1 ENS Live Breaking News

గ్రామపాలనకు పునాది పంచాయతీరాజ్ వ్యవస్థ

అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి కొలబద్ద పంచాయతీరాజ్ సంస్థలు అని అనకాపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గింజాల గంగరాజు పేర్కొన్నారు. ఆదివావారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ,మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు అవసరమైన  వార్షిక ప్రణాళికలను ఒక యజ్ఞం లాగ పంచాయతీరాజ్ సంస్థలు రూపొందించి అమలు చేయాలనే లక్ష్యంతో 73, 74 రాజ్యాంగ సవరణలు 1993  ఏప్రిల్ 24 నుండి  దేశవ్యాప్తంగా అమలులోకి రావడంతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చక్కటి ప్రణాళికలు రూపొందించినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిపూర్ణమై మరింత పటిష్టవంతం అవుతుందని  అన్నారు. వేగవంతమైన అభివృద్ధి, సమగ్రమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి వికేంద్రీకరణ, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు .ఈ  కార్యక్రమంలో న్యాయవాది యనమల రామo, రాజా ,రాఘవరావు, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

సర్పవరం

2022-04-24 07:07:26

మీరు మనుషులుకాదు మానవత్వమే లేదు

మీకు అసలు మానవత్వం అనేది లేనట్టుంది. చిన్నపిల్ల అందునా 3ఏళ్ల చిన్నారిని ఎలా హింసిస్తారని అంగన్వాడీ సిబ్బందిపై అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కోవుర్ నగర్ లో మూడేళ్ల బాలుడు ఈశ్వర్ కృష్ణా ను అంగన్వాడీ సిబ్బంది కొట్టి గాయపరిచారు.విషయం తెలుసుకున్న మేయర్ వసీం శనివారం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాధిత చిన్నారి తల్లితండ్రుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లల్ని ఇలానే హింసిస్తారా అని ప్రశ్నించారు. బాద్యులపై చర్యలు తీసుకోని భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఐ సి డి ఎస్ సీడీపీఓ లాలితమ్మ కు మేయర్ వసీం సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.


Anantapur

2022-04-23 14:10:01

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పక్కాగా..

సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. శనివారం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో,  ఈ నెల 28 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా,  విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున, అనకాపల్లి జిల్లా కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శభాష్, డిఐజి ఎస్. హరికృష్ణ, పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్ లతో కలిసి ఆయన పరిశీలించారు. ముఖ్య మంత్రి పర్యటనకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున  వివరించారు. పైలాన్, స్టాల్స్, మోడల్ హౌస్, పార్కు లను ముఖ్యమంత్రి సందర్శిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ సమావేశానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.  సైనేజస్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీ పేద వారికి అన్ని సౌకర్యాలుతో కూడిన గృహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. వచ్చిన దరఖాస్తులలో తిరస్కరణకు గురైన దరఖాస్తుల తిరిగి సాధ్య సాధ్యాలను పరిశీలించి వారికి అర్హత గల ప్రతీ పేద వారికి లబ్ధి చేకూరాలన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. అనంతరం పైలాన్, మోడల్ హౌస్, సభా స్థలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Sabbavaram

2022-04-23 13:49:38

ముత్యాలమ్మతల్లి జాతర విజవంతం చేయాలి

జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరను భక్తి శ్రద్దలతో విజయవంతం చేయాలని ఐటిడిఏ పిఓ రోణంకిగోపాల క్రిష్ణ స్పష్టంచేసారు. శనివారం సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో కలిసి ఐటిడి ఏ సమావేశ మందిరంలో విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు,వెలుగు , వైద్య ఆరోగ్యశాఖ , ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27 వతేదీ నుండి 30 వతేదీ వరకు నిర్వహిస్తున్న అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకరిస్తామన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. జాతర కు వచ్చే భక్తులకు నిరంతరం తాగునీటి సరఫరా చేయాలని , మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సూచించారు. ఉత్సవంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు చెప్పారు. ఆలయం వద్ద తగిన పోలీస్ బందోబస్తు ,సిసి కెమెరాలు, కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని సూచించారు. ఈనెల 27 వతేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున పగటి పూట మైక్‌సెట్లు, ఇతర సౌండ్ సిస్టంలు వినియోగించ కూడదన్నారు. ఉత్సవంలో వెలుగు, జిసిసి, ఐసిడి ఎస్, వైద్య ఆరోగ్యశాఖ స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విడివికె ఉత్పత్తులను విక్రయించాలని అన్నారు. ఉత్సవ ప్రాంగణంలో అగ్నిమాపక శకటం, అంబులెన్సును అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ఎపిఓ(పిటిజి) ఎం. వేంకటేశ్వరరావు, చింతపల్లి తాహశీల్దార్ గోపాల క్రిష్ణ, ఎంపిడిఓ ఎల్.సీతయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, వెలుగు ఎపిడి మురళి, సి ఐ టి.శ్రీను, చింతపల్లి ఎంపిపి వంతాల బాబూరావు ఉత్సవ కమిటీ సభ్యులు డి.హేమంత్ కుమార్,జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-23 08:59:22

పుస్తక పఠనంతో మానసిక ఆనందం

పుస్తక పఠనం వలన మానసిక ఆనందం, విజ్ఞానం, వివేకం మన సొంతం అవుతాయి అని గ్రంథాలయ మాజీ ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పుస్తకాలు చదవడం వలన కలిగే మానసిక ఆనందాన్ని తెలుసుకునేలా చేయడమే ప్రపంచ పుస్తక దినోత్సవం మౌలిక లక్ష్యమని అన్నారు. పుస్తక పఠనం వలన జ్ఞాన వికాసం పెంపొందుతుందని వ్యక్తిని, సమాజాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పుస్తకాలు చదవడం వలన మనలో ఉండే అజ్ఞానం తొలగి వివేక వంతులను  చేస్తుందన్నారు. ఎటువంటి  విపత్కర పరిస్థితుల్లోనైనా సంయమనంతో ఆలోచించే సద్గుణం పుస్తక పఠనం వలన లభిస్తుందన్నారు. ఏ పుస్తకాన్ని అయినా  తపనతో, ఆసక్తితో చదవాలని సుబ్బారావు తెలిపారు. అనంతరం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, న్యాయవాది యనమల రామ0, పట్నాయక్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-04-23 07:27:19

వృక్షాలే జీవకోటికి ఆత్మ బంధువులు..

వృక్షసంపద జీవావర్ణాన్ని పర్యవేక్షిస్తూ, మానవాళికి జీవనోపాధి కల్పిస్తూ ఆత్మ బంధువుగా నిలుస్తుందని దరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు ఎస్. సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో  ప్రపంచ దరిత్రి రక్షిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమాత అని అన్నారు. భూమాత చల్లగా ఉంటేనే సమస్త జీవరాశి సజావుగా మనుగడ  సాగిస్తుందని అన్నారు. కానీ దట్టమైన అడవులను నరికేయడం, సహజ నిక్షేపాలను అంతూ పొంతూ లేకుండా తవ్వడం వలన పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతింటుందని అన్నారు.  ప్లాస్టిక్ చెత్త కూడా భూ కాలుష్యానికి ప్రధాన కారణమన్నారు. కాలుష్యం కారణంగా దుమ్ము, ధూళి వలన గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయి క్యాన్సర్,  ఆస్తమా,  గుండె జబ్బులకు పలువురు గురవుతున్నారని  అన్నారు. దీన్ని అధిగమించడం కోసం విలువైన భూ వనరులను పరిమితంగా వాడుకోవడంతో పాటు  విరివిగా మొక్కలు నాటి అవి పెరిగే వరకు సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ సంచుల స్థానే గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులను వినియోగించకుండా కంపోస్టు, జీవ ఎరువులను వినియోగించాలని సురేఖ తెలిపారు. అనంతరం బుర్రకథ దళంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్కలు, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ , రేలంగి బాపిరాజు , మల్లీశ్వరి , ఓం నమశ్శివాయ  తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-04-22 07:51:57

సమయానికి రాకపోతే వేటు తప్పదు..

స‌మ‌య పాల‌న పాటించ‌ని స‌చివాల‌య సిబ్బందిపై జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రుకాని సిబ్బందికి మెమోలు జారీ చేయాల‌ని ఆదేశించారు.  విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని అల‌కానంద కాల‌నీ 47వ వార్డు స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి శుక్ర‌వారం ఉద‌యం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆమె ఉద‌యం 9.55 గంట‌ల‌కే స‌చివాల‌యాన్ని చేరుకున్నారు. ఆ స‌మ‌యానికి స‌చివాల‌యంలో కేవ‌లం ఇద్ద‌రు ఉద్యోగులు మాత్ర‌మే ఉన్నారు. ఉద‌యం 10.15 గంట‌లు వ‌ర‌కు, సుమారు 20 నిమిషాల‌పాటు క‌లెక్ట‌ర్‌ స‌చివాయంలోనే ఉన్న‌ప్ప‌టికీ, మిగిలిన సిబ్బంది హాజ‌రు కాక‌పోవ‌డంతో, ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బందికి మెమోలు జారీ చేయాల‌ని, మున్సిప‌ల్‌ స‌చివాల‌యాల స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌రీష్‌ను ఆదేశించారు.  

Vizianagaram

2022-04-22 07:48:51

జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచాలి

జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మాకవరపాలెం మండలం తామరం, మాకవరపాలెం, భీమబోయిన పాలెం గ్రామాలలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  ప్రణాళిక ప్రకారం ఇనుము, సిమెంటు, ఇసుక ఇటుక సరఫరా చేయాలని,  నిర్మాణాలు తొందరగా పూర్తి చేయించాలి అన్నారు. నిర్ణీత సమయంలో అన్ని గృహాలు పూర్తవ్వాలన్నారు.  కాలనీల్లో పనులను పరిశీలిస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  వారంతా ఎంతో సంతోషంతో తమకు సొంత ఇల్లు ఏర్పడుతున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని దీనిపై తక్షణం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ పర్యటనలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్ గోవిందరావు, ఎంపీడీవో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Makavarapalem

2022-04-21 16:29:26

చదువుల్లో మరింతగా రాణించాలి

చదువులో రాణించినా నాడే అంబేద్కర్ ఆశయాలు సాధించినవారువుతారు అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. గురువారం నర్సీపట్నం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న వారికి వీడ్కోలు సభ జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే పరీక్ష రాసుకునేందుకు సుమారు 300 అట్టలు, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుంచి చాలా దూరం నుంచి వచ్చి చదువుతున్న మీరంతా బాగా చదివి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను అన్నారు. కార్పొరేటు కళాశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల కళాశాలలను మెరుగు పరుస్తుందని అన్నారు.దీంతోపాటు హెచ్ సి ఎల్  లో ఉద్యోగాలు పొందిన 15 మందికి మెమెంటో లను అందజేసి వారిని సన్మానం చేశారు. అదేవిధంగా కళాశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న క్లాస్ కి మొదటి మరియు రెండవ ర్యాంకు సాధిస్తున్న విద్యార్థినిలకు ప్రత్యేకంగా మెమెంటో లను అందజేసి వారిని ఉత్సాహపరిచారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశారద ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇప్పటికే తమ కళాశాలలో చదువుకున్న వారు ఉన్నత స్థానాలకు, ఉన్నత చదువులకు వెళ్లారని చంద్రశారధ తెలిపారు. బాలికలు సాంస్కృతిక నృత్య రూపక కార్యక్రమాలలో కళాశాలను అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను ఘనంగా పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ సత్కరించారు పాఠశాలలో మరిన్ని వసతులను సమకూరుస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Narsipatnam

2022-04-21 14:34:59

భూముల రీసర్వేలో పురోగతి నమోదుకావాలి..

భూముల రీ సర్వే పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనపర్తి మండలంలో రీసర్వే పనులను తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రీ సర్వే డేటా ఎంట్రీ నమోదు ను పరిశీలించారు. క్షేత్రస్థాయి లో సేకరించిన డేటా వివరాలు నమోదు విషయం లో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. భూములు సర్వే నవీన కరణలో డేటా నమోదు కీలకం అయినందున  మండల అధికారులు సిబ్బంది పై పూర్తి భాద్యత ఉంచి నిర్లక్ష్యం గా వ్యవహరించారాదని పేర్కొన్నారు. పురోగతిని నమోదు చేస్తూ.. రీ సర్వే వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు.  ఈ తనిఖీ లో మండల స్థాయి అధికారులు, తదితరులు ఉన్నారు.

Anaparthi

2022-04-19 14:56:00

ఫ్యాన్లు బహుకరించిన అడబాల ట్రస్ట్

కాకినాడలోని రమణయ్యపేట గైగోలుపాడు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల సౌలభ్యం  కోసం అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విఆర్వో తాతారావు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నందున వారి సౌలభ్యం కోసం సీలింగ్ ఫ్యాన్లు సమకూర్చిన అడబాల ట్రస్ట్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ సేవాతత్పరత అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ .రవి మాట్లాడుతూ మాజీ సర్పంచ్ గా అడబాల రత్న ప్రసాద్ పాఠశాలలో లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  అన్నారు.   ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు అందజేశారని ఆ సమయంలో సీలింగ్ ఫ్యాన్ లు కావాలని అడిగిన వెంటనే సమకూర్చారని అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి. లోవబాబు, పట్నాయక్, రేలింగి బాపిరాజు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు .

Ramanayyapeta

2022-04-19 13:03:57

అగ్ని ప్రమాదాలపై అవగాహన ముఖ్యం..

వేసవి కాలం వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటి నివారణపై అవగా హన ముఖ్యమని అగ్నిమాపక శాఖ అధికారి బి. ఏసుబాబు  పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపిఐఐసి కాలనీ  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మామూలు సీజన్లో కన్నా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు అధిక మన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు గాను ఈనెల 14 నుండి  20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల వలన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ప్రాణాలను సైతం లెక్కచేయక అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయో వాటిని ఏ విధంగా నివారించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రాక్టికల్ గా వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల ఆధ్వర్యంలో ఏసుబాబు ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలంగి బాపిరాజు, పార్థసారథి, మల్లీశ్వరి, పట్నాయక్ ,రాఘవరావు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Ramanayyapeta

2022-04-19 13:02:10

గ్రుహ నిర్మాణాలు మరింత వేగంపెంచాలి

పేదలందరికీ ఇళ్ల పధకంలోని గృహాల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము అందుబాటులో వుంచి నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు లో జగనన్న పేదలందరికీ ఇళ్ల పధకం లే అవుట్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. లే అవుట్ 7.39
ఎకరాలలో 285 ప్లాట్లు ఏర్పాటు చేసారని, వీటిలో 257 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసారని, బిలో బేస్మెంట్ లెవల్ లో 108 ఇల్లు, బేస్మెంట్ లెవల్ లో 74 ఇల్లు, రూఫ్ లెవల్ లో 19 ఇల్లు, రూఫ్ పూర్తి అయినవి 45 ఇల్లు ఉన్నాయని హౌసింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులు అందరికి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్, దశల వారీగా బిల్లులు
మంజూరు అయ్యేలా హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించిన ఇంటి నిర్మాణాల పురోగతి తెలిపే పాస్ పుస్తకాలను లబ్దిదారులకు అందించి, ఎప్పటికప్పుడు నిర్మాణ వివరాలు, బిల్లుల చెల్లింపు వివరాలు, సప్లయ్ మెటీరియల్ వివరాలు అధికారులు నమోదు చేసి సంతకాలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను అధికారులు తనిఖీ చేసే సమయంలో పాస్ పుస్తకాల లోని వివరాలను
సరి చూసుకోవడానికి వీలుగా వుంటుందన్నారు. లే అవుట్ లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారు రేష్మ భర్త మక్బుల్ తో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడి ఇంటి నిర్మాణానికి అధికారులు అందించిన సహకారం, మెటీరియల్, జమ చేసిన నగదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించారని, ప్రతి దశలోనూ దగ్గరుండి అవసరమైన
మెటీరియల్ సకాలంలో అందించారని లబ్దిదారు సంతృప్తి వ్యక్తం చేసారు. లే అవుట్ లోని కొంతమంది లబ్దిదారులు అంతర్గత రహదారులు, కల్వర్ట్, విద్యుత్ స్తంభాలు, పూర్తి స్థాయిలో నీటి సరఫరా అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా, అంతర్గత రహదారులు చదును చేయాలని, విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాలలో  వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్ట్ నిర్మాణానికి, మంచినీటి సరఫరా పనులకు
టెండర్లు జరుగుతున్నాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇంటి నిర్మాణానికి బ్యాంకర్ల ద్వారా అందించిన రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్  రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకుల ద్వారా అందిస్తున్న పైకాన్ని సద్వినియోగం  చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ప్రభాకర రెడ్డి, హౌసింగ్ పీడీ సాయి నాథ్, వట్టిచెరుకూరు తహశీల్దారు ఫణేంద్ర బాబు, యంపీడీఓ ఉషా రాణి, జెడ్పీటీసీ వెంకట లక్ష్మీ, హౌసింగ్, పంచాయితీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్,
సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Vatticherukuru

2022-04-19 12:54:36

సీఎం వైఎస్ జగన్ కూడా ఒక వాలంటీర్..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక వాలంటీర్, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వాలం టీర్ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం పని చేస్తున్న మేమంతా వాలంటీర్లమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం ఉత్తమ సేవలందించిన వాలంటీర్ లకు పురస్కార సత్కార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కార ప్రదానం చేశారు. ఈ సందర్భముగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పాలన ప్రజలకు అందుబాటులో లేదని వాలంటీర్, సచివాలయ వ్యవస్థను నెలకోల్పోరని ఆయన అన్నారు. వాలంటీర్లను విమర్శించిన నాయకులు  కరోనా కాలంలో జూమ్ మీటింగ్ లో కనిపించెవారిని విమర్శించారు. పొందూరు మండలం పరిధిలోని అచ్చిపోలు, దల్ల, ధర్మపురం, గోకర్ణ పల్లి, గోరింట, కనిమెట్ట, కింతలి, కోటిపల్లి సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు సేవమిత్ర, సేవ రత్న, సేవవజ్ర  పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు , జడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-04-19 11:51:29

Simhachalam

2022-04-15 13:29:14