1 ENS Live Breaking News

విశాఖలో12న ఎమ్మెల్సీ అభ్యర్ధులతో ముఖాముఖి

ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర విద్యావంతుల వేదిక కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం విశాఖలోని పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బరిలో పోటీపడుతున్న అభ్యర్థులతో నిర్వహించే ముఖాముఖి ద్వారా అభ్యర్ధులు ప్రజలకు చేయబోయే అభివ్రుద్ధి, హామీలు, అభివృద్ధి తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ ప్రక్రియ దేశంలోనే మొదటి సారిగా తాము నిర్వహిస్తున్నామన్నారు. అమెరికలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ప్రజలకు ముఖాముఖి నిర్వహించే సంప్రదాయం ఉందన్నారు. ఓటర్లు అభ్యర్థులను నేరుగా ప్రశ్నించవచ్చునన్నారు. ఈనెల 12న  9.30 గంటలకు విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహిస్తున్నట్టు కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో డా.జ్ఞానానంద, వెంకటేష్, శ్రీధర్, వంశీ, అసిత పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-11 07:09:15

డాక్ యార్డ్ ఉద్యోగులకు సంపూర్ణ సహకారం అందిస్తాం

నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగులకు సంపూర్ణ సహకారం అందిస్తామని  రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయ్ సాయి రెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ సీతమ్మదారలోని నివాసంలో ఆయనను నేవల్ డాక్ యార్డ్ కేటిబి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవిలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాధుడు జ్ఞాపికను  విజయ సాయిరెడ్డి కి శ్రీనుబాబు బహుకరించారు. అనంతరం నావెల్ డాక్ యార్డ్  కేటిబి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన భవనం ప్రారంభం, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పలు అంశాలపై వీరు విజయ్ సాయి రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉన్న  ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో సహకరిస్తుందని సాయి రెడ్డి హామీ ఇచ్చారు. 

Visakhapatnam

2023-03-10 09:26:17

సీపిఎస్ రద్దుపై సోమువీర్రాజు సంచనల వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దుపై బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానమే కొనసాగుతుం దని, ఎలాంటి మార్పులు ఉండవన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సిపిఎస్ రద్దు చేసే రాష్ట్రాలకు కేంద్రం నిధుల పంపిణీ కుదించే స్తుందన్న విషయమై మీడియా ప్రశ్నపై సోము పై విధంగా స్పందించారు. ఏపీ ఉద్యోగులను సీఎం వైఎస్.జగన్ దారుణంగా మోసం చేశారన్నారు. అధికారంలో వచ్చిన వారంరోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం మడమ వెనక్కి తిప్పేశారని, ఆ విషయమై ఆందోళన చేస్తున్న ఉద్యోగులను కేసుల పేరుతో బెదిరించి అణగదొక్కాలని చూస్తు న్నారని ఆరోపించారు. సిపిఎస్ బీజేపి రద్దు చేస్తుందా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమయంలో దానికి సమాధానం చెబుతాన్నారు. సోము ప్రకటన ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటలంలో పెట్టేలా ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

2023-03-09 09:56:08

మహిళతోనే జీవన గమనం ముడిపడి వుంది

మహిళతోనే జీవన గమనం ముడిపడి ఉందని 32వ వార్డు కార్పోరేటర్, కెఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కందుల నాగరాజు అన్నారు. గురువారం విశాఖలోని అల్లిపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేకలు ఘనంగా నిర్వహించారు. వార్డులోని పలు రంగాల్లో సేవలు అందించేవారితోపాటు, జనసేన వీర మహిళలను కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ, మహిళతోనే సృష్టి ముడిపడి ఉన్నద న్నారు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా దేశ అధ్యక్షురాలిగా నేడు మహిళ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకొన్న మహిళకోసం ఏడాదికి ఒక రోజు కాకుండా అన్ని రోజులూ మహిళా దినోత్సవాలు జరుపుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని మహిళలను వీర మహిళలుగా గుర్తించి వారికి ప్రత్యేక స్థానాన్ని కల్పించి 33శాతం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని కొనియాడారు.

Visakhapatnam

2023-03-09 09:19:18

సమసమాజ స్థాపనే సీఎం జగన్ సంకల్పం

ఎటువంటి ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, ముఖ్యంగా పేదవర్గాల ఆర్థిక పరిపుష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామంలో ఆయన 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ప్రతినెల 1నే అవ్వాతాతలకు, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును నేరుగా వారి ఇంటి ముంగిట అందజేస్తున్న ఘనత మన జగనన్నకే దక్కుతుందన్నారు. గతంలో నూతన పింఛన్ రావాలంటే ఎవరైనా చనిపోతే లేదా పార్టీ జెండా కడితేనే పెత్తందారులు పింఛన్లు మంజూరు చేసే వారన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంగా ఎంత మంది ఉంటే అంతమందికి అందుతున్నాయన్నారు.

Mylavaram

2023-03-01 13:20:42

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ లో సత్తాచాటిన గిరియువత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు సెల‌క్ష‌న్ బోర్డు నిర్వ‌హించిన ఎస్సై ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో గిరిజ‌న యువ‌త మ‌రోసారి స‌త్తా చాటారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సెస్సీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 9 మంది, గ్రూప్ -1 ప‌రీక్ష‌లో 12 మంది యువ‌త‌ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విష‌యం విధిత‌మే. తాజాగా మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లో 23 మంది గిరిజ‌న యువ‌త శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించి మ‌రోసారి వారి ఘ‌న‌త‌ను చాటుకున్నారు. ఐటీడీఏ ఆధ్వ‌ర్యంలో 21వ సెంచ‌రీ శిక్ష‌ణా సంస్థ ద్వారా వేప‌గుంట వైటీసీలో సివిల్స్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు ప్ర‌త్యేక త‌ర్ఫీదు అందిస్తున్నారు. వారిలో 23 మంది యువ‌త ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లు హాజ‌రు కాగా 23 మంది కూడా మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు. దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ విజేత‌ల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన 23 మంది యువ‌తా ఎస్సై మెయిన్స్ కు అర్హ‌త సాధించటం గ‌ర్హ‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. వీరి చూపిన ప్ర‌తిభ భ‌విష్య‌త్త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అన్నారు. 21వ సంచ‌రీ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ సంస్థ అందిస్తోన్న శిక్ష‌ణ గిరిజ‌న యువ‌త‌కు ఎన్నో విధాలుగా పోటీ ప‌రీక్ష‌లకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా సంస్థ నిర్వాహ‌కురాలు ధ‌ర‌ణి పేర్కొన్నారు.

Paderu

2023-03-01 13:12:39

గ్యాస్ ధరల పెంపుపై విశాఖలో సీపీఐ నిరసన

కేంద్రం ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచడాన్ని సీపీఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ దరి గురజాడ అప్పారావు విగ్రహాం వద్ద గ్యాస్ బండ్లకు ఉరి వేసుకొని వినూత్నమైన నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మరో మారు వంటగ్యాస్ ధరలను పెంచి వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం మోపడం సమంజసం కాదన్నారు. ప్రజలు నిత్యం వాడుకోనే వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 వరకు పెంచారని, అదే వాణిజ్య సిలిండర్‌ ధర రూ.350.50 పెంచారని ఈ పెంపు కూడా పరోక్షంగా ప్రజలపైనే పడుతుందన్నారు. నిన్నటిదాకా గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,105 ఉండగా తాజా పెంపుదలతో రూ.1,155 అయ్యిందని ఇంటికీ వచ్చే సరికి రూ.1200 అవుతోందన్నారు. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2119.50కు ఎగబాకిందని, పెరిగిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. 

ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు, ట్రూ అప్ పేరుతో విద్యుత్తు ఛార్జీలు పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడుతున్నాయని తాజాగా పెరిగిన ధరలతో ఆ భారం మరింత పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెంచడం సామాన్యులను దగా చేయ్యడమేనని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి ఎన్ క్షేత్రపాల్, ఎం మన్మధరావు, జి కాసులరెడ్డి, వై రాంబాబు, ఎ ఆదినారాయణ, ఎన్ అప్పన్న, యు నాగరాజు, ఎం శ్రీనివాసరావు, సీహెచ్ కాసుబాబు, సీహెచ్ బుజ్జి, తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులతో పాటు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2023-03-01 13:10:21

వైభవంగా గండిపేట రామాలయం ప్రారంభోత్సవం

మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం శివారు గండిపేటలో నూతనంగా నిర్మించిన రామలయాన్ని వైభవంగా ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఆలయాన్ని బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకుని స్థానికులు పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు  పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలా టం అందరినీ ఆకట్టుకుంది.

Makavarapalem

2023-03-01 12:20:15

గ్రేటటర్ విశాఖలో ఘనంగా దర్జీల దినోత్సవం

రెడీమెడ్‌ రంగం విస్తరించడంతో టైలరింగ్‌కు గిరాకీ తగ్గి తమ పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళ వారం అక్కయ్యపాలెం కూడలిలో గ్రేటర్ విశాఖ టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. టైలరింగ్‌ మెషిన్ సృష్టి కర్త  ఐజాక్ మెరిట్ సింగర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షులు సిహెచ్ యాదిగిరి రెడ్డి మాట్లా డుతూ, గత 23 ఏళ్లుగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి సామజిక భవనం కోసం విన్నవించుకున్నా కనీస స్పందన లేదన్నారు. తమ కనీస అవసరాలకోసం సామజిక భవనాన్నివెంటనే మంజూరు చేయాలని కోరారు. సంయుక్త కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ లో ఇప్పటివరకూ సుమారు 150 షాపులకు చెందిన  1000 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సిహెచ్ వేణు,కోశాధికారి సిహెచ్ తిరుపతిరావు, అధిక సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-28 12:40:01

సచివాలయ మహిళా పోలీసులు జాబ్ చార్ట్ పాటించాలి

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రభుత్వం సూచించిన జాబ్ చార్ట్ ను తప్పకుండా పాటించాలని నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మంగళవారం డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది, మహిళా పోలీసులతో ఆయన వీడియోకాన్ఫ రెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు సచివాలయాల్లో పరిధిలో జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన చైతన్య అవగాహన కార్యక్రమాలు తప్పని సరిగా చేపట్టలన్నారు. ప్రజలకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరుగుతున్న నేరాల గురించి అవగాహన కార్యక్ర మాలను నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నకు నూజివీడు రూరల్ సీఐ అంక బాబు, రూరల్ ఎస్ఐ టి.రామ కృష్ణ  నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని  సచివాలయంలో పనిచేస్తున్నసచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Nuzividu

2023-02-28 08:30:46

స్పందన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారం

ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తుకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ (FAC)సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు.  కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. డ్రైనేజీలలో షీల్డ్ , రోడ్లపై వేసిన భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని, పారిశుధ్య సమస్య మెరుగుపరచాలని కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి దీపాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2023-02-27 10:17:50

యువ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్

భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారుడిగా వినతికెక్కిన చంద్రశేఖర్ ఆజాద్ దేశ భక్తి ఎనలేనిదని ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్. శ్రీ నగేష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో  యువకుల తెగువను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. నాయకుడిలా కాకుండా ఓ సేవకుడిలా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అని తెలిపారు. స్వాతంత్రం అంటే ఆత్మ గౌరవం అని నిరూపించారని అన్నారు. 19 31 ఫిబ్రవరి 27న తన  25  ఏటనే ఆత్మ త్యాగం చేసిన ఆజాద్ దేశభక్తి ఎనలేనిదని శ్రీ నగేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాజా ,రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-02-27 09:33:58

మన శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం

మన జీవన విధానంలో అన్ని దశలలో శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలంటే ప్రోటీన్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు పి. పార్థ సారథి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ప్రోటీన్ దినోత్సవం పురస్క రించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన శరీరం ప్రోటీన్లు గల ఆహారాన్ని కోరుకుంటాయని అన్నారు. వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు ఎముకలు, చర్మం, మృదులాస్తి, రక్తాన్ని వృద్ధి చేయడంలో సహాయపడతాయని అన్నారు. గుడ్లు, చేపలు, గుమ్మడి గింజలు, బీన్స్, పాల ఉత్పత్తులు, కూరగాయల ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి అని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం లో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-02-27 09:32:40

అయ్యరో ఈ టేకు చేప 1500 కేజీల బరువురో..

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండ‌లం బంగారమ్మపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కంది. ఆ చిక్కి న ముక్కుడు టేకు చేప సుమారు 1500 కేజీలకు పైనే బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. సోమ‌వారం జాలర్ల వేటలో ఈ టేకు చేప వ‌ల‌కు చిక్కింది. దాన్ని పడవలో ఎక్కించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్య పడలేదు. దానితో ఆ చేపకు పెద్ద తాడు కట్టి దాన్ని పడవకు చుట్టి అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చాల్సి వచ్చింది. అక్కడ  మత్స్యకారుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ టేకు చేపను విక్రయిస్తే సుమారు రూ. 50 వేల వరకు వస్తుందని మత్స్యకారులు చెప్పారు. భారీ సైజులో ఉన్న ఈ టేకు చేపను చూడడానికి అక్కడ జనాలు ఎగబడ్డారు. అంతేకాకుండా ఇంత పెద్ద చేపలను చూడటం ఇదే మొదటి సారని బంగారమ్మపాలెం వాసులు చెబుతున్నారు. ఎప్పుడో ఇలా ఒకటి అరా పెద్ద పెద్ద చేపలు చిక్కుతుంటాయని చెప్పుకొచ్చారు.

S Rayavaram

2023-02-27 09:03:01