1 ENS Live Breaking News

ఏపీలో అధికారంలోకి వచ్చేది జనసేన-టిడిపి ప్రభుత్వమే

జనసేన - టీడీపి కూటమి ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రానున్నదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఎసీ సభ్యులు కొణిదెల నాగబా బు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, అనకాపల్లిని పట్టి పీడిస్తున్నవి ప్రధానంగా దోమలు, వైఎస్సార్సీపీ నాయకులు పట్టి పీడిస్తున్నారన్నారు.  సిగ్గు, యగ్గు వదిలేసి రోడ్ల పై గుండాల్లాగ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జన సైనికులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నేర్పారని, మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను ఈ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేసారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో అనకాపల్లి బెల్లం వాడేవారని దానిని కూడా వైఎస్సార్సీపి ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీను తిరిగి ప్రారంభించక పోగా అమ్మకానికి పూనుకున్నారని, ఫ్యాక్టరీ పై ఆధారపడిన లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతున్నారని అన్నారు. 

మీ అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పేరు నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదని, ఇలాంటి మంత్రిని నేను ఎక్కడా చూడలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉంటూ అనకాపల్లికి ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు చెప్పాలని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ఇంత నీచమైన, నికృష్టమైన, బఫూన్ ప్రభుత్వం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దొరికిందని, ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం ఎక్కువైపోయిందని ఉమ్మడి విశాఖ జిల్లా లోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుందని రాష్ట్రమంతా అంటున్నారని అందులో ఇక్కడ మంత్రికి కూడా వాటా ఉందని తెలిసిందని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరన్ హ్యాండ్ తో గంజాయి వ్యాపారాన్ని పెకిలిస్తామని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆక్రమణలు, కబ్జాలు చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసి జరిమానా వేసి మరీ వసూలు చేస్తామని హెచ్చరించారు. జగన్ అద్భుతమైన నటుడు అని, పచ్చి అబద్ధాలు కొరు అని భూ ప్రపంచంలో అంతడి వాడు మరొకడు లేడని అన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని కొనియాడారు.

అంతకు ముందు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి ఎలాగో, ఇక్కడ కొడు గుడ్డు మంత్రి కూడా అలానే ఆక్రమణలు చేస్తున్నారని, విస్సన్నపేటలో 600 ఎకరాలు దోచుకుంటున్నారని అన్నారు. బీఆర్టి కాలనీలో 80 ఎకరాల ఢీ ఫారం భూములు అక్రమిస్తున్నారని, మండల పార్టీ ప్రెసిడెంటుల పేరుతో మైన్స్ లో దండుకుంటున్నారని, ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారని అన్నారు. మాకవరంలో ఐదు ఎకరాలు మంత్రి బంధువుల పేరిట క్వారీ ఏర్పాటు చేసుకున్నారని, జన సైనికులు పోరాడి క్వారీల్లో తప్పులను ఎత్తి చూపి ఇటీవల 8.16 కోట్లు జరిమానా కూడా వేయించారాని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 వేల ఇండస్ట్రీస్ ఉన్నాయని, పరిశ్రమల శాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నప్పటికీ 100 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యారావు, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల కమిటీ ఇంచార్జి సుందరపు వెంకట సతీష్, అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ యాదవ్, రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు, కొట్ని సూరిబాబు, సత్యారావు గెంజి, జనసేన వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-10 16:20:33

సిహెచ్.నాగాపురంలో టిడిపి పతనానికి ఆ వ్యక్తే కారణం..?!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొనఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీ పతనానికి అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ మండలం, సిహెచ్.నాగాపురం గ్రామ పంచా యతీలో ఒక వ్యక్తి ప్రధాన కారణంగా మారుతున్నాడనే ప్రచారం గుప్పుమంటుంది. అంతేకాదు ఆ అంశాన్ని నిజం చేసేలా మారుతున్న ఆయన వ్యవహార సైలి అటు వైఎస్సార్సీపీ మండల నాయకత్వానికి వరంగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఎలాగైనా పార్టీని బ్రష్టు పట్టించి, అధికార వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి సొంతింటి కార్యకర్తలను కూడా అధికార పార్టీలోకి వెళ్లిపోయేలా చేస్తున్న ఆ వ్యక్తి అరాచకాలు ఇపుడు మండల పార్టీ,జిల్లా పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎలాగైనా చే జారిపోయిన్న కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఓటర్లను కూడగట్టుకునే పనిచేస్తున్న తరుణంతో ఆవ్యక్తి వ్యక్తిగత స్వలాభం, ఫాల్స్ ఫ్రెస్టేజీతో గ్రామ పంచాయతీలోని అన్ని విషయాల్లోనూ వేలు పెడుతుండటంతో కొద్దో గొప్పో ఓట్లు పడతాయనుకున్న పంచాయతీలో పూర్తిగా పార్టీ చతికబడి స్థితికి చేరుకుందనే వాదన బలంగా వినిపిస్తున్నది.

ఇప్పటికే సదరు వ్యక్తిపై మండల నాయకత్వం ఫిర్యాదుచేసినప్పటికీ పట్టించుకోకపోవడం, అటు జిల్లా నాయకత్వం చర్యలు తీసుకోకపోవడంతో సదరు వ్యక్తి పంచాయతీలో చేస్తున్న స్వలాభపనులకు పార్టీగ్రామస్థాయి కార్యకర్తలు కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించింది. గత కొద్ది రోజుల నుంచి గ్రామపంచాయతీలో పూర్తిగా పార్టీని బ్రష్టు పట్టించి, ఎవరూ పార్టీలో ఉండకుండా చేయడంలో సదరు వ్యక్తి యొక్క వ్యక్తిగత పనులకు పార్టీని దారు ణంగా వాడుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఈకారణంతోనే మొన్న కదలిరా టిడిపి మాడుగుల మండలంలోని మహాసభకు సైతం కార్యకర్తలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతకు కొద్ది రోజుల ముందు నిర్వహించిన సిద్దం వైఎస్సార్సీపి సభకు టిడిపి కార్యకర్తలు సైతం అధికార వైఎస్సార్సీపీ పార్టీతో తెలియకుండా కలిసి వెళ్లారనే ఆరోపణలు కూడా బగ్గుమంటున్నాయి. పేరుకి చిన్నగ్రామ పంచాయతీ అయినప్పటికీ సదరువ్యక్తి చేసే పనులకు, తేడా రాజకీయాలకు మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులకు సైతం ఫిర్యాదులు వెల్లువత్తే పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉన్న ఆ కాస్త ఓట్లు, కార్యకర్తలు కూడా చేజారిపోయే పరిస్థితి లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తి విషయంలో మండల, జిల్లా పార్టీ దృష్టిసారిస్తుందా లేదంటే ఆయన వ్యక్తగత పనుల కోసం పార్టీని వినియోగించుకుంటున్నా పర్వాలేదనుకొని ఊరుకుండిపోతుందా అని..!

Nagalapuram

2024-02-06 17:35:55

రామానుజ సమతా కుంభ్ కు ఆడారి కిషోర్ కు ఆహ్వానం

ఈనెల 20 నుంచి త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామానుజ సమతా కుంభ్ 2024 మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా టిడిపి యువనేత, మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ కు ఆహ్వానం లభించింది. ప్రపంచ ఖ్యాతి గాంచిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట జరిగి 3వ వార్షికోత్సవం సందర్భంగా  సమతా కుంభ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే విశాఖ వచ్చిన ఆయన 50వ అవగాహన సదస్సు బ్రోచర్ ను విడుదలచేసి అభినందించారు.

Visakhapatnam

2024-02-04 14:34:29

సోమవారం జీవీఎంసీలో జగనన్నకు చెబుదాం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జగనన్నకు  చెబుదాం ( స్పందన) కార్యక్రమం సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్టు జివీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగం, రెవిన్యూ, యు సి డి, ఇంజనీరింగ్ మొదలైన విభాగాలకు సంబంధించిన సమస్యలను నగర ప్రజలు స్వయంగా ఈ కార్యక్రమం తమ సమస్యలపై అర్జీలు పెట్టుకొని పరిష్కారం పొందాలని తెలియజేశారు.

Visakhapatnam

2024-02-04 14:25:57

మునగపాకలో గౌరీపరమేశ్వరుల ఉత్సవానికి భారీ ఏర్పాట్లు

అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఫిబ్రవరి 3 న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెంటకోట ఆదినారాయణ, ఆడారి అప్పలనాయుడు తెలిపారు.బుధవారం ఈ మేరకు గ్రామం లో సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.కొబ్బరి బొండాలు, చెరకు గడలు,కొత్త పంటలు ఎడ్లు బండి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తో పాటు, వివిధ రకాల స్వీట్స్, పిండి వంటకాలు తో పెద్ద ఎత్తున మహిళలు  ఊరేగింపు లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహోత్సవం లో  భారీ స్టేజ్ ప్రొగ్రాం లు , నేల వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది మునగపాక లో ఫిబ్రవరి 3 న గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ  తెలియజేసింది. ఉత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు.

Munagapaka

2024-01-31 18:18:10

మిషన్ కర్షకదేవోభవకు చినజీయర్ స్వామి ప్రశంసలు

రైతులు శుభిక్షంగా ఉంటేనే జీవకోటికి సమయానికి ఆహార దినుసులు అందుతాయని, అలాంటి ప్రాజెక్టు చేపట్టి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధిచేయడానికి కృషిచే స్తున్న టిడిపియువనేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ ను చినజీయర్ స్వామి అభినందించారు. మంగళవారం విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిషోర్ తాను చేపడుతున్న మిషన్ కర్షకదేవోభవ ప్రాజెక్టు బ్రోచర్ ను చినజీయర్ స్వామికి అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయరంగం అన్నిచోట్ల పెరగాడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, తక్కువ సమయంలో అధిక దిగుబడి వచ్చే వంగడాల రూపకల్పనకు మిషన్ కర్షకదేవోభవ కేంద్రబిందువు కావాలన్నారు. ఆదిశగా ప్రోత్సాహక, చైతన్య కార్యక్రమాలు మిషన్ కర్షకదేవోభవ ప్రజల కోసం కార్యక్రమాలను రూపొందించాలన్నారు. మంచి పనిచేస్తున్న కిషోర్ అండ్ టీమ్ సభ్యులను చినజీయర్ స్వామి అభినందించి.. అనంతరం బ్రోచర్ ను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో ఆడారి కిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-30 15:42:56

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం..

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం ముందుకి సాగుతూ, తనవంతు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు పేర్కొన్నారు. గ్రామంలో జరుగుతున్న చర్చి నిర్మాణానికి  ప్రకటించిన సహాయాన్ని ఆయన నిర్వాహకులకి అందజేశారు. ఈ సందర్భంగా  గుర్రాజు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా వైఎస్సార్సీపి నేతగా గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గ్రామంలో జరిగే ఎలాంటి సేవాకార్యక్రమాలకైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి స్పూర్తితోనే తాను సేవాకార్యక్రమాలు చేపడుతున్నానని స్పష్టం చేశారు. శంఖవరం మండలంలో వజ్రకూటం పంచాయతీని అన్ని రంగాల్లోనూ ముందువరుసలో నిలబెట్టాలన్నదే తన ప్రధాన ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో సకురుసోమరాజు, సకురు రాజా, మొరాతి అప్పారావు, మొరాతి రాజు తదితరులు పాల్గొన్నారు.

2024-01-29 06:39:27

మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు .. జిల్లాకలెక్టర్

అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశం లో చైర్మన్ చిక్కాల రామారావు తో కలిసి ఆయన పాల్గొ న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించే రుణ సదుపాయాలను గూర్చి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారిలో అవస రమైన వారందరికీ వ్యవసాయ పశుసంవర్ధక మత్స్య ఉద్యానవన, బిందు సేద్య మొదలగు శాఖలకు సంబంధించి రుణాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదే శించారు. వీలైనంత ఎక్కువ మందికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పాడి పశువుల కొనుగోలుకు సంబంధించిన రుణాల విషయంలో పిఎం ఈజిపి సంస్థలైన కెవిఐసి, డిఐసి అధికారుల సమన్వయంతో రుణ ధరఖాస్తులను ఎక్కువ శాతం మంజూరు చేయించాలన్నారు.  పంటలు దిగుబడి శాతం పెంచేందుకు, మార్కెటింగ్ చేసేందుకు రైతులు వ్యాపార సంస్థ లకు అవగాహనతో రైతులకు మేలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు.  అనంతరం వ్యవసాయ శాఖ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు ఎస్ .రమణ, ఏ.సూరి అప్పారావు వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, సహకార బ్యాంకు మేనేజర్ వర్మ, పశుసంవర్ధక శాఖ జెడి ప్రసాద రావు, మత్స్య శాఖ డిడి ప్రసాద్, ఉద్యానవన శాఖ డిడి ప్రభాకర్ రావు, ఏపీఎంఐపీ ఏడి జీవీ లక్ష్మి, డీఎస్ఓ కె వి ఎల్ ఎన్ మూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనా రాయణ, తదితర శాఖల అధికారులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2024-01-19 14:02:48

ఓటర్ల సవరణకు లక్షా 13వేల దరఖాస్తులు.. ఈఆర్వో

రాజకీయ పార్టీలతో సమావేశం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే –2024 కుసంబంధించి ఫారం–6,7,8 ద్వారా ఇప్పటి వరకు 1,13,504 దరఖాస్తులు అందాయని కాకి నాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమా వేశం జరిగింది. సవరణ ప్రక్రియ ప్రగతిని ఆయా పార్టీల ప్రతినిధులకు ఈ ఆర్ ఓ  వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 436 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించామన్నారు. 12,023 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. ఇంకా సుమారు వెయ్యి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు నూతన దరఖాస్తులను కూడా స్వీకరించి పరిష్కరిస్తామన్నారు.ఈ  సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కమిషనర్‌ నివృత్తి చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు(వైఎస్‌ఆర్‌సీపీ), తుమ్మల రమేష్‌ (టిడిపి), అప్పారావు(బిఎస్‌పి), ఏఈఆర్వోలు జాన్‌బాబు, వరహాలయ్య, మురళి, సీతాపతిరావు, హరిదాసు, నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2024-01-18 15:13:48

పారదర్శకంగా కులగణన.. కమిషనర్ నాగ నరసింహారావు

కుల గణన పై శిక్షణా కార్యక్రమం  కాకినాడ లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కులగణన ను పారదర్శకంగా  నిర్వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్. నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో కుల గణన పై సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ యాప్ లో  కులాన్ని నమోదు చేయాలన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేని ప్రజల సౌలభ్యం కోసం... ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆయా సచివాలయాలలో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.కుల గణన ప్రక్రియకు వాలంటీర్ తో పాటు సచివాలయ కార్యదర్శి కూడా తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. కులగణన నమోదు అనంతరం ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ వరకు  పరిశీలనా కారులు వెరిఫికేషన్ చేస్తారన్నారు. ఈ ప్రక్రియ కు  సంబంధించి ప్రజలనుంచి సేకరించాల్సిన సమాచారం, విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో  స్పెషల్ ఆఫీస ర్లు,నోడల్ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు,ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు హాజరయ్యారు.

Kakinada

2024-01-18 15:09:33

కాకినాడలో 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ..ఈఆర్వో

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 25న  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసిహారావు చెప్పారు.  స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ అంశంపై, ఏఈఆర్వోలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన గురువారం సాయంత్రం సమావేశ మయ్యారు. ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడం, ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజెప్పేలా వివిధ అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను కూడా నిర్వహిస్తు న్నామ న్నారు. ఇందులో భాగంగా 25వ తేదీన వివేకానంద పార్కు నుంచి పీఆర్‌ కళాశాల వరకు ఓటర్‌ వాక్‌ నిర్వహించనున్నట్టు కమిషనర్  చెప్పారు. అనంతరం పీఆర్‌ కళాశా లలో జరిగే జాతీయ ఓటర్‌ దినోత్సవంలో వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేస్తామన్నారు. సీనియర్‌ ఓటర్లను సన్మానించడం, యువ ఓటర్లు, కొత్త ఓటర్లుకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా తో పాటు పలువురు అధికారులు,విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఓటరు దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆర్వోలు సీతాపతిరావు, వరహాలయ్య, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్‌బాబు, మురళికృష్ణ, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, యూని వర్సిటీ ఆఫ్‌ డెమోక్రసీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2024-01-18 15:06:07

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

 విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఐటిడిఏ పీఓ వి. అభిషేక్ హెచ్చరించారు. మండలంలోని ఈదుల పాలెం ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. పి.హెచ్.సి. వైద్యాధికారులు ఇద్దరు విధులకు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. డా.పి. శ్రీను, డా. ఎం.నరసింహలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఒపి రిజిష్టరును తనిఖీ చేసారు. మందుల నిల్వలపై ఆరా తీసారు. పి.హెచ్.సి పరిధిలో ఉన్న గర్భవతులు ఎంతమంది ఉన్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. గర్భవతులకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రసవ సమయానికి వారం రోజుల ముందుగా ఆసుపత్రి చేర్పించి సుఖ ప్రసవం జరిగేలా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు.ఈనెల 22 న 300 సెల్ టవర్లు ప్రారంభం ఈనెల 22 వ తేదీన 300 మొబైల్ టవర్లను ముఖ్యమంత్రి పర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ప్రాజెక్టు అధికారి చెప్పారు. పాడేరు మండలం ఈదుల పాలెం, డుంబ్రిగుడ మండలంలో ముఖ్యమంత్రి పర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సభ ఏర్పాటు స్థలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి. వి. ఆర్. ఎం. రాజు, డి. ఇ అనుదీప్, రిలయన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2024-01-18 14:26:51

నిశ్వార్ధంగా సేవచేసే అంగన్వాడీ లను ఎస్మాతో బెదిరిస్తారా

తమ హక్కుల సాధన కై పోరాటం చేస్తున్న ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తల ఎస్మా ప్రయోగించి బెదిరిస్తారా..? ఉద్యోగాల్లో చేరకపోతే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరిస్తా రా..? అంటూ తెలుగు దేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మండి పడ్డారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అంగన్ వాడి కార్యకర్తలు నిర్వహి స్తున్న నిరసన శిబిరంలో పాల్గొని వారి నిరసనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా దృక్పథానికి అంగన్వాడీలు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఎందరో పిల్లకు విద్యాబుద్దులు చెప్పే తల్లిగా కొనసాగుతున్న వాళ్ళని గౌరవంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. భారత దేశంలో అ త్యంత ఓర్పు, సహనం, శక్తి ఉన్నవాళ్లు మహిళలేనన్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ సర్వే లు, సంక్షేమ పథకాలు పంపిణీ సహా అన్ని పనులూ కేవలం అంగ న్వాడీలే చేస్తన్నారన్నారు. అలాంటిది వాళ్ళ కనీస డిమాండ్లను నెరవేర్చకపోవడం  పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. మూడుసార్లు చర్చలకు పిలిచి అసం పూర్తిగా వదిలేయడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఈ రాక్షస పాలన లో ఏ ఒక్క ప్రభుత్వ విభాగం కూడా సంతృప్తి గా లేవని, నాలుగున్నరేళ్ళ కాలం లో హామీ లు అన్ని తుంగలోకి తొక్కారని మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో అనకాపల్లి  టిడిపి నాయకులు భాస్కర్,  మహేష్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొ న్నారు.

Visakhapatnam

2024-01-18 14:19:33

సర్పంచ్ రఘురామ్.. సాంప్రదాయ కళలకు కేరాఫ్ నాగాపురం

ఆయనపేరు యలమంచిలి రఘురామ్..పేరు ఎంత సాంప్రదాయంగా ఉందో..అంతకంటే ఎక్కువగా సాంప్రదాయాలకు విలువనిస్తారు..సాంప్రదాయ కళలను, క్రీడలను ప్రోత్సహిస్తారు.. కోలాటం, తాళాల రామభజన, డప్పు దరువులు, తప్పెటగుళ్లు, సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచి గ్రామంలో చేసే మేలుకొలుపులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు. సాంప్రదాయాలన్నింటికీ గ్రామాన్నే చిరునామాగా చేస్తారు. శ్రీరాముల వారిని పల్లకీలో ఊరేగిస్తూ స్వయంగా ఆయనే కార్యక్రమంలో పాల్గొంటారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి మేలుకొలుపు చేసే బృందానికి డ్రెస్ కోడ్ పెట్టి గ్రామంలోని పెద్దలందరూ పాత తరాన్ని గుర్తుచేసుకునే విధంగా అన్నికార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తుంటారు. కోలాటానికి చేయూతనిస్తూ.. కళాకారులతో సరిసమానంగా నాట్యమాడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరుగున పడిపోతున్న సాంప్రదాయాలన్నింటినీ మళ్లీ అందరికీ పరిచియంచేస్తూ.. వాటి ఉనికి మరుగున పడిపోకుండా తనవంతుగా చేయూత నందిస్తున్నారు. ఎక్కడైనా సంక్రాంతి సమయంలో 
గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు, డాన్స్ బేబీ డాన్సులు పెడితే ఈయన మాత్రం కోలాట కళాకారులను ప్రోత్సహించడానికి కోలాటాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈయన చేసే కార్యక్రమాలకు యువత, గ్రామ పెద్దలు కూడా ఆవిధంగానే సహకరిస్తారు. గొలుగొండ మండలంలో సిహెచ్.నాగాపురం గ్రామ పంచాయతీ అంటే చాలా చిన్నదే అయినా ఇక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు ఎంతో చక్కగా ఉండటంతో ఈ గ్రామం పేరు అన్ని ప్రధాన రోజుల్లో మీడియాలో ఎప్పుడూ నానుతూ ఉంటుంది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడం దగ్గర నుంచి పంచాయతీ పరిపాలన ప్రజలందరికీ చేరువచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఎక్కడైనా గ్రామ 
సర్పంచ్ అంటే రాజకీయంగా కాస్త బిల్డప్ ఉంటుంది. పనిగట్టుకొని వెళ్లి సమస్య విన్నవించుకున్నా..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తారు. కానీ నాగాపురం గ్రామంలో మాత్రం అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. సమస్యను ఈయనదగ్గరకి వెళ్లి చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే, అన్నింటినీ ముందుగానే తెలుసుకొని ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారు. తమకు సహాయం చేయాలని వెళ్లి ఎవరికైనా తనవంతుగా సాయహాపడతారు. ఎవరైనా సమస్య అంటూ వస్తే..దానిని పరిష్కరించే వరకూ ఆయన స్వయంగా ఆ పనిపై నిమగ్నమైపోతారు. 

ముక్కనుమరోజు ఈ గ్రామంలో జరిగే తీర్ధ మహోత్సవాలకు కూడా చుట్టుప్రక్కల గ్రామపంచాయతీల సర్పంచ్ లను, ఆయా గ్రామాల తోడపెద్దులను గ్రామంలోకి ఆహ్వానించి పూజా కార్యక్రమాలను నిర్వహించి, పక్కగ్రామాల పెద్దలను గౌరవంగా చూస్తారు. సంక్రాంతి సందర్భంగా ముక్కనుమరోజు గ్రామంలో జరిగే తీర్థం సందర్భంగా కొయ్యూరు కోలాట బృందం వారితో చేపట్టిన కళా నృత్య కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కూడా సర్పంచ్ రఘురామ్ ఆధ్యర్యంలో ఎంతో ఉత్సాహంగా చేపట్టింది టీమ్ రఘురామ్ బృందం. ఈ కార్యక్రమంలో యలమంచిలి పెదబాబులు, యర్రాశ్రీనివాసరావు, యర్రా నాగేశ్వర్రావు, యర్రా బాబులు, గంట్ల బుచ్చియ్య, అప్పన దివానం, అప్పర సురేష్, అప్పన క్రిష్ణ, లంక లోవ, లంకశివ, అప్పన చిన్ని, అప్పన రమణ తదితరులు పాల్గొన్నారు.


క్రిష్ణదేవీపేట

2024-01-17 14:12:14

19ఏళ్ల తరువాత కలిసిన క్రిష్ణదేవిపేట పూర్వ విద్యార్ధులు

అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట జెడ్పీ హైస్కూలు 2005 బ్యాచ్ పదవతరగతి పూర్వ విద్యార్ధులు మంగళవారం కలిశారు. సంక్రాంతి పండుగ సంద ర్భంగా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్ధులు సామాజిక మాద్యమాల ద్వారా విషయాన్ని చేరవేసుకొని ఈరోజు  ఏజెన్సీ లక్ష్మీపురం అల్లూరి థీమ్ పార్క్ వద్ద కలిశారు. చాలా సంవ త్సరాల తరువాత కలుసుకున్న వారిలో చాలా మంది ఇంజనీర్లు, వైద్యులు, జర్నలిస్టులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వ్యాపారులుగానూ స్థిరపడ్డారు. ఈప్రాంతంలోని పదవతరగతి విద్యార్ధులు ఎవరైనా అల్లూరిథీమ్ పార్కు వద్దనే కలవడం అలవాటుగా వస్తోంది. వీరంతా కూడా ఇక్కడేకలిసి అల్లూరికి నివాళులు అర్పించి, చిన్ననాటి మధుల స్మ్రుతుల ను నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. మిగిలిన వారంతా మరోసారి పూర్తిస్థాయిలో కలుసుకోవాలని ప్రత్యేకంగా ఇక్కడే ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. 

Krishnadevipeta

2024-01-16 08:24:27