1 ENS Live Breaking News

జిల్లాలో శాశ్వత భూ హక్కు సర్వే పక్కాగా చేయాలి..

శ్రీకాకుళంజిల్లాలో జగనన్న భూ సర్వే శాశ్వత భూ హక్కు కార్యక్రమంను  గ్రామాల్లో పక్కాగా రీ సర్వే నిర్వహించాలని సర్వే శాఖ కర్నూల్ ప్రాంతీయ ఉప సంచాలకులు మరియు ప్రధాన శిక్షకులు ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ భూములు, దేవదాయ శాఖ భూములు, ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. భూతగాదాలకు తావులేకుండా రీ సర్వే సక్రమంగా జరిగి శాశ్వతంగా భూ హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయాలని వెంకటేశ్వరరావు సర్వేయార్లకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రీ సర్వే ఆపరేషన్స్ వర్క్ షాప్ మరియు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) పై శిక్షణ తరగతులు జరిగింది. డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, అన్ని మండలాల సర్వేయర్లు,   గ్రామ సర్వేయర్ల రీ సర్వే కార్యకలాపాలకు  శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం, విజయనగరం సర్వే శాఖ సహాయ సంచాలకులు  కె .ప్రభాకర్,  టి.త్రివిక్రమ్, సర్వే తనిఖీఅధికారి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-06 10:52:49

లక్ష్యాలను అధిగమించేందుకు క్రుషిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్ణ‌యించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ అంశాల్లో భాగ‌మైన వ్య‌వ‌సాయం, నీటి వ‌న‌రులు వినియోగం, ఉద్యాన‌పంట‌ల విస్త‌ర‌ణ‌, సూక్ష్మ నీటి పారుద‌ల త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై త‌న ఛాంబ‌ర్‌లో శ‌నివారం సంబంధిత అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా ఆయా శాఖ‌ల వారీగా నీతి అయోగ్ ర్యాంకుల‌ను, ఇండికేట‌ర్ల‌ను స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప్ర‌తీ శాఖా నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ర‌బీలో పంట‌ల సాగు పెరిగేలా చూడాల‌ని, చిన్న‌, స‌న్న‌కార రైతుల‌కు విరివిగా రుణాల‌ను అంద‌జేయాల‌ని సూచించారు. రైతులు కేవ‌లం సంప్ర‌దాయ పంట‌ల‌కే ప‌రిమితం కాకుండా, ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగును ప్రోత్స‌హించాల‌ని కోరారు. భూసార ప‌రీక్ష‌ల‌ను విరివిగా నిర్వ‌హించి, స‌ర్టిఫికేట్ల‌ను రైతుల‌కు అంద‌జేయాల‌ని, భూ సారాన్ని బ‌ట్టి పంట‌ల‌ను సూచించాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ‌ను ఆదేశించారు. ప్ర‌జ‌లు కేవ‌లం ప్ర‌భుత్వం ఇచ్చే స‌బ్సిడీల‌కోసం ఎదురు చూడ‌కుండా, బ్యాంకు రుణాలను తీసుకొని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టేలా చైత‌న్యం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ‌, తుంప‌ర సేద్యం అమ‌లుపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆస‌క్తి ఉన్న రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, ఈ విధానాన్ని అవ‌లంబించేలా చూడాల‌న్నారు. వారికి పూర్తి సాంకేతిక స‌హ‌కారాన్ని అందించాల‌ని ఎపిఎంఐపిని ఆదేశించారు.  ఈ స‌మావేశంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌ల‌క్ష్మి, వ్య‌వ‌సాయ‌శాఖ జెడి వి.టి.రామారావు, ఉద్యాన‌శాఖ డిడి ఆర్‌.శ్రీ‌నివాస‌రావు, ఎపిఎంఐపి పిడి పాండురంగారావు, ఎల్‌డిఎం ఎం.శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-06 08:52:16

చేపల ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి.. ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి..

మత్స్యకారులు చేపల పెంపకం, ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పిలుపు నిచ్చారు. బుధవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 10.87లక్షలు చేప పిల్లలను, సాలూరు మండలంలోని, చిన చీపురువలస వెంగళరాయునిసాగరం రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధి పెంచాలనే  లక్ష్యంలో జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో చేపపిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఆహ్వానితులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మత్సకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పార్వతి, ఎఫ్డీఓ నాగమణి, స్థానిక సర్పంచ్ రాములమ్మ, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలు రెడ్డి సురేష్ కుమార్, త్రినాధ్, , ఎంపీటీసీ అనూష, సొసైటీ అధ్యక్షుడు తిరుపతి,  అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.

Salur

2021-11-04 03:53:44

వీజెఎఫ్ లో ఘనంగా దీపావళి వేడుకలు..

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బాణాసంచా, మిఠాయిలు, ప్రమిదులు తదితర సామాగ్రిని పంపిణి  చేశారు.ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిధిగా హాజరైన  నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు మాట్లాడుతూ, సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టులు దీపావళి పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలన్నారు. సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు క్రమం తప్పకుండా దీపావళి సామాగ్రిని అందజేస్తున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పండుగలు, క్రీడలు, విద్య, వైద్యం ఇలా అన్నింటా కూడా తమ సభ్యులకు వీజెఎఫ్ అందజేయడం అభినందనీయమన్నారు. తాను జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటానన్నారు.. పురాన ఇతిహాస కథనాల ప్రకారం దీపావళి పండుగకి విశిష్టమైన స్థానం ఉందన్నారు. మహాలక్ష్మిని పూజించడంతో పాటు ప్రతీ ఒక్కరూ పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా ఈ పండుగను జరుపుకోవాలని, పిండి వంటలతో పర్వదినాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరికి ఆ సింహాద్రినాధుడు ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు,ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అన్ని పండుగలు నిర్వహించిన ఘనత వైజాగ్ జర్నలిస్టుల ఫోరంకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందరి సహకారంతోనే అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయగలుగుతున్నామన్నారు. త్వరలోనే జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం, మీడియా అవార్డుల ప్రధానం ఘనంగానిర్వహించనున్నట్లు చెప్పారు. మీడియా అవార్డుల కమిటీ ఛైర్మన్, వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె. రామేశ్వరి తదితరులు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.నానాజీ, కోశాధికారి పి ఎన్ మూర్తి. జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, పి. నానాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తొలుత అతిధులు చేతులు మీదుగా బాణాసంచా, మీఠాయిలు, ప్రమిదలు ప్యాక్లను పలువురు జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.

Visakhapatnam

2021-11-03 17:32:02

ఏఓబీలో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్..

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్ కి శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి అత్యధికంగా గంజాయి రవాణా కావడం.. దానికి మూలాలు తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజాహంట్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెరలేపారు. ఇందులో బుధవారం భాగంగా ఎక్కడైతే గంజాయిని పండిస్తారో ఆ ప్రాంతం మోతుగూడెం మండలం ఒడిసా కేంప్  ప్రాంతానికి తాను స్వయంగా వెళ్లి గంజాయి మొక్కలను పెకిలించారు. ఆపై వాటిని స్వయంగా తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడి జిల్లా కేంద్రంలోని మీడియా కూడా అక్కడికి వెళ్లింది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు వెళ్లి అక్కడ సుమారు రూ.2 కోట్ల విలువైన గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఈ గంజాయి సాగు వలన కలిగే నష్టాలు, నమోదవుతున్న కేసులను ఏఓబీ(ఆంధ్రా ఒడిసా బోర్డర్) లో ఏ ఎవరెవరు గంజాయి సాగుచేయిస్తున్నారో వారికి పడిన శిక్షలను అక్కడి గిరిజనులకు, సాగు దారులకు వివరించారు. ఇదంతా స్టేట్ పోలీస్ బాస్ డీజీపీ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఎస్పీ తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి రవాణా ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి జరుగుతుండటం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతున్న కేసుల్లో కూడా జిల్లాకి చెందిన వారు ఉండటంతో మొత్తం మూలాలతో సహా గంజాయిని నిర్వీర్యం చేయాలని పోలీసుశాఖ భావించి ఈ నిర్మూళన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వం ఈ గంజాయి, నాటుసారా వ్యవహారంలో కాస్త సీరియస్ గా ఉండటంతో పోలీసులు తమ దూకుడుని పెంచారు.  జిల్లాఎస్పీ  స్వయంగా తన సిబ్బందితో కలిసి వెళ్లి మరీ ఈ కార్యక్రమం చేపట్టడం, అదీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టడం విశేషం. కార్యక్రమం మొత్తం పోలీసు తుపాకీ పహారా మధ్య కట్టుదిట్టంగా సాగింది. విధినిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఎస్పీ దైర్యంగా ముందగు వేయడంతో మీడయా కూడా ఆయన వెంటన నడిచింది. అక్కడి గిరిజనులు కూడా ఇకపై గంజాయి పంటను పండించమని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ చర్యలతో మంచి ఫలితాలు వస్తాయని పోలీసుశాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ డిఎస్పీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఏఓబీ కేంప్

2021-11-03 15:42:24

ఉప రాష్ట్రపతికి విమానాశ్రమంలో ఘన స్వాగతం..

విశాఖ జిల్లాలో 5 రోజుల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయంలో పలువురు అధికారులు,  ప్రజా ప్రతినిధులు, నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు కు విమానాశ్రయంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్.ఎల్.ఎ. పి.వి.జి.ఆర్.నాయుడు, రాష్ట్ర డి.జి.పి. గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి.క్రిష్ణా రావు, నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్టి, వి.ఎస్.ఎమ్,  ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్  ఈస్టర్న్ ఫ్లిట్ (FOCEF) తదితరులు ఘన స్వాగతం పలికారు.

Visakhapatnam

2021-11-02 07:35:47

గురుకులాల్లో సీఆర్టీల సర్వీసు పొడిగింపు..

రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల (సీఆర్టీలు) సర్వీసును 2021-22 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో 1798 మంది కాంట్రాక్ట్ రిక్రూటెడ్ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 794 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా, 1004 మంది ఎస్జీటీలు, పీఇటీలు, లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి కాంట్రాక్ట్ సర్వీసును పొడిగిస్తుండగా ఈ ఏడాది కొన్ని సాంకేతిక కారణాలతో సీఆర్టీల సర్వీసు పొడిగింపును అధికారులు నిలిపివేసారు. దీంతో పలు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే సీఆర్టీలు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఆర్టీల సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సీఆర్టీల సర్వీసును పొడిగించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్టీల సర్వీసును ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులను జారీ చేసారు. కాగా సీఆర్టీల సమస్యను గురించి తాను చెప్పిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కృతజ్ఞతలు తెలియజేశారు.

Kurupam

2021-11-02 07:25:35

పర్యావరణ హితంగా దీపావ‌ళి జ‌రుపుకుందాం..

ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌లు నుంచి 10 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే బాణాసంచా కాల్చాల‌ని సూచించారు. దీపావ‌ళి పండుగ‌, బాణాసంచా విక్ర‌యాల‌కు సంబంధించి, జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌, మ‌రియు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సూచ‌న‌ల‌కు అనుగుణంగా  ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ఉత్త‌ర్వుల‌ ప్ర‌కారం, వివిధ‌ శాఖ‌ల‌కు క‌లెక్ట‌ర్ ప‌లు ఆదేశాల‌ను క‌లెక్ట‌ర్ జారీ చేశారు. ప్రకృతికి హిత‌మైన, గ్రీన్ క్రాకర్స్ ని  మాత్ర‌మే వినియోగించాల‌ని ఆ ఉత్త‌ర్వుల్లో క‌లెక్ట‌ర్‌ పేర్కొన్నారు. దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌లు నుంచి 10 గంట‌లు మ‌ధ్య మాత్ర‌మే బాణాసంచా కాల్చాల‌ని ఆదేశించారు. బాణాసంచా విక్ర‌యించే షాపుల్లో అన్ని ర‌కాల భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని, షాపుల‌మ‌ధ్య క‌నీసం 10 అడుగుల‌ దూరం ఉండాల‌ని సూచించారు. కొనుగోలుదారుల మ‌ధ్య క‌నీసం 6 అడుగుల భౌతిక‌ దూరం ఉండేట‌ట్టుగా, షాపుల‌వ‌ద్ద క్యూ ఏర్పాటు చేయాల‌ని, షాపుల‌వ‌ద్ద శానిటైజ‌ర్ల‌ను వినియోగించ‌వ‌ద్ద‌ని, దానికి బ‌దులుగా చేతుల‌ను శుభ్రం చేసుకొనేందుకు స‌బ్బును వాడాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు మేర‌కు, త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో,  ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌లుగ‌కుండా, ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకొనేలా ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌ర‌చాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను, తాశీల్దార్లు, ఎంపిడిఓల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2021-11-01 11:47:08

ఘ‌నంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్‌లో ఘనంగా నిర్వ‌హించారు. సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ కార్యాలయ ప్రాంగ‌ణంలోని జాతీయ ప‌తాకాన్ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆవిష్క‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు కిశోర్ కుమార్‌, మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, వెంక‌ట‌రావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంక‌ట‌ప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొని జాతీయ ప‌తాకానికి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడారు. త్యాగ‌ధ‌నుల ఫ‌లితంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భ‌వించింద‌ని.. వారి స్ఫూర్తిని, భావ‌జాలాన్ని భావిత‌రాల‌కు అంద‌జేయాల‌ని హితవు ప‌లికారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని, మంచి ప‌నితీరు, ఆద‌ర్శ భావాల‌తో జీవిస్తూ ఆ గుర్తింపును కాపాడుకోవాల‌ని పేర్కొన్నారు. మ‌ద్రాసీల నుంచి ప్ర‌త్యేకంగా విడిపోక ముందో ఇక్క‌డి నాయకులు, ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని, అవ‌మానాలు ఎదుర్కొన్నార‌ని గుర్తు చేశారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌లు ప‌డి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో ముందంజంలో ఉండాల‌ని ఆకాంక్షించారు. పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగ ఫ‌లితంగానే ఈ రోజు మ‌నంద‌రం ప్ర‌త్యేక రాష్ట్రంలో జీవిస్తున్నామ‌ని, ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. గుర‌జాడ చెప్పిన‌ట్లు ప‌త్రి మ‌నిషీ పౌరుల కోసం.. స‌మాజం కోసం జీవించాల‌ని హిత‌వు ప‌లికారు. వైఎస్సార్ జీవిత సాఫ‌ల్య పుర‌స్కారానికి జిల్లా నుంచి అయిదుగురు ఎంపిక‌వ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆశాజ‌నకంగా సాగింద‌ని పేర్కొంటూ వైద్యాధికారుల‌కు, స‌చివాల‌య సిబ్బందికి క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. స్కిల్ డెవల‌ప్‌మెంట్ విభాగ అధికారులు నిర్వ‌హించిన జాబ్ మేళాలు స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. 

కార్య‌క్ర‌మంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంక‌ట‌ప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, వెంక‌ట‌రావు, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, ఎస్‌డీసీ ప‌ద్మావ‌తి, విజిలెన్స్ డీఎస్పీ ర‌ఘువీర్ విష్ణు ఇత‌ర జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-01 07:52:36

కమిషనర్ లక్ష్మీశకు SCRWA శుభాకాంక్షలు..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)  కమిషనర్ గా లక్ష్మీశ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు .. పరిశుభ్రతకు  తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా కృషిచేస్తానని  మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు .. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు  జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు . విశాఖ నగరాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు .కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్య ప్రకాష్ (కిరణ్),సభ్యులు కొండ్రి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2021-10-30 15:48:05

మూమెంట్, టూర్ డైరీలు నిర్వహించాల్సిందే..

జీవిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్. జి.లక్ష్మీశ ఆదేశించారు. శనివారము నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన  3వ జోన్ లోని 17, 18, 19 వార్డు పరిధిలోని జాలరి పేట నేతాజీ నగర్ ఆదర్శ నగర్ తదితర ప్రాంతాలలోని  6 సచివాలయాలను సందర్శించారు.  సచివాలయంలోని ప్రజలకు అందించే సేవలు,  సంక్షేమ పథకాల పోస్టర్లును పరిశీలించి,  సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు కొన్ని తెలుగులోనూ, కొన్ని ఆంగ్లంలోనూ ఉండడం గమనించి పోస్టర్లు ఇంగ్లీషు, తెలుగులో  అందరూ చదివే విధంగా  ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.  కార్యదర్శుల యొక్క మూమెంట్ రిజిస్టర్, డైరీలను, బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యదర్శులు వారు నిర్వహిస్తున్న విధులు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వార్డు సచివాలయంలో ఉన్న కార్యదర్శులు  కూడా సంక్షేమ పధకాల యొక్క పూర్తి వివరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సచివాల్యాలలో వాడే ప్రతి రిజిస్టర్ ప్రభుత్వ రిజిస్టర్ కాబట్టి అందులో సంతకం పెట్టి,  సచివాలయం ముద్ర వేయాలని కార్యదర్శులకు సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందాలని ఉద్దేశంతో వార్డు సచివాలయ  వ్యవస్థను ప్రవేశపెట్టిందని,  ప్రజలు ఎన్నో ఆశలతో సంక్షేమ పథకాల కొరకు సచివాలయాలకు వస్తారని,  అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందేలా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు.  ప్రజలు పెట్టుకున్న అర్జీలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని లేని యెడల శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ పర్యటనలో కార్పొరేటర్లు గేదల లావణ్య, గొలగాని మంగవేణి, నోల్లి నూకరత్నం, జోనల్ కమిషనర్ శివప్రసాద్,  ఎఎంఒహెచ్ డాక్టరు రమణ మూర్తి, కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాస్, ఎపీడి పద్మావతి సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-30 14:50:47

దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ కు ఘనసన్మానం..

శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్రకు ఘన స్వాగతం లభించింది. బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు  గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు ఛైర్మన్ కు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. దేవాంగ కుల సమస్యలను రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ ఈ సందర్భంగా వివరించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

Srikakulam

2021-10-30 14:23:24

ఆదిత్యునికి దేవాంగ కార్పోరేషన్ చైర్మన్ పూజలు..

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత అయిన అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర చేనేత దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ ఆలయ మర్యాదలతో , వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను ఛైర్మన్ కు అందజేసారు. అనంతరం అనివేటి మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని ఛైర్మన్ కు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు  గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు, సభ్యులు గుంటముక్కల పాపారావు, చప్పటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Arasavilli

2021-10-30 14:22:18

జివిఎంసీ కమిషనర్ లక్ష్మీషా కి గంట్ల సత్కారం..

మహావిశాఖనగర పాలక సంస్థ కమిషనర్ గా చేరిన డా.లక్ష్మీషా ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రినుబాబు కలిసి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అప్పన్న చిత్రపటాన్ని బహుకరించారు. మంచి అధికారిగా పేరున్నమీరు విశాఖ నగరపాలక సంస్థకు కమిషనర్ గా రావడం ఎంతో ఆనందంగా వున్నదన్నారు. మంచి నగరానికి మంచి అధికారి వస్తే వాటి యొక్క ఫలితాలు అదేస్థాయిలో వుంటాయని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విశాఖలో మంచి వాతావరణం, అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల కలయిక వుంటుందని కమిషనర్ కి వివరించారు.

జివిఎంసీ

2021-10-30 14:19:33

అభివృద్ది వైపు అడుగులు వేయండి..

ప్ర‌భుత్వం అందిస్తున్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకొని, అభివృద్ది దిశ‌గా అడుగులు వేయాల‌ని మహిళా సంఘాల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. త‌మ‌పై తాము న‌మ్మ‌కం ఉంచి, ఆలోచ‌నా ప‌రిధిని విస్తృతం చేసుకొని, పెద్ద‌పెద్ద ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. స్థానిక టిటిడిసిలో శ‌నివారం జ‌రిగిన జిల్లా స‌మాఖ్య 206వ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్ర‌స్తుతం మ‌హిళా సంఘాలు స్వ‌యం ఉపాధి యూనిట్లను స్థాపించుకొనేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. ఆర్థికంగా ఎదుగుద‌ల‌కు ఇదొక గొప్ప అవ‌కాశామ‌ని పేర్కొన్నారు. సంఘాలు ముందుకు వ‌స్తే, శిక్ష‌ణ‌, ఇత‌రత్రా స‌హ‌కారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, తెల్ల కార్డుల‌కోసం ఆశ‌ప‌డ‌కుండా, తామే ఆదాయ‌ప‌న్ను చెల్లించే స్థాయికి ఎద‌గాల‌ని,  ప‌దిమందికి ఉపాధి క‌ల్పించాల‌ని కోరారు. చిన్న‌చిన్న యూనిట్ల‌ను కాకుండా, పెద్ద యూనిట్ల‌ను స్థాపించుకొనేలా సంఘాలు ముందుకు రావాల‌ని, ఉన్న‌తంగా ఆలోచించాల‌ని సూచించారు. స‌మావేశ భ‌వ‌నాలు లేని మండ‌లాల్లో, క‌మ్యూనిటీ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేస్తున్నామ‌ని వెళ్ల‌డించారు.  ఆంగ్ల‌భాష‌పై ప‌ట్టు సంపాదించుకొనేందుకు మ‌హిళ‌లు ప్ర‌య‌త్నించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.  

          జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, స్వ‌యం ఉపాధి యూనిట్ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుందని అన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న చేయూత‌, చేదోడు, తోడు, ఆస‌రా త‌దిత‌ర ప‌థ‌కాల డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్టి, స్వ‌యం ఉపాధి యూనిట్ల‌ను స్థాపించాల‌ని కోరారు. దీనికి అద‌నంగా స్త్రీనిధి, ఉన్న‌తి, బ్యాంకు లింకేజీ  త‌దిత‌ర మార్గాల అద‌న‌పు రుణాలు తీసుకొని, యూనిట్ల‌ను స్థాపించుకొనే వెసులుబాటు ఉంద‌ని సూచించారు. మ‌హిళ‌లు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సాంకేతిక స‌హ‌కారాన్ని అందిస్తామ‌న్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటుగా, ఇప్ప‌టికే న‌డుస్తున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా పూర్తి స‌హ‌కారాన్ని అందించ‌డం ద్వారా, సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని అధికారులకు జెసి సూచించారు. ప‌లు అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ, త‌మ శాఖ‌ల ప‌రిధిలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు.

          ఈ స‌మావేశంలో డిఆర్‌డిఏ ఏపిడి కె.సావిత్రి, టిపిఎంయు ఏపిడి స‌త్యంనాయుడు, జిల్లా స‌మాఖ్య అధ్య‌క్షులు చింత‌ప‌ల్లి వెంక‌ట‌ల‌క్ష్మి, ఉపాధ్య‌క్షులు పీడిక రేవ‌తి, కోశాధికారి బోడ‌సింగి స‌న్యాస‌మ్మ‌, కార్య‌ద‌ర్శి కాగాన మేరీ, ఉప కార్య‌ద‌ర్శి సిరిశెట్టి సింహాచ‌లం, వివిధ శాఖ‌ల అధికారులు, ఎఫ్ఎస్‌పిలు, ఏసిలు, ఎపిఎంలు, మెప్మా సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-30 12:38:33