1 ENS Live Breaking News

తాళ్లపాలెం అగ్నిప్రమాద బాధితులకు మలసాలభరత్ చేయూత

అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తాను అండగా ఉంటానని, ఎలాంటి కష్టమొచ్చినా తాను చూసుకుంటానని వైఎస్సార్సీపి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్ పేర్కొన్నారు. సోమవారం తాళ్లపాలెం సంతలో ప్రమాదవసాత్తు పూరి గుడిసె కాలిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడి కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అత్యవసర సహాయం క్రింద రూ.10వేలు ఆర్ధిక సహాయాన్ని చేశారు. గుడిసె కాలిపోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఇల్లు మంజూరు చేయించేందుకు తహశీల్దార్ తో మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా నిత్యవసర సరుకులు సమకూర్చుకొవాలని కోరారు. తన అనుచరులకు ఈ కుటుంబ బాధ్యతను అప్పగించారు. కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట కశింకోట మండల వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tallapalem

2024-01-08 16:03:32

వైఎస్సార్సీపీ పాలనలో నవరత్నాలు ఎక్కడ..గండి

వైఎస్సార్సీపీలో నవరత్నాలు ఎక్కడ? అని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జి ప్రశ్నించారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో మూడు అంశాలు ఇప్పుడే చేసేస్తాం అంటున్నారు. టీడీపీ ప్రకటిం చింది కాబట్టి ఇప్పుడే అమలు చేస్తాం అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకోవాల న్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఎక్కడ ఇచ్చారు? ఏ శాఖలో ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులను పెర్మినెంట్ చేస్తాను, చట్టబద్దత తీసుకొస్తామన్న ప్రభుత్వం ఎక్కడ చేసిందన్నారు. నవ రత్నాలులో 98 శాతం అమలు అంటారు.. ఎక్కడ ఇచ్చారు? విద్యుత్ 300 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటే ఎలా? అని వైఎస్సార్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఉమ్మడి విశాఖకు ఇద్దరు మంత్రులను ఇచ్చారు. ఎమ్మెల్యే బదిలీలు చేసిన ప్రభుత్వం ఎక్కడ చూడలేదని ఆక్షేపించారు. ముందు ఈ రాష్ట్రం నుంచి  వైఎస్సార్సీపీ ని ప్రజలు బదిలీ చేసే సమయం ఆశసన్నమైందని అన్నారు.

Visakhapatnam

2024-01-08 15:14:05

తలసేమియా బాధితులకోసం డెక్కన్ మెగారక్తదాన శిబిరం

రక్తదానం ప్రాణదానంతో సమానమని డెక్కన్ కంపెని వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ పి.వి.ఎస్.ఎస్ రాజు అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డెక్కన్ ఉద్యోగులు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  మెగా రక్తదాన శిబిరం ద్వారా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడానికి సుమారు 320 మంది ఉద్యోగులు రక్తదానం చేశారని అన్నారు. వారందరినీ డెక్కన్ కంపెనీ యాజమాన్యం తరఫున అభినందించారు. మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ జగపతి రాజు మాట్లాడుతూ, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం చాలా అవసరమని వారికోసం మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా తలసేమియా సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. సదరు ఆసుపత్రి ద్వారా కంపెనీ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కె.వి.ఎల్ పి రాజు,మదర్ బ్లడ్ బ్యాంక్ గుప్త,ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ శ్రీనివాస్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Payakaraopeta

2024-01-08 13:55:45

కశింకోట సర్కిల్ మొట్టమొదటి సీఐ గా వినోద్ బాబు

శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అన్ని వర్గాల సహకారంతో సర్కిల్ పరిధిలో పోలీసు సేవలు అందిస్తామని సిఐ వినోద్ బాబు పేర్కొన్నారు. కశింకోట పోలిస్టేషన్ ను సర్కిల్ గా చేసిన తర్వాత  మొట్ట మొదటిగా ఆదివారం సిఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం జిల్లాకు చెందిన తాను  ఎస్సై గా  శ్రీకాకుళంలో పనిచేశానన్నారు. అక్కడి నుంచి  సిఐ గా పదోన్నతిపై ఇక్కడి వచ్చినట్టు చెప్పారు.  తాను శాంతి భద్రతల పర్యవేక్షణలో సిబ్బంది, ప్రజా సహకారంతో ముందుకు అడుగు వేస్తాను అన్నారు. రాబోయే సంక్రాంతి సంబరాల్లో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. 
ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్యగా వున్న ట్రాఫిక్ సమస్య పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలందరూ దిశ యాప్ ను వారి స్మార్ట్ ఫోన్ లలో ఇనిస్టాల్ చేసుకో వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చునన్నారు. అన్నివేళలా ప్రజాసేవలో కశింకోట సర్కిల్ పనిచేస్తుందని సిఐవివరించారు.

Anakapalle

2024-01-07 16:39:10

శ్రీవారి ఆలయంలో కనుల పండువగా రుక్ష్మిణీ కళ్యాణం

అనకాపల్లి గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ  రుక్మిణి కళ్యాణం భారీ భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.  దేవస్థాన ప్రధాన అర్చకులు,రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ , రేజేటి గోప అప్పలాచార్యులు(చక్రవర్తి) కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లికాని యువతి  యువకులు   రుక్మిణి కల్యాణంలో పాల్గొంటే వారికి అతి త్వరలో వారి జీవితంలోకి ఒక మంచి వధువు కానీ వరుడు కానీ వచ్చి అతి తక్కువ సమయంలోనే వివాహం జరుగునున్న నమ్మకంతో ఈ కళ్యాణం జరిపించుకుంటారని అన్నారు.  ఆ కారణంగానే అతి పుణ్యదినాలైన ధనుర్మాసంలో ఈ కళ్యాణం దేవాలయంలో జరిపిస్తున్నా మన్నారు. ఈ కళ్యాణంలో 108 మంది పెళ్ళికాని యువతీ యువకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.  ఈ కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం తిలకించారు. కళ్యాణ అనంతరం కళ్యాణ అక్షింతలను అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Anakapalle

2024-01-07 16:28:55

మానవ హక్కులు కాపాడుట అందరి బాధ్యత

మానవ హక్కుల కాపాడుటం అందరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.సంపత్ కుమార్ అన్నారు. అనకాపల్లి శ్రీ శిరిడి సాయి లా కాలేజీలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయనముఖ్య అతిథులుగా  హాజరై ప్రసంగించారు. మానవ హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. హ్యూమన్ రైట్స్ సభ్యులు విధి విధానాలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. న్యాయవాది విద్యార్థులకు తమ వృత్తిలో నైపుణ్యం పెంచుకునేందుకు సీనియర్ లాయర్ల దగ్గర నుంచి తగిన శిక్షణ, సూచన, సలహాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లా కాలేజీ విద్యార్థులకు న్యాయవాది వృత్తిలో మరింత నైపుణ్యం సంపాదించేందుకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ లీగల్ సెక్రటరీ కాండ్రేగుల లీలా హరిప్రసాద్, అడిషనల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ న్యాయవాది బి. ఎస్.వి రాజుగోపాల్, లా కాలేజ్ కరస్పాండెంట్ పి, వెంకట్రావు, ప్రిన్సిపల్ పి. శ్రీధర్, లీగల్ అడ్వైజర్లు షేక్ నజీరా వసంత్, జగదీష్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి బి .లీలాప్రసాద్, నేషనల్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ మురళీమోహన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చందర్రావు,సభ్యులు ఆదిలక్ష్మి వెంకటలక్ష్మి అనుపమ యాదవ్, రూపదత్, శ్రీధర్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. 

Gajuwaka

2024-01-03 16:17:31

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్..ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ ప్రజలకు మార్గం చూపిస్తోంది. 
ప్రతి మంగళవారం మాదిరిగా దొండపర్తిలో 27, 41, 42 వార్డులకు సంబంధించి దొండపర్తి పరదేశమ్మ గుడి వద్ద ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశయం మేరకు ప్రజల వద్దకే పాలన కు ఆదర్శంగా తీసుకుని వినూత్న రీతిలో వారి సమస్యలు నేరుగా పరిష్కరించి ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలతో అవసరమైన ధ్రువపత్రాల మంజూరు, పెన్షన్లు, ఇళ్ళ కేటాయింపు, రేషన్ కార్డులు, వంటి వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వారికి ఆర్థిక సహాయం అందజేయాలని ఎమ్మెల్యేకు గోడు విన్నవించుకున్నారు. అలాగే గత వారం ప్రజా దర్బార్ లో వాలంటరీ ఉద్యోగం కోసం ఆర్జీలు పెట్టుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇంచార్జెస్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ & జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్స్, గృహశారదులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-02 15:14:03

హెచ్చరికలకు భయపడేది లేదు..ఉత్తర్వులు దగ్దం చేసిన అంగన్వాడీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తే భయపడేది లేదని  అంగన్వాడీలు హెచ్చరించారు. జనవరి 5 లోగా విధుల్లోకి చేరకపోతే అంగన్వాడీలపై శాఖా పరమైన  చర్యలు తీసుకుంటామని ఇచ్చిన నోటీసులను వీరు దగ్ధం చేశారు. మంగళవారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వం జారీచేసిన ప్రతులను వీరు దగ్దం చేసి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా సిఐటియు, ఏఐటియుసి, ఇస్ట్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, అంగన్వాడి యూనియ న్ల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె నేటికి 22 రోజులకు చేరుకుందని..అయినా ప్రభుత్వం స్పందించకపోగా బెదిరింపులకు దిగడం బావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ప్రభుత్వం వేతనాలు పెంపు, గ్రాట్యూటీ సమస్య మీద స్పందించకపోగా  జనవరి 5 లోపల సెంటర్లకు గాని తిరిగి రాకపోతే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ రకమైన బెదిరింపు చర్యలను  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల  పౌష్టికాహారం గురించి ఆలోచించే ప్రభుత్వం, అంగన్వాడీల బ్రతుకుల  గురించి ఆలోచించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన  ధరలతో పోల్చుకుంటే రూ.11500 వేతనం ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నించారు. ఈ విషయమే గడచిన 4 సంవత్సరాల  8 నెలలుగా  ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము అనేక ప్రయత్నాలు చేశామని అన్నారు. ప్రభుత్వం స్పందించనందునే.. తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె చేస్తున్నామని చెప్పారు. తమ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న వీరు..  వేతనాలు పెంచే వరకు, గ్రాట్యూటీ ఇచ్చేవరకు ఈ సమ్మె ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్ట్ మూడు యూనియన్ల నాయకులు పి. మణి,  వై.తులసి, శోభారాణి, వెంకటలక్ష్మి, పాపవేణి, శాంతి, శ్యామల, రామలక్ష్మి , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-02 14:42:29

విశాఖలో కోలాటమాడి నిరసన తెలియజేసిన అంగన్వాడీలు

తమన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలకి కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు నూతన సంవతర్సం వేళ కోలాటమాడి తమ నిరసన తెలియ జేశారు. సోమవారం విశాఖలోని జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె ప్రాంతంలో అంగన్వాడీలు కోలాటమాడారు. సాధారణంగా కోలాటంలో సదరు ఆటకు సంబంధించిన పాటలు ఉంటాయి. కానీ వీరు మాత్రం, వీరి డిమాండ్లనే పాటగా మార్చి, కోలాటమాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ, ఎందరో పిల్లలకు తల్లులుగా కేంద్రాల్లో వారి బాగోగులను చూసుకుంటూ, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందిస్తూ సేవలందిస్తున్నామని వాపోయారు. తమకు కార్మిక చట్టాలను అను సరించి మాత్రమే తాము తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, అంతే తప్పా అదనంగా ఎక్కడా ఏమీ కోరలేదన్నారు. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా చర్చలతో కాలయాపన చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ నిరవధిక సమ్మె ఉదృతం అవు తుంది తప్పితే ఎక్కడా విరమించే ప్రశక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు శ్యామలాదేవి, సరస్వతి, కుమారి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-01 18:15:31

కొత్త ఏడాది రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుంది

కొత్త సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్ద యువ తేజం ఆడారి కిషోర్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం చంద్రబాబు ను కలిసి కిషోర్ కుమార్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా చంద్ర బాబు ఉత్సాహ పూరిత సంభాషణ చేశారు. గతం లో చేసిన పరిపాలన కు మించి ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ప్రజలకు అందించడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. ఈ సందర్భం గా రాష్ట్ర ప్రజలకు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాన, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, క్యాడర్ కు చంద్రబాబు నాయుడు, ఆడారి కిషోర్ కుమార్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాను,, ఉద్యోగులకి ఇచ్చిన హామీల విషయంలో రివర్స్ విధానంలో చేసిన మోసాలను శక్తివంచన లేకుండా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ప్రజలందరూ ఇప్పటికే రాష్ట్రపాలనపై విసుగు చెంది ఉన్నారన్నారు. ఇచ్చింది రూపాయి అయితే ప్రజలపై భారం పది రూపాయలు వివిధ పన్నుల రూపంలో మోపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను,  కనిపించని దొంగపన్నులపైనా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. 

Visakhapatnam

2024-01-01 18:12:12

అంగన్వాడీల సమ్మెకు టిడిపినేత ఆడారి కిషోర్ కుమార్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలను వెంటనే తీర్చాలని టిడిపి యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక ధర్నా చేస్తున్న అంగన్వాడీల ఆందోళనకు ఆయన సంపూర్ణ సంఘీబావాన్ని ప్రకటించారు. వారితో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అంగన్వాడీలను ప్రభుత్వం వర్కర్లుగా కాకుండా ఎందరో పిల్లలకు సంరక్షణగా నిలిచే తల్లులుగా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు డిమాండ్లు పరిష్కరించడం ద్వారా వీరంతా తిరిగి పిల్లలను సంరక్షించడానికి కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం వుంటుం దన్నారు. ప్రభుత్వం వీరి డిమాండ్ లను అంగీకరించేంతవరకూ చేసే పోరాటంలో తన మద్దతును తెలియజేస్తానని అన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి గన్వాడీలకు జీతాలు పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు పెంచడంతోపాటు గ్రాడ్యుటీ కూడా అమలుచేయాలన్నారు.వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.19 రోజులుగా వీరుచేస్తున్న సమ్మెకారణంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు అరకొరగానే నడుస్తున్నాయన్నారు. అంగన్వాడీలు కేంద్రాల్లో ఉంటే పిల్లలకు నాణ్యమైన ఆహారంతోపాటు, ఆటపాటలు ఆడించడానికి అవకాశం వుంటుందన్నారు. ప్రస్తుతం కేంద్రాలన్నీ బోసీ ఉన్నాయనే విషయాన్నిప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఇన్నిరోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం అంగన్వాడీల కోసం ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. వీరి న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని ఆడారి కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఆడారికిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు అంగన్వాడీలు తమ డిమాండ్ల పత్రాన్ని ఆయనకు అందజేశారు.

Visakhapatnam

2023-12-30 16:34:09

ఐక్య కార్యాచరణతోనే బిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిసి ఉద్యోగుల సమస్యలను ఐక్య కార్యాచరణతోనే పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కోసెట్టి అప్పారావులు పేర్కొన్నారు. శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశం చిలుకూరి బృందావన ఎస్టేట్ లో జరిగింది. ఈ సందర్భంగా 2024 డైరీ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ,  రాబోయే 3సంవత్సరాలకు  రాష్ట్ర, కంపెనీలు,  జిల్లా కార్యవర్గాలను ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగించాలని తీర్మనించినట్టు చెప్పారు. అదేవిధంగా  ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రధానంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్ సదుపాయాలను 2004 ఆగస్టు 31 ముందు జాయిన్ అయిన ఉద్యోగులందరికీ అందరికీ కల్పించాలని, ఉద్యోగులకు మెడికల్ సదుపాయం పూర్తిగా కల్పించాలని , డిపార్ట్మెంట్  జారీ చేసిన మెడికల్ క్రెడిట్ కార్డులను అన్ని హాస్పిటల్ వారు తక్షణమే ఆమోదించుటట్టుగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని,

 ప్రతినెల జీతాలు ఒకటో తారీఖున ఉద్యోగులకు జమ చేయాలని,పి అర్ సి బకాయిలను ఒప్పందం ప్రకారం వెంటనే విడుదల చేయాలని,జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయిస్ ను విద్యుత్ సంస్థ ల ఎంప్లాయీస్ లాగా పరిగణించి అన్ని ప్రయోజనాలను కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్స్ ఉద్యోగుల కు నేరుగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు,  ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన అత్యవసర సెలవులను మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ,విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని , కొత్తగా ఏర్పడిన డివిజన్ వలన కొంతమంది ఉద్యోగులు ఒక్క జిల్లా పరిధి నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన వారిని పాత జిల్లాలోని వారి ని కొనసాగించాలనే సమస్యల పరిష్కారం కోసం ఏకవాఖ్య తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ
  సనపల వెంకటరావు, కంపెనీ ప్రెసిడెంట్  సాయిబాబా,వర్కింగ్ ప్రెసిడెంట్  కె వి నరసింహారావు,  ఐదు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రతినిధులు, బీసీ సభ్యులు హాజరయ్యారు.

Visakhapatnam

2023-12-29 15:30:06

ఏఎంఏఎల్ కాలేజ్ కి టీడీపీ నేత ఆడారి కిషోర్ రూ.20 వేలు విరాళం

కాలేజ్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కోసం పూర్వవిద్యార్ధులు ముందుకి రావాలని తెలుగు దేశం యువ నేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజ్ కి ఆయన రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, తన జన్మదినోత్సవం సందర్భంగా  చదువుకున్న కళాశాల అభివృద్ధి కోసం ఈ విరాళాన్నిఅందజేయడం ఆనందంగా ఉందన్నారు. చదువకున్న పాఠశాలలు, కళాశాలలకు విద్యార్ధులు తమవంతుగా ఏదో అంశంలో సహాయం చేయడం ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించడానికి అవకాశం వుంటుందన్నారు.  తాను విద్యార్థి గా ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడేనని, తాను నేడు సమాజంలో నాయకునిగా ఎదగడానికి ఇక్కడే  బీజం పడిందన్నారు.ఈ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎదిగానని, ఆపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సైతం విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనట్టు తెలిపారు. తాను చదువుకున్న కళాశాలలోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభించడం కోసం  సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు సాంకేతిక పరమైన శిక్షణ కూడా ఏర్పాటు చేసి, అతి త్వరలోనే విద్యార్థుల ఉపాధి కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఆ మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ గల్లా జయబాబు,  యాజమాన్యం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బొడ్డేటి అప్పారావు, సూపరింటెండెంట్ అనురాధ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ కే వి ఎస్ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు ఆడారి కిషోర్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Anakapalle

2023-12-29 14:05:19

సేవ్ సాయిల్ రన్ కు..మిషన్ కర్షకదేవోభవ సంపూర్ణ మద్దతు

ప్రతీ ఒక్కరూ మట్టిని కాపాడుకోవడం ద్వారా జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా ఉంటుందని మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పేర్కొ న్నారు. మంగళవారం విశాఖ ఎంవీపి కాలనీ నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం సుబ్రమణ్యశర్మ అనే సామాజికవేత్త ప్రారంభించిన సేవ్ సాయిల్ రన్ కు ఆయన సం పూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను కిషోర్ కుమార్ మార్గమధ్యలో కలిసి అభినందనలు తెలియజేశారు. 55ఏళ్ల వయస్సులో పుడమిపై ఉన్న ప్రేమ తో, ప్రతీ ఒక్కరికీ మట్టిపై అవగాహన కల్పిండానికి, మట్టిని కాపాడుకోవాలనే మంచి కాన్సెప్ట్ తో 33 కిలోమీటర్ల పరుగు చేపట్టడం చాలా గొప్పవిషయమన్నారు. మట్టి ని కాపాడుకుంటేనే.. రైతు వ్యవసాయం చేయడానికి ఆస్కారం వుటుందని, మొక్కలు నాటడానికి వీలుంటుందని.. తద్వారా రైతుకి పని, మనందరికీ ఆహారం సకాలంలో దొరుకుతుందని చెప్పారు. ఇలాంటి మంచి పనులకు తమవంతు మద్దతు ఎల్లప్పుడూ వుంటుందని సేవ్ సాయిల్ సుభ్రహ్మణ్యశాస్త్రికి తెలియజేశారు. ఈ సేవ్ సాయిల్ రన్ పూర్తయిన తరువాత తమన కార్యాలయానికి రావాలని కూడా ఆహ్వానించారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కోసం కిషోర్ కుమార్ ఆయనకు తెలియజేశారు.  




Visakhapatnam

2023-12-26 08:35:59

సమిష్టి కృషితో ‘పెవా’ను అగ్రగామి అసోసియేషన్ గా నిలపాలి

ఆంధ్రప్రదేశ్ లోని పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్(పెవా) ను అగ్రగామిగా నిలబెట్టడానికి అందరి కృషి అవసరమని అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నీలంజోగిరాజు పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలోని తిరుమల ఆసుపత్రి ప్రాంగణంలో డా.కోడి నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 కేలండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్ అంచెలంచలుగా అతిపెద్ద ఉద్యోగుల సంఘంగా అవతరించేందుకు కార్యాచరణ జరుగుతోందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యవచ్చినా పెవా అండగా వుంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్క సభ్యుడూ గుర్తించుకోవాలన్నారు. ఉద్యోగులకు పనికొచ్చే సమాచారం, జీఓలను కూడా డైరీలో పొందుపరిచామన్నారు. ప్రముఖ వైద్యులు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. సిహెచ్.పాండురంగారావు మాట్లాడుతూ, ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్న పెవాకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. పద్మశాలీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు, జర్నలిస్టులు ఇలా ప్రముఖ రంగాల్లో పనిచేస్తున్నవారు ఈ సంఘంలో సభ్యులుగా ఉండి పనిచేయడం అనేది చాలా గొప్పవిషయమన్నారు.

రిటైర్డ్ ఎంఈఓ, రాష్ట్ర ఉపాధ్యక్షులు  రాపర్తి సత్యనారాయణ,  మాట్లాడుతూ, ఉద్యోగుల సేవ, సంక్షేమమే పరమావధిగా పెవా అందిస్తున్నసేవలు ప్రతీ పద్మశాలీ ఉద్యోగి వరకూ చేర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా అసోసియేషన్ లో చేరాలని పిలుపునిచ్చారు. ప్రముఖ  కంటి వైద్య నిపుణులు హైమ నేత్రాలయం పసగడుగుల శివరాజ ప్రసాద్ మాట్లాడుతూ, పద్మశాలీ ఉద్యోగులకు, కులబాంధవులకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాన రంగాల్లోని వారిని అసోసియేషన్ లో చేర్చి కార్యక్రమాలు చేపట్టడం అభినంద నీయమన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు పెవా సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధ్యక్షులు కోసూరు నాగ వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వశాఖల్లోని పద్మశాలీ కులబాంధవులను గుర్తించి, వారిని సభ్యులుగా చేర్పిస్తున్నామన్నారు. దానికోసం ఇప్పటికే చేరిన సభ్యుల ద్వారా ప్రత్యేక క్యాంపైన్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జాగు చినబాబు, అంజూరి శ్రీనివాసరావు ప్రతినిధులు, సభ్యులు జిఎన్ఎస్.శిరీష, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), తదితరులు పాల్గొన్నారు.

Payakaraopeta

2023-12-25 16:17:01