1 ENS Live Breaking News

రాజ్యాంగం వలనే అన్నివర్గాలకు సమాన హక్కులు..

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అన్ని వర్గాలకు సమాన హక్కులు సమకూరాయని కరప ఎంపీడీఓ కె.స్వప్నపేర్కొన్నారు.  రాజ్యాంగ నిర్మాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరప మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ  మాట్లాడుతూ నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి విశేష గౌరవం వుందని, దానిని మనమంతా మరింత గౌరవించుకోవాలని ఎంపీడీఓ స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Karapa

2021-11-26 10:46:16

మహిళలపై హింస కూడా హక్కుల ఉల్లంఘనే..

గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగి మహిళలకు రక్షణ కొరవడిందని ఇవన్నీ  మానవ హక్కుల ఉల్లంఘనే  అని ప్రముఖ న్యాయవాది శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట, రాయుడు పాలెం లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ  స్త్రీ హింస నిరోధక దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళ  అన్నిరంగాల్లో ఎదుగుతున్నా ఆమెపై హింస అణచివేత వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు.  వయసు తారతమ్యం లేకుండా అన్ని ఆదాయ వర్గాలు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలంతా బాధితులేనని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి పలు చట్టాలు ఉన్నాయి అన్నారు. సమాజం కోసమో, సంప్రదాయాల గురించో లేదా పిల్లల కోసమో   హింసను భరించాల్సిన అవసరం లేదని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే అండగా నిలుస్తుందని శ్రీలక్ష్మి తెలిపారు. అనంతరం ఉచిత న్యాయ సేవలు పై కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-25 17:11:39

ఓటిఎస్ పై సిబ్బంది ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలి..

గ్రామ సచివాలయ సిబ్బంది ఒటిఎస్ వసూళ్లపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని కరప మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్ శ్రీనివాసరావు గ్రామసచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కరప మండల కేంద్రంలోని సచివాలయ పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ పై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున..సచివాలయాల వారీగా సిబ్బంది నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. పంచాయతీలకు వచ్చిన ఓటిఎస్ జాబితాల వారీగా లబ్దిదారుల ఎంపిక చేసి, వారికి అవగాహన కల్పించడంతోపాటు, వారినుంచి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాలను వసూలు చేయడంతోపాటు వారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల గ్రేడ్1 నుంచి డ్రేడ్ 5 వరకూ కార్యదర్శిలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-11-25 17:10:10

ముందు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..

రోగాలు వచ్చిన తర్వాత చికిత్స పొందే కన్నా అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక జీవనశైలి, శారీరక వ్యాయామం లోపించడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడంతో పలువురు  స్థూలకాయులు అయ్యి దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం ,రక్తపోటు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులకు గురవుతున్నారన్నారు. దీని నివారణకు గాను రోజూ క్రమబద్ధంగా వ్యాయామం చేయాలని, ఆహారంలో నూనె పదార్ధాలు తగ్గించాలని, తీపి పదార్థాలు తిన రాదన్నారు. పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవాలని డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-25 17:08:38

జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీతో అవగాహన..

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కరప ఎంపీడీఓ కె.స్వప్న పేర్కొన్నారు. గురువారం కరప మండల కేంద్రంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, కాలువల్లో చెత్తలు వేడయం ద్వారా మురుగునీరు ప్రవాహం నిలిచిపోయి దోమలు వ్రుద్ధి చెందడంతో పాటు, దుర్వాస వెదజల్లుతుందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి వీధుల్లోకి చెత్త సేకరణకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. లేదంటే గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చెత్త డంపర్ బిన్ లలో వేయాలన్నారు. అంతేకాకుండా చెత్త వేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదన్నారు. అవి మట్టిలో కలిసే అవకాశం లేనందున కాలుష్య కారకాలుగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నాగేంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-11-25 17:07:34

వన్ టైమ్ సెటిల్ మెంట్ లక్ష్యాలను పూర్తి చేయాలి..

కాకినాడ రూరల్ మండలం పరిధిలో వన్ టైమ్ సెటిల్ మెంట్ లక్ష్యాలను పూర్తిచేయాలని ఎంపీడీఓ పిఎన్.మూర్తి సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రం నుంచి అన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలో ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాల ఆధారంగా ఒటిఎస్ ను పూర్తిచేయాలన్నారు. ముందు లబ్దిదారులకు ఓటిఎస్ యొక్క ఉపయోగాలు తెలియజేయడం ద్వారా ఎక్కువ మంది ముందుకి వచ్చే అవకాశం వుంటుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామవాలంటీర్లకు వారికి కేటాయించిన ఇళ్లలో ఎంత మంది ఓటిఎస్ జాబితాలో ఉన్నారో తెలుసుకొని వారి ద్వారా సంప్రదింపులు చేయించాలన్నారు. ఓటిఎస్ లో జిల్లాలోనే కాకినాడ రూరల్ మండలం ముందుండేలా సచివాలయ సిబ్బంది శ్రమించాలని ఎంపీడీఓ సూచించారు. థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామసచివాలయం ముందు ప్రతీరోజూ శానిటేషన్ చేయించి బ్లీచింగ్ చల్లించాలన్నారు ఆదేశించారు.

కాకినాడ రూరల్

2021-11-23 15:47:46

జగనన్న స్వచ్చసంకల్పం కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.. ఎంపీడీఓ కె.స్వప్న

కరప మండలంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలోని ప్రజలకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అవగాహన కల్పించాలని ఎంపీడీఓ కె.స్వప్న సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని అన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలతోనూ ఆమె టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతీ ఇంటి వద్ద తడి చెత్త, పొడిచెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి ఇచ్చేవిధంగా చూడాలన్నారు. తద్వారా చెత్త సేకరణ సులవవుతుందని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అంతేకాకుండా గ్రామ వాలంటీర్లకు వారికి కేటాయించిన కుటుంబాలకు వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలన్నారు.  ఇప్పటికే అన్ని పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు మంజూరు చేసిందని వాటిని కూడా జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రామానికి పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆమె సూచించారు.

Karapa

2021-11-23 14:56:14

ఉప్పలంక లో ఓటిఎస్ కింది ముగ్గురుకి రిజిస్ట్రేషన్లు..

కరప మండలంలో ఉప్పలంక గ్రామసచివాలయంలో ముగ్గు రు లబ్దిదారుల నుంచి రూ.30వేలు ఓటిఎస్ కింద వసూలు చేసినట్టు ఈఓపీఆర్డీ నాగేంద్ర తెలియజేశారు. ఈ మేరకు కరపలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప్పలంక పంచాయతీలో మల్లాది నాగూర్, సాదరబోయిన నాగలక్ష్మి, సంగడి కనకరాజు అనే ముగ్గురు నుంచి వన్ టైమ్ సెటిల్ మెంట్ కిందర రూ.30వేలు వసూలు చేసి వారికి ఇంటి స్థలం రిజిస్ట్రేషన్లు చేసిఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన లబ్దిదారులు కూడా వేగంగా ఓటిఎస్ కింద వచ్చిన పేర్లు కింద రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని  సూచించారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన ఈ కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు స్థలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియతో సొంతం అవుతుందని వివరించారు. ఈ అవకాశన్ని జాబితాలో పేర్లు వచ్చినవారంత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈఓపీఆర్డీ కోరారు.

Karapa

2021-11-23 14:54:00

జగనన్న స్వచ్ఛ సంకల్పం పెద్ద ఎత్తున చేపట్టాలి..

శంఖవరం మండల కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాల పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, వన్ టైమ్ సెటిల్ మెంట్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మండల ఉపాధ్యక్షులు దారా వెంకటరమణ సూచించారు. మంగళవారం శంఖవరం గ్రామసచివాలయంలో మూడు సచివాలయాల సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఒటిఎస్ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, రెండు కార్యక్రమాల్లో ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అవసరాలు వచ్చినా తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి,శంకరాచార్యులు, సత్య,  వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, ఎంపీటీసీ వీరబాబు, పడాల సతీష్, సచివాలయ సిబ్బంది,  గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-11-23 07:49:57

నష్టపోయిన ప్రతీరైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..

తుపానులో పంట నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యన్నారాయణ పేర్కొన్నారు. సోమవారం కరప మండలంలోని ఇటీవ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన స్థానిక వ్యవసాయ అధికారిణి ఏ.గాయత్రీదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించిందని అన్నారు. ఒక్క కరప మండలంలోనే 12వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి ఆయనకు వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తరవాత పూర్తివివరాలు ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు, మండల నాయకులు పాల్గొన్నారు.

Karapa

2021-11-22 13:45:07

14884 ఎకరాల్లో ఈ-క్రాప్ బుకింగ్ పూర్తి..

కాకినాడ రూరల్ నియోజకవర్గంల పరిధిలోని కరప మండలంలో 14వేల 884 ఎకరాల్లో ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసినట్టు మండల వ్యవసాయ అధికారిణి ఎ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కరపలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.విజయ్ కుమార్ ఆదేశాలతో అనుకున్న సమయానికే ఈ-క్రాప్ బుకింగ్ తోపాటు, రైతుల బ్యాంక్ అకౌంట్ ఈ-కెవైసీ కూడా పూర్తిచేశామన్నారు. ఇపుడు పంట నష్టపోయిన రైతులకు ఈ-క్రాప్ నమోదు ఆదారంగానే  ఇన్ పుట్ సబ్సిడీ, నష్టపరిహారాలు అందనున్నాయని చెప్పారు. మండలంలో 21 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 19 మంది గ్రామీణ వ్యసాయ సహాయకుల ద్వారా అనుకున్న సమయానికే ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసినట్టు ఆమె ఆ ప్రకటనలో మీడియాకి తెలియజేశారు.

Karapa

2021-11-21 11:23:51

ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు..

కరప మండలంలో ధాన్యం కొనుగోలు  రైతు భరోసా కేంద్రాల వద్దే చేపడుతన్న విషయాన్ని రైతులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నట్టు మండల వ్యవసాయశాఖ అధికారిణి ఎ.గాయత్రీదేవి తెలియజేశారు. ఈ మేరకు కరప మండలంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామీణ వ్యవసాయ సహాకులు మరియు సచివాలయ గ్రామవాలంటీర్ల సహాయంతో రైతులకు ధాన్యం కొనుగోలుపై చైతన్యం తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆర్బేకే కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న విషయం ప్రతీ రైతుకు తెలియాలనే ఉద్దేశ్యంతో సచివాలయాల పరిధిలో ప్రత్యేక అవగాహన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మకానికి తీసుకు వచ్చే లోపు ఈ-క్రాప్ బుకింగ్, బ్యాంకు అకౌంట్ ఈ-కేవైసీ పూర్తిచేసుకొని ఉండాలన్నారు. ఒక వేళ ఎవరైనా రైతులు చేయించుకోకపోతే గ్రామీణ వ్యవసాయ సహాయకులను ఆర్బీకేల్లో సంప్రదించి చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన వ్యవసాయ అధికారిణి గాయత్రీ దేవి ఈ సందర్భగా మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Karapa

2021-11-21 11:22:26

పాఠశాలల్లో నేషనల్ అసెస్ మెంట్ సర్వే..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసు కొనేందుకు నేషనల్ అసెస్మెంట్ సర్వే కాకినాడ రూరల్ మండలంలో చక్కగా జరుగుతోందని మండల విద్యాశాఖ అధికారి ఐ.గణేష్ బాబు అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక ఉన్నత పాఠశాలల్లో ఒక్కో తరగతికి 30 మంది చొప్పున విద్యార్థులే ఉన్నారా, అంతకు మించి ఉన్నారా, వారి విద్యా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయనే విషయంపై సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్ధులు కాస్త వెనుకబడినా మళ్లీ పాఠశాలల్లో విద్య సాధారణ స్థాయికి రావడంతో మళ్లీ పుంజుకుంటున్నారని ఎంఈఓ తెలియజేశారు. ఈ సమయంలోనే అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యార్ధులకు మరింత మెరుగైన విద్య అందించే విధంగా సూచనలు సలహాలు అందిస్తున్నట్టు మండల విద్యాశాఖ అధికారి ఐ.గణేష్ బాబు వివరించారు.

Karapa

2021-11-20 13:03:49

ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించండి..

కరప మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేసి అవగాహన కల్పించాలని తహశీల్దార్ శ్రీనివాసరావు విఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. శనివారం కరప తహశీల్దార్ కార్యాయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు పీఎసిఎస్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి గాయత్రీదేవితో కలసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆర్బేకే కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న విషయం ప్రతీ రైతుకు తెలియాలన్నారు. మండలంలోని గ్రామసచివాలయాల పరిధిలోని వీఆర్వోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు జరగాలన్నారు. ఈ విషయంలో రైతులకు  ఏ రకమైన అనుమానాలు వున్న ప్రభుత్వం నిర్ధేశించిన నియమ నిబంధనలను వారికి తెలియజేసి అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్ సూచించారు.

Karapa

2021-11-20 13:02:29

రక్తదాతలంతా ప్రాణదాతలే.. ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు

రక్తదాతలంతా ప్రాణదాతలేనని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలంలోని పెనుమర్తి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దానశిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం ద్వారా దానితో ఎనిమిది మందికి ఆరోగ్యాన్ని ప్రశాదించవచ్చునన్నారు. ఆపద సమయాల్లో ఈ రక్తం క్షతగాత్రులకు ప్రాణం నిలబెతుందని అన్నారు. ముఖ్యంగా యువత రక్తదాన శిబిరాల్లో పాల్గొని మంచి సేవకులుగా ఎదగాలని సూచించారు. చాలా మందికి రక్తం ఇవ్వడం ద్వారా అనారోగ్యం భారిన పడతామని అపోహ వుంటుందని..కాని రక్తం ఇవ్వడం ద్వారా మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని ఆరోగ్యవంతులు ఏడాదిలో రెండు నుంచి మూడు సార్లు రక్తం దానం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆసుపత్రి వ్యవస్థాపకులు చంద్రశేఖర్, రోటరీ క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.

కాకినాడ రూరల్

2021-11-20 11:19:38