1 ENS Live Breaking News

Vijayawada

2021-06-25 13:03:49

కరోనా టీకాకి ప్రజలు ముందుకి రావాలి..

కరోనా వైరస్ నియంత్రణకి ప్రతీ ఒక్కరూ సహకరించి టీకా వేయించుకోవడానికి ముందుకి రావాలని శంఖవరం ఈఓపీఆర్డీ కెవివిఎస్ విశ్వనాధ్, పంచాయతీ కార్యదర్శి రామచంద్రమూర్తి(రాంబాబు) పిలుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ హైస్కూలులో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సిన్ కేంద్రంలోని టీకా పంపిణీ కార్యక్రమాన్ని వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ప్రభుత్వం 5ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ లో ప్రధాన్యత ఇస్తుందన్నారు. థర్ఢ్ వేవ్ ని ద్రుష్టిలో పెట్టుకొని పిల్లల తల్లులందరికీ వేక్సిన్ వేస్తున్నామన్నారు. అదేవిధంగా మొదటి డోసు తీసుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండో డోసు కూడా వేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ నిభందనల మేరకు వేక్సినేషన్ వేయించుకోవాలన్నారు. పీహెచ్సీవైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ మాట్లాడుతూ, కరోనా నిబంధనలు అనుసరించి వేక్సినేషన్ చేపడుతున్నామన్నారు.  ఈరోజు సెషన్ లో 200 మందికి కోవిడ్ టీకాలు వేసినట్టు డాక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం2,3 కార్యదర్శి శంకరాచార్యులు, సత్య, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-06-24 17:19:47

ల్యాబ్ పనులు పరిశీలించిన జెసి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని బొండ‌ప‌ల్లి మండ‌లం నెలివాడ వ‌ద్ద నిర్మాణంలో జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ నిర్మాణాన్ని జాయింట్ క‌లెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ గురువారం ప‌రిశీలించారు. రూ.3.63 కోట్ల వ్య‌యంతో రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో దీని నిర్మాణాన్ని చేప‌ట్టారు. అయితే ఈ భ‌వ‌న నిర్మాణం ఎలివేష‌న్‌కు సంబంధించి కొన్ని స‌మ‌స్యలు ఏర్పడ‌టంతో ఇటీవ‌లి కాలంలో నిర్మాణం ప‌నులు నిలిచిపోయాయి. వాటిని ప‌రిష్కరించి ల్యాబ్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసే ల‌క్ష్యంతో శుక్రవారం జాయింట్ క‌లెక్టర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఏపి పోలీసు హౌసింగ్ కార్పొరేష‌న్ ఇంజ‌నీర్లు, వ్యవ‌సాయ అధికారుల‌తో త‌న ఛాంబ‌రులో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో జె.సి. డా.కిషోర్ కుమార్ గురువారం నిర్మాణంలో ఉన్న ల్యాబ్ భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. ల్యాబ్ నిర్మాణం ప‌నులు దాదాపు 65 శాతం వ‌ర‌కు పూర్తయ్యాయ‌ని వ్యవ‌సాయ శాఖ ఏ.డి. మ‌హ‌రాజ‌న్ జె.సి.కి వివ‌రించారు. ఈ ప‌ర్యట‌న‌లో భాగంగా బొండ‌ప‌ల్లి మండ‌లంలో క‌నిమెర‌క‌, బొండ‌ప‌ల్లిలో నిర్మాణంలో ఉన్న రైతుభ‌రోసా కేంద్రాల‌ను జాయింట్ క‌లెక్టర్ డా.కిషోర్ కుమార్ ప‌రిశీలించారు. జూలై 8న ఈ భ‌వ‌నాల‌ను ప్రారంభించేందుకు సిద్ధం చేయాల‌ని వ్యవ‌సాయ అధికారి ర‌వీంద్రను ఆదేశించారు.

Neliwada

2021-06-24 10:47:48

స‌చివాల‌యాల ప్రారంభోత్స‌వం..

భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్స‌వాల్లో భాగంగా ఎమ్మెల్యే డా. స‌త్తిసూర్య‌నారాయ‌ణ‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ (గృహ నిర్మాణం) ఎ.భార్గ‌వ్ తేజ త‌దిత‌రుల‌తో క‌లిసి బిక్క‌వోలులో రూ.25 లక్ష‌ల‌తో నిర్మించిన గ్రామ స‌చివాల‌యం-1, రూ.40 ల‌క్ష‌లు ఖ‌ర్చుతో నిర్మించిన గ్రామ స‌చివాల‌యం-3 భ‌వ‌నాల‌కు కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభోత్స‌వం చేశారు. అనంత‌రం స‌చివాల‌య సిబ్బందితో మాట్లాడి.. విధుల నిర్వ‌హ‌ణ‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు అందుబాటులోకి వ‌చ్చినందున మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లందించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా కీల‌కైన రెండు ముఖ్య భ‌వ‌నాల‌కు నేడు ప్రారంభోత్స‌వం చేయ‌డం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ఈ జిల్లాలోని క‌ర‌పలో 2019, అక్టోబ‌ర్ 2న తొలి గ్రామ స‌చివాల‌యాన్నిప్రారంభించార‌ని, అప్ప‌టి నుంచి స‌చివాల‌య సిబ్బంది అంకితభావంతో ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నార‌ని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా శాశ్వ‌త భ‌వ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. వీటితోపాటు రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ యూనిట్లు త‌దిత‌రాలకు కూడా శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే డా. స‌త్తిసూర్య‌నారాయ‌ణ‌రెడ్డి కృషితో భ‌వ‌నాల నిర్మాణాలు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, రామ‌చంద్రాపురం ఆర్‌డీవో పి. సింధు సుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, బిక్క‌వోలు స‌ర్పంచ్ స‌రెళ్ల సుమ‌ల‌త‌, త‌హ‌సీల్దార్ కె.వెంక‌ట మాధ‌వ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Bikkavolu

2021-06-24 10:30:48

నిర్మాణ పనులు స‌త్వర‌మే పూర్తిచేయాలి..

ఉపాధి నిధుల అనుసంధానంతో గ్రామాల్లో చేప‌ట్టిన ప్రభుత్వ భ‌వ‌నాల నిర్మాణాల‌ను సత్వర‌మే పూర్తిచేయాల‌ని జాయింట్ క‌లెక్టర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మండ‌ల స్థాయి ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్సవాల్లో భాగంగా జె.సి. జె.వెంక‌ట‌రావు గురువారం కొత్తవ‌ల‌స మండ‌లంలోని వీర‌భ‌ద్రపురం, వియ్యంపేట, తుమికాప‌ల్లి, కాట‌కాప‌ల్లి గ్రామాల్లో ప‌ర్యటించారు. ఈ గ్రామాల్లో నిర్మాణంలో వున్న గ్రామ స‌చివాల‌యాలు, వెల్ నెస్ సెంట‌ర్లు, రైతుభ‌రోసా కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ సెంట‌ర్ భ‌వ‌నాల‌ను మండ‌ల‌స్థాయి అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. వాటి నిర్మాణ ప‌రిస్థితుల‌ను, ఎప్పటికి పూర్తవుతాయ‌నే అంశాల‌పై చ‌ర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన గ‌డువులోగా భ‌వ‌న నిర్మాణాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తిచేయాల‌ని, అదే స‌మ‌యంలో భ‌వ‌న నిర్మాణాల్లో నాణ్యత విష‌యంలో రాజీలేకుండా వ్యవ‌హ‌రించాల‌న్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భ‌వ‌నాల నిర్మాణాన్ని వేగ‌వంతం చేసేందుకు భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్సవాలు ప్రభుత్వం చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గ్రామాల్లో ప‌ర్యటించి వాటి ప్రగ‌తిని స‌మీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ ప‌ర్యట‌న‌లో త‌హ‌శీల్దార్ ఎస్‌.ర‌మ‌ణ‌, మండ‌ల ఇంజ‌నీరింగ్ అధికారి, ఇ.ఓ.పి.ఆర్‌.డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-24 10:18:59

Simhachalam

2021-06-24 07:04:02

ఉద్యాన పంటలతో ఎంతో మేలు..

ఉద్యాన పంటలతోనే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఐటిడిఏ కూర్మనాథ్ పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు తన కార్యాలయంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఉద్యాన శాఖ, సబ్ ప్లాన్ మండలాల పి.ఓ లు, ఉద్యాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఉద్యాన పంటలపై నేటికీ నిర్వహిస్తున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు పొందిన లబ్ధిదారులు అందరికి ఉద్యాన పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అందులో భాగంగా రేపటి నుండి సబ్ ప్లాన్ మండలాలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని లబ్ధిదారులు గ్రామ సభలకు హాజరయ్యే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సభలో ఉద్యాన పంటలపై లబ్ధిదారులు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.  అనంతరం  జూలై 1 వ తేదీ నుండి జీడి మామిడి, జామా, మామిడి మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాలని . అందు నిమిత్తం ప్రతి మండలంలో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పి. ఎ లు, పి.ఓ లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు సమన్వయంతో విధులు నిర్వహించి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉద్యాన ఆధికారులు మొక్కలు పరీక్షించి మేలుజాతి మొక్కలు లబ్ధిదారులకు అందజేయాలని, జూలై 30 నాటికి జియో టేగింగ్ పూర్తి కావాలని ఆదేశించారు.
           ఈ సమావేశంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఎ.పి.డి శ్రీహరి, పి.హెచ్.ఓ. చిట్టిబాబు, సబ్ ప్లాన్ మండలాల ఉద్యాన ఆధికారులు,  పి.ఓలు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-06-23 15:34:33

రైతులకు సాగునీరు అందాలి..

రైతులకు సాగునీరు సక్రమంగా అందేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. సాగునీటి కాలువలకు భంగం కలగరాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సాగునీటి పారుదలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ శ్రీకేష్  అన్నారు. బుధవారం నరసన్నపేట మండలం పోతయ్య వలస వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాగునీటి కాలువలను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా నరసన్నపేట మండలం దేసవానిపేట, పోలాకి మండలం దీర్ఘశీ, డోల తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఇటీవల కోమర్తి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కనపల శేఖర్ రావు సాగునీటి కాలువల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వంశధార ఎస్ఇ డోల తిరుమలరావు కు ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి కాలువలకు అందుతున్న నీటిని అడ్డుకునేందుకు ఎవరికీ హక్కు లేదని జాతీయ రహదారి పనులలో ఇవి ఆటంకంగా ఉన్నట్లయితే ముందుగా సంబంధిత అధికారులకు తెలియ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ఏడాది ఖరీఫ్ కు సాగునీరు అందేటట్లు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2021-06-23 13:39:44

అప్పన్న శాంతించిన వేల కుంభవృష్టి..

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారు శాంతించారు. మూడోవిడత చందన సమర్పణకు ముందు శ్రీవారు కరుణించారు. ఫలితం కుంభవృష్టి వర్షం. భారీ వర్షంతో సింహాచల క్షేత్రంతోపాటు విశాఖ మహానగరం కూడా సేదతీరింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న విశాఖవాసులు భారీ వర్షాలకు ఊపిరి పీల్చుకున్నారు. చందన స్వామి తెచ్చిన  చల్లదనంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీఏటా అప్పన్నకు చందనం సమర్పించే సమయంలో వర్షాలు కురుస్తుంటాయని దేవస్థాన ఆచార్యులు పేర్కొన్నారు. స్వామి సాంతించడం ద్వారా ఈవిధంగా వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. ప్రతీఏటా వర్షాలు కురవడం కోసం సింహాచల క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక హోమాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

Simhachalam

2021-06-23 05:05:57

వైభవంగా బంగారమ్మ తల్లి పండగ..

అడివివరం గ్రామదేవత శ్రీ శ్రీశ్రీ బంగారమ్మతల్లి వారి వార్షిక పండగ మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం నుండి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, రవికలు సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. పాత అడివివరంలోని అమ్మవారి సతకంపట్టు వద్దకు కూడా భక్తులు భారీగా తరలివెళ్లి మొక్కులుతీర్చుకున్నారు. అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యెక ఆహ్వా నీతులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. పైడితల్లమ్మ వారి దేవాలయంలో కూడా మారువారం పూజలు సంప్రదాయంగా జరిగాయి. గతవారం వీలుపడని గ్రామస్థులు అమ్మవారికి ఈవారం మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లమ్మ వారి పండగ సందర్భంగా గతవారం సమన్వయ లోపంతో తలెత్తిన ఇబ్బందులను ఈవారం ఈవో సూర్యకళ ప్రత్యక్షంగా పర్యవేక్షించి చక్కదిద్దారు.  కరోనా నేపథ్యంలో ఈవో ఆమె ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అమ్మవారి సన్నిధిలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంతో పాటు బంగారుతల్లి యూత్ ఫ్రెండ్స్ ప్రతినిధులు భక్తులకు పొంగలి, పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదాలను పంపిణీచేశారు. దేవస్థానం ఏ ఈఓ ఇజ్జిరోతు శ్రీనివాసరావు,సుపరింటెండెంట్ ముద్దాడ రమణ, సొసైటీ అద్యక్షులు కర్రిస్వామి స్థానిక నేతలు సతివాడ శంకరరావు దొంతల సంతోష్ ఇతర పెద్దలు, నక్క చందు పాల్గొన్నారు.

అడవివరం

2021-06-22 15:20:52

మహిళలకు అండగా YSRచేయూత..

వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఎంత గానో ఉపయోగపడుతుందని వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. మంగళవారం 64 వార్డు గొడ్డువానిపాలెం గ్రామంలో వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరములు గల అక్క చెళ్ళమ్మలకు రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 18,750 లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే చెందుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందెందుకు సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారని, దళారీ వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించారని అన్నారు. వార్డు ఇంచార్జ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగిరెడ్డి సహకారంతో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వైఎస్ఆర్ చేయూత అందిందని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా  ఉండేందుకు అనుకున్న సమయానికే పధకం మహిళలకు అనిదించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు. కార్య క్రమంలో పితాని అప్పన్న, మాధవ రావు, చిన్న, గొడ్డు శ్రీను, రమణ, గోందేసి రాము, దొర కొండ, శ్రీను, మహిళలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, యువకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

గంట్యాడ

2021-06-22 15:09:56

పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్..

భూరికార్డులను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ముమ్మిడివరం మండల తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూమి యొక్క రికార్డులను స్కానింగ్ చేసే ప్రక్రియను అమలాపురం ఆర్డీవో ఎన్ ఎస్ వి బి వసంతరాయుడుతో కలిసి జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా  డిజిటలైజేషన్ చేస్తున్న సిబ్బందిని స్కానింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. రికార్డులను స్కానింగ్ చేసే విధానం, స్కాన్ చేసిన డాక్యుమెంట్లను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసే విధానం, డాక్యుమెంట్లు ప్రింటింగ్ చేసే విధానం పై సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాణ్యతతో కూడిన డిజిటల్ భూరికార్డులను అందించే విధంగా సిబ్బంది పనితీరు ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఈ పరిశీలనలో ముమ్మిడివరం తహశీల్దార్ ఎస్. పోతురాజు, కంప్యూటర్ ఆపరేటర్లు, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Mummidivaram

2021-06-22 14:24:41

మహిళాభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..

ప్రతీ నిరుపేద అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు.  మంగళవారం నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  నియోజకవర్గంలోని మండలాలల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ ,బిసి ,మైనారిటీ మహిళా లబ్ధిదారులకు  రెండవ విడత వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల లో భాగంగా తను ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని , వారు సామాజికంగా అభివృద్ధిని సాధించేందుకు  వైయస్సార్ చేయూత ను అందిస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికీ రూ 18,750/- చొప్పున మొత్తం 75 వేల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి అండగా నిలబడుతున్నారన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 16,508 మంది అర్హులైన  మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ18,750/- చొప్పున రూ 30,95,25000/- చెక్కు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు ,సర్పంచులు, మహిళలు హాజరయ్యారు.

Golugonda

2021-06-22 13:21:11

YSRచేయూతలో రూ.4 కోట్లు పంపిణీ..

శంఖవరం మండలంలోని అర్హులైన మహిళా శక్తి సంఘాల్లోని 2,131 మంది సభ్యులకు వైఎస్సార్ చేయూత పధకం కింద రూ . 4 కోట్లను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణి చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ క్రాంతి పధం పధకం మహిళా శక్తి సంఘాల్లోని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 - 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన వారికి ఏడాదికి ఒక సారి రూ .18,750 చొప్పున ప్రభుత్వం అందించే ఈ ఆర్ధిక సహాయం రెండో ఏడాది నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసారు.  వైఎస్సార్ క్రాంతి వపధం తుని ఏరియా కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ వల్లీ, ఎంపీడీఓ రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబులు సంయుక్తంగా మండల మహిళా సంఘం ప్రతినిధులకు అందించారు . ఈ సందర్భంగా ఈ అధికారులు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సొమ్ములతో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబం ఆదాయాన్ని పెంచు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ క్రాంతి పధం పధకం ఇంచార్జ్ ఏపి ఎం . జీవీ.ప్రసాద్ , కత్తిపూడి సీసీ సీత , శంఖవరం సీసి నాగలక్ష్మి వివోఏలు , సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-06-22 13:17:51

ప్రజల వినతులను తక్షణమే పరిష్కరించాలి..

ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను నిర్ణీత గ‌డువులోగా స‌త్వ‌రం ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ జె.వెంక‌ట‌రావు(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ మండలంలోని జొన్నాడ గ్రామ స‌చివాల‌యాన్ని జె.సి సోమ‌వారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌చివాల‌య సిబ్బంది హాజ‌రు, ప్ర‌జా విన‌తుల ప‌రిష్కారం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఆరా తీశారు. ప్ర‌జా విన‌తుల ప‌రిష్కారంలో జాప్యానికి తావివ్వొద్ద‌ని సిబ్బందికి సూచించారు. స‌చివాల‌య సిబ్బంది నిర్వ‌ర్తిస్తున్న విధుల‌పై ఆరా తీశారు. అంత‌కుముందు మండ‌లంలోని మోద‌వ‌ల‌స‌లో నిర్మిస్తున్న గ్రామ స‌చివాల‌యం, రైతు భ‌రోసా కేంద్రం త‌దిత‌ర భ‌వ‌నాల‌ను భ‌వ‌న నిర్మాణ ప‌క్షోత్స‌వాల్లో భాగంగా ప‌రిశీలించి వాటిని త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ఎంపిడిఓ స్వ‌రూప‌రాణి, ఏ.ఇ.ల‌ను ఆదేశించారు. మండ‌లంలో ఉపాధి అనుసంధాన నిధుల‌తో చేప‌డుతున్న భ‌వ‌న నిర్మాణాల ప్ర‌గ‌తిపై వారితో స‌మీక్షించారు.

Denkada

2021-06-21 13:51:43