1 ENS Live Breaking News

ఇవిఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

నెల్లిమ‌ర్ల‌ మండ‌లంలోని ఇవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మంగ‌ళవారం త‌నిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సిబ్బందిని ఆదేశించారు. త‌నిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, నెల్లిమర్ల తాసిల్డార్ రమణ రాజు, ఎంపిడిఓ జి.గిరిబాల‌, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎన్నిక‌ల విభాగం సూప‌రిం టిండెంట్ నీలకంఠ రావు, లోక్‌స‌త్తా నాయ‌కురాలు రాయి ప‌ద్మావ‌తి, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Nellimarla

2023-04-04 06:38:31

ట్యాబ్‌ల‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలి

ఎంతో విలువైన కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల‌ను ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ఉచితంగా అంద‌జేసింద‌ని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాల‌ని ఉపాధ్యాయుల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ కంటెంట్‌లో ఉన్న ప్ర‌తీ స‌బ్జెక్టుకు సంబంధించిన క్లాస్ టెస్టు ను విద్యార్ధులు చేత చేయించాల‌ని సూచించారు. నెల్లిమర్ల మండ‌లంలోని క‌స్తూరిభా గాంధీ బాలిక‌ల‌ విద్యాల‌యాన్ని మంగ‌ళ‌వారం, ఆమె ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఇంట‌ర్ 1, 2 సంవ‌త్స‌రం విద్యార్ధుల‌తో మాట్లాడారు. ఉన్న‌త విద్య‌ప‌ట్ల వారి భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను తెలుసుకు న్నారు. కేవ‌లం ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ లాంటి కోర్సులే కాకుండా, సిఏ, లా త‌దిత‌ర ఎన్నో ప్ర‌త్యామ్నాయ అవ‌కాశాలు ఉన్న‌య‌ని చెప్పారు. విద్యార్థుల‌కు కెరీర్ గైడెన్స్ ఇవ్వాల‌ని, ఉపాధ్యాయుల‌కు సూచించారు. ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన‌ ట్యాబ్‌ల‌ను త‌నిఖీ చేశారు. వాటి వినియోగం, స‌బ్జెక్టు టెస్టుల నిర్వ‌హ‌ణ‌, టెస్టుల్లో వ‌చ్చిన మార్కుల‌పై ఆరా తీశారు. ట్యాబ్ ద్వారా అందిస్తున్న కంటెంట్ అర్ధం అవుతుందా లేదా అని విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు. డిక్ష‌న‌రీ వినియోగించే విధానాన్ని ప‌రిశీలించారు. బాగా చ‌దువుకొని, మంచి మార్కులు తెచ్చుకోవాల‌ని సూచించారు. ఈ త‌నిఖీలో ఎంపిడిఓ జి.గిరిబాల‌, ఎంఈఓ ఎ.కృష్ణారావు, కెజిబివి ప్రిన్సిపాల్ బి.ఉమ పాల్గొన్నారు.          

Nellimarla

2023-04-04 06:37:31

200 మంది గిరిజనులకు దోమతెరలు పంపిణీ

సిఆర్పిఎఫ్ పోలీసుల సేవలను గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 198 బెటాలియన్ ఇనిస్పెక్టర్ అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. సోమవారం సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా పెదబయలు మండలం కృష్ణాపురం గ్రామంలో  ఇన్ స్పెక్టర్, ముంచంగిపుట్టు ఎస్సై రవీంద్ర లు సంయుక్తంగా 200 మంది గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు.  సిఆర్పిఎఫ్ ఇనెస్పెక్టర్ మాట్లాడుతూ,  ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. గతంలో గొడుగులు, రేడియోలు, చలి దుప్పట్లు, క్రీడా సామాగ్రి పంపిణీ చేశామ ని.. ఇపుడు పంపిణీ చేసే దోమతెరలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత అసాంఘిక క్రమ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు ఎస్సై రవీంద్ర, హెడ్ కానిస్టేబుల్  రమేష్, మాజీ సర్పంచ్ పండ సుబ్రహ్మ ణ్యం తదితరులు పాల్గొన్నారు.

Pedabayalu

2023-04-03 15:00:49

సమిష్టి సేవలతో అప్పన్న కళ్యాణం విజయవంతం

అప్పన్న కళ్యాణోత్సవం పూర్తిస్థాయిలో విజయవంతమైన నేపథ్యంలో  సోమవారం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో వి.త్రినాధ రావును ఘనంగా  సత్కరించారు. కళ్యాణంలో దేవస్థానం అధికారులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది సేవలందించడం అభినందనీయ మన్నారు. అలాగే ఈ నెల 23 న  రానున్న చందనోత్సవం(అప్పన్న నిజరూప దర్శనం) కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని.. దానికోసం ధర్మకర్తల మండలి తరపున తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని సభ్యులు ఇఓ కి తెలియజేశారు. ఈ సందర్భంగా ఈఓ త్రినాధ్ రావు మాట్లాడుతూ,  అందరి సహకారంతోనే ఉత్సవం విజయవంతం చేయగలిగా మన్నారు. కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివ చ్చినప్పటికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో భక్తులకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు సహకరించిన ధర్మ కర్తల మండలి సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Simhachalam

2023-04-03 12:50:59

7రోజులపాటు సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 6వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేస్తున్నట్టు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం అన్నరంలో మీడియా కి ప్రకటన విడుదల చేశారు. స్వామివారి ఉత్సవాల్లో భక్తుల కోసం దేవస్థానంలో తిలకించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయా లని కూడా నిర్ణయించినట్టు తెలియజేశారు. దానికోసం కూచిపూడి నృత్యం, భరతనా ట్యం, భక్తి కీర్తనలు, హరికథలు, బుర్రకథ, నాటికలు, నాట కములు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆశక్తిగల కళాకారులు, బృందాలు పాల్గొనవచ్చునని వివరించారు. ఈ ప్రకటన వెలువడి 7 రోజులలో దేవస్థానం పి.అర్. ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, మరిన్ని వివరాలకు 6301092359 లో సంప్రదించా లని ఈఓ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.


Annavaram

2023-04-02 16:23:34

"మిషన్ వాత్సల్య" కు దరఖాస్తుల ఆహ్వానం

అనాధ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు రూ 4000/- అందించడం జరుగుతుందని, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకం ప్రాజెక్టు అధికారిణి పద్మావతి కోరారు. ఈ సందర్భంగా ఆమె శనివారం శంఖవరంలో మీడియాకి పథకం యొక్క వివరాలను తెలియజేశారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 72 వేలు, పట్టణ ప్రాంతాల్లో 96 వేల లోపు ఉండాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు తల్లి/తండ్రి ఆధార్ కార్డు తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం మరణ కారణం గార్డియన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బాలిక బాలుడి కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఫోటో,  ఆదాయ ధ్రువీకరణ బ్యాంకు ఎకౌంటు వివరాలు జత చేయాలన్నారు.

తల్లిదండ్రులు లేని అనాధలు,  ప్రాణాంతక వ్యాధి తో బాధపడే తల్లిదండ్రులు గలవారు తల్లి లేదా తండ్రి నీ కోల్పోయిన పాక్షిక అనాధలు, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నవారు, ప్రకృతి వైపరీత్యానికి గురైన, యాచకులైన , బాల కార్మికులు బాల్య వివాహం జరిగిన వారు ఇవి బాధిత పీడిత బాలలు దివ్యాంగులకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుటకు అర్హులని ఆవిడ పేర్కొన్నారు. ఇతర వివరములకు దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ణి అంగనవాడీలలోనూ, గ్రామ, వార్డు సచివాలయాలలోనూ సంప్రదించాలని సూచించారు.

Sankhavaram

2023-04-01 14:28:55

జిరాయితీ భూమిలో సాగుదార్లకు పట్టాలు ఇవ్వలేం

జిరాయితీ భూమిలో సాగుదారులకు పట్టాలు మంజూరు చేయడం కుదరదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. శనివారం ఆమె అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం కోనాం శివారు కొత్త వీధి గ్రామం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జిరాయితీ భూమిలో సాగు చేసుకుంటున్న గిరిజనులను కలిశారు. వారు సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వ భూమి అయితేనే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, రికార్డులను పరిశీలించగా   289 సర్వే నంబరు లో 29.86 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు వారి మెట్టు భూమిగా నమోదయిందని చెప్పారు.  జిరాయితీ పట్టా కాబట్టి కౌలుదారులకు ఎటువంటి హక్కు ఉండదన్నారు. వీలును బట్టి వారికి మరొకచోట ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపారు. జెసి వెంట చీడికాడ తాసిల్దార్ బి.వి రాణి తదితరులు ఉన్నారు.

చీడికాడ

2023-04-01 14:14:43

శ్రీసత్యదేవ నిత్యన్నదాన ట్రస్టుకి రూ.3.32లక్షలు విరాళం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి రాజమండ్రికి చెందిన నల్లం వెంకటదుర్గాప్రసాద్ దంపతులు, రూ.3,32,472.50 లు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం చెక్కును దేవాలయ సిబ్బం దికి శనివావారం ఆలయ సిబ్బందికి అందజే శారు. నల్ల వేదనాషిక పేరున జూలై 29న అన్నదానం చేయాలని కోరారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచ నం అందించగా ఆలయ సిబ్బందికి దాతలకు ప్రసాదాలను అందజేశారు.

Annavaram

2023-04-01 07:26:36

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

సింహాచలం కొండ దిగువన కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.  స్వామివారి కళ్యాణం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలను ఇచ్చారు. అనంత రం శ్రీను బాబు మాట్లాడుతూ లోకకళ్యాణార్థం జరిగే నవమి వేడుకల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని.. శ్రీరాముని చల్లని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని స్వామిని కోరుకున్నట్టు వివరించారు.

Simhachalam

2023-03-30 12:39:17

భోగిగణపతి పీఠంలో శ్రీరామ పాదుకలకు విశేషపూజలు

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో భద్రాచల శ్రీరామ పాదుకలకు విశేష పూజలు నిర్వహించారు. సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలతో  మామిడాకుల తోరణాలు ప్రతిష్ఠాలంకరణ చేపట్టారు.  సహస్ర నామావళి ప్రధానంతో పానకం వడపప్పు పనసతొనల నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ,  భద్రాచల పాదయాత్రలో ప్రత్యేకంగా గుమ్మడి చెక్కతో తయారుచేసి శిరస్సు మీద వుంచి తీసుకువెళ్లిన శ్రీరామ పాదుకలు భద్రాద్రి రామాలయం గర్భాలయంలో శ్రీరాముల వారి పాదాల చెంతవుంచి ప్రత్యేక పూజలు చేసి తెచ్చిన తరువాత భోగిగణపతి పీఠంలో ఉంచి నిత్య పూజ జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి కి విశేష పూజ నిర్వహిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు.

Kakinada

2023-03-30 08:06:05

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలు

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతరం స్వరూపా నందేంద్ర స్వామి సీతారాములకు విశేష పూజలు చేసారు. రాజోపచారాలు నిర్వహించి మహా మంగళ హారతులిచ్చారు. కళ్యాణానంతరం భక్తుల కు పానకం అందజేసారు.

Pendurthi

2023-03-30 07:04:26

ఛలో శృంగవృక్షం కార్యక్రమానికి అనుమతులు లేవు

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి "చలో శృంగవృక్షం 30-03-2023" అంటూ కొన్ని సంఘాలు  పిలుపునిచ్చినట్లు గా సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతూ ఉందని సదరు కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పెద్దాపురం డిఎస్సీ ఎస్.ముర ళీమోహన్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరూ రావొద్దని కోరారు. అంతేకాకుండా గ్రామంలో ప్రస్తుతం  సామరస్య , సుహృద్భావ వాతావరణం ఉందని దానికి విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. అలాకాకుం డా  హద్దు మీరి గ్రామంలో  శాంతియుత వాతావరణానికి  విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ఆదేశానుసారం అమలు చేస్తున్నట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో డిఎస్పీ పేర్కొన్నారు.

Tondangi

2023-03-30 04:57:02

సెలవైనా పన్నులు కట్టవచ్చు..ఏడిసి

ఆర్థిక సంవత్సరం ముగింపునేపద్యంలో గురువారం శ్రీరామనవమి సెలవు అయినప్పటికీ పన్నులు స్వీకరిస్తామని కాకినాడ నగరపాలకసంస్థ అదనపు కమిషనర్‌ సిహెచ్  నాగనరసింహారావు తెలిపారు. ఈ మేరకు కాకినాడలో బుధవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పన్నులు చెల్లింపునకు రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున కాకినాడలోని అన్ని సచివాలయాల్లోను ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, కుళాయి పన్నులను స్వీకరించేలా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయాలతోపాటు ప్రస్తుత  నగరపాలక సంస్థ కార్యాలయం(స్త్రీ శక్తి భవన్‌), సినిమా రోడ్డులోని పాత కార్పొరేషన్‌ భవనంలోని కౌంటర్లలో కూడా పన్నులు చెల్లించవచ్చునన్నారు. వడ్డీ, అపరాధ రుసుము లేకుండా ఈ నెల31వ తేదీలోపుగా పన్నులు చెల్లించాలని ఆయన పన్ను చెల్లింపుదారులను కోరారు. సెలవు రోజైనా సిబ్బంది అన్నిచోట్లా అందుబాటులో ఉంచినట్టు ఏడిసి ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.    

Kakinada

2023-03-29 14:17:55

భూమి రిజిస్ట్రేషన్ కోసం ఏడేళ్లుగా తిప్పుతున్నారు

2016 లో కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయడానికి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ఏడు సంవత్సరాలు తిరిగిన రిజిస్ట్రేషన్ చేయకపో వడంలో గల ఆంతర్యం ఏమిటి అని బాధితుడు అబ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ పెదబయలు గ్రామానికి చెందిన చెండా అబ్రహము 2016 సంవత్సరం లో అరకువేలి మండలం ఎండపల్లివలస గ్రామానికి చెందిన గొండ లక్ష్మీ దగ్గర 11 సెంట్లు భూమిని కొనుగోలు చేసి.. అదే ఏడాది నవంబరులో అన్ని రకాల ఆధారాలతో అరకువేలి తాసిల్దార్ కి భూ రిజిస్ట్రేషన్ కొరకు అర్జీ పెట్టుకున్నారు. అప్పటి తాసిల్దార్ దస్తావేజులను పరిశీలించి పా డేరు సబ్ కలెక్టర్ ఆఫీస్ కు పంపగా, అక్కడనుండి ఈ విషయాన్ని సరి చేయగలరని రాసి మరలా అరకు వేలి తహసిల్దార్ కార్యాలయానికి పం పించేసి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను భూమి సక్రమంగానే కొనుగోలుచేశానన్నాడు.

Pedabayalu

2023-03-28 14:12:53