1 ENS Live Breaking News

ఈ వీడియోచేస్తే 70% ఇంగ్లీష్ వచ్చేస్తుంది..

భారతదేశంలోనే స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవడానికి అత్యుత్తమ వీడియో ఇది. స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుడు మనోహర్ సర్ ఎంతో చక్కగా ఇంగ్లీషు భాషపై భయం పోగొట్టి.. తెలుగు మీడియం విద్యార్ధులు, గ్రుహిణిలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడాలనే ఎంతో ద్రుఢ సంకల్పంతో  రూపొందించిన  మంచి వీడియోనే ఇది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎవరైనా 70% ఇంగ్లీషులో మాట్లాడేస్తారు. చూడకపోతే మాత్రం ఆణిముత్యంలాంటి, ఎంతో విలువైన ఇంగ్లీష్ క్లాసులు, సులవైన పద్దతిలో చెప్పే స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ చాలా మిస్ అయిపోతారు.. ఇది మాత్రం పక్కా.. సో మరిచిపోకుండా ఈ వీడియో చూడండి. ఇంగ్లీషు నేర్చుకోండి. మీకు నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. అందరికీ తెలియజేయండి. ఆల్ ది బెస్ట్.

Visakhapatnam

2022-04-14 15:06:28

కాకినాడ వాసులకు సురక్షిత మంచినీరు

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 11,12, 34 డివిజన్లలో వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంచినీటి సరఫరాలో ఇబ్బందులు,సమస్యలను స్వయంగా పరిశీలించారు.  నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న మంచినీటిని స్వయంగా త్రాగి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
 మంచి నీటి నాణ్యత పై ఎటువంటి  అపోహలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.   కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచినీటిని  వాహనాల శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, రోడ్లు కడగడానికి వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించారు. త్రాగడానికి వినియోగించే మంచినీటిని అలా దుర్వినియోగం చేయడం  సరికాదని  సూచించారు.వేసవి దృష్ట్యా నీటిని పొదుపుగా వాడాల్సిన  ఆవశ్యకత ఉందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్ర స్థాయిలో   రోజువారీ నీటి సరఫరా జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి క్లోరిన్ శాతాన్ని సరిచేసి సరఫరా లో అవాంతరాలు లేకుండా పరిష్కరించాలని, ఎక్కడైనా  సమస్యలు ఉంటే  వెనువెంటనే పై అధికారులుకు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని ఆదేశించారు.  ఎక్కడైనా త్రాగు నీరు అందని పక్షంలో నీరు ట్యాంకర్లు ద్వారా పంపిణీ చేసి అందరికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈ  పి.సత్యకుమారి ఆదేశించారు.  ఈ పర్యటన లో ఇంచార్జి కమిషనర్  వెంట డి ఈ  ప్రభాకరరావు  అమీనీటిస్ సెక్రెటరీ ఉన్నారు.

Kakinada

2022-04-08 08:52:23

ఎండలో తిరిగి వడదెబ్బ బారిన పడొద్దు..

రోజురోజుకీ ఎండలు పెరగడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని సాధ్యమైనంత వరకూ ఎండలో తిరగ రాదని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, మంచి నీటిని కూడా తీసుకువెళ్ళి దాహం వేసినప్పుడు తాగాలి  అని  అన్నారు. మసాలా పదార్థాలతో తయారైన ఆహారపదార్థాలను తీసుకోరాదని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.

సర్పవరం

2022-04-08 08:18:55

ముంపు బాధితుల సమస్యలకు పరిష్కారం..

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు పోలవరం ప్రాజెక్ట్  ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.  గురువారం స్థానిక ఐటిడిఎలో  ప్రవీణ్ ఆదిత్య, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, సంబంధిత ఇంజనీర్లు, ఆర్ అండ్ ఆర్ అధికారులు, తహసిల్దార్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్  అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ కాలనీలలో మౌలిక సదుపాయాలు పక్కాగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా కొంతమంది 18 సంవత్సరాల ప్యాకేజీ, మరికొంత మంది ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ, భూమికి భూమి సమస్యలు కొంతమంది, త్రాగునీరు కొరకు సమస్యలు తదితరవి మా దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్ని సమస్యలు పరిష్కరించి మంజూరు  అమలు చేయుటకు నిబంధనల ప్రకారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొండమొదలు పంచాయతీలోని కొంతమంది ముంపు బాధితుల సమస్యలు కూడా  పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని ఎ ఆర్ అండర్ కాలనీలోనేనా బిల్డింగుల లీకేజీలు ఉంటే అదేవిధంగా మరుగుదొడ్ల లో లీకేజీలు ఉంటే త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఈఈ లు డేవిడ్ రాజు, నాగేశ్వరరావు, తహసీల్దార్లు వీర్రాజు, శ్రీమన్నారాయణ, డీఈ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2022-04-07 13:13:37

మంచి ఆరోగ్యం తోనే సంతోషం..

మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉండదని ప్రముఖ వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యక్తి శారీరిక, మానసిక, భావోద్వేగ సంతులిత జీవన స్థితినే అసలైన ఆరోగ్యంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించిందని అన్నారు. మనదేశంలో మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ ,కంటి శుక్లాలు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, టీ బి, వినికిడి సమస్యలు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలు, స్థూలకాయం అనారోగ్యాలుగా గుర్తించబడ్డాయి అని అన్నారు.  పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శుభ్రత, దురలవాట్లు లేకపోవడం, మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని డాక్టర్ అడ్డాల  తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు , రాజా తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram Junction

2022-04-07 06:01:02

గ్రామ సచివాలయాలతో ప్రజల ముంగిటకే సుపరిపాలన..

భారత దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని రాష్ట్ర ఉపము ఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. అవినీతికి, వివక్షతకు తావులేకుండా పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతిని ఆయన గుర్తుచేశారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు మంజూరు, తాగునీటి సరఫరా సమస్యకు పరిష్కారం, వైద్యం , భూముల సర్వే తదితర సమస్యలు ఏదైనా ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల్లో పరిష్కరించడం జరుగు తుందని అన్నారు. బుధవారం నరసన్నపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. తొలుత గోపాలపెంట గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ. 17.50 లక్షలతో నిర్మించిన డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ  అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య  ఉండదని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలని కృష్ణదాస్ కోరారు. అనంతరం నర్సింగ రాయుడు పేట గ్రామంలో రూ. రెండు కోట్ల నిధులతో లుకలాం నుంచి కొమనాపల్లి వరకు నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారికి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో ఎల్.కె. రోడ్డు నుండి ఎల్.కె. రోడ్డు వరకు (వయా కొబగాం,వెంకటాపురం) రూ.1.50 కోట్లతో ప్రత్యేక మరామ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. కామేశ్వరి పేట గ్రామ పంచాయతిలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ. 21.50 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి ఆరంగి మురళీధర్, జడ్. పి.టి.సీ చింతు అన్నపూర్ణ రామారావు, వైఎస్ ఎం.పి.పి చింతల సత్యవతి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లుకలాపు రంజిత్ కుమార్, వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పొట్నూరు సాయిప్రసాద్, గోపాలపెంట, పోతయ్యవలస సర్పంచులు ఎండ కృష్ణవేణి, కనపల సత్యప్రియ, కొత్తపాలవలస సర్పంచ్ వెంకట శ్యామ కుమార్, కామేశ్వరిపేట సర్పంచ్ రాములు రాధిక చక్రధరరావు, రాష్ట్ర కళల కార్పొరేషన్ డైరెక్టర్ బొబ్బరి ఈశ్వరరావు, పి.ఏ.సి. ఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, కనపల శేఖర్ రావు, సబ్బ రాము తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2022-04-06 11:32:47

సమగ్ర భూసర్వేతో ప్రతీ ఇంచీ కొలతల్లోకి వస్తుంది..

జగనన్న సమగ్ర భూ సర్వేను అందరు వినియోగించుకోవాలని కాకినాడ రూరల్  తహసీల్దార్ మురార్జీ సూచించారు. కాకినాడ రమణయ్యపేటలో ఈ మేరకు సమగ్ర భూ సర్వే కార్యక్రమమాన్ని తహశీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదునాతన కంప్యూటర్ ర్లు, డ్రోన్లు, శాటిలైట్ ద్వారా ప్రతి ఇంచు రేఖాంశాన్ని కూడా కొలిచి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ లో నిక్షిప్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశానుసారం కాకినాడ రూరల్ మండలం ముఖ్య ప్రదేశాల్లో ఈ సమగ్ర భూసర్వే కార్యక్రమం తొలుత నిర్వహించి తరువాత మొత్తం ప్రాంతాలను సర్వే చేయనున్నట్టు తెలియజేశారు. ఈ సర్వే లోసెంట్రల్ గవర్నమెంట్ అఫ్ ఇండియా సర్వయర్ పి. చిన్న కొండయ్య, మండల సర్వేయర్ గోపాలచార్యులు, వైస్సార్సీపీ నాయుకులు సత్తిబాబు,కృష్ణంరాజు, రమణ, రేఖారెడ్డి,భాస్కర్, ధర్మరావు, వీఆర్వో నున్న సత్యనారాయణ, నాగేంద్ర,కిరణ్, తాతారావు,భవాని,తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-03-28 10:31:00

బియ్యం పంపిణీ పొడిగింపుపై హర్షం..

భారతదేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ విధానాన్ని మరో 6 నెలలు పొడిగించడం పట్ల స్వచ్చభారత్ రాష్ర్ట కన్వీనర్ పాలూరి సత్యానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కరోనా మొదటి దశలో కేంద్రం ప్రారంభించిందని..అయితే ప్రస్తుత పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకొని 2022 సెప్టెంబర్ వరకూ పొడిగించడం  శుభపరిణామమని  పాలూరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేయడం హర్షనీయమని తెలియజేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకం ఊరటనిస్తుందని పాలూరి మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Prathipadu

2022-03-27 07:08:30

దిశయాప్ అత్యధిక రిజిస్ట్రేషన్లలో ఆముగ్గురు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్  అన్నవరం స్టేషన్ పరిధిలో దిశయాప్ ను అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించడంలో శంఖవరం మండలంలోని గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో మొదటి స్థానంలో శంఖవరం మండల కేంద్రంలోని శంఖవరం-1 గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష నిలవగా, మండపం గ్రామసచివాలయ మహిళా పోలీస్ గంగగౌతమికి ద్వితీయ స్థానం, నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజని త్రుతీయ స్థానాల్లో నిలచారు. సర్కిల్ పరిధిలో ఒకే మండలం నుంచి ముగ్గురు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మూడు స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ ముగ్గురిని జిల్లా అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.  వారి సచివాలయాల్లో కూడా సహచర సిబ్బంది అభినందించారు. దిశ యాప్ రిజిస్ట్రేష్లన్లో రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా ప్రధమ స్థానంలో నిలవగా ప్రస్తుతం ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని గ్రామసచివాలయ మహిళా పోలీసులందరూ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించడంలో ప్రత్యేక శ్రద్ధను కనపరడచం పై సర్కిల్ ఇనెస్పెక్టర్ కిషోర్ బాబు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో మిగిలిన గ్రామ సచివాలయ మహిళా పోలీసులందరూ దిశ యాప్ రిజిస్ట్రేషన్లు అధికంగా చేయించి యాప్ ను అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా చూడాలని కోరారు.

Sankhavaram

2022-03-25 04:52:45

New Delhi

2022-03-23 05:48:14

నీటి తీరువా నోటీసులతో రైతులను భయపెడుతున్న ప్రభుత్వం..బీజేపీ

నీటి తీరువా పన్నుల వసూళ్ళలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహించి, ఖజానాకు నిధులు అవసరమైనప్పుడు, పాత బకాయిలన్నీ వడ్డీతో సహా కట్టమని రైతులకు నోటీసులు పంపడం ప్రభుత్వాలకు సరికాదని బిజెపి స్వచ్చబారత్ అభియాన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కత్తిపూడిలో మీడియాతో మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణా లోపం వల్ల, రైతులకు కావలసినంత నీరు అందించలేకపోతున్నారని, శివారు భూములకు నీరు సరిగా అంధక ఏళ్ల తరబడి రైతులు పంట నష్టపోతున్నారని, కానీ పాతబకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించమనడం భావ్యం కాదని అన్నారు. ఖరీఫ్ పంటకు రూ 200/-, రబీ పంటకు రూ. 150/- చొప్పున, సంవత్సరానికి ఎకరానికి  రూ. 350/- చొప్పున, పాతబకాయిలన్నీ వడ్డీతో సహా కట్టమని నోటీసులు పంపుతున్నారని, కరోనా కారణంగా రైతులందరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, తుఫానులు, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయారని, ఇప్పటి వరకు ఉన్న నీటి తీరువా బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు.

Prathipadu

2022-03-19 10:52:41

చిన్నారులకు కరాటే శిక్షణతో ఆత్మ విశ్వాసం..

 అపాయం ఎదురైనపుడు సునాయసంగా ఎదుర్కోడానికి ఆత్మరక్షణ నిచ్చే విద్య కరాటే అని ఈ మార్షల్ ఆర్ట్స్ తో మనోధైర్యం ఇనుమడిస్తుందని రాష్ట్ర  టెన్నికాయిట్ సంఘ అధ్యక్షులు వై డి రామారావు పేర్కొన్నారు. కాకినాడలోని బోట్ క్లబ్ ఉద్యానవనంలో  పరిమల కరాటే క్లబ్ ద్వారా   కరాటే పోటీలలో విజేతలైన  బాలబాలికలకు  రామారావు  పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే శిక్షణ వలన  రక్షణ తో పాటు  శారీరక వ్యాయామం కూడా   చేకూరుతుందని అన్నారు.  కరాటే కోచ్ డి .సతీష్ మాట్లాడుతూ ఇటీవల కాకినాడ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీలలో తమ సంస్థ తరఫున 15 మంది బాల బాలికలు  పాల్గొనగా ముగ్గురికి స్వర్ణ, ముగ్గురికి రజిత ,నలుగురికి కాంస్య పతకాలు లభించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, కార్యదర్శి దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు ,చింతపల్లి సుబ్బారావు ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-03-10 11:10:14

కిడ్నీలను పదిలంగా కాపాడుకోవాలి..

శరీర  జీవక్రియలు అన్నిటికీ అతి ముఖ్యమైన అవయవం  కిడ్నీలు అని వీటి పనితీరు మందగించినా, పూర్తిగా నిలిచిపోయినా  రకరకాల ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున వాటిని పదిలంగా కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. కాకినాడలోని  సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో  ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం  పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన శరీరంలో  చిక్కుడుగింజల ఆకారంలో పిడికిలి సైజు లో నడుముకి ఇరువైపుల ప్రక్కటెముకల వెనుక భాగంలో కిడ్నీలు ఉంటాయని ఏదైనా కారణం చేత అవి దెబ్బతింటే అశ్రద్ధ చేయరాదని అన్నారు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ మలినాలను మూత్ర రూపంలో బయటికి పంపిస్తాయి అని అన్నారు. కిడ్నీలపై పనిభారం పెరిగే కొద్దీ అవి దెబ్బతింటాయని అన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, రక్తహీనత, కిడ్నీలో రాళ్లు, మానసిక ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ మందులు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు  దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. అనంతరం వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు,  రేలింగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-03-10 11:07:58

ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే..

మూఢాచారాలు, అసమానతలు, దౌర్జన్యాలను ఎదిరించిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని నేటితరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆధ్యాత్మికవేత్త పి.వి రాజేశ్వరి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా జరిగింది. రాజేశ్వరి మాట్లాడుతూ పురుషులతో సమాన హక్కులు, హోదా, గౌరవం కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు. వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, సతీసహగమనం ,భ్రూణ హత్యలు వంటి వాటిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన స్త్రీ విముక్తి ప్రదాత సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె 1897 మార్చి 10న కాలం చేశారని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Kakinada

2022-03-10 11:06:46