబంధించిన దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు apfishdomesticmktg@gmail.com లోగానీ,8247586549, 9908603882లో గాని సంప్రదించాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మల కుమారి కోరుతున్నారు.

Vizianagaram

2021-06-17 08:45:49

వైద్యసిబ్బందిని ప్రభుత్వం ఆదుకుంటుంది..

కరోనా వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వైద్య‌, ఆరోగ్య సిబ్బంది కుటుంబాల‌ను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లుచేస్తున్నార‌ని తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని స‌ఖినేటిప‌ల్లి మండ‌లం మోరి గ్రామానికి చెందిన డాక్ట‌ర్ కందిక‌ట్ల రోజి ఏలూరులోని ఆశ్ర‌మ్ వైద్య క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసి, అక్క‌డే హౌస్ స‌ర్జ‌న్ చేస్తూ కోవిడ్ రోగుల‌కు సేవ‌లందిస్తూ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత మోరిలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి జూన్ 1వ తేదీన మ‌ర‌ణించారు. కోవిడ్ బాధితుల ప్రాణాల‌ను కాపాడే క్ర‌మంలో అదే వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించిన రోజి కుటుంబాన్ని ఆదుకునే క్ర‌మంలో గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రోజి సోద‌రుడు రాకేశ్‌కు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) కింద రూ.25 ల‌క్ష‌ల చెక్కును బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అందించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు వైద్య‌, ఆరోగ్య‌; పోలీస్‌, రెవెన్యూ ఇలా వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన సిబ్బంది వైర‌స్ బారిన‌ప‌డుతున్నార‌ని, దుర‌దృష్ట‌వ‌శాత్తు కొంద‌రు మ‌ర‌ణిస్తున్నార‌ని తెలిపారు. ముఖ్యంగా ప్ర‌త్య‌క్షంగా రోగుల‌కు వైద్య సేవ‌లు అందించే క్ర‌మంలో వైద్య‌, ఆరోగ్య శాఖ సిబ్బంది వైర‌స్ బారిన‌ప‌డుతున్నారని, వీరిలో కొంద‌రు మ‌ర‌ణించ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఇలా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటూ, బాధిత కుటుంబ స‌భ్యుల‌కు భ‌రోసా క‌ల్పిస్తోంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్న డా. రోజి కుటుంబానికి ప్ర‌భుత్వం ఆర్థిక స‌హ‌కారం అందించిన‌ట్లు క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు: క‌ందిక‌ట్ల రాకేశ్‌:
కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వైద్యురాలు రోజి సోద‌రుడు రాకేశ్ మాట్లాడుతూ సంఘ‌టన గురించి తెలిసిన వెంట‌నే స్పందించి మా కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన గౌర‌వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. రెండు రోజుల్లోనే క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక స‌హ‌కారాన్ని అందేలా చేశార‌ని పేర్కొన్నారు. కోవిడ్ విభాగంలో విధులు నిర్వ‌హిస్తూ వైర‌స్ బారిన‌ప‌డిన చెల్లెమ్మ రోజి కోవిడ్‌తో పోరాడి మ‌ర‌ణించిన‌ట్లు రాకేశ్ వెల్ల‌డించారు. 2006లో తండ్రి మ‌ర‌ణించార‌ని, ఇప్పుడు సోద‌రి మ‌ర‌ణం తీవ్ర ఆవేద‌న‌ను మిగిల్చింద‌న్నారు. క‌ష్ట‌కాలంలో త‌మ కుటుంబానికి అండ‌గా నిలిచిన క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు, అధికారులు, సిబ్బందికి కూడా ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-16 12:19:40

భూములు పరిశీలించిన జెసీ లక్ష్మీషా..

రవాణాశాఖ కార్యాలయానికి అనువైన భూములను గుర్తిస్తున్నట్టు జెసి లక్ష్మీషా తెలియజేశారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు గిడ్డంగి భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రభుత్వ ఖాళీ స్ధలాలను ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, రెవిన్యూ అధికారులతో కలిసి జెసి పరిశీలించారు. ఇందుకోసం శంఖవరంలోని అరుంధతీయ కాలనీకి, వాణీనవ దుర్గాదేవి ఆలయానికీ మధ్య ఉన్న ప్రభుత్వ ఖాళీ భూమిలో నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ జెసికి  ప్రతిపాదించారు. ఈభూమిని గతంలోనే
 గతంలోనే దేవాదాయ ధర్మాదాయశాఖ  నుంచి రెవెన్యూ శాఖ కొనుగోలు చేసినట్టు జెసికి ఎమ్మెల్యే వివరించారు. అంతేకాకుండా ఈ రెండు తరహా భూముల్లోనూ ఆయా శాఖల భవనాల నిర్మాణానికి నిర్ణయిస్తూ  గతంలోనే తహశీల్దార్ ప్రభుత్వికి ప్రతిపాదనలు కూడా పంపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ మల్లిబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, సర్వేయర్ సురేష్, వీఆర్వో సీతారాం తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2021-06-15 14:04:44

ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేయాలి..

లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేసి.. నిర్ణీత గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం రాజధాని నుండి.. "భవన నిర్మాణ పక్షోత్సవాలు", "జగనన్న పచ్చతోరణం" "జగనన్న స్వచ్ఛ సంకల్పం" తదితర కార్యక్రమాల కార్యాచరణపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది, సంక్షేమం)తో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక  కలెక్టరేట్లోని  విసి హాలు నుండి జేసీలు  సిరి ,గంగాధర్ గౌడ్, హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. రానున్న 15 రోజులు అధికారులకు అత్యంత కీలకం అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో.. ఈ నెల 17వ తేదీ నుండి జులై 2వ తేదీ వరకు "భవన నిర్మాణ పక్షోత్సవాలు" నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా.. ఆయా జిల్లాల్లోని గ్రామ సచివాలయాల పరిధిలో నిర్మించ తలపెట్టిన, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్ర భవనాలను.. నిర్ణేత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించా లన్నారు. జులై 8వ తేదీలోపు రైతు భరోసా కేంద్రాలను, జులై 31వ తేదీలోగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా చేపడుతున్న ఉద్యాన వన మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలకు నిర్ణయించిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. "జగనన్న పచ్చతోరణం" కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో, రైల్వే పరిసరాలు, రోడ్లు తదితర సామాజిక ప్రదేశాలతో పాటు.. ప్రైవేటు భూముల్లో కూడా విరివిగా మొక్కలను నాటి.. పచ్చదనాన్ని పెంచాలన్నారు. 

జులై 8న రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న.. "జగనన్న స్వచ్ఛ సంకల్పం" కార్యక్రమంను విజయవంతం చేసేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి వ్యవస్థ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు.. బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా.. డివిజనల్ పంచాయతీ అధికారులు, అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. సంబందిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు ఎంపిడివోలు, వారివారి గ్రామీణ స్థాయి సిబ్బంది చేత.. పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగు పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావాలన్నారు. 

అనంతరం జేసీ   సిరి మాట్లాడుతూ... జిల్లాలో  గ్రామ, వార్డు సచివాలయ భవన నిర్మాణాలకు 300 సంబంధించి..  ఇప్పటికే  వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే 30% పైగా పూర్చి చేయడం జరిగిందని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణ పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు.  నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

"జగనన్న స్వచ్ఛ సంకల్పం" కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో పరిశుద్యంపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా.. పంచాయతీరాజ్, డ్వామా, డీఆర్డీఏ, సచివాలయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామ, వార్డు, మండల స్థాయి టీములుగా ఏర్పడి... ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. . ఈ కార్యక్రమంలో డ్వామా పిడి,   పంచాయతీ రాజ్ శాఖ  సూపర్డెంట్ ఇంజనీరు, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-14 15:09:42

BMSఆంధ్ర రాష్ట్ర నూతన కార్యవర్గమిదే..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రకార్యవర్గాన్ని బిఎంఎస్ సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దురైరాజు ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించిన 3వ రాష్ట్ర మహా సభల సందర్భంగా ప్రకటించారు. ఏపీ అధ్యక్షుడిగా ఎం.శ్రావణ్ కుమార్(గుంటూరు), ఉపాధ్యక్షులుగా ఖాధర్ భాషా(నెల్లూరు), ఉన్ని క్రిష్ణ(తూర్పుగోదావరి), పద్మావతి(అనంతపురం), జనరల్ సెక్రటరీగా ఎంవీఎస్ నాయుడు(విశాఖపట్నం), డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బి.రమేష్(కడప), కార్యదర్శిలుగా మహేష్ సింగ్(పశ్చిమగోదావరి), సుబ్రమణ్యంరెడ్డి(తిరుపతి), కొల్లా భవాని(గుంటూరు),అద్దంకి సాంభశివరావు(క్రిష్ణాజిల్లా), ట్రజరర్ గా ఎల్.ప్రసాద్(విశాఖపట్నం), మరో 13 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని నియమించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్ర కార్యవర్గ మంతా జాతీయ కార్యవర్గానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు జరిగిన మహాసభలో బిఎంఎస్ చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి వారి అభివ్రుద్ధికి తోడ్పాటునందించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బిఎంఎస్,బిటిఈయూ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-13 15:09:33

కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సాదర వీడ్కోలు..

తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం ఉ.11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ వారికి సాదర వీడ్కోలు లభించింది. ర్రాష్ట ఆర్థిక , ప్రణాళిక , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ , తిరుపతి ఎంపి గురుమూర్తి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎస్. ఎస్.రావత్ ఐ.ఎ. ఎస్, రైల్వే జి.ఎం. గజానన మాల్యా, డిఆర్ఎం అలోక్ తివారీ,ఎయిర్ పోర్ట్ ఎపిడి ఎస్.సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, టర్మీనల్ మేనేజర్ గోపాల్ , తహసీల్దార్ శివప్రసాద్ ,బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, అధికారులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.

Renigunta

2021-06-13 10:17:44