1 ENS Live Breaking News

ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3రోజుల సక్సెస్ మీట్

ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3 రోజుల పాటు జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు వియవంతం చేసిన నాయ కులు, కార్యకర్తలు, సచివాలయ గృహసారధులతో కలిసి సక్సెట్ మీట్ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తెలియ జేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురా లు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభు త్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో చక్కగా తీసుకెళ్లిన క్యాడర్ ను ప్రత్యేకంగా గుర్తించాలని సన్మానించుకోవాలని ఈ కార్యక్రమం చేపడుతున్నారమన్నారు. 26న రౌతులపూడి, శంఖవరం మండలాలు, 27న ప్రత్తిపాడు మండలానికి అన్నవరంలోని ప్రైవేటు హోటల్ లో నూ, 28న ఏలేశ్వరం నగర పంచాయతీ, రూరల్ మండాల కేడర్ కే ఏలేశ్వరంలోనూ ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశామన్నారు.

Sankhavaram

2023-04-24 07:24:06

ప్రత్తిపాడులో పర్వత నాయకత్వానికి తిరుగులేదు

ప్రత్తిపాడులోని ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రాసాద్ నాయకత్వానికి తిరుగులేదని కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినీ డి సుజాత అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఎమ్మెల్యే కార్యదీక్ష, కార్యకర్తలు, నాయకత్వం సహకారంతోనే ప్రత్తిపాడు నియోజకవర్గం జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం ను వ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో టాప్ 10గా నిలిచిందన్నారు. ఇదే స్పూర్తితో పనిచేసి మళ్లీ ఆయనను ఎ మ్మెల్యేగా నియోజవర్గానికి బహుమతిగా ఇవ్వాలని కేడర్ ను ఉత్సాహ పరిచారు. రాష్ట్రప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎమ్మెల్యే పర్వత దానిని అమలుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో శక్తివంచన లేకుండా క  కృషి చేస్తారని కొనియాడారు. అలాంటి నాయకత్వం నియోజవకర్గ అభి వృద్ధికి చాలా అవసరమని అన్నారు. 4 మండలాల ఎంపీపీలు, గృహసారధులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Sankhavaram

2023-04-24 07:23:15

175నియోకవర్గాల్లో ప్రత్తిపాడు టాప్10- ఎమ్మెల్యే పర్వత

జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం టాప్ 10లో నిలవడానికి కారణం బలోపేతమైన నాయకులు, సీఎం జగనన్నను నమ్మిన ప్రజలేనని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. నియోజకవర్గంలో 80, 915 గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడంతోపాటు మద్దతుకూడా పొందామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు అభివృద్ధిని కూడా తెలియజేశామన్నారు.

Sankhavaram

2023-04-24 07:21:14

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

విశాఖప కెజిహెచ్ కు ప్రతి రోజు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు, వసతి అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కె జి హెచ్ ను ఆయన ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గైనిక్ వార్డును తని ఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో పాటు వచ్చే సహా యకులు విశ్రాంతి తీసుకునే గదులను పరిశీలించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరాతీశారు. కె జి హెచ్ లో చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వం వైద్యసేవలకు ప్రభుత్వం పెద్ద పీటవేస్తుందని ఈ తరుణంలో ప్రభుత్వ వైద్యం కార్పోరేట్ వైద్యాన్ని మించి నిరుపేద రోగులకు అందాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కె జి హెచ్ సూపరింటిండెంట్ డా.అశోక్ కుమార్, ఎపిఐడిసి ఇఇ నాయుడు, కె జి హెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-20 16:22:13

శారదాపీఠాన్ని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ బుధవారం శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఇటీవలే కమి షన ర్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా విశాఖ వచ్చిన ఆయన విశాఖలోని పెందుర్తిలో గల పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వా త్మానందేంద్ర సరస్వతిలను మర్యాదపూర్వకంగా కలుసుకొని  అక్కడ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచ లంలో జరిగే చందనోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికాలరు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో ఉన్న ఆలయాలకు చెందిన మాన్యాలను, భూములను పరిరక్షించాలని కోరారు. ధార్మిక సలహా మండలి సమావేశాలను క్రమం తప్ప కుండా నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను భక్తులకు ముందుగానే తెలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ కు సూచించారు.

Pendurthi

2023-04-19 10:40:46

సమ సమాజ స్థాపకుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే

సమ సమాజ స్ధాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి , రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే  అని శెట్టిబ త్తుల కుమార్ రాజా అ న్నారు. మంగళవారం అన్నవరం పెద్ద రావిచెట్టు సెంటర్ లో పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,  బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రైతు సమస్యలపై అమితాశక్తి ప్రదర్శించి వివిధ ప్రాంతాల్లో ఉద్యమించిన బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహులు మహాత్మా జ్యోతి బాపూలే అని తెలిపారు. ఆయన సతీమణి సావిత్రి భాయ్ పూలే కూడా నిస్వార్థ సేవలం దించిన మహనీయురాలని వారిద్దరూ అమరజీవులుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు  మనమి చ్చే నిజమైన ఘన నివాలి అన్నారు. వైస్ ఎంపీపీ దారారమణ,  కొండపల్లి అప్పారావు బొబ్బిలి వెంకన్న పాల్గొన్నారు.

Annavaram

2023-04-11 13:30:22

వజ్రకూటంలో ఉత్సాహంగా జగనన్నే మాభవిష్యత్తు

నిరుపేదల పక్షన నిలిచి నవరత్నాల పథకాల ద్వారా పూర్తిస్థాయి సంక్షేమం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు అన్నారు. సోమవారం శంఖవరం మండంలోని వజ్రకూటం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్ర మాన్ని కార్యకర్తలు, వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రమే చేపట్టగలుగుతున్నారని అన్నారు. నిరుపేదలు, అక్క, చెల్ల మ్మల పక్షపాతిగా నిలిచిన జగనన్ననే మళ్లీ మళ్లీ మనం మన భవిష్యత్తుగా భావించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముం గిటే సమస్యల పరిష్కారం చూపిస్తున్న జగనన్నతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు స్వర్గయుగంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారధులు,కె.రమణ, కె.వెంకటరమణ, కీర్తి, నానాజీలు పాల్గొన్నారు.

Vazrakutam

2023-04-10 14:42:43

ఆదిత్యుడుని దర్శించుకున్న మంత్రి అమర్నాధ్

కలియుగ ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ సో మవారం దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు,స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కా ర్యక్రమంలో  ఆర్డీఓ బొడ్డేపల్లి శాంతి, తహశీల్దార్ కె.వెంకటరావు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Arasavilli

2023-04-10 11:23:48

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం

బోయ వాల్మీకి,బెంతు, ఒరియా లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలులేదని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో పంచాయితీ పాలకవర్గం గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.  ఈ సందర్భంగా వా ర్డు సభ్యులు జర్తా రాజబాబు  అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ ,బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా లను ఎస్టీ జాబి తాలో చేర్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంరాని.. అయితే ఎటువంటి  గిరిజన సాంప్రదాయాలు లేని బిసి ఏ లో ఉన్న బోయ వాల్మీకి,బెంతు ఒరియా 40లక్షలు మందిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం 52 జీవో  తీసుకువచ్చిందన్నారు. దీ నివలన ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన గిరిజనులు 25 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త క్షణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52 ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాజఒమ్మంగి

2023-04-06 10:50:57

మహిళలకే 70శాతం పథకాలు.. ద్వారంపూడి

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకి నాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పాలనా సంస్కరణ లు అమలు చేయడంతో పాటు 70 శాతం  పథకాలను మహిళల పేరుతోనే ఇస్తున్నారన్నారు. శారదాదేవి ఆలయం సమీపంలో గురువారం జరి గిన వైయస్సార్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని పదింతలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపా లిం చడం ప్రజల అదృష్టమన్నారు. కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి , కమిషనర్ కే. రమేష్, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహా రావు, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.

Kakinada

2023-04-06 10:11:48

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా

జర్నలిస్టులు, వారి కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గురు వారం దాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఇటీవల మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ చిన్న కుటుంబానికి విజేఎఫ్ తరఫున రూ.75వే లు ఆర్థిక సహాయంతోపాటు, డెత్ సర్టిఫికేట్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న కుటుంబానికి  మంత్రి అమర్నాథ్ తో పాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా కృషి చేస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రకాల రాయితీలను అందించేందుకు తమ వంతు బాధ్యతగా పని చేస్తున్నా మన్నారు. పగ లు, రాత్రి అనే తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకు వారి కుటుంబాలకు నిరంతరం సేవ చేసేందుకు తాము ఎల్ల ప్పుడూ సిద్ధం గా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజె ఎఫ్ కార్యవర్గ సభ్యుడు ఈరోతి ఈశ్వరరావు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-06 10:04:26

ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మరింత వైద్యసహాయం

ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం ఇంటి ముంగిటే అందుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని పీహెచ్సీకి మంజూరు చేసిన 104 వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలో ప్రతీ నిరుపేదకు అన్ని రకాల రోగాలకు వైద్యసేవలు అందించాలన్నదే ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయమని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతీ గ్రామసచివాలయం పరిధిలోని ఒక విలేజ్ క్లినిక్ కూడా ప్రభు త్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇకపై వైద్యసేలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాజబాబు, వైఎస్సార్సీపీ నాయకు లు,  పీహెచ్సీ వైద్యాధికారి ఆర్వీవి. సత్యన్నారాయణ, డా.ఎస్ఎస్ఆర్. కుమార్, ఎంపీహెచ్ఈఓ మల్లిఖార్జునరావు, పీహెచ్ఎన్.కె.మేరీ, పారామె డికల్ సిబ్బంది సూర్యకాంతం, నూకరత్నం, నాగమణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. 

Sankhavaram

2023-04-06 07:25:31

సీఎం వైఎస్ జగన్ తోనే ప్రజా సంక్షేమం.. ఎమ్మెల్యే పర్వత

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే ప్రజా సంక్షేమ పూర్తి స్థాయిలోఅమలు జరుగుతోందిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. గడపగడపకి మన ప్ర భుత్వ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శంఖవరం గ్రామ సచివాలయం-3లో ఎమ్మెల్యే  పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదు వులు, అర్హులకు పింఛన్లు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఓటువేయాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, సంక్షేమం వైఎస్సా ర్సీపి పరిపాలనకు మారుపేరు అని అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే జగనన్నను ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరా రు. అనంతరం ఎమ్మెల్యే పర్వత సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథిలతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ పర్వత రాజ బాబు, ఎంపీడీవో రాంబాబు, జట్ల సోమేశ్వరరావు, ఎ.వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-04-04 12:02:57

అహింసా మార్గాన్ని బోధించిన మహావీర్

చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అహింసా వాదాన్ని, సత్యం, ప్రేమ తత్వాన్ని బోధించిన మహావీర్ బోధనలు ప్రతి వ్యక్తి ఉన్నతికి దోహదపడతాయని గురు స్వామి గల్లా సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో మహావీర్ జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ కుటుంబంలో చైత్రమాసం శుక్ల పక్షం త్రయోదశి రోజున మహావీర్ జన్మించారని, సత్యాన్వేషణ కోసం తన 30వ  ఏటనే రాజ సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారని అన్నారు. 36వ  ఏట సన్యాసాన్ని  స్వీకరించగా 43వ  ఏట జ్ఞానోదయం పొందారని అన్నారు. 32 సంవత్సరాల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవం అయ్యారని అన్నారు.  72వ ఏట ఆయన తుది శ్వాస విడిచారని సుబ్బారావు తెలిపారు. క్షేత్ర అధ్యక్షులు రాజా ఆధ్వర్యంలో జరిగిన  కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్,  ఓదూరి వరలక్ష్మి  ,   పి .పార్థసారథి, అడబాల సత్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-04-04 07:53:58