1 ENS Live Breaking News

పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత - నగర మేయర్ గొలగాని

 ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు జివిఎంసి పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె గాజువాక 87వ వార్డు పరిధిలోని అమరావతి, మదర్ థెరీసా, వాకర్స్, మహాత్మా గాంధీ పార్కులతోపాటు తిరుమల నగర్ చిల్డ్రన్ పార్కులను అభివృద్ధి పరిచేందుకు సుమారు రూ.50.70 లక్షల వ్యయంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం, జోనల్ కమిషనర్ బంటు సన్యాసినాయుడు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ఉరుకూటి చందు, వైయస్సార్సీపి వార్డ్ ఇంచార్జ్ శ్రీనులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడు తూ ప్రతి వార్డులో ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు పార్కులను జివిఎంసి అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. 87వ వార్డులో సుమారు 51 లక్షల రూపాయలతో తిరుమల నగర్, అమరావతి పార్కు, మదర్ థెరీసా పార్కు, వాకర్స్ పార్కు, మహాత్మా గాంధీ పార్కులను అభివృద్ధి తోపాటు సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేసామన్నారు. అనంతరం గాజువాక శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని, గాజువాక ప్రాంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో గాజువాక అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చించి ప్రతి వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-22 11:49:30

ప్రియదర్శిని స్టేడియం ను త్వరగా ఆధునీకరించండి

మహా విశాఖ నగరంలో గల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను అధునాతనంగా ఆధునీకరించి వినియోగంలోకి త్వరితగతిన తీసుకురావాలని జివిఎంసి కమీషనర్ సిఎం.సా యికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం జివిఎంసి అధికారులతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖ నగరంలో అతి పెద్దదని, ఈ స్టేడియం నందు అంతర్జాతీయ క్రీడలు జరిగి ఉన్నాయని, రానున్న రోజులలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరుగనున్నందున అందుకు సిద్దంగా ఈ స్టేడియంను మరింత అభివృద్ధి పరచి ఆధునీకరణతో తీర్చిదిద్ది వినియోగంలోనికి త్వరిత గతిన తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం స్టేడియం లోపల జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఆడియన్స్ గేలరీ, విద్యుత్ స్తంబాలు, గ్రిల్ల్స్, స్కోర్ బోర్డు బిల్డింగ్, గార్డెనింగ్, పెయింటింగ్, లైటింగ్ మొదలగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆడియన్స్ ప్రధాన గేలరీకి ఆనుకొని వున్న హాల్స్, గదుల నందు ఇండోర్ గేమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.  అనంతరం  స్టేడియం గేలరీల వెనుక భాగంలో గల ఖాళీ ప్రదేశాలలో టెన్నిస్, బాడ్మింటన్, వాలీ బాల్ తదితర క్రీడా సంబంధిత  కోర్ట్ లను, పార్కింగ్ స్తలం, కెఫెటేరియా, ల్యాండ్ స్కేపింగ్, చిల్ద్రెన్ ప్లే ఏరియా, జిమ్ పరికరాలు మొదలగు వాటిని ఏర్పాటు చేయుటకు ప్రణాలిక లను సిద్దం చేసి సమర్పించాలని పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రాజును కమీషనర్ ఆదేశించారు.

 స్టేడియం అంతటా పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్, మినియేచర్స్, కూర్చునే బల్లలను ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సురేష్ ను ఆదేశించారు. మార్చి నెల 15వ తేదీ నాటికి స్టేడియం నందు అన్ని పనులను పూర్తి చేసి అధునాతనంతో అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం దొండపర్తి నుండి నేషనల్ హైవే వరకు అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణ, ఫుట్ పాత్ లు, కాలువలు, జంక్షన్ అభివృద్ధి, సెంటర్ మీడియన్, లైటింగ్, తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు సంతోషి, మత్సరాజు, ఎ.సి.పి. ఝాన్సీలక్ష్మి, ఎ.ఎం.ఒ.హెచ్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2024-02-22 10:59:28

పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులు త్వరగా పూర్తిచేయండి

సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖ నగర పర్యటన సందర్భంగా పారిశుధ్యం, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సీఎం విశాఖ నగరానికి విచ్చేయుచున్న సందర్భంగా ఎన్టీఆర్ జంక్షన్ నుండి చిన్న ముసిడివాడ శారద పీఠం వరకు పారిశుద్ధ్య పనులను, సుందరీకరణ పనులను అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులతో పాటు రోడ్లు మరమ్మత్తులు పనులు, ఆకర్షణీయమైన మొక్కలతో సెంటర్ మీడియన్ లను ఆకర్షణీ యంగా తీర్చిదిద్దాలని, వీధి దీపాల నిర్వహణ, ఫుట్ పాత్ లు, పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్, ఎస్.ఇ రామమోహన్ రావు, జోనల్ కమీషనర్ హేమావతి, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరరావు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-20 14:06:59

పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి బమ్మిడి ఎల్లాజీ

విశాఖ జనసేనలోకి యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. విశాఖలోని బీజేపిలోని ఓబీసీ పార్లమెంట్ సెక్రటరీగా తూర్పుని యోజకవర్గం సోషల్ మీడియా కో-కన్వీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తన్న బమ్మిడి ఎల్లాజీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈయన విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అడాప్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఈ సామాజిక వర్గంలో ఈయనకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. జనసేనలోకి వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేరిన తరువాత, సదరు సామాజిక వర్గం అంతా ఆలోచనలో పడినట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.  ఒక్క తూర్పునియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బమ్మిడికి మంచి ఫాలోయింగ్. ఇలా నెట్వర్క్ ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా జనసేన తీర్ధం పుచ్చుకోవడం విశాఖలో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈయన చేరిక తరువాత మరిన్ని చేరకలు జరుగే అవకాశముంది.

Visakhapatnam

2024-02-20 13:45:50

జివిఎంసి అభివృద్ధి పనులకు స్థాయి సంఘం ఆమోదం

విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మం గళవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ, స్థాయి సంఘంలో 136 అజెండా లతోపాటు 51 టేబుల్ అజెండాలు తో కలిపి మొత్తం 187 అంశాలు పొందుపరిచారని వీటిని స్థాయి సంఘం సభ్యులు చర్చించి ఆమోదించారని తెలిపారు. రెవెన్యూ విభాగా నికి చెందిన లీజులు పొడిగింపు, గుత్తలు, ఆశీలు వసూలకు సంబంధించి, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి పలు ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలు తొలగింపుకు రూ.12.30 లక్షలు, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పలు వార్డులలో తాత్కాలిక పద్ధతిపై అదనపు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసేందుకు జెసిబి లతో వ్యర్ధాలు తొలగింపు కొరకు రూ 2.23 కోట్లు, అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.47.41 కోట్ల తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందన్నారు. ఈ సమావేశంలో స్థాయి సంఘం సభ్యులతో పాటు పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్, కార్యదర్శి నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, డిసి(ఆర్) ఎస్.శ్రీనివాస్, జోనల్ కమీషనర్లు కె.కనక మహాలక్ష్మి, విజయలక్ష్మి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-20 12:53:40

జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించండి..ఈఎన్ఎస్ బాలు

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజవకర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(అక్రిడేటెడ్) చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త వరుపుల సుబ్బారావుని కోరారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో జర్నలిస్టులు, వారి సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ బాలు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల వలన ఈసారి మండల విలేఖరులకు ప్రెస్ అక్రిడిటేషన్ లు రాలేదని, నిబంధనలు సడలించి మండల కేంద్రంలో పనిచేసేవారికి అక్రిడిటేషన్లు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. చాలా ఏళ్లు జర్నలిస్టులకు హౌస్ సైట్లు, హౌసింగ్ స్కీములు ఇస్తామన్న హామీలు కూడా నెరవేరలేదని, ప్రస్తుతం ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవాలంటే అక్రిడిటేషన్ అవసరమని దానికోసం జిల్లా కలెక్టర్ తో సంప్రదించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టులు ప్రతినిత్యం వార్త సేకరణ కోసం ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తుంటారని, అలాంటి వారందరికీ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా చేయించాలని కోరారు. అదేవిధంగా టోల్ గేట్ల వద్ద కూడా సున్నారాయితీ మీడియా వాహనాలకు వర్తింపచేయాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే సమ యంలో పెట్టే కేసుల విషయంలో వాస్తవాలు గమనించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సానుకూలంగా స్పంది స్తూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తన బాధ్యతగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు పాల్గొన్నారు.

Prathipadu

2024-02-20 11:18:21

మీలో ఒక్కడిగా ఆదరించండి.. మీడియా ఆత్మీయ కలయికలో వరుపుల

మీలో ఒక్కడిగా తనను ఆదరించి మద్దుతు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కోరారు. మంగళవారం ప్రత్తిపాడు నియోజవకర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనను గుర్తించి మళ్లీ మీఅందరికీ సేవచేసుకునే అవకాశం ఇచ్చిందని.. ఆ విషయాన్ని మీడియాకి తెలియజేయడంతోపాటు, అందరినీ ఒకేసారి కలిసే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న విలేఖరుల అపరిష్క్రుత సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. సాధ్యమైనంత వరకూ అన్ని సమస్యలను పరిష్కరానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉన్నమీకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చునన్నారు. మధ్యలో ఎలాంటి మీడియేటర్లు, ప్రజాప్రతినిధులు ఉండరనీ చెప్పారు. పార్టీ అభివృద్ధి తాను చేయబోయే కార్యక్రమాలకు మీడియా సహకారం చాలా అవసరమని చెప్పారు. తనకి మీడియాలో పనిచేసేవారంతా ఒక్కటేనని, అందులో చిన్నా, పెద్దా తారతమ్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్టుగానే రాయాలని, అభిృద్ధి కోణంలో కూడా మీడియా వాస్తవాలు రాయాలన్నారు. లేనిపోని విషయాలు కల్పితాలు రాయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరుపులతోపాటు జెడ్పీటిసి, ఎంపీటిసిలు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు. 

Prathipadu

2024-02-20 10:57:57

మిలాన్ ఏర్పాట్లను నిరంతరం పరిశీలించండి..జీవీఎంసీ కమిషనర్


విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న మిలాన్ 2024 కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలుఅవాంతరాలు కలగకుండా నిరంతరం పరిశీలిస్తూ పర్యవేక్షించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి ఆర్.కె. బీచ్ రోడ్ లో మిలాన్ 2024 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బీచ్ రోడ్ విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ నుండి నోవాటల్ పరిసర ప్రాంతాల వరకు సందర్శించి,  మిలాన్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లనుసందర్శకుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీలను పరిశీలించారు. నేటి నుండి మిలన్ కార్యక్రమాలు జరుగుతున్నందున సందర్శకులు అధిక సంఖ్యలో బీచ్ ప్రాంతాలకు వస్తారనిఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

 

 బీచ్ నందు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలనిసెంట్రల్ మీడియన్ లలో మొక్కలను అందంగా తీర్చిదిద్దాలనిబీచ్ నందు అన్ని సోలార్ లైట్లనుసీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలనివీక్షకుల కోసం పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలనిఅవసరమైన చోట త్రాగునీటిని ఏర్పాటు చేయాలనికార్యక్రమంలో సందర్శకులకువీక్షకులకురవాణా సౌకర్యానికి ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లలో వున్న వ్యాపార బండ్లను తాత్కాలికంగా తొలగించాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్లు కేవిఎన్.రవిసత్యనారాయణ రాజుజోనల్ కమిషనర్ విజయలక్ష్మిప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్,  డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదర రావుచీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కుమార్కార్యనిర్వాక ఇంజనీర్ రత్నాకర్ రెడ్డిఏసీపీలుఎ ఏం ఓ హెచ్ లు  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-19 12:40:05

నిరాశ్రయులను రాత్రి బసలకు తరలించండి

విశాఖ నగరంలో రోడ్లు, ఫుట్పాత్తులు, ఫ్లై ఓవర్లు, రోడ్ల సెంటర్ మీడియన్లలో నిద్రిస్తున్న నిరాశ్రయులను జివిఎంసి నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లకు తరలించేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) కె.వి.పాపునాయుడు ను ఆదేశించారు. శుక్రవారం జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జివిఎంసి అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి నైట్ షెల్టర్ల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రాత్రిపూట నిరాశ్రయులు రోడ్లపైన, బహిరంగ ప్రదేశాలలో నిద్రించకుండా వారిని నైట్ షెల్టర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు మూ డు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

 రాత్రిపూట నిరాశ్రయులు ఎక్కడబడితే అక్కడ నిద్రించడం వలన పలు ప్రమాదాలు, ఇతర సంఘటనలకు గురి అయ్యే  అవకాశం ఉందన్నారు. రాత్రి బసకి తీసుకువచ్చిన నిరాశ్రయులను మరుసటి రోజు వారికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్ళేలా వారికి సూచించేలా చర్యలు చేపట్టాలని నైట్ షెల్టర్ నిర్వాహకులకు తెలిపారు. పోలీస్ కేసులో ఉన్న మహిళా నిరాశ్రయులను నైట్ షెల్టర్లకు తరలించకుండా ప్రత్యేకంగా ఐసిడిసిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా బస కేంద్రాలకు తరలించాలన్నారు. రోడ్లపై తిరిగే వృద్ధులు, అనాధలు, మానసికంగా ఉన్నవారిని గుర్తించి నగరంలో సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న పలు వృద్దాశ్రమలకు నిరాశ్రయ కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయాలని అదనపు కమీషనర్ కుప్రాజెక్ట్ డైరెక్టర్ కు కమీషనర్ సూచించారు.  ప్రతి నెల నైట్ షెల్టర్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, అందరూ విధిగా సమావేశానికి హాజరు కావాలని కమిషనర్ ఆదేశించారు.

 

అనంతరం పలువురు నైట్ షెల్టర్ల నిర్వాహకులు, నగరంలో నిరాశ్రయుల సంఖ్య పెరుగుతున్నందున కొత్తగా మరిన్ని రాత్రి బసలు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు కమిషనర్ స్పందిస్తూ, జివిఎంసి రెవెన్యూ విభాగంతో సమన్వయం చేసుకొని వారికి గాజువాక, అనకాపల్లి జోన్లలో నైట్ షెల్టర్లను ఏర్పాటుకు కేంద్రాలను గుర్తించాలని అదనపు కమిషనర్ కు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కు సూచించారు. అలాగే నైట్ షెల్టర్ నిర్వాహకుల యొక్క గౌరవ వేతనాలను పెంచేందుకు చర్యలు చేపడతామని నిర్వాహకులకు కమిషనర్ తెలిపారు.

         జివిఎంసి అదనపు కమీషనర్ మాట్లాడుతూ నగరంలో ఎన్ని నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నారు, ఏ ఏ షెల్టర్లలో ఎంతమంది నిరాశ్రయులు  ఉన్నారు ? వారికి సమకూరుస్తున్న మౌలిక వసతులపై ఆరా తీసి, నిరాశ్రయులు ఏ ఒక్కరు రోడ్లపై నిద్రించకుండా రాత్రి బసలతో బస చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.  ఈ సమావేశంలో భూపేష్ నగర్ నైట్ షెల్టర్ నిర్వాహకులు కొల్లి సింహాచలం, టిఎస్ఆర్ నైట్ షెల్టర్ నిర్వాహకులు ప్రగడ వాసు, ఇతర నైట్ షెల్టర్ నిర్వాహకులతోపాటు జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-16 11:16:49

అట్టహాసంగా నాగాపురం రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన

గొలుగొండ
మండలంలోని నాగాపురం  రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి శ్రీనివాస వెంకట రమణారావు, రాజరాజేశ్వరి దంపతుల చేతులమీదుగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడి పాత ఆలయం ఉన్నచోటే రూ.20 లక్షలకు పైబడి అంచనా ఖర్చుతో నూతన హంగులతో కొత్త దేవాలయం పునర్నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకమై ఈ బృహత్ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.56 గంటలకు   పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు మాట్లాడుతూ పాత ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దరఖాస్తు చేసుకున్నామన్నారు. వారు పెద్ద మనసుతో రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. దాతల నుంచి కూడా విరాళాలు సేకరిస్తున్నామని, అలా తోచినంత సాయం అందించానుకునేవారు 9492339941 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

Golugonda

2024-02-15 06:26:11

సూర్యభగవానుడి రథసప్తమి వేడుకలకు సిద్దమైన రాజుపాలెం

అనకాపల్లి మండలంలోని రాజుపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 16న రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లు అన్ని పూర్తిచేసామని ఆలయ చైర్మన్ కొణతాల బాబురావు తెలియజేశారు. శతకంపట్టు కనకదుర్గ అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ సహకారంతో ప్రముఖ బిల్డర్ కాండ్రేగుల నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సహకారంతో  శ్రీ సూర్య భగవాన్ క్యూ కాంప్లెక్స్ లు నిర్మించామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మధ్యాహ్నం అన్నదానం, పలు సంస్కృతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈనెల 14న ఉదయం ఆలయ అర్చకులు దొడ్డిపట్ల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో  శ్రీ ఉష పద్మిని చాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందని, సాయంత్రం స్వామి వారికి భక్తులు సహకారంతో సారి ఊరేగింపు జరుగుతుందని వివరించారు.

Anakapalle

2024-02-13 15:44:01

ప్రతీ వివాహం ముందస్తు నమోదు జరిగేలా సహకరించాలి

బాల్య వివాహాలు నిర్మూలనకు రాష్ట్రంలో జరిగే ప్రతీ వివాహానికి సంభందించిన వివరాలు ముందస్తుగా నమోదు జరిగేందుకు అధికారులు సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సిపిసిఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు.అనకాపల్లి జిల్లా స్త్రీ,శిశు  సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ డైరెక్టర్ అనంత లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  జిల్లా చైల్డ్ వెల్ఫేర్ పోలీసు అధికారులు,పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు బాల్య వివాహాలు నిలుపుద లలో పోలీసుల పాత్ర,ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ బాలల సంక్షేమ కార్యక్రమాలు,చట్టాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహాలు ముందస్తు నమోదు ద్వారా బాల్య వివాహాలు అరికట్టేందుకు ఆస్కారం వుంటుందన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ప్రకారం వదువు, వరుడి వయ స్సులను కూడా నిర్ధారించ వచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొబేషనరీ అధికారి ఎం.శరత్ బాబు, ఉమ్మడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బి.లూసీ కార్డులియా,జిల్లా లోని 33 పోలీసు స్టేషన్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు,సబ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
               

Anakapalle

2024-02-13 15:02:00

జివిఎంసి లో డయిల్ యువర్ మేయర్ కు 13 ఫిర్యాదులు

నిర్ణీత సమయం లో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కారించాలని జివిఎంసి అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జివిఎంసి అదనపు కమీషనర్ కె.ఎస్.విశ్వనాధన్ ఆదేశించారు. సోమవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యలయం లో జరిగిన డయిల్ యువర్ మేయర్,  జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమము లో పాల్గొని ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్బముగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డయిల్ యువర్ మేయర్ కు 13, జగనన్నకు చెబుదాం కు 96 ఆర్జీలు వచ్చాయన్నారు. అందులో డయిల్ యువర్ మేయర్ కార్యక్రమములో ఇంజినీరింగు విభాగానికు 05, పట్టణ ప్రణాళిక విభాగానికు 02,  ప్రజారోగ్య విభాగానికి 01, మొక్కల విభాగానికి 01, పిడి(యుసిడి) విభాగానికి 04 వచ్చాయని తెలిపారు. అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమములో 2వ జోన్ కు 17, 3వ జోన్ కు 17,  4వ జోన్ కు 10,  5వ జోన్ కు 09, 6జోను కు 20,  8వ జోన్ కు 15, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 08 ఫిర్యాదులు అందాయిని.. అలాగే పరిపాలనా విభాగానికి 01,  రెవెన్యూ విభాగానికి 09,  ప్రజారోగ్య విభాగానికి 07,  పట్టణ ప్రణాళిక విభాగానికి 29, ఇంజినీరింగ్ విభాగానికి 34, హార్టికల్చర్ విభాగానికి 02, యుసిడి విభాగానికి 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయరు మాట్లాడుతూ సంబంధిత అధికారులు మూడు రోజుల్లో లేదా నిర్ణీత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని, వచ్చేవారానికి నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవి క్రిష్ణం రాజు, ఎగ్జామీనర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఎఫ్.ఎ & ఎ.ఓ మల్లికాంబ, అన్ని జోన్ల పర్యవేక్షక ఇంజినీర్లు, డిపిఓ చంద్రిక, ఇన్ చార్జి డిడిహెచ్ చక్రవర్తి,  ఎసిపి శ్రీలక్ష్మి, యుసిడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2024-02-12 14:23:24

గ్రంథాలయాల ఆధునీకరణతో పాఠకులకు టెక్నాలజీ సౌలభ్యం

గ్రంథాలయాలను ఆధునీకరించడం ద్వారా పాఠకులకు మంది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ పేర్కొ న్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రంథాలయానికి కంప్యూట ర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రంథాలయాలకు సొంత భవనాలు సమకూరుతు న్నాయ న్నారు. అంతేకాకుండా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంక ట్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, లైబ్రేరియన్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

పెదబయలు

2024-02-11 09:13:18

గ్రంథాలయాలతో పఠనాశక్తి పెంపొందించుకోవాలి..కొండా రాజీవ్

గ్రంథాలయాలతో విద్యార్ధులు పఠనా శక్తి పెంపొందించుకోవాలని విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థను అగ్రగామిలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. గ్రంథాలయాల్లో విద్యార్ధుల సౌకర్యార్ధం అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, లైబ్రేరియన్ మహేష్, స్థానికి ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Gangaraju Madugula

2024-02-11 07:29:40