1 ENS Live Breaking News

అండమాన్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఎంపీ కలిశెట్టి భరోసా

అండమాన్ లోని మత్స్యకారులకు  సదుపాయాలు, రక్షణ, శిక్షణ కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో చర్చలు జరుపుతానని విజ యనగరం ఎంపీ, ఐ.టి & కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు భరోసా ఇచ్చారు.   సీఎం చంద్ర బాబు సూచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదుని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ వారిని ఎంపి కలిసి ఉత్తరాంధ్ర మత్స్యకార కాలనీ, ఫిషింగ్ పోర్ట్ సందర్శించారు. అన్ని ప్రాంతాలను తిరిగి అక్కడి పరిస్థితిని అవగతం చేసుకున్నారు. వారి సమ స్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ నివసించే మత్స్యకారులకు ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. ఇక్కడి వారి జీవన విధానం, వేటకు వెళ్ళే నౌకలు, వేట కోసం ఉన్న పరిస్థితులు, వాటిలో ఉన్న ఇబ్బందులను సమగ్రంగా అర్థం చేసుకున్నారు. మత్స్యకారులంతా పేదరికంలో, స్వల్ప వనరులతో జీవనం సాగిస్తూ, సముద్రం మీద ఆధారపడిన జీవనానికి నిత్య కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఎం.పి గుర్తించారు. జీవోపాదికై అండమాన్, నికోబార్ దీవులకు తరలివచ్చినప్పటికీ తమకోసం స్వయంగా వచ్చిన ఎంపీ కలిశెట్టిని అక్కడి వారు ఎంతో ఆప్యాయతగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఘనంగా సత్కరించారు. పెద్ద సంఖ్యలో ఉత్త రాంధ్రాకి చెందిన మత్స్యకార కుటుంబ సభ్యులు టిడిపి సభ్యత్వాన్ని స్వీకరించారు. 

visakhapatnam

2024-10-27 06:25:07

ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులున్నాయ్- డా.కంచర్ల

 ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులు, అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, కళా భోజ డా. కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. శనివారం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా  డాబా గార్డెన్స్  అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో  కంచర్ల యువసేన ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ పర్యాటకంతోపాటు, రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను రాష్ట్రంలో నిర్మించే సినిమాల్లో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంత కళాకారులుకు, పర్యాటక ప్రదేశాలకు సినిమా రంగం కూడా ఆదాయాన్ని సమకూర్చినట్టు అవుతుందన్నారు. అనంతరం దంపతులిద్దరూ కట్ చేశారు. వారి కుమారుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర తల్లిదండ్రులకు కేక్ తినిపించి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 

 అభిమానులు, సన్నిహితులు మద్య వివాహ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పతాకంపై తన కుమారుడు ఉపేంద్ర హీరోగా 8 సినిమాల్లో నటిస్తున్నాడని తెలియజేశారు. ఒక సినిమా ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. మరో సినిమా నవంబర్ తొలి వారంలో విడుదల అవుతుందన్నారు.  ఈ సినిమా బడ్జెట్ ఐదు కోట్లు నుంచి 30 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మళయాలం, కన్నడం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీయలేరు, నిర్మించలేరనే అపవాదు హైదరాబాద్ లో వుందని.. తాను ఏపి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి తెలుగు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేస్తున్న మంత్రి దుర్గేశ్ కి ధన్య వాదాలు తెలిపారు. 

ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్ళగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖ పట్నం లో ఎందరో కళాకారులు వున్నారని.. విశాఖ షూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతోందన్నారు. అరకు వెలి సినిమా షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.  నూతన సంస్థ కలాభోజ డాక్టర్ కంచర్ల కల్చరల్ అసోసియేషన్ ను లోగోను అభిమాను కరతాల ధ్వనుల మధ్య  ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి తన సినిమాలు, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామన్ని చెప్పారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల ఒక పెద్ద కార్య క్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బాలభాను అర్చక సంఘం నిర్వాహకులు కంచర్ల దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహా చలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ ధర్మ కర్త, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, దర్శకుడు యాద్ కుమార్, మా అధ్యక్షుడు భయ్యా శ్రీనివాస్, లోకేష్, నెహ్రూ, జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, సభ్యులు అరుణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

visakhapatnam

2024-10-26 17:14:44

అయ్యవార్లకు కోడిగుడ్డు ఫ్రై.. విద్యార్థులకు బంగాళ దుంప కూర..!

ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాల విద్యార్ధులకు పౌష్టికాహారం మాట ఎలా ఉన్నా.. అయ్యవార్లకు మాత్రం చక్కటి పౌష్టికాహారం విద్యార్ధులకి ప్రభు త్వం ఇచ్చే మెనూలో నుంచే తయారు చేసి పెడుతున్నారు.. విద్యార్ధులకు బంగాళా దుంపల కూర.. రసం పెడితే.. అయ్యవార్లకు మాత్రం ఎక్కడ నీరసం వస్తుందోనని ఎంచెక్కా కోడిగ్రుడ్ల ఫ్రై చేసి పెడుతున్న ఆశ్రమ పాఠశాల యాజమాన్యాలు.. ఇదేమీ ఏజెన్సీలో క్రొత్త కాదు.. కానీ డుంబ్రీగూడ మండంలోని సొవ్వా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈరోజు చిత్రం యూనిట్ పాఠశాల సందర్శించినపుడు మాత్రం విద్యార్ధులకు బంగాళా దుంపల నీరు కూరా.. ఉపాధ్యాయులకి చిక్కటి చక్కని కోడి గ్రుడ్ల ఫ్రై వడ్డించడం కనిపించింది.. ఏంటి ఆశ్రమపాఠశాలల్లోని ఉపా ధ్యా యులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోరా అంటే మాత్రం.. అదేమీ లేదంటే.. పిల్లలకిచ్చే మెనూ లో నుంచి వారికి కాస్త రుచిగా.. సుచిగా వండి పెడతాం.. విద్యార్ధులకు మాత్రం యధాప్రకారం నీరు చారు.. పలచటి కూరలు వండి పెడతాం..ఇవేమీ మీకు తెలియకుండానే అడుగు తున్నారా అని సిబ్బంది మీడియానే తిరిగి ప్రశ్నించారు. సొవ్వ ఆశ్రమపాఠశాలలోని భోజన సందర్భాన్ని చిత్రీకరించినపుడు కనిపించిన దృశ్యాలివే.. ఇప్పటికైనా పాడేరు ఐటిడిఏ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధుల భోజనంలో కక్కుర్తిపడి కోడిగ్రుడ్ల కూరను తయారుచేయించుకొని తిన్న ఉపాధ్యాయుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో చదివే విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకుగాను ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని అమలు చేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. విద్యార్థులకు పెట్టాల్సిన పౌష్టికాహారాన్ని సక్రమంగా పెట్టడం లేదు. మండలంలోని సొవ్వా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పెట్టాల్సిన భోజన మెనునూ సక్రమంగా పెట్టకుండా గురువారం మధ్యాహ్నం ఉపాధ్యాయులు గుడ్ ఫ్రై కూర వండుకుని , విద్యార్థులకు బంగాళదుంప కూరతో పాటు రుచి, పచి లేని సాంబార్ తో భోజనాలు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు గుడ్లును నాణ్యతగా ఫ్రై చేసి వంట చేసుకుని చేసుకుని తింటున్నారు. కానీ విద్యార్థులకు మంగళవారం పాలకూర పప్పుతో పాటు సాంబార్ తో పెట్టాల్సి ఉండగా బంగాళదుంప బటానితో పాటు నాసిరకమైన నీల లాంటి సాంబార్ తో భోజనాలు పెట్టారు. మెనూ అమలుతీరుపై  అధికారులు దృష్టి సారించకపోవడంతో  నాసిరకంగా భోజన మెనూ పెడుతున్నట్లు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు  ఆరోపిస్తు న్నారు. తక్షణమే సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి సొవ్వ ఆశ్రమ పాఠశాలలో భోజన మెనూ సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

dumbriguda

2024-10-24 16:41:10

నేటి నుండి పల్లె పండుగ-కలెక్టర్ దినేష్ కుమార్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 14 సోమవారం నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.   ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆగస్ట్ 23వ తేదీ ఒకేరోజు  జిల్లాలోని 430 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి గ్రామసభల్లో తీర్మానం చేసిన పనులను ప్రారంభించేందుకు, పల్లె పండుగ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభ౦ కానుందని చెప్పారు.  ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడతామని  కలెక్టర్ తెలిపారు .  సుమారు 413 కోట్ల రూపాయలతో 900 పైగా వివిధ రకాల పనులను ప్రతిపాదించడం జరిగిందన్నారు.  సోమవారం నుంచి ఆగస్ట్ 23వ తేదీన పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులు ప్రారంభించాలని సూచించారు.  వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారం, తీర్మానాల అమలు చేయాలన్నారు.

 పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలని సూచించారు. పల్లె పండుగలో సీసీ రోడ్లు, తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.  అదేవిధంగా సిటిజన్ నాలెడ్జ్ బోర్డులు అందరికీ తెలిసేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు.  సోమవారం 138 గ్రామపంచాయతీలలో  రూ. 12.4 కోట్లతో  చేపట్టనున్న 211 పనులకు  శంకుస్థాపన జరుగుతుందన్నారు.  ఈ 211 పనులలో 28 సీసీ రోడ్లకు 3.98 కోట్లు, మూడు బీటీ రోడ్లకు 1.63 కోట్లు, నాలుగు wbm రోడ్డులకు 5.05 కోట్లు,   4 సీసీ డ్రైన్లకు 0.17 కోట్లు, 66 పెరక్యలేషన్ ట్యాంకులకు  రూ. 5.51 కోట్లు,  ఏడు ఫిష్ పాండ్లకు 3.50 కోట్లు, 35 కమ్యూనిటీ సోక్ ఫిట్స్ కు 13 లక్షలు, 64 రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పథకాలకు 47 లక్షలు తో పనులు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ వివరించారు.

paderu

2024-10-13 15:07:34

జల కళలో వీరుడు.. జలాసనంలో ధీరుడు..!

 "సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా" అన్నాడో సినీ కవి.. ఆయన మాటలు పాటకు బాగున్నా.. పాటలోని భావాన్ని మాత్రం ఆచరణలో చూపిస్తున్నాడీయువకుడు. ఎవరివద్ద ఎటువంటి శిక్షణ పొందకుండానే స్వీయసాధనతో జల కళలో పట్టు సాధించి.. జలాసనంలో అబ్బురపరుస్తున్నాడు. నీటిలో వెల్లకిలా నాలుగు గంటలపాటు తేలియాడుతూ ఔరా..! అనిపిస్తున్నాడు. అతనే విజయనగరం జిల్లా గుర్ల మండ లం గూడెం గ్రామానికి చెందిన శనపతి సంతోష్. జలాసనంలో తనదైన శైలిలో ప్రతిభ కరబరుస్తున్నాడు. సంతోష్ జలాననానికి ముగ్దు లవుతున్నారు. చూపరులు. ప్రస్తుతం ఈయన టాలెంట్ జిల్లానే కాదు రాష్ట్రం దాటి  దేశం మొత్తం చక్కర్లు కొడుతున్నది. 

 పుట్టుకతో వికలాంగుడైన సంతోష్ కు చిన్నప్పటి నుంచి ఈత అంటే మహా సరదా. ఊర్లో చెరువులు, బావుల్లో స్నేహితులతో కలిసి గంటలకొద్దీ ఈత కొట్టేవాడు. క్రమంగా జలాసనం గురించి తెలుసుకున్న సంతోష్ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. పాటించాల్సిన మెళకువలపై కూడా ఎవరినీ సంప్రదించకుండా తనకుతానుగానే బావుల్లో జలాసనం వేయడం మొదలుపెట్టాడు. ఐదు నిమిషాలతో మొదలైన జలాసనం ఇప్పుడు ఏకబిగిన నాలుగు గంటలు  క్షణకాలం కూడా విరామం ఇవ్వకుండా,  నిరంతరాయంగా కొనసాగించే స్థాయికి చేరుకునే ప్రావీణ్యం సంపాదిం చాడు. ఈయ జన కళా ప్రావీణ్యం చూసిన వారు ఎవరైనా  ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతటి పట్టు ఎలా సాధ్యమైందని అడిగితే, చిరునవ్వే సమా ధానమవుతుంది. నాలో అసక్తే నాతో ఇలా జలక్రీడకు ఊతమిచ్చే జలాసనం చేయిస్తోందని చెబుతుంటాడు. 

 జలాసనానికి ముందుగా కొన్ని నిమిషాల పాటు ఈతకొట్టి, ఆ తర్వాత ఊపిరి బిగబట్టి నీటిలో వెల్లకిలా తేలియాడి జలాసనానికి ఉపక్రమించాక, తిరిగి విరమించేవరకు అచేతనంగా అలాగే ఉంటాడు. ఏ ఒక్క ఆవయవం లోనూ చలనం కనిపించదు. ఆ స్థితిలో చూసేవారెవరైనా మృతదేహంగా భావించి భయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి..! అంతేకాదు.. ఈ జల క్రీడా నేర్చుకునే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందిన ఉదంతాలూ ఉన్నాయి. రహదారి అంచునున్న బావిలో సంతోష్ జలాసనంలో ఉన్న సమయంలో, ఆ రహదారి మీదుగా రాకపోకలు సాగించేవారు బావిలో మృతదేహం ఉందంటూ కేకలు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. తీరా అసలు విషయం తెలిసాక నోళ్లు వెళ్ళబెట్టకునేవారు అంతా.  ఈ కళను హాబీగా చేసుకున్న సంతోష్, చూపరుల కోరిక మేరకు తరచూ ప్రదర్శిస్తూనే ఉంటాడు.  

మారుమూల గ్రామంలో పుట్టి, అందునా వికలాంగుడు ఎవరివద్ద తర్ఫీదు లేకుండా స్వీయసాధనతో ఇంతటి ఘనతను పొందడం నిజంగా ఆశ్చర్యకరమే! ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ఎనలేని గుర్తింపు పొందిన సంతోష్ నాలుగు గంటల తన రికార్డును తానే తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సమయం ఐదు గంటలా.. ఇంకా ఎక్కువా అనేది మాత్రం ఇప్పుడప్పుడే తెలీదు. కానీ నిత్యం జలాసనంలో సమయాన్ని పెంచుకుంటూ.. కఠోర సాధన చేస్తున్నాడు సంతోష్.  శిక్షణ ద్వారా జలాసనంలో ప్రావీణ్యం సంపాదించినవారందరికీ తాను ఏకలవ్య శిష్యుడినని వినమ్రంగా చెప్పే సంతోష్, ఈ కళలో మరింతగా రాణించాలని కోరుతున్నారు గూడెం గ్రామస్తులు. ఇలాంటి జల క్రీడ, జలాసనంలో నైపుణ్యం ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించి ఆర్దికంగా చేయూ అందిస్తే మరిన్ని రికార్డులు నమోదు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. జలాసన వీరుడికి అందరూ అభినందలు చెప్పాల్సిందే..!

-జలాసనం నేర్చుకునే ఆశక్తి ఉంటే 
జలాసనం నేర్చుకోవడంలో నేనే స్వయంగా నేర్చుకున్నాను. ఈత కొట్టడం అందరికీ వస్తుంది. అలాకాకుండా అంతకు మించి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఈ జలాసనంపై ఆశక్తి ఏర్పడింది. దీనితో స్వయంగా సాధన చేస్తూ ఈ జలాసనం వేయడం నేర్చుకున్నాను జలాసనం నేర్చుకునే ఆవక్తి ఉన్నవారికి ఈ ఆసనం వేయడం నేర్పిస్తాను. అయిదే దానికి ముందుగా వారికి ఈత కొట్టడం వచ్చి ఉండాలి. తద్వారా ఈ జలాసనం నేర్చుకోవడం సులవవుతుంది. ఇలాంటి ఆసనాలు వేసే సమయంలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వేయాలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది కదలకుండా ఉండే నీటిలో.. అంటే నేల భావులు, స్విమ్మింగ్ ఫూల్స్ లో మాత్రమే వేయడానికి వీలుపడుతుంది. ఈ ఆసనం నేర్చుకోవడం ద్వారా వాయుబంధనం కూడా అలవాటు అవుతుంది. ఎవరికైనా నేర్చుకోవాలని అనిపిస్తే నేరుగా నన్ను సంప్రదించవచ్చు అంటున్నారు సంతోష్.

gurla

2024-10-13 09:28:30

సమాజానికి జర్నలిస్టులు..సైనికులు రెండు కళ్లు-హీరో ఉపేంద్ర

సరిహద్దుల్లో సైనికులు లేకపోతే దేశానికి రక్షణ లేదని.. రైతు వ్యవసాయం చేయకపోతే మనకి తిండి దొరకదని.. జర్నలిస్టులు లేకపోతే సమా జంలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియదని.. దేశానికి సైనికులు, సమాజానికి జర్నలిస్టులు రెండు కళ్లు వంటి వారని, మూడో నేత్రం రైతేనని సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలోని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో దసరా సంబు రాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  హీరో ఉపేంద్ర జర్నలిస్టులు మిఠాయిు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు బాగుంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి ఏ కష్టమొచ్చినా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ తన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. జర్నిస్టుల సంక్షేమం కోసం ట్రస్ట్ చైర్మన్, నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. జర్నలిస్టులు ఇలాంటి పండుగల సమయంలో ఒకో చోట కలిసి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. 

జర్నలిస్టులు నిత్యవం సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తారని అలాంటి జర్నలిస్టులు నిర్వహించుకునే కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీయడంలో కీలకం గా వ్యవహ రించాలన్నారు. అదేవిధంగా విశాఖ టూరిజంను బాగా ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సినిమాలు ఎక్కువగా తీయడానికి కూడా అవ కాశం వుంటుందని చెప్పారు. ఏం చేయాలన్నా అది కేవలం మీడియా చేతుల్లోనే వుంటుందని.. మీడియా తలచకుంటే సినీ పరిశ్రమ మొత్తం విశాఖ తరలివస్తుందన్నారు. అనంతరం టిజెఎఫ్ నిర్వాహకులు ఘనంగా హీరో ఉపేంద్రబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, నిర్వాహకులు పి.ఈశ్వర్, యూనియన్ ప్రతి నిధులు జార్జిఫెర్నాండేస్, ఎం.శ్రీనివాసరావు,  నందా, తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-12 09:51:55

కేబినెట్ దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య-పల్లా

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను కేబినేట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివా సరావు హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గం గురువారం  ఆయన్ని కలిసి జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల అంశాన్ని వివరించింది. విశాఖలో ఇళ్ల స్థలాలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాల వివరాలు ఆయ నకు అందజేశారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తాన న్నారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తా నని చెప్పారు. తప్పకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ మాట్లా డుతూ సుమారు 800 మందికి  పైబడి జర్నలిస్టులు ఇంటి స్థలం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా రన్నారు. వారందరికీ  ఈ ప్రభుత్వ హ యాంలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ సలహాదారులు ధవలేశ్వరపు రవికుమార్, కోశాధికారి ఆలపాటి శరత్ కుమార్, సహాయ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు,బందరు శివప్రసాద్,యూ భాస్కరరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఏ రావు,ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు, పవన్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్.గురునాథ్  పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-03 16:16:49

ఆసుపత్రిలో మంచాలు దారుణం.. లోచల రామక్రిష్ణ ఔదార్యం..!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి  చాలా దారుణంగా ఉంది.. ఇటు ప్రభుత్వం గానీ.. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటిడిఏలు కానీ వీటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. గిరిపుత్రులకు వైద్య సేవలు చేయడానికి కనీసం ప్రభు త్వాలకి అవకాశం లేదో.. ఇక్కడ ఎందుకులే వసతులు అనుకున్నారో తెలీదు గానీ.. జెర్రిల ప్రాధామిక ఆరోగ్య కేంద్రంలోని మౌళిక వసతులను గాలికి వదిలేశారు. లక్షల రూపాయాలు జీతాలు ఇచ్చి ఉద్యోగులను, వైద్యుల పెట్టిన ప్రభుత్వం వేల రూపాయాలు ఖర్చు చేసి ఇక్కడ రోగుల సౌకర్యార్ధం కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.. కాదు కాదు.. ఉన్నవి పాడైపోయినా పూర్తిగా పట్టనట్టు వదిలేసింది. ఏజెన్సీలోని నేతలు కూడా ఈ దీన పరిస్థితిపై కన్నెత్తి చూడలేదు. ఆ దారుణమైన పరిస్థితి కాస్తా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోచల రామక్రిష్ణ వరకూ వెళ్లింది. దీనితో స్పందించిన ఆయన మంచి మనసుతో ముందుకొచ్చారు. జీకే వీధి మండలం జర్రెల  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచాలు పూర్తిగా పాడై పోవడంతో తనవంతు సహా యంగా ఆరు మంచాల ఏర్పాటు చేయడానికి రూ.20వేలు సహాయం చేశారు. 

ఆ మొత్తాన్ని ఆసుపత్రి సిబ్బంది.. గ్రామ పెద్దల సమక్షంలో వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లోచల రామక్రిష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజనులకు ప్రాధమిక వైద్యం అందించాలని.. ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వసతులు లేని పీహెచ్సీల్లో సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం గిరిజనులకు వైద్యసేవలు చేయడానికి రావాలనీ.. కనీసం ఆసుపత్రిలో రోగుల కోసం మంచాలు కూడా లేకపోతే గిరిజనులు వైద్యానికి వచ్చినా ఎక్కడు ఉండాలని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం వైద్య సేవలు అందే సమయంలో సేద తీరడానికి కూడా అవకాశం లేకపోవడం శోచనీయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, ఐటిడిఏ అధికారులు స్పందించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మౌళిక సదుపాయాలతోపాటు ఖాళీగా ఉన్న సిబ్బందిని కూడా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గిరిపుత్రులు ఆసుపత్రికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడకూడదనే మంచి ఆలోచనతో మంచాల ఏర్పాటు కోసం లోచల రామక్రిష్ణ ముం దుకి రావడం పట్ల గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

G.K.Veedhi

2024-10-01 14:34:59

మహా విశాఖలో ‘అపర రక్త దాన’ కిరణుడు..!

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే దేవుడంటారు.. ఈ లెక్కన ఆ జర్నలిస్టు ఎన్నిసార్లు దేవుడవ్వాలి..మరెన్నిసార్లు మంచోడవ్వాలి.. అంటే ఇప్పటి వరకూ ఆ జర్నలిస్టు 74 సార్లు దేవుడు.. 7 సార్లు ఆపద్భాంధవుడు అయ్యాడు.. ఇంతకీ అన్ని సార్లు దేవుడవడానికి కారణం మాత్రం ఒక్కటే.. అదే రక్తదానం.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 సార్లు రక్తం దానం చేసిన అపర రక్తదాన కర్ణుడు..అతనే జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్(కిరణ్). విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తూ.. సామాజిక బాధ్యతగా ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేస్తూ ఎందరికో ఆపద సమయంలో అండగా నిలిచాడు.. నిలుస్తున్నాడు కూడా. ఒక్క రక్తం దానమే కాదు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే నేనున్నాంటూ ముందుకెళ్లిపోతాడు. తనకు తోచిన రీతిలో అభాగ్యులకు అన్నదానం కూడా చేస్తుంటాడు. జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా.. తన పని ఉందని తెలిసినా.. ఎవరైనా తనను గుర్తించి పని పురమాయించినా నిండు మనసుతో ఆ పనులు చక్కబెట్టి అందరివాడిగా మారిపోయాడు.

ఐదు రూపాయలు సహాయం చేసి రూ.500 పైగా పబ్లిసిటీ చేయించుకుంటున్న ఈ రోజుల్లో జర్నలిస్ట్ కిరణ్ చేసే రక్తదానం ఆయనకి..దానం తీసుకున్న వారికి తప్పా మరెవరికీ తెలియదు.. ఇపుడు మాత్రం ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా బాహ్య ప్రపంచానికి కూడా తెలియజేసే అవసరం వచ్చింది. చెడ్డవారికోసం లోకానికి తెలియడం ఎంత అవసరమో.. అదేవిధగా మంచి వారి కోసం కూడా అంతకంటే ఎక్కువగా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం చాలా అవసరం. అలా చేయడం వలన జర్నలిస్ట్ కిరణ్ లాంటి వారిని స్పూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకి వచ్చే అవకావం వుంటుంది. మీడియా అంటే సమాజంలో జరిగే అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వుంటుంది. ఒకరకంగా అదికూడా ప్రజాసేవే. ఎందరికో ఆపద సమయంలో రక్తం చేసే కిరణ్ కోసం కొందరికే ఈ విషయం తెలిస్తే.. ఈయన దగ్గర రక్తం దానం తీసుకున్నవారు.. ఈయనకోసం తెలుసుకున్నవారు.. తెలియనివారి కోసం తెలియజేసిన వారమవుతామని ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా మీ ముందుకి తీసుకువస్తున్నాం. 

డబ్బు దానం చేస్తే అది ఖర్చు అయిపోతే మరిచిపోతారు.. అన్నం దానం చేస్తే అది అరిగిపోతే ఆకలి తీరుతుంది.. కానీ రక్తం దానం చేస్తే మాత్రం ఒక నిండు ప్రాణం నిలబడుతుంది. అందుకోసమే తాను ఈ సేవను ఎంచుకున్నానని చెబుతాడు కిరణ్. ఒక్కోసారి చాలా మంది రక్తం దానం చేసినందుకు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తారని.. కానీ అలా చేయడం తనకి ఇష్టం లేకనే చేసిన దానాన్ని కూడా తెలియకుండా ఉంచుతానని చెబుతాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మాత్రం రక్తం దానం చేసినపుడుల్లా ఫోటోలు పెడుతున్నానని.. అదీకూడా పబ్లిసిటీ కోసం కాదని.. ఎపుడైనా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే.. వెంటనే తనను సంప్రదిస్తారనే సామాజిక కారణంతోనే పెడుతున్నానని చెబున్నాడ జర్నలిస్టు కిరణ్. ఎన్నోసార్లు ఎన్నో వార్తలు రాసిన తాను. రక్తం కోసం.. అత్యవసర సమయంలో దాని విలువ తెలిసిన వాడిని కనుకే అర్ధరాత్రి లేపి రక్తం కావాలని వచ్చినా నిశ్శంకోచంగా దానం చేస్తానని ఈఎన్ఎస్-ఈరోజుకి  చెప్పుకొచ్చాడు.  

-రక్తం దానం చేయండి ప్రాణదాతలు కండి
అత్యవసర సమయంలో మీరు చిందించిన రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని బ్రతికిస్తుంది.. ఈరోజుల్లో అవసరానికి రక్తం దొరక్క ఎందరో మృత్యువాత పడుతున్నారు. అలాంటివారిని ఆదుకోవాలంటే మంచి మనసునున్నవారంతా రక్తం దానం చేయడానికి ముందుకి రావాలి. రక్తం దానం చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది. అయితే శరీరంలోని 12 గ్రాములకు మించి రక్తం ఉన్న వారు ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేయవచ్చు. అలా రక్తం దానం చేయడం ద్వారా దానిని విభజించి ప్లేట్ లెట్స్ గా కూడా రోగులకు ఎక్కిస్తున్నారు. రక్తం దానం చేసి ప్రాణ దాతలు కండి. రక్తం దానం చేసిన తరువాత మళ్లీ శరీరంలో రక్తం పెరగడానికి క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తోపాటు, బలవర్ధక ఆహారం తీసుకుంటే అతి తక్కువ సమయంలోనే దానం చేసిన రక్తం మళ్లీ శరీరంలోకి చేరుతుంది. ఇప్పటికీ ఒక్కవిశాఖలో రోజుకి 50 యూనిట్లు రక్తం ఆసుపత్రులకి అవసరమే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

visakhapatnam

2024-09-28 13:39:29

చినగదిలో డా.కంచర్ల మహా అన్నదానం..పెల్లుభికిన జనాభిమానం

ప్రజలకు చేసే నిశ్వార్ధ సేవైనా.. దేవుడు మెచ్చేలా చేసే నిండుగా ఉండే పూజలైనా.. భక్తుల మనుసుకి నచ్చే అన్నదానమైనా.. ఉపకార్ ఛారి టబుల్ ట్రస్టు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ సేవకులు, విద్యాదాత డా.కంచర్ల అచ్యు తరావు మార్కు ఉండాల్సిందే.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 రకాలతో భారీ ఎత్తున చేపట్టిన మహా అన్నదానం విశాఖలో రికార్డు సృష్టిం చింది. మహావిశాఖ పరిధిలోని ఆరిలోవ చినగదిలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేషుడి మండపంలో 24 అడుగుల ఎత్తులో  స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 24 రోజుల పాటు దూపదీప నైవేద్యాలతో సాక్షాత్తూ ఆ గణపయ్యే మెచ్చేవిధంగా పూజలు చేశారు.. 24 రోజుల పాటు 24 రకాల ప్రసాదాలు పంచిపెట్టారు..24వ తేదీనే స్వామిని అనుపుచేశారు.. అదే 24 రకాలతోనే 5వేల మందికి పైగా మహా అన్న దానం చేపట్టారు. మహా భోజ ఏర్పాటు చేసిన మహా అన్నదానం ప్రసాదంగా స్వీకరించిన వారంతా ఇపుడు నిండైన మనసుతో నిర్వాహకులను ఆశీర్వదిస్తున్నారు. ఏన్నో ఏళ్ల నుంచి ఆరిలోవ చినగదిలి ప్రాంతంలో వినాయక మండపాలను ఏర్పాడు చేస్తున్న ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది కూడా ఘనంగానే మండపాలు ఏర్పాటు చేసింది. అన్నింటా పెద్ద ఎత్తు కార్యక్రమాలను నిర్వహించింది. 

ఆఖరుగా 24 అడుగుల మహా గణపతి అనుపు మహోత్సవం రోజున చేసిన కూడా 24 సంఖ్య విశాఖలోని ఆరిలోవ వాసులకు గుర్తిండిపోయేలా భారీ అన్నసంతర్పణ కూడా చేపట్టింది. స్వయంగా డా.కంచర్ల అచ్యుతరావు ఈ మహా అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ మహాగణపతి ఆశీస్సులతో విశాఖ ప్రజలు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున గణేష్ మండపాలు ఏర్పాటుచేసి ఆ గణపతికి పూజలు చేసుకునే భాగ్యం దక్కిందన్నారు. ఈ ప్రాంత వాసులు తనపై చూపిస్తున్న అభిమానం.. ఆ దేవ దేవుడు ఇచ్చిన శక్తిమేరకు రానున్న రోజుల్లో కూడా మరింతగా కార్యక్రమాలు ట్రస్టు ద్వారా చేపడతామని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో ఈ ప్రాంతవాసులు భారీగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు స్వామివారి అనుపు సందర్భంగా కంచర్ల ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-09-26 14:49:12

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల రెగ్యులైజేషన్ అంశం కేబినెట్ లో చర్చించాలి

రాష్ట్రం లోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు రెగ్యులర్ చేసే విషయాన్ని ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సస్ స్ట్రగల్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సదరు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు మంగళవారంతో 12వ రోజుకి చేరుకున్నాయి.  ఈ సందర్భంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సు లు మాట్లాడుతూ, జీఓనెంబరు 115 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర  అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు జీఓను రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11500 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వంలో ప్రధాన అంశాల పై నిర్ణయాలు తీసుకునే ఏపీ కేబీనెట్ లో ఈ అంశాన్ని చేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎ.ఎన్.ఎం లకు జీఓఎంఎస్ నెం-5, జీఓఎంఎస్ నెం- 57 ల ద్వారా  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ఇచ్చి జిఓఎంఎస్ నెం-115 తో ఏఎన్ఎం లకు  స్టాఫ్ నర్సులు(జిఎన్ఎం) గా పదోన్నతి ఇస్తుందన్నారు.  

ఇలా ఇచ్చే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కనీసం పరిగనణలోనికి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల్లో జీఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్శింగ్ చదివి ఇప్పటికే 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఇందులో చాలా మంది మంది ఐదేళ్లు దాటిన వారు, మరికొందరు మూడేళ్లు దాటిన వాళ్లు ఉన్నారని. అయితే వాళ్లని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుంగా కేవలం ఏఎన్ఎంలను మాత్రమే ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. 13 ఏళ్లుగా ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ రాలేదని..కనీసం వేల సంఖ్యలో ఉద్యోగ విరమణలు చేస్తున్న స్టాఫ్ నర్సుల ఖాళీల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

visakhapatnam

2024-09-17 14:39:55

సత్యదేవుని నిత్యన్నాధాన ట్రస్ట్ కి రూ.1,00,000/-విరాళం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోని శ్రీ సత్య దేవ నిత్య అన్నదాన ట్రస్ట్ కి  జగ్గంపేటకి చెందిన బొండా సు బ్బరాజు, సరస్వతి దంపతులు ,రూ 1,00,000/-విరాళంగా అందజేశారు.  ఆదివారం దేవస్థానం కార్యాలయ సిబ్బందికి ఆ మొత్తాన్ని చెక్కుగా అందజేశారు. ప్రతి సంవత్సరం, ఆగస్టు 23న అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశా రు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు.

annavaram

2024-09-15 15:59:42

సత్యదేవుని నిత్యన్నాధాన ట్రస్ట్ కి రూ.1,00,001/-విరాళం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోని శ్రీ సత్య దేవ నిత్య  అన్నదాన ట్రస్ట్ కి కందుకూరుకి చెందిన ఎం శ్రీ కాం త్  దంపతులు ,రూ 1,00,001/-విరాళంగా అందజేశారు.  ఆదివారం దేవస్థానంలోని కార్యాలయ సిబ్బందికి ఆ మొత్తాన్ని చెక్కుగా అందజే శా రు. ప్రతి సంవత్సరం, ఏదో ఒక రోజున అన్నదానం చేయాలని దాతలు కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశా రు. దాతలకు సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు.

annavaram

2024-09-15 15:46:52

డా. బీవీఏ స్వామికి ఏపీఎంఈడీపీఏ అవార్డు

 ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ బూర్లె వెంకయ్యప్పలస్వామికి ఏపీ ఎంఈడీపీఏ అవార్డు లభించింది.  ఆంధ్ర ప్రదేశ్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోస్పెక్ట్ అసోసియేషన్ (ఏపీ ఎంఈడీ పీఏ)వారు ప్రతీ ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఈ ఏడాదికి గాను డాక్టర్ బీవీఏ స్వామిని ఎంపిక చేసి అందజేశారు.   ఈ అవార్డును ఏపీ  గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి  అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వి ఏ స్వామికి  హైదరాబాద్ లో అందించారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత స్వామి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన  అవార్డు తనకు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.  గుర్ల మండలం గూడెం గ్రామానికి తాను అసిస్టెంట్ ప్రొఫెసరుగా  అందించిన సేవలు, అనుభవం, వివిధ పరిశోధనలతో పాటు పలుఅభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు గాను  తనకి అవార్డు లభించందన్నారు. కాగా తమ యూనివర్సిటీకి చెందిన, అవార్డు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసరు డాక్టర్ బి వి ఏ స్వామిని  ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.అశోక్ తోపాటు అధ్యాపక సిబ్బంది, సహచరులు హర్షం వ్యక్తం చేశారు.

gurla

2024-09-15 15:10:17

ఎస్ఐ దివ్యకు వైఎస్సార్సీపీ నేతల శుభాకాంక్షలు

కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన టి.దివ్యను నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు, వైఎస్సా ర్సీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ స్టేషన్ కు మహిళా ఎస్ఐ రావడం ఇదే తొలిసారని. ఇప్పటి వరకూ చాలా మంది ఎస్ఐలు మారినా ఎన్నడూ మహిళా ఎస్ఐలు రాలేదన్నారు. మొట్టమొ దటిసారిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళా ఎస్ఐలు స్టేషన్ అధికారులుగా రావడం వలన మహిళల సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యర్రా శ్రీనివాసరావు, యర్రా నాగేశ్వ రరావు, యలమంచిలి ఎస్వీ రామణారావు, అప్పన కృష్ణ, లంక లోవనారాయణ, వాసం లోవ, లంక శివ, యర్రా బాబులు, అప్పన చిన్ని, గొంతి న సూరిబాబు, చేపూరి కృష్ణ, తురంగల చిన్న, గాజుల లోవ, కూనిశెట్టి యేసు, అప్పన చిన రమణ, కూనిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

krishnadevipeta

2024-09-15 07:02:40