1 ENS Live Breaking News

నూతన పరిశ్రమలకు అన్నిరకాల చేయూత..

విజయనగరం  జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్ చేసుకోడానికి అనుకూలమైన వాతావరణం ఉందని,  పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే  వారికీ అన్ని రకాలుగా చేయూత నివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు.   అందుకు సరైన ప్రతిపాదనల తో , సంబంధిన డాక్యుమెంట్లతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు.   శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉంది , అవకాశాలు ఉన్నాయి కాని   ఏ ఏ పరిశ్రమలకు ఎలాంటి మార్కెటింగ్ ఉంటుందనే అంశాల పై కూడా అవగాహన ఉండాలన్నారు.   ముఖ్యంగా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, గిరిజన ఉత్పతులు , చేనేతలు, చేతి వృత్తులు,  చిరు ధాన్యాల గ్రేడింగ్, ఆర్గానిక్ ఉత్పతులు ,   మాంగో ప్రాసెసింగ్, జనప నార, తేనే, కూరగాయల ఉత్పతులకు సంబంధించిన పరిశ్రమలకు ఎక్కువగా మార్కెటింగ్  అవకాశాలు ఉన్నాయని, ఇందులో తక్కువ పెట్టుబడి తో ప్రారంభించవచ్చని అన్నారు.   బ్యాంకర్స్ తో ఉన్న సమస్యలను పరిస్కారానికి ఈ నెల 28 న లీ పారడైస్ లో లోన్ మేళ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరయితే, బ్యాంకర్ లతో ముఖ ముఖి  మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చని  తెలిపారు.  ఈ కార్యక్రమం లో విశాఖపట్నం నుండి హాజరైన ప్రముఖ వాణిజ్య వేత్త , ఛాంబర్  అఫ్ కామర్స్  మాజీ  అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ   కంటకపల్లి లో 40 ఎకరాల్లో  పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయితే  ఆ స్థలానికి రహదారులు, విద్యుత్, నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ ను కోరారు.   మోటార్ వాహనాల  అవసరత ఎక్కువగా ఉందని, అయితే  డ్రైవర్ల కొరత వలన ఆ  ఫీల్డ్  పెద్దగా అభివృద్ధి కావడం లేదని అన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ  డ్రైవింగ్ స్కూల్ ద్వారా హెవీ వెహికల్ శిక్షణలు ఇచ్చి డ్రైవర్ లను తయారు చేయడానికి  చర్యలు తీసుకుంటామని తెలిపారు.  స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా డిమాండ్ ఉన్న కోర్స్ లకు శిక్షణలు అందించడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణలు పొందిన వారికి త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. 

 డిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల వారికీ యూనిట్ల  స్థాపనకు  బ్యాంకు గ్యారంటీ లతో పాటు సేల్ డీడ్  లు అడుగుతున్నారని, అందువలన ఆసక్తి ఉన్నప్పటికీ  యూనిట్ ల స్థాపనకు ముందుకు రావడం లేదని అన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ అజెండా  లో పెట్టి ఎస్.ఎల్.బి.సి లో  ఉన్న నిబంధనలను చర్చించి  , బ్యాంకర్ లతో మాట్లాడి  తగు పరిష్కారాన్ని కనుగొంటామని అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్  శ్రీధర్ మాట్లాడుతూ  సెప్టెంబర్ నుండి నేటి వరకు  జిల్లాలో సింగల్ డెస్క్ పోర్టల్  లో 55  దరఖాస్తులు అందాయని, 33 దరఖాస్తులు అనుమతి పొందాయని , 20  దరఖాస్తులు పలు  కారణాలతో పెండింగ్ ఉన్నాయని,  2 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని  తెలిపారు.  ఈ కార్యక్రమం లో  సంయుక్త కలెక్టర్ లు డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు,  ఎం.ఎస్.ఎం.ఈ , స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్, స్టీల్ ప్లాంట్ , ఫాప్సి, డిక్కీ నుండి ప్రతినిధులు, కమిటి సభ్యులు, అధికారులు  పాల్గొన్నారు.  

Vizianagaram

2021-10-23 10:36:21

100 కోట్ల కరోనాటీకా మైలు రాయి వేడుకలు..

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో 100 కోట్ల మైలురాయి దాటిందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వేడుకలు  జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ చేసి తమ సంతోషాన్ని పాలుపంచుకున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా మన దేశంలో వేక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరిగిందని, ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని దాటామని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు గుర్తుచేసారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే మనదేశం తొలిస్థానంలో ఉందని వైద్య సిబ్బందితో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. దీనికి సహకరించిన వైద్య శాఖ, ఇతర శాఖల సిబ్బంది మరియు ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. వ్యాక్సినేషన్ తొలి రోజుల్లో ప్రజలు కొంత మేర భయబ్రాంతులకు గురైనప్పటికీ అనతికాలంలోనే ప్రజల్లో అవగాహన పెరిగి ముందుకు వచ్చారని, తద్వారా 100 కోట్ల మైలురాయిని దాటడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అతిత్వరలో శతశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దేశంలో , రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.  జిల్లాలో మొదటి డోసు 16 లక్షల 9వేల 662 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, రెండవ డోసు 8 లక్షల 41 వేల 484 మందికి వేయడంతో ఇప్పటివరకు 24 లక్షల 51 వేల 146 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, త్వరలోనే జిల్లాలో కూడా శతశాతం వ్యాక్సినేషన్ జరగనున్నట్లు ఆయన తెలిపారు.    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స్వరాజ్యలక్ష్మీ, అర్బన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. జె.కృష్ణమోహన్ , వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2021-10-22 15:38:10

సీఎం జగన్ కు మహిళలు అండగా నిలవాలి..

అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన సుభిక్షంగా ఉందని, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత కొనియాడారు. మహిళలకు ఒక అన్నగా, అండగా ఉంటూ, వారిని ఆర్ధికంగా, సామాజికంగా,  రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్.కోట మండలం గోపాలపల్లిలో రూ.7.5 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని, శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వనిత మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించేందుకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి పై, ప్రతిపక్ష టిడిపి నాయకులు అవాకులు, చెవాకులు ప్రేలుతూ, సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో అసభ్యకరంగా దూషిస్తున్నారని అన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోయిన టిడిపి, తమ ఉనికి చాటుకోడానికే  ఇలా వ్యవహారిస్తోందని   విమర్శించారు. డ్వాక్రా మహిళలను రుణ మాఫి పేరిట గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఇటీవలే రెండో విడత ఆసరా విడుదల చేయడంతో, మహిళలకు ప్రభుత్వం పై మరింత నమ్మకం, అభిమానం పెరిగాయని అన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలని మంత్రి కోరారు.   ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. ఇంతటి మహిళా పక్షపాతిని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని చంద్రబాబు కార్పోరేటీకరణ చేస్తే.... ఆ రెండింటినీ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన, దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రమేనని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆర్డిడి చిన్మయి, పిడి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో బిహెచ్ భవానీశంకర్, జెడ్పిటిసి ఎం.వెంకటలక్ష్మి, వైస్ ఎంపిపి ఐ.సుబ్బలక్ష్మి, వైసీపీ నాయకులు ఐ.రఘురాజు, ఎంపిడివో శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-22 15:24:13

టిటిడి గ్రంధాలను ఆవిష్కరించిన చైర్మన్..

తిరుమల తిరుపతి దేవస్థానం పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ముద్రించిన అగ్నిమ‌హాపురాణం(ప్ర‌థ‌మ భాగం), ఉత్త‌ర హ‌రివంశం (ప్ర‌థ‌మ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆవిష్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ స‌నాత‌న హైందవ ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఇతిహాసాల‌ను, పురాణాల‌ను స‌ర‌ళ‌మైన తెలుగులోకి అనువ‌దించి సామాన్య పాఠ‌కులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. అగ్నిమ‌హాపురాణంలో మొత్తం 383 అధ్యాయాల్లో 11 వేల‌కు పైగా శ్లోకాలు ఉన్నాయ‌ని, ప్ర‌థ‌మ భాగంలో 209 ఆధ్యాయాల్లో 5,780 శ్లోకాలు ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం సంస్కృత‌ విశ్రాంతాచార్యులు డా. కె.ప్ర‌తాప్ తెలుగులోకి చ‌క్క‌గా అనువ‌దించార‌ని వివ‌రించారు. అదేవిధంగా శ్రీ నాచ‌న సోమ‌న ర‌చించిన ఉత్త‌ర హ‌రివంశం గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయ‌ని, వీటిని రెండు సంపుటాలుగా శ్రీ కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యం తెలుగు విశ్రాంతాచార్యులు  డా. తుమ్మ‌పూడి కోటేశ్వ‌ర‌రావు తెలుగులోకి అనువ‌దించార‌ని చెప్పారు. ఈ రెండు గ్రంథాల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌కు, ఇత‌ర పండిత ప‌రిష‌త్ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌తాభినందనలు తెలియ‌జేశారు.  టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు పూర్వ‌ ప్ర‌త్యేకాధికారి డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య మాట్లాడుతూ భ‌గ‌వంతుడు వేదాల్లో చెప్పిన విష‌యాల‌ను అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా విశ‌దీక‌రించేందుకు 18 పురాణాలను వేద‌వ్యాసుల వారు ర‌చించార‌ని చెప్పారు. అగ్నిపురాణంలోని అంశాల‌ను అగ్నిదేవుడు వ‌శిష్టుడికి చెప్పారని, మాన‌వ‌జీవితం సార్థ‌క‌మ‌య్యేందుకు కావాల్సిన అన్ని విష‌యాలు ఇందులో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ గ్రంథంలో శ్లోకాల‌కు తాత్ప‌ర్యం, విశేషాంశాల‌ను తెలియ‌జేశామ‌న్నారు. టిటిడిలో పురాణాల అనువాదం ఒక మ‌హాయ‌జ్ఞంలా జ‌రుగుతోంద‌ని చెప్పారు. మ‌హాభార‌తానికి అనుబంధంగా ఉన్న గ్రంథం ఉత్త‌ర హ‌రివంశం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మ‌య్య‌,  పండిత ప‌రిష‌త్ స‌భ్యులు డా. కొంపెల్ల రామ‌సూర్య‌నారాయ‌ణ‌, డా. శ్రీ‌పాద స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, డా. శ్రీ‌పాద సుబ్ర‌మ‌ణ్యం, డా. ధూళిపాళ ప్ర‌భాక‌ర కృష్ణ‌మూర్తి, డా. తూమాటి సంజీవ‌రావు, డా. సాయిరాం సుబ్ర‌మ‌ణ్యం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. రేమెళ్ల రామకృష్ణ శాస్త్రి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, డా. స‌ముద్రాల ద‌శ‌ర‌థ్, డా.ఎన్.నరసింహాచార్యులు  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-22 13:06:46

అంగన్వాడీ కేంద్రాలను తరుచగా తనిఖీచేయాలి..

మహిళల భద్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ,  ఆర్ధిక భారం అయినా  లెక్క చేయకుండా  నిధులను కేటాయిస్తోందని  రాష్ట్ర  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  గత ప్రభుత్వం  500 కోట్ల ను కేటాయిస్తీ ఈ ప్రభుత్వం 1800  కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని అన్నారు. జిల్లా  రిషత్ సమావేశ మందిరం లో ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లతో సమీక్షించారు. సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు తమ పరిధి లోనున్న అంగన్వాడి కేంద్రాలను  రెగ్యులర్ గా తనిఖీలు  తనిఖీలు చేయాలనీ ఆదేశించారు.  క్షేత్ర స్థాయి లో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ్, పోషణ్ ప్లస్ కార్యక్రమాల క్రింద అందిస్తున్న  ఎండు ఖర్జూరం, బెల్లం, చిక్కీలు, గుడ్లు నాణ్యంగా ఉండడం లేదని కొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయని,  ఈ పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని అన్నారు . నాణ్యమైన సరుకులు రానపుడు  డెలివరీ తీసుకోకుండా తిరిగి పంపించి వేయాలని అన్నారు.   స్టాక్ వచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేసుకోవాలని, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వారికి నోటీసు లు జారి చేయాలనీ సూచించారు.  తరచుగా అంగన్వాడి  కేంద్రాలను తనిఖీ చేస్తుంటేనే అక్కడి లోపాలు అధికారుల దృష్టికి వస్తాయని, లోపాలను సవరించుకుంటే  గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.  ఈ తనిఖీలతో అంగన్వాడీ కేంద్రాల్లో బోగస్ నమోదును కూడా తగ్గించవచ్చని అన్నారు.   ఒక తనిఖీ కి  మరొకసారి వెళ్లి చేసిన తనిఖీ కి మధ్య జరిగిన మార్పులను కూడా గుర్తించాలన్నారు.  ప్రభుత్వం గర్భిణీల, బాలింతల, పసి పిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు వృద్ధా కాకుండా లబ్ది దారులకు అందిన నాడే  ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని అన్నారు.   రాష్ట్రం లో క్లిష్హ్త మైన  ఆర్ధిక పరిస్థితి  ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటీ మీరంతా చిత్త శుద్ధితో పని చేయాలనీ హితవు పలికారు.  ఈ సందర్భంగా మంత్రి  బాలల గృహం,  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మహిళా  ప్రాంగణం, వన్ స్టాప్ సెంటర్, ట్రాఫికింగ్,  జువనైల్ హోం, వయో వృద్ధులు, సదరం   తదితర  శాఖల పని తీరుపై సమీక్షించారు. సదరం క్యాంపు లను ప్రతి నియోజక వర్గం లో నిర్వహించాలన్నారు.   దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపకరణాల పై అందరికీ అవగాహన కలిగించాలన్నారు.
 
అంగన్వాడి కేంద్రాలకు జిల్లా పరిషత్ నిధులు: చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు 
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పని తీరు భేష్ గా ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు కొనియాడారు.  కోవిడ్ తర్వాత కేంద్రాలను తిరిగి ప్రారంభించారని,  అసలైన లబ్ది దారులకు పౌష్టి కాహారం అందేలా చూడాలని అన్నారు.   బాల్య వివాహాలను నిరోధించడం లో ఐ.సి.డి.ఎస్ శాఖ పాత్ర అభినందనీయమని అన్నారు.  ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.  శాఖ లో  జిల్లాలో ఖాళీ గ ఉన్న పోస్ట్ లను నింపడం ద్వారా మరింత మెరుగైన సేవలను అందించవచ్చని, పోస్ట్ లను వీలున్నంత తొందరగా నింపాలని మంత్రిని కోరారు.  అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల కోసం జిల్లా పరిషత్ నిధులను కేటాయిస్తామని చైర్మన్  ప్రకటించగా  మంత్రి స్పందిస్తూ  అంగన్వాడీల అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు  ధన్యవాదాలు తెలిపారు. అరకు పార్లమెంట్ సభ్యులు  గొట్టేటి మధ్హవి మాట్లాడుతూ మైదాన ప్రాంతాల కంటే గిరిజన గ్రామాల పై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తోందని,  గిరిజనులు  అంగన్వాడీ కార్యకర్తలనే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు.  గిరిజనులకు ఆరోగ్యం, ఆహారం పై పెద్దగా అవగాహనా ఉండదని, అంగన్వాడీ లే పెద్ద దిక్కని, వారికీ పౌష్టికాహారం పై అవగాహనా కల్పించడమే కాక అందించడం లో కూడా శ్రద్ధ చూపాలన్నారు.   సంయుక్త కలెక్టర్ అభివృద్ధి  డా.మహేష్ కుమార్   క్షేత్ర స్థాయి  తనిఖీలకు ఒక షెడ్యుల్ తయారు చేస్తామన్నారు. స్టాక్ వెరిఫికేషన్  చేసి నాణ్యత లేని సరఫరా దారులకు  నోటీసు లు జరీ చేసేందుకు నిర్ణీత ప్రోఫార్మ  తయారు చేసి అన్ని సెక్టర్ లకు పంపిస్తామన్నారు.  సాదరం కోసం త్వరలో మెగా క్యాంపు  నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  సమావేశం అనంతరం  బాల్య వివాహాల రద్దు పై, దిశా మొబైల్ యాప్ , దిశా సేవలు పై వరల్డ్ విజన్ ముద్రించిన కర పత్రాలను, పోస్టర్  లను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో శాసన సభ్యులు కోలగట్ల వీర భద్ర స్వామి,   ప్రాంతీయ  ఉప సంచాలకులు చిన్మయి దేవి, పి.డి మహిళా అభివృద్ధి ఛైర్పర్సన్ శాంతకుమారి  తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-22 12:50:22

ప్రభుత్వ భూముల పరిరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలి..

రెవిన్యూ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేందిగా వుండాల‌ని, ప్రభుత్వ భూముల విష‌యంలో నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు బాధ్యత‌గా, అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి త‌హ‌శీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అవ‌స‌రాల నిమిత్తం సేక‌రించిన భూముల‌ను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో న‌మోదు చేసేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి ప్రక్రియ‌నుపూర్తి చేసి భ‌విష్యత్తులో ఆ భూముల‌పై ఎలాంటి వివాదాలు త‌లెత్తకుండా చూడాల‌న్నారు. క‌లెక్టర్ కార్యాల‌యంలో జిల్లా రెవిన్యూ అధికారుల స‌మావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. తెలుగుత‌ల్లి చిత్రప‌ టం వ‌ద్ద జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి జ్యోతి ప్రజ్వల‌న చేసి స‌మావేశాన్ని ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రెవిన్యూ అధికారుల స‌మావేశం నిర్వహించ‌డం ఆనందంగా వుంద‌న్నారు. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా ప్రత్యక్ష స‌మావేశాలు నిర్వహించ‌లేద‌ని పేర్కొన్నారు. తొలి ద‌శ‌ కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డంలో ఈ జిల్లా ఇత‌ర జిల్లాల కంటే ముందువ‌రుస‌లో నిలిచింద‌న్నారు. జిల్లాలో 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సుగ‌ల వారిలో 92.5 శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌ని, 18 ఏళ్లకు పైబ‌డిన వారిలో 65శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌న్నారు. ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ప‌రిస్థితులు, ఖ‌చ్చిత‌మైన‌ డేటా సేక‌ర‌ణ‌కోసం రెవిన్యూ శాఖ కే బాధ్యత‌లు అప్పగిస్తార‌ని, రెవిన్యూశాఖకు ఏ ప‌ని అప్పగించినా వాస్తవిక‌మైన స‌మాచారం త్వరితంగా సేక‌రించి అందిస్తుంద‌నే న‌మ్మకం వుంద‌న్నారు. ఎలాంటి ఆ న‌మ్మకాన్ని నిల‌బెట్టేలా అధికారులు వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. రెవిన్యూ శాఖ‌కు సంబంధించి ప్రజలు త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ప‌దే ప‌దే కార్యాల‌యాల‌కు రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా త్వర‌గా ప‌రిష్కరించాల‌ని సూచించారు. గ్రామ స‌చివాల‌యాల నుంచి వ‌చ్చిన స‌మ‌స్యలు ఎంత కాల వ్యవ‌ధిలో ప‌రిష్కారం అవుతున్నాయో ప్రతి వారం స‌మీక్షించాల‌న్నారు. గ్రామ స‌చివాల‌యాల త‌నిఖీల ద్వారా నిర్దిష్ట ప్రయోజ‌నం క‌లిగేలా త‌హ‌శీల్దార్లు చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు.

 స‌చివాల‌యం త‌నిఖీ చేసిన‌పుడు గ్రామంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చిన రెవిన్యూ సంబంధ స‌మ‌స్యలు ఏవిధంగా ప‌రిష్కరిస్తున్నారు, స‌కాలంలో స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాలు ప‌రిశీలించాల‌న్నారు. రేషన్ కార్డు దారులకు సంబంధించి ఇ-కేవైసి తదితర సమస్యలను పరిష్కరించి రేషన్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బియ్యం పంపిణీ చేసే వాహనాలకు సంబంధించి ఆపరేటర్ల ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసే విధంగా ఎం.పి.డి.ఓ. లతో సమన్వయము చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జే.వెంకట రావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావనా, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, డి.ఎస్.ఓ. పాపారావు, భూసేకరణ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-22 12:46:37

పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలు..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్ట వలస గ్రామంలో శుక్రవారం ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. అధికంగా పాల్గొన్న మహిళా సంఘాలు ముందుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సరుబుజ్జిలి మండలంలో 611 సంఘాలకు 4 కోట్ల 50 లక్షల రూపాయల నమూనా చెక్కును డ్వాక్రా చెల్లెమ్మలకు స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో  అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంత పరిణితి చెందిన ముఖ్యమంత్రి చూడలేదని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో ప్రామాణికం కలిగిన పాలన అందిస్తున్నారని, అర్హత ప్రామాణికంగా పాలన సాగిస్తున్నారన్నారు. పిల్లలను బడికి పంపిస్తే ఆ పిల్లలకి ఉన్నత చదువులు చదివిస్తానని చెప్పి విద్య కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం రెండో విడత డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేడు నగదు జమ చేశారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.వి.జి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శివానందమూర్తి (బాబు), జెడ్ పి టి సి సురవరపు నాగేశ్వరరావు, బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కోవిలాపు శేఖర్, స్థానిక సర్పంచ్ ముడాడ్ల రమణ, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-22 12:40:33

స్వచ్ఛ కాకినాడకు నగరవాసులు సహకరించాలి..

కాకినాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా  తీర్చిదిద్దేందుకు కాకినాడ నగర పాలక సంస్థ అహర్నిశలు కృషి చేస్తుందని కమిషనర్   స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శుక్రవారం  కాకినాడ నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలు ఉండకూడదని పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. నగరవాసులు కూడా రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలను వేయకూడదని, ఎటువంటి ఆక్రమణలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు.  ఒకవేళ పారిశుధ్య కార్మికులు వ్యర్ధాల సేకరణకు రాకపోతే 18004250325 నెంబరుకు ఫోను చెస్తే 24 గంటల లోపల పారిశుధ్య కార్మికులు ఇంటికే వచ్చి  వ్యర్ధాలను సేకరిస్తారని తెలిపారు.   దుకాణదారులకు డస్ట్ బిన్ ను తప్పనిసరిగా షాపు ముందు ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. స్థానికులు అందరూ పర్యావరణ పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం హర్షదాయకమని పేర్కొన్నారు. కొంత శ్రద్ధతో తడి, పొడి, హానికర వ్యర్ధాలను విడివిడిగా ఇవ్వడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలను భద్రపరిచగలమని కమిషనర్ గారు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

Kakinada

2021-10-22 12:18:55

జర్నలిస్టులకు అండగా ఉంటాం.. విజయసాయిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత  ఇవ్వడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డిని జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను విజయసాయిరెడ్డి వద్ద శ్రీనుబాబు ప్రస్తావించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయ్ సాయిరెడ్డిని శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

GVMC Park

2021-10-22 10:05:43

గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళం..

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్  శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు,  2 దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు.  ఆ పత్రిక ప్రతినిధి  సందీప్ టిటిడి చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి ద్వారా ఆవులు, దూడలను గోశాలకు అందించారు. ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు. అనంతరం  సుబ్బారెడ్డి గోశాలను పరిశీలించారు. శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే  వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు అవసరమవుతాయి,  ఎన్ని పాలిచ్చే ఆవులు ఉండాల్సిన అవసరం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా చైర్మన్  సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.  తిరుమలలో శ్రీవారికి దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడానికి తిరుమల లోని గోశాలను విస్తరించడం జరుగుతుందన్నారు.  ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ 60 దేశీయ  జాతి ఆవులు ఉన్నాయని,  మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేకమంది దాతలు ముందుకొచ్చారని చైర్మన్ చెప్పారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టినందువల్ల నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి రూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు,  సర్వ దర్శనం టికెట్ల సంఖ్య గత నెల కంటే పెంచామని చెప్పావు. శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసిన గంటన్నరలోనే  బుక్ చేసుకున్నారని చెప్పారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు సైతం మొబైల్ ఫోన్ ద్వారా కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక  తిరుపతిలో కొంత మేరకు సర్వ దర్శనం టికెట్లు జారీ చేసే ఆలోచన చేస్తామని  సుబ్బారెడ్డి వివరించారు.  ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తున్న గో ఆధారిత నేవేద్యం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించడం లో భాగంగా  అక్టోబర్ 30 మరియు 31 వ తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రముఖులను ఆహ్వానించామన్నారు.  టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో  హరీంద్ర నాథ్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు  శివ కుమార్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-22 08:06:01

స‌చివాల‌యాన్ని ఆకస్మికంగా త‌నిఖీచేసిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని కెఎల్‌పురం-2 వార్డు స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ రిజిష్ట‌ర్‌ను ప‌రిశీలించారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ఆరాతీశారు. స‌చివాల‌య ప‌రిధిలో జ‌రిగిన‌ కోవిడ్‌ వేక్సినేష‌న్‌, రైస్ కార్డుల జారీ, ఈకెవైసి న‌మోదు, జ‌గ‌న‌న్న శాశ్వ‌త గృహ హ‌క్కు ప‌థ‌కాల గురించి ప్ర‌శ్నించారు. న‌ర‌త్నాల అమ‌లుపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. స్పందన కార్యక్రమం ద్వారా  ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే ద‌ర‌ఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాల‌ని, అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఉద్యోగులంతా సమయపాలన పాటించాలన్న కలెక్టర్ సిబ్బంది మొత్తం అంతా మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.  ప్రజలకు ఏ ఒక్క సేవలోనూ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

Vizianagaram

2021-10-22 06:27:30

తేడా రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్..

తెలుగు దేశం పార్టీని వ్యతిరేకిస్తూ జనం చీకొడుతున్నా ప్రతిపక్ష నాయకుడు చంద్రబా బునాయుడుకు సిగ్గురావడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. గురువారం నరసన్నపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తో కలిసి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. కోమర్తి, చితవానిపేట, తలసముద్రంలలో రూ.35 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలు కష్టాలున్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారని ఆరోపించారు. సుపరిపాలన అందిస్తున్న సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ధోరణిలో చంద్రబాబు తీరు ఉండడం ఎంతో దారుణమన్నారు. రాజకీయ వికృతి క్రీడలో భాగంగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేయించారన్నారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమనం తో ఉండాలని తమను కోరారన్నారు. అయినా కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితికి చంద్రబాబు తెస్తున్నారని, చంద్రబాబు మాట్లాడే భాష ప్రజలు చూస్తున్నారని. వారే మళ్లీ గుణ  పాఠం నేర్పుతారని అన్నారు, 

మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని అన్నారు. అది చూసి ఓర్వ లేక ప్రతిపక్షం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు  కొద్దీ తీరు దారుణంగా తయారైందన్నారు. సిగ్గుమాలిన వ్యక్తిగా చంద్రబాబు రూపాంతరం చెందారన్నారు. పట్ట్బాలి నూట్లాడిన మాటలు కన్న తల్లులు, అడవారిని కించపరిచే లా లేవా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని అన్నారు. అవినీతి రహిత పాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. 

యువ నాయకులు పోలాకి జడ్పిటిసి సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ  అభివృద్ధి, సంక్షేమ పథకాల కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని చెప్పారు. టీడీపీ ఎన్ని ప్రేలావనలు చేసినా విజ్ఞత గల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు సంయమనం కోల్పోరనీ, కానీ ఎల్లవేళలా సహనంతో ఉంటారని అనుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో  జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాడ కృష్ణచైతన్య, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర్ రావు, ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-21 08:57:53

సమాజంలో అతిముఖ్యమైనది పోలీస్ వ్యవస్థ..

తల్లి తండ్రి తరువాత అతి ముఖ్యమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని అయితే ఇందులోని మంచిని గుర్తించకుండా కొంతమంది చెడును బహిర్గతం చేయకుండా మనకోసం మన సమాజం కోసం అసువులు బాసిన వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి వై వి ఎన్ బి జి పార్థసారథి అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరులకు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ సెంథిల్ కుమార్ లతో పాటు అమరవీరుల ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మన వ్యవస్థకు ఎంతో గొప్ప కుటుంబాన్ని అదేవిధంగా అమర వీరులను ఇవ్వడం జరిగిందని వీరి ద్వారా మనం రక్షించబడుతున్నామని ప్రజలు సుఖంగా ఉండడానికి కారణం ఒక రక్షణ వ్యవస్థ అని రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోతున్నా మన్నా అందుకు పోలీసులే కారణమని సాధారణంగా మంచి చేసే వారి విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది .అయితే ఎప్పుడూ ఆ వ్యతిరేకతను మర్చిపోయి వారిలోని  సేవలను గుర్తించాలని అన్నారు. కోర్టు కన్నా ముందే ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్ కు వెళుతుందని పోలీసులు స్నేహ పూర్వక వాతావరణంలో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని అన్నారు. అదేవిధంగా రాత్రింబవళ్లు సెలవులు లేకుండా పనిచేయడం వల్ల వారు కొంత చిరాకు పడటం జరుగవచ్చునని అయితే బాధితులు కూడా వారి కష్టాలను అర్థం చేసుకోని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.
 జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ ఎవరైతే మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించారో వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మొదట ఈ సంఘటన 1959 అక్టోబర్ 21న జరగడంతో అమరవీరుల సంస్మరణ దినాన్ని అదేరోజున జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు, వారు చేసిన సేవలను మననం చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము జరుగుతోందన్నారు.  ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా క్లిష్ట సమయంలో  ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి,పోలీసు వ్యవస్థ వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం చేసిన సేవలు మర్చిపోలేమని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ప్రజలకు సేవ చేసే సమయంలో ఎంతోమంది అశువులు బాయడం కూడా జరిగిందని అటువంటి క్లిష్ట సమయంలో కూడా పోలీసు శాఖ అందించిన సేవలను మర్చిపోలేమ న్నారు. కొంతమంది హక్కులను కాలదోసి సంఘంలో గొడవలు సృష్టించే సమయంలో కూడా పోలీసులు అందించినసేవలు మరువలేనివని వారికుటుంబసభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని అమరులైన వారికి జోహార్లు అని అన్నారు.
త్యాగనిరతి కి ప్రతిరూపంగా పోలీసుల అమరవీరుల దినంగా అక్టోబర్  21 ని భావిస్తున్నామని ఎంతోమంది విధినిర్వహణలో అమలు కావడం జరిగిందని వారందరినీ మననం చేసుకునేందుకే అమరవీరుల దినోత్సవం ను జరుపుకుంటున్నా  మన్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పోలీసుల సేవలు అందించడం జరిగిందని నిరంతరం ప్రజల కోసం సేవలందిస్తూ కొంతమంది అశువులు బాయడం కూడా జరిగిందని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ప్రజల సంరక్షణ ప్రధమ బాధ్యతగా పోలీసుల సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం స్పెషల్ ఫోర్స్ మెంట్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అమరవీరుల పేర్లను చదువుతూ అందరికీ మననం చేశారు. ఈ సందర్భంగా వారికి గౌరవసూచకంగా అందరూ గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘవిద్రోహ శక్తుల చేతిలో మరణించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన హుస్సేన్ భాష, సురేంద్ర, జవహర్ లాల్ నాయక్, దేవేంద్ర కుమార్, ఆంజనేయులు, ఈశ్వరయ్య, ముని శంకర్, ప్రదీప్ కుమార్, మోహన్ కిషోర్, కృష్ణమూర్తి  కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సంవత్సరం మరణించిన ఏ ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు, ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు, మునిశంకర్ కుటుంబ సభ్యులకు 10.5 లక్షలు జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు అందించారు.ఈ  కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులతో పాటు అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Chittoor

2021-10-21 05:49:11

శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా  ఉద‌యం సుప్రభాత సేవ‌తో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం, అన్నలింగ అలంకరణ చేపట్టారు. అంతకుముందు శుద్ధోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.  అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం అన్నలింగ దర్శనం అనంతరం, అన్నలింగ ఉద్వాసన చేశారు. స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.

Tirupati

2021-10-20 13:58:43

అయ్యవార్లను అధిక భక్తులు దర్శించుకోవాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆలయాలను ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు చక్కగా విధులు నిర్వహించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో ఆలయాల వారీగా అభివృద్ధిని చేసి చూపాలన్నారు. ఆలయాల స్థలపురాణం, ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సప్తగిరి మాసపత్రిక, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టిటిడి వెబ్ సైట్ లో ఆలయాల స్థల మహత్యం, చరిత్ర, వసతులు ఇతర విషయాలను వివరంగా పొందుపరచాలని, తద్వారా సుదూర ప్రాంతాల భక్తులు సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యంగా సంబంధిత ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీనియర్ అధికారులు ఆయా ఆలయాలను సందర్శించినప్పుడు చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.   ఈ సమావేశంలో ఎఫ్ఎ అండ్ సిఎఓ  బాలాజి, న్యాయాధికారి  రెడ్డప్ప రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈఓ జనరల్  రమణ ప్రసాద్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-20 13:44:45