1 ENS Live Breaking News

మర్రిపాలెంలో ఫుట్ పాత్ అక్రమణాల తొలగింపు

పాదాచారులకు అంతరాయం కలిగిస్తూ ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ మేరకు కంచరపాలెం మెట్టునుండి ఊర్వశి జంక్షన్ వరకు ఉన్నా  ఫుట్ పాత్ లు అలాగే కంచరపాలెం రైతు బజార్ రోడ్డు జాతీయ రహదారిపై తాటిచెట్ల పాలెం నుండి బర్మా క్యాంపు వరకు సర్వీసు రోడ్ లో ఉన్న ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని శుక్రవారం కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పాదాచారులు వాహనదారులు వెళ్లేందుకు వీలు లేకుండా ఈ రోడ్లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ సీ.ఐ మళ్ళ అప్పారావు దృష్టికి తీసుకురావడంతో ఎ.స్సై పాపారావు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుతో కలిసి ఈ డ్రైవ్ చేపట్టినట్టు సీ.ఐ తెలిపారు. ఇలా అక్రమాలు చేయడంతో పాదాచారులు, వాహన దారులు, అటుగా వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, పలు ప్రమాదాలకు దారి తీసే విధంగా ఉండటం వల్ల ఖాళీ చేయించినట్టు ఆయన తెలిపారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించామని తెలిపారు.

Visakhapatnam

2023-05-20 08:50:01

కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే లక్ష్యం

మహా విశాఖ నగరంలోని పారిశుద్ధ కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం  5వ జోన్ తాటిచెట్లపాలెంలోని ఎం ఎస్ ఎఫ్ 5 లో నేషనల్ సేఫ్టీ సపాయికర్మాచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నమస్తే స్కీం ద్వారా పారిశుద్ధ కార్మికులకు జెసిబి లు, సెప్టిక్ ట్యాంకు వాహనాలను నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మలు అందించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,  పారిశుద్ధ్య కార్మికులను ఆర్థికంగా బలోపతo చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐదవ జోన్లో రెండు జెసిబి లు, ఒక సెప్టిక్ ట్యాంకును నమస్తే స్కీం ద్వారా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్సిడీపై అందించడం జరిగిందని తెలిపారు.  జోనల్ పరిధిలో ఒక్కొక్క వాహనానికి ఐదుగురు పారిశుద్ధ కార్మికులు గ్రూపుగా ఏర్పడి నిర్వహిస్తారని, ఈ వాహనాల్ని జీవీఎంసీ ప్రధాన గెడ్డలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.

 ఈ సబ్సిడీని ఏడు సంవత్సరాల పాటు జీవీఎంసీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా దళారులు కాంట్రాక్టర్లకు లబ్ధి  చేకూరకుండా నేరుగా పారిశుద్ధ కార్మికుడికే లబ్ధి పొందవచ్చని తద్వారా వారిని ఆర్థికంగా బలోపతo చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించారని ఆయన పరిపాలన త్వరలోనే ఇక్కడ నుండి కొనసాగుతుందని తద్వారా విశాఖ నగరం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే  జీవీఎంసీ పరిధిలో అన్ని జోన్ల కార్యాలయాలకు ఇటువంటి వాహనాలు సమకూర్చడం జరుగుతుందని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదరపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, ఏ ఎం ఓ హెచ్ రాజేష్, కార్యనిర్వహణ ఇంజనీర్ శ్రీనివాస్, విశాఖ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్ సుదీర్, సానిటరీ సూపర్వైజర్ జనార్ధన్, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-17 07:56:59

శ్రీసత్యదేవ నిత్యన్నదాన ట్రస్టుకి రూ.100116 విరాళం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి విజయనవాడకికి చెందిన  పొట్లా వెంకటేశ్వర్రావు దంపతులు, రూ.100116 లు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం చెక్కును దేవాలయ సిబ్బం దికి గురువారం ఆలయ సిబ్బందికి అందజేశారు. వినాయక చవితి వెళ్లిన రెండవ రోజు పొట్టా కొత్త లక్ష్మీ కుమారి పేరుపూ అన్నదానం చేయాలని కోరారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ సిబ్బందికి దాతలకు ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-05-17 07:50:23

మరిడమ్మ అమ్మవారి చీరకు వెండి విరాళమివ్వండి

కాకినాడ జిల్లా,అన్నవరం గ్రామంలోని(రైల్వే స్టేషన్ రోడ్డు) గ్రామ దేవత గా పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారికి త యారుచేయించే వెండి జెరీ చీరకు భక్తులు విరాళాలు ఇవ్వడానికి ముందుకి రావాలని ఆలయ కమిటీ నిర్వహాకులు బండారు రమణ కోరారు.  శ్రీఅమ్మవారికి ప్రతి సం వత్సరం వార్షిక జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తల్లికి తయారు చేయించే ఈ వెండి చీర తయారీకి భక్తులు వారి శక్తి మేరకు పాల వెండి దానం చేయాలన్నారు. సదరు  చీర తయారు నిమిత్తం సుమారు 40 కిలోల వెండి అవసరం అవుతుందని. అన్నవరం గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న  శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మ వారికి అన్నవరం గ్రామ ఆడపడుచులు ప్రతి ఇంటికి 1లేక 2 తులముల పాల వెండిని విరాళంగా ఇవ్వడానికి ముందుకి రావాలని  శ్రీఅమ్మ వారికి సమర్పించే వెండి చీర తయారులో భాగస్వాములు అయి శ్రీ అమ్మవారి క్పప కుపాత్రలు కావాలని కోరారు. వివరాలకు ఆలయంలో సంప్రదించాలన్నారు.

Annavaram

2023-05-16 09:14:22

150కార్ల ర్యాలీతో టిడిపి ఇన్చార్జిగా రంగ ప్రవేశం..తగ్గేదెలే

తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకర్గంలో కొత్త ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కార్ల ర్యాలీతో ప్రత్తిపాడు ఇన్చార్జిగా వరపుల రాజా సత్యప్రభ అన్నవరంలో చేసిన ఎంట్రీ తగ్గెదే లే అన్నట్టుగా సాగింది. వరుపుల రాజా హఠాత్మరణం తరువాత ఆమె భార్య సత్యప్రభ నియోజకవర్గ పగ్గాలు చేపట్టారు. వస్తూ వస్తూనే తొలిసారి అన్నవరం వచ్చి సభ నిర్వహించారు. నాడు వరపులకు  వచ్చిన అభిమానం కంటే నేడు ఆమె భార్యకు ప్రజలు, టిడిపి కార్యకర్తలు,నాయకుల నుంచి వచ్చిన అభిమానం, అండదండలు అందరినీ ఆలోచింపజేశాయి. పెద శంకర్ల పూడి నుంచి బయలు దేరిన అభిమానుల కాన్వాయ్.. లంపకలోవ,ఉత్తర కంచి, ఒమ్మంగి, శరభ వరం, గజ్జనపూడి, వెంకట నగరం, కొంతంగి  కొత్తూరు, యు.జె.పురం,నెల్లిపూడి, కత్తిపూడి, సీతయ్యమ్మ పేట, గ్రామాల మీదుగా అన్నవరం  చేరుకుంది. అక్కడ సత్యదేవుని పాదాల మండపం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. సత్యప్రభకు అభిమానులు, కార్యకర్తలు అడుగడునా బ్రహ్మరధం పట్టారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ తొలిరోజు కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలను, నాయకులను కలుసుకున్నారు. అనంతరం తొలిపావాంచ వద్ద సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. వరుపుల రాజాపై చూపించిన ప్రేమ, అభిమానాలు, తనపైనా చూపించి మీ తోబుట్టువుకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

2023-05-15 15:16:42

రాజన్న మన మధ్యలేరంటూనే కన్నీటి పర్యంతం

కట్టుకున్న భర్త దూరమైన వెంటనే రాజకీయపగ్గాలు చేపట్టడమంటే అంత ఆషామాషీ కాదు..ఎంతో గుండై ధైర్యం, పార్టీ అండ, కార్యకర్తల సహకారం ఉంటే తప్పా కుదర దు. అయినప్పటికీ తాళికట్టిన భర్త జీవితం నుంచి శాస్వతంగా కనుమరుగైన విషయాన్ని దిగమింగి ప్రజల్లోకి రావడం కూడా ప్రత్యేకంగానే చూడాలి. ఎల్లప్పుడూ భర్తచాటు భార్యగా ఉన్న వరుపుల రాజాసత్యప్రభ ఆయన హాఠాత్మరణం తరువాత ప్రత్తిపాడు నియోజవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజలతో మమేకం అయి తిరుగుతున్నారు. సోమవారం అన్నవరం వచ్చిన ఆమె నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా పాదయాత్ర చేసి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో వరుపులను తలచుకొని నడిరోడ్డుపైనే కన్నీటి పర్యంతం అయ్యారు. కష్టకాలంలో నావెంట ఉన్న ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుంటానని, రాజా లేని లోటుని ప్రతీ కార్యకర్తకు, నాయకుడి వెంట నిలబడి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. తనను దీవించాలని, రాజాపై చూపిన అభిమానం తనపైనా చూపాలని కోరారు. రాజా పేరు వినపడిన ప్రతీ క్షణం ఆయన తన కళ్లముందే ఉంటారని, ఆయనే తనను ఈ విధంగా మీముందు నిలబెట్టారంటూ చేసిన ప్రశంగం అందరినీ ఆలోచింపజేసింది. భర్తను తలచుకుంటూ, చేసిన ప్రసంగం సభికులను, కార్యకర్తల హృదయాలు ద్రవించేలా చేసింది.

ఆరునెలల వరకూ బయటకు రాకూడదనుకున్నా కానీ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రజలను దూరంగా ఉండలేక అంతటి బాధను దిగమింగుకొని మీ మధ్యకు వచ్చానని.. తనను మీ తోబుట్టువుగా అనుకొని సహకరించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజా అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, ఈసారి ఆయన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక మెజార్టీతో రాజానే గెలిపించాననుకొని తనకు పట్టం కట్టాలని కోరారు. నియోజవవర్గంలోని ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని, పనిచేసిన ప్రతీ కార్యకర్తను, నాయకులను పేరు పేరుగా గుర్తించుకుంటానని హామీ ఇచ్చారు. సత్యప్రభ మాట్లాడుతున్నంతసేపూ రాజా అమర్ రహే..సత్యప్రభ నాయకత్వం వర్ధిల్లాలి, అధికారంలోకి వచ్చేది టిడిపినే అనే వాఖ్యాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2023-05-15 15:03:06

జగన్ రెడ్డి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాలి..

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి దుష్టపరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వరు పుల రాజాసత్యప్రభ పిలుపునిచ్చారు. సోమవారం అన్నవరంలో నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా ఆమె గ్రామంలో పాద యాత్ర నిర్వహించారు. అంతకు ముందు తొలిపావంచా వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు తీరడంతోపాటు, రాష్ట్రం శుభిక్షంగా వుంటుందన్నారు. వరపుల రాజామన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానంటూ కన్నీటి పర్యంతం అయ్యా రు. కష్టకాలంలో నావెనుక నిలబడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.. వరపుల రాజా మాదిరిగానే తాను కూడా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని, నియోజకవర్గ ప్రజలు తనను మంచి మనసుతో దీవించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


Annavaram

2023-05-15 14:30:12

చాన్నాళ్లకు ఆరిలోవ రిజర్వ్ ఫారెస్టు రోడ్డుకు మహర్ధశ

గొలుగొండ మండల ప్రజల దశాబ్దాలకల, దీర్ఘకాలిక ఆరిలోవ రోడ్డు సమస్యకు శాస్వత పరిష్కారం లభించనుంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ రూపుదిద్దుకోబోతున్నది. 7 దశాబ్దాలుగా ఎందరో ప్రజా ప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళుతున్నా, గొలుగొండ మండల పరిధిలోని ,ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న, 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ మాత్రం చేపట్ట లేకపోయారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన, పెట్ల ఉమా శంకర్ గణేష్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చొరవతో తొలి అడుగు వేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ వెల్లడించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో  రెవెన్యూ, అటవీ, రోడ్లు భవనాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి సత్వరమే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.  ఈ సమావేశంలో ఆర్డిఓ  హెచ్ వి జయరాం, డీఎఫ్ఓ రాజారావు,  రేంజర్ లక్ష్మి నర్సు , గోలుగొండ తాసిల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.


Golugonda

2023-05-15 09:42:24

చాన్నాళ్లకు ఆరిలోవ రిజర్వ్ ఫారెస్టు రోడ్డుకు మహర్ధశ

గొలుగొండ మండల ప్రజల దశాబ్దాలకల, దీర్ఘకాలిక ఆరిలోవ రోడ్డు సమస్యకు శాస్వత పరిష్కారం లభించనుంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ రూపుదిద్దుకోబోతున్నది. 7 దశాబ్దాలుగా ఎందరో ప్రజా ప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళుతున్నా, గొలుగొండ మండల పరిధిలోని ,ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న, 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ మాత్రం చేపట్ట లేకపోయారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన, పెట్ల ఉమా శంకర్ గణేష్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చొరవతో తొలి అడుగు వేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ వెల్లడించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో  రెవెన్యూ, అటవీ, రోడ్లు భవనాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి సత్వరమే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.  ఈ సమావేశంలో ఆర్డిఓ  హెచ్ వి జయరాం, డీఎఫ్ఓ రాజారావు,  రేంజర్ లక్ష్మి నర్సు , గోలుగొండ తాసిల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.


Golugonda

2023-05-15 09:42:24

అన్నవరం ప్రసాదం కౌంటర్ లో ఫోన్ పే ఏర్పాటుచేయాలి

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ప్రసాదం కౌంటర్లలలో కొండపైనా, కొండదిగువన పాదాల మండపం వద్ద యూపీఐ, ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎక్కువ మంది స్వామివారి పాదాల మండపం, హైవేపే పై ఉన్న స్వామివారి రూప ఆలయం వద్ద ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రసాదం అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయని చెబుతున్నారు. భక్తులు ప్రసాదాలు కొన్న నగదును నేరుగా ఖాతాలోకి దేవస్థానం అధికారులు ప్రతీరోజూ సాయంత్రం రెండు పర్యాయాలు  జమచేస్తుంటరాని, యూపీఐ పేమెంట్ల ద్వారా ప్రసాదం అమ్మకాలు చేపడితే..నేరుగా ఆ మొత్తం దేవస్థానం బ్యాంకు ఖాతాల్లోకే చేరి సమయం కూడా కలిసివస్తుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 60శాతం మంది భక్తులు యూపీఐ విధానం ద్వారా పేమెంట్లు చేస్తున్నందున.. ప్రసాదం కౌంటర్ల దగ్గర ఫోన్ పే, గుగూల్ పే, పేటిఎం తదితర యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ స్కారన్లు ఏర్పాటు చేయడం ద్వారా త్వరగా ప్రసాదాలు కొనుగోలు చేసుకునేందుకు కూడా వీలు పడుతుందని, ఈ విషయంలో ఈఓ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.




Annavaram

2023-05-12 06:55:04

గొప్ప సిద్ధాంతకర్త కారల్ మార్క్స్..

ఆర్థిక అసమానతలు లేని స్వేచ్ఛపూరితమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని కోరుకున్న సిద్ధాంతకర్త కారల్  మార్క్స్ అని గ్రంథాలయ విశ్రాం తి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1818   మే 5న జర్మనీలో జన్మించిన కారల్ మార్క్స్ శ్రామికులకు మార్గద ర్శకుడు అని అన్నారు. పెట్టుబడి దారి నాగరికతలో కనీసం తిండి దొరకక బాధలు పడుతున్న ప్రజానీకానికి ఆయన సిద్ధాంతం ఒక ఆశాజ్యోతి వంటిదని అన్నారు.  ఆర్థిక అంశాలు, సామాజిక జీవనానికి సంబంధించిన ఇతర విషయాలను ఆయన చెప్పినంత  షూటిగా మరెవరు చెప్ప లేదని అన్నారు. ఆయన జీవితమంతా సమాజంలో నెలకొన్న వర్గ వైరుధ్యం, పెట్టుబడి దారి విధానం, సంపద యొక్క అసమాన పంపిణీకి వ్యతిరేకంగా సాగిందని అన్నారు. ఈ విషయాలపై ఆయన పలు రచనలు చేశారని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-05-05 07:58:22

సీఎం వైఎస్ జగన్ స్పూర్తితో కేన్సర్ రోగులకు జుట్టుదానం

ఈరోజుల్లో అందంగా పెంచుకున్న జుట్టుతో రకరకాల హెయిర్ స్టైల్ చేస్తుంటారు యువత.. కానీ ఆ యువకుడు మాత్రం పనిగట్టుకొని జుట్టు పెంచుకొని దానిని కేన్సర్ రోగులకు తయారు చేసే విగ్గులకు ఉచితంగా దానం చేస్తున్నాడు. ఆ యువకుడి పేరు గోపి వంశీక్రిష్ణ.. కాకినాడ జి ల్లా, శంఖవరం మండల కేంద్రం నివాసి.. చేసే పని గ్రామ సచివాలయ వాలంటీరు.. ఈ యువకుడికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంటే ఎన లేని అభిమానం..ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అంటే అమితమైన గౌరవం..వారి స్పూర్తితోనే ఈ యువకుడు గత రెండేళ్లు గా తన జుట్టును దానం చేస్తూ వస్తున్నాడు. మరెందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు సీఎం వైఎస్ చేస్తున్న సంక్షేమ కార్యక్ర మాలంటే చాలా ఇష్టమని, ఆయనపై ఉన్న ప్రేమ గౌరవంతోనే తాను వాలంటీరుగా చేరి తనవంతు సేవలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కే న్సర్ రోగుల విషయంలో ఒకసారి సీఎం జగనన్న చేసిన సూచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని..నాటి నుంచి నేటి వరకూ 2 దఫాలుగా ఏడాది పాటు పెంచిన తన జుట్టును కేన్సర్ రోగుల కోసం ఇస్తున్నానని చెప్పాడు. ఇకపై కూడా తన శిరోజ దానసేవను కొనసాగి స్తానని, మనం ఏదో రూపంలో ఎదుటివారికి సేవగా నిలవాలన్నదే తన అభిమతమని చెప్పాడు. ఆడుతూ, పాడుతూ జీవితాన్ని సంతోషంగా గడిపే కాలంలోనూ కేన్సర్ రోగుల కోసం వంశీ చేస్తున్న సేవను గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీరామంచంద్రమూర్తి, జేఏబిసి రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, విఆర్వో సీతారాం, సర్వేయర్ సురేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు మెచ్చుకొని తమ సచివాలయంలో పనిచేసే వాలంటీరు చేస్తున్న సేవను అభినందించారు.

Sankhavaram

2023-05-05 06:08:49

గోపాలపట్నం దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

విశాఖలోని 92వ వార్డు గోపాలపట్నం బాపూజీ నగర్ లో వేంచేసి వున్న కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మతల్లికి ప్రతీకరమైన రోజు కావడంతో అమ్మవారిని వేపకొమ్మలు, పూలదండ లతో అలంకరించి తెల్లవారుజాము 5గంటల నుంచే పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పిడుగు మంగలక్ష్మి మాట్లాడుతూ, అమ్మవారిని నిత్యపూజలు ఆలయంలో జరుగుతుంటాయన్నారు. శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. ఆ సమయంలో భక్తులు పెద్దఎత్తున దుర్గమ్మకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. అదే సమయంలో తల్లికి ఇష్టమైన చిన్నారులకు ప్రత్యేక తీర్ధ ప్రసాదాల వితరణ కూడా జరుగుతుందని వివరించారు. ఒక్క విశాఖ మహానగరమే కాకుండా ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి కూడా పర్వదినాల్లో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ధర్మకర్త తెలియజేశారు.

Visakhapatnam

2023-04-28 16:47:04

అన్నవరంలో 50% టిక్కెట్లే ఆన్ లైన్ 50% ఆఫ్ లైన్

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో వసతి గదులను  దేవాదాయధర్మాదాయశాఖ వెబ్ సైట్ కి అనుసంధానించి ఆన్ లైన్ చేశారు. అ యితే ఇక్కడ కేవలం 50శాతం గదులు మాత్రమే ఆన్ లైన్ చేస్తున్నారు. మిగిలిన వాటిని ఆఫ్ లైన్ లోనే అందించాలని నిర్ణయించారు. తద్వారా అప్పటికప్పుడు వచ్చే భ క్తులకు సౌకర్యార్ధంగా వుంటుంది ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ చెబుతున్నారు. కాగా మొత్తం టిక్కెట్లలోని 70శాతం ఆన్ లైన్ చేయడం ద్వారా భక్తులకు సౌకర్యంగా వుంటుందనేది వివిధ వర్గాల నుంచి వస్తున డిమాండ్. ఆఫ్ లైన్ లో ఉంచేసిన 50శాతం టిక్కెట్ల వలన చాలా వరకూ మిగిలిపోయే అవకాశం కూడా లేకపోలేదని, పైగా ఇక్కడే తిష్టవేసుకుని కూర్చున్న దళారులను నియంత్రించడానికి అవకాశం లేకుండా పోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చూడాలి దేవస్థా నం అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..!

Annavaram

2023-04-27 08:13:02