1 ENS Live Breaking News

రైతులకు ఈ-క్రాప్ లో నమోదు తప్పనిసరి..

పంటల  నమోదు జరగక పోతే  రైతుకు రావలసిన రైతుకు భరోసా, పంటల నష్టం తదితర పధకాలు  వర్తించవని సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  కౌలు రైతులు, ఈనాం భూముల్లో పండించే రైతులు, ప్రభుత్వ భూముల్లో పండించే రైతులు ఎవరైనా గానీ  వాస్తవంగా పంటలువేసే రైతులందరూ ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన తెలిపారు.  గ్రామ స్థాయి  వ్యవసాయ సహాయకుల వద్ద కు వెళ్లి వెంటనే ఈ.కే.వై.సి  నమోదు చేసుకోవాలన్నారు. శనివారం  కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో వ్యవసాయాధికారులతో  ఈ క్రాప్ నమోదు,  గులాబ్ తుఫాన్ నష్టాల అంచనా, ధాన్యం సేకరణ  తదితర అంశాల పై సమీక్షించారు.  ఈ క్రాప్ నమోదు లో కురుపాం, మెరకముడిదం మండలాల్లో శత శాతం నమోదు జరిగినందుకు ఆయా అధికారులను అభినందించారు. బాడంగి మండలం అతి తక్కువగా నమోదు చేసినందున ప్రత్యెక దృష్టి పెట్టాలని సూచించారు. ఇటీవల   సంభవించిన గులాబ్  తుఫాన్  కు జరిగిన పంట నష్టాల పై ఆరా తీసారు.   వ్యవసాయ శాఖ కు సంబంధించిన 1580 హెక్టార్లలో , ఉద్యాన పంటలకు సంబంధించి 750 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు వేయడం జరిగిందన్నారు.  పంటల వారీగా,  మండల వారీగా నివేదికలను పూర్తి స్థాయి లో వెంటనే అందజేయాలని వ్యవసాయాధికారులకు ఆదేశించారు.  పంటల నష్టాల అంచనాలను సంబంధిత శాసన శాసన సభ్యుల దృష్టి లో కూడా పెట్టాలని సూచించారు. 

ధాన్యం సేకరణ  కేంద్రాలను ప్రారంభించాలి:
జిల్లాలో నున్న 624 రైర్తు భరోసా కేంద్రాల్లో, 230  ధాన్యం సేకరణ కేంద్రాల్లో   ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లను గావించాలని జే.సి ఆదేశించారు. సోమవారం  అన్ని చోట బ్యానర్లను పెట్టి ప్రారంభించాలని అన్నారు.  ప్రతి కేంద్రం వద్ద తేమ యంత్రాలను సిద్ధం చేయాలన్నారు.  డ్వాక్రా సభ్యలకు, గిరి మత్ర లకు, రైతు భరోసా కేంద్రాల  సిబ్బందికి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి  వారిని సమాయత్తం చేయాలనీ,  సమావేశపు మినిట్స్ ను పంపలన్నారు.   నవంబర్ నాటికీ 9150  మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశం ఉన్నందున అందుకు  తగ్గట్టుగా ఏర్పాట్లు గావించాలన్నారు.  జనవరి కి మరో 2 లక్షల మెట్రిక్ తన్నులు వస్తుందని, వచ్చిన పంటను ఎప్పటికప్పుడు సేకరించి మిల్లర్లకు ఇవ్వాలని,   పెండింగ్ ఉండే  సహించేది  లేదని స్పష్టం చేసారు. రానున్న మూడు రోజుల్లో భారి వర్ష సూచన ఉన్నందున పొట్ట  దశ లో నున్న పంట నష్టం జరగకుండా రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  నీరు పొలం లో నిల్వ ఉండకుండా  బయటకు పంపే లా ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారులంత రైతులకు పంట నష్టం జరగకుండా జాగ్రతలు తీసుకునేలా  అవగాహన కలిగించాలన్నారు.  ఈ సమావేశం లో డి డి లు  నందు, ఆనంద్,  ఎ.డి. అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-16 09:10:06

విద్యుత్ కోతలపై వచ్చే వదంతులు నమ్మొద్దు..

విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు సీఎండీ..

Visakhapatnam

2021-10-16 08:30:50

పీహెచ్సీల్లో బయోమెట్రిక్ వేస్తేనే జీతం వస్తుంది..

రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లోనూ నవంబర్ 1 నుంచి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని బయోమెట్రిక్ లేనివారు తక్షణమే కొత్తవి కొనుగోలు చేసి ఏర్పాటుచేసు కోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. పి.హెచ్.సీల్లోని సిబ్బంది విధులకు వచ్చినపుడు,వెళ్లే సమయంలో తప్పనిసరిగా బియోమెట్రిక్ అటెండన్స్ ఉండాలని, విధులకు హాజరుకాని రోజులకు జీతం చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమీషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఇవ్వని విధంగా వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు సకల సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. ఇన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసినప్పటికి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెలుతున్నారని, ఇందుకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరనే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే రోగులకు అన్నివిధాల ఆదుకుని, వారికి పూర్తి భరోసాను ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినపుడే ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెరుగుతుందని ఆ దిశగా పి.హెచ్.సి వైద్యులు,సిబ్బంది కృషిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్యులు,నర్సులు,లాబ్ టెక్నిషియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోఉండబోరని,  మంచి అనుభవం, అర్హతలు కలిగిన సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నారని ఆ భరోసా ప్రజలకు కలిగించాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో పి.హెచ్.సీల్లో ప్రసవాలు తక్కువగా జరిగాయని, ఇది సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి నిదర్శమని అన్నారు. ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని, అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలను  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి 108 వాహనాలు ఉన్నాయని, అలాగే ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ఉన్నాయన్నారు. అలాగే గర్భిణి స్త్రీలకు అవసరమైన మందులను సకాలంలో అందజేసి, ప్రసవాలకు ఆసుపత్రులకు తరలించి, ప్రసవం అనంతరం ఇంటికి తరలించాల్సిన బాధ్యత ఆశావర్కర్లపై ఉందని, కానీ ఆ విధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందువలనే మాత, శిశు మరణాలు సంభవిస్తున్నాయని ఇకపై ఇటువంటివి జరగ రాదని, నిర్లక్ష్యం వహించిన అధికారులను విధుల నుండి తొలగించడానికి కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. గ్రామంలోని గర్భిణీలు పి.హెచ్.సీల్లోనే ప్రసవాలు వేసుకునేలా, వారికి అవసరమైన మందులు, వైద్యం, భోజన వసతి, బేబీ కిట్స్ తదితర సౌకర్యాలు అందేలా వైద్యులు కృషిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సంభవించిన మాత, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇకపై ఎటువంటి మాత,శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పి.హెచ్.సీలకు అవసరమైన మందులను ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. సిబ్బంది లేనిచోట సిబ్బందిని సమకూరుస్తున్నామని వివరించారు. ప్రసవాలు పి.హెచ్.సీల్లోనే జరిగేలా ఆశా సిబ్బందికి ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-14 13:29:23

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సిజె..

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ దర్శించుకున్నారు.   ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, అర్చ‌కులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.


Tiruchanur

2021-10-14 12:56:19

నైపుణ్యా భివృద్ధి శిక్షణ తో  స్వయం ఉపాధి..

యువతకు నచ్చిన రంగం లో నైపుణ్యా భివృద్ధి శిక్షణ   ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదా ఆసక్తి గల వారికి   స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని సంయుక్త కలెక్టర్ ఆసరా జే. వెంకట రావు తెలిపారు.  అందు కోసం టార్గెట్  గ్రూప్ లను గుర్తించాలని అన్నారు.   గురువారం  అయన ఛాంబర్ లో స్కిల్ డెవలప్మెంట్  పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.  ఫుడ్ ప్రాసెసింగ్ , డైరీ అభివృద్ధి, మేషన్, ప్లంబింగ్ , ఎలక్ట్రికల్  తదితర రంగాల్లో ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉందని, ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న యువకులను గుర్తించి శిక్షణ కు సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు.  మత్స్య , ఉద్యాన  శాఖలలో  మార్కెటింగ్ స్కిల్ల్స్ ను నేర్పించడం ద్వారా సుస్థిరమైన ఆదాయం అందుకునేలా  చేయవచ్చని అన్నారు.    ప్రతి శాఖ వారి పరిధి లో గల అవకాశాలను గుర్తించి, శిక్షణ కోసం  టార్గెట్ గ్రూప్ లను కూడా గుర్తించాలన్నారు.  ఈ సమావేశం లో డి.అర్-.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్, వ్యవసాయ సఖ జే.డి ఆశ దేవి, పశు సంవర్ధక జే.డి డా. రమణ,  స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్  శ్రీనివాస్,  సెట్విజ్ సి .ఈ.ఓ  ఉద్యాన, మత్స్య, పరిశ్రమల, కార్మిక  శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 12:51:08

ప్రతీఒక్కరూ చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి..

ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి సూచించారు. చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా, చాలా వ‌ర‌కూ వ్యాధుల‌ను నివారించ‌వ‌చ్చ‌ని అన్నారు. గ్లోబ‌ల్ హేండ్ వాషింగ్ డేకి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను గురువారం త‌న ఛాంబ‌ర్‌లో  క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఇత‌ర ప్ర‌చార సామ‌గ్రిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానంద‌కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, డ్వామా పిడి ఉమా ప‌ర‌మేశ్వ‌రి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఇఇ వై.గోవింద‌రావు, ఎస్‌డిసి వెంక‌టేశ్వ‌ర్లు, హెచ్ఆర్‌డి క‌న్స‌ల్టెంట్ టి.సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 12:49:32

సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి..

శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా ఎస్.పి అమిత్ బర్థార్ అధ్యక్షతన ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెవెన్యూ మొబైలైజేషన్  కార్యక్రమం గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో నాటు సారా,అక్రమ మద్యం రవాణా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో కలెక్టర్,ఎస్.పి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి సారా అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని అన్నారు. సముద్ర మార్గం ద్వారా రవాణా అవుతున్న నాటు సారాకు అడ్డుకట్టు వేయాలని సూచించారు. సారా రహిత గ్రామాలుగా రూపొందించాలని ఆన్నారు.అటవీ శాఖ అధికారులుతో సమన్వయం చేసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలను గుర్తించి, నాటు సారా తయారీ కొసం ఉపయోగించే బెల్లపు ఊటలును నిర్వీర్యం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రేరణా కార్యక్రమం చేపట్టి మారుమూల ప్రాంత గ్రామస్తులతో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమలు చేపట్టి, నాటు సార వలన కలిగే దుష్ప్రభావాలు గురించి గ్రామీణ ప్రజానీకానికి తెలియజేసి నాటుసారా తయారీ,వినియోగాన్ని అరికట్టాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలతో మమేకమై, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయబడుతున్న నాటు సారా రవాణను అడ్డుకట్ట వేయాలని సూచించారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల వద్ద,  చెక్ పోస్ట్ కేంద్రాల వద్ద తనిఖీలను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గ్రామీణ మద్యం విక్రయాలు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు.ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఆంధ్ర, ఒడిశా స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, నాటు సారా స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా నియంత్రించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరిండెంట్ కె.యేశు దాసు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-14 10:08:46

విశాఖ లో ఘనంగా జాలాది10వ వర్ధంతి..

విశాఖలో జాలాది రాజారావు 10వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఆర్కేబీచ్ లోని ఆయన విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా జాలాది సతీమణి అగ్నేశమ్మ, జాలాది శ్రీనివాసరావు, కుమారి, నిర్మల మరియు కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాలాది సతీమణి మాట్లాడుతూ, ఆయన దూరమై నేటికి పదేళ్లు పూర్తవుతోందని, జాలాది భౌతికంగా మన మధ్యలేకపోయినా, పాట రూపంలో ఎల్లప్పుడూ ఆఖిలాంధ్ర ప్రేక్షకుల మధిలో కదలాడుతూ, గుర్తుకు వస్తూనే ఉంటారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ, పాటలు ఉన్నంత కాలం జాలాది రచనలు, పాఠలు తెలుగువారంతా గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన రచించిన మంచి పాటలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జాలాది అభిమానులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-14 10:02:12

ప్ర‌జా విన‌తులపై స‌త్వ‌రం స్పందించాలి..

గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జా సమ‌స్య‌ల ప‌రిష్కారం మ‌రింత వేగ‌వంతంగా జ‌ర‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. ప్ర‌జ‌లు వివిధ సేవ‌ల‌కోసం అందించే విన‌తుల‌ను స‌చివాల‌య సిబ్బంది త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. డెంకాడ మండ‌లం మోద‌వ‌ల‌స గ్రామ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స‌చివాల‌య సిబ్బంది హాజ‌రు, ప్ర‌జ‌ల నుంచి ప‌లు సేవ‌ల నిమిత్తం, ప‌లు సంక్షేమ ప‌థ‌కాల మంజూరు కోరుతూ వ‌చ్చిన విన‌తుల ప‌రిష్కారం, సంక్షేమ ప‌థ‌కాల కోసం దర‌ఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల‌కు ఆయా ప‌థ‌కాలు ఏవిధంగా ఎంత కాలంలో అందిస్తున్నార‌నే అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌చివాల‌య సిబ్బందితో స‌మీక్షించారు. స‌చివాల‌య సిబ్బంది ఎవ‌రు ఏయే విధులు నిర్వ‌హిస్తున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. స‌చివాల‌యంలోని రిజిష్ట‌ర్ల‌ను, వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి అర్హ‌త‌లు తెలిపే చిత్ర‌ప‌టాల‌ను ప‌రిశీలించారు. గ్రామంలో కోవిడ్‌ వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితిపై ఆరా తీశారు. అర్హులై వుండి టీకాలు వేయించుకోని వారు ఎవ‌రైనా వున్నారా అని తెలుసుకున్నారు. అర్హులైన ప్ర‌తి  ఒక్క‌రికీ వ్యాక్సిన్ వేయించాల‌ని ఆదేశించారు.

మోదవలస

2021-10-14 08:26:28

అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జెసి కిశోర్‌..

విజయనగరం శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వానికి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్, గురువారం ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. ఆయ‌న ముందుగా హుకుంపేట వెళ్లి, ఆల‌య ప్ర‌ధాన‌ పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు ఇంటివ‌ద్ద త‌యార‌వుతున్న అమ్మ‌వారి సిరిమాను, ఇరుసుమాను, ర‌థాల‌ను ప‌రిశీలించారు.  వెంక‌ట‌రావుతో చ‌ర్చించారు. ప‌నుల‌ను స‌కాలంలో పూర్తిచేయించాల‌ని కోరారు. అనంత‌రం పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య ప‌రిస‌ర‌ ప్రాంతాల‌ను,  సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి జెసి కిశోర్‌ సంద‌ర్శించారు. భ‌క్తుల‌కోసం ఏర్పాటు చేసిన‌ క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు.  ఆల‌యం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమును, విఐపి లాంజ్‌ను త‌నిఖీ చేశారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.   ఈ ప‌ర్య‌ట‌న‌లో జెసి కిశోర్‌తోపాటు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఆల‌య అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 08:12:27

ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు..

నిర్వాసితుల‌కోసం నిర్మించ‌నున్న కాల‌నీల్లో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ నున్నట్టు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. భోగాపురం అంత‌ ర్జాతీయ‌ విమానాశ్ర‌య నిర్వాసితుల‌కోసం, గూడెపువ‌ల‌స వ‌ద్ద ప్ర‌తిపాదించిన ఆర్అం డ్ఆర్ కాల‌నీలో ఇళ్ల‌ నిర్మాణానికి  శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం మొద‌ల‌య్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా, బొల్లింక‌ల‌పాలెం గ్రామానికి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది నిర్వాసితులు, గురువారం ఇక్క‌డ భూమిపూజ చేశారు.  నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఒక్కొక్క‌రికీ 5 సెంట్లు చొప్పున స్థ‌లాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి, ఆర్అండ్ఆర్ కాల‌నీల్లో స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారుల స్వయంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఒక్కొక్క ఇంటికి రూ. 9 లక్షల 20 వేలను, ఆర్ఆర్ ప్యాకేజీ కింద  కేటాయించడం జరుగుతుందని చెప్పారు. కాల‌నీలో రోడ్లు, కాలువలు, విద్యుత్, త్రాగునీరు త‌దిత‌ర అన్నిర‌కాల మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం జరుగుతుంద‌ని జెసి చెప్పారు. ఆర్డిఓ బిహెచ్‌. భవాని శంకర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు నిధులను, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.  లబ్ధిదారులు దళారులను నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంత‌రం పోలిప‌ల్లి ఆర్అండ్ఆర్ లేఅవుట్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాశీల్దార్‌ రమణమ్మ, వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, గూడెపు వలస సర్పంచ్ అయ్యప్ప రామకృష్ణా రెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ   భూసేక‌ర‌ణ స‌మ‌న్వ‌యాధికారి జి.అప్పలనాయుడు, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Bhogapuram

2021-10-14 06:29:30

వీడియోజర్నలిస్టుల సంక్షేమానికి రూ.50వేలు విరాళం..

మహా విశాఖ నగరంలోని వైజాగ్ వీడియో జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు బుధవారం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య, కార్యవర్గ సభ్యులుకి అందచేసారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు  మాట్లాడుతూ, గతఏడాది స్మార్ట్ సిటీ  వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కి 50 వేలు అందజేశామని, ఈఏడాది విశాఖ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్  అసోసియేషన్ కి 50000 అందజేస్తామన్నారు. విడియో జర్నలిస్ట్స్ సభ్యులు సంక్షేమానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. విడియో జర్నలిస్ట్ లు సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నట్టు శీనుబాబు చెప్పారు.

Visakhapatnam

2021-10-13 16:24:16

కాకినాడ మేయర్ ను తొలగిస్తూ ఏపీ గెజిట్ విడుదల..

తూర్పుగోదారి జిల్లాలోని ప్రతిష్టాత్మక కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సుంకర పావనిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు ఏపీ గెజిట్ రూపంలో జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఈ విషయం ఏపీ హైకోర్టు పరిధిలో వుంది. 22వ తేదీ వరకూ కోర్టు గడువు కూడా ఉంది అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం సుంకర పావనీని తప్పిస్తూ గెజిట్ నువిడుద చేయడం విశేషం.  కాగా ఓటింగ్కు ముందే మేయర్ సుంకర పావని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశానికి అభ్యంతరాలు చెప్పలేదు. అయితే ఫలితాన్ని మాత్రం తుది తీర్పునకు లోబడి ఉండాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తనను మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సుంకర పావని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పునకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు. 22 వ తేదీన కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు హైకోర్టు తీర్పును ధిక్కరించేందిగా ఉందంటూ పావని విమరిస్తున్నారు.దీంతో సుంకర పావని పదవీచ్యుతులు అయ్యారు. కాకినాడ నగర పాలక సంస్థకు 2017 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించి పాలక మండలని ఏర్పాటు చేసింది. అయితే 23 మంది కార్పొరేటర్లు మేయర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానంనకు ప్రతిపాదించి జిల్లా కలెక్టర్ హరికిరణ్ వినతి పత్రాన్ని అందించారు. ఈ అక్టోబర్ నెల 5 వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. పాలక మండలిలో ప్రస్తుతం మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో నుంచి మేయర్, డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటేశారు. దీంతో వారిద్దరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ‌ప్ర‌భుత్వం కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది. దీనిపై మండిప‌డ్డ పావ‌ని, కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ అవుతుంద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం ద్వారా మేయ‌ర్ ప‌ద‌వినుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ తాను మేయ‌ర్  హోదాలోనే కొన‌సాగుతాన‌ని పావని  చెబుతుండటం విశేషం..

Kakinada

2021-10-13 16:01:00

కనకదుర్గమ్మకు అన్నవరం పట్టువస్త్రాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి అన్నవరం దేవస్థానం అధికారులు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈఓ  వి.త్రినాధరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్త్రాలు సమర్పించి వచ్చారు. ప్రతీఏటా నవరాత్రి సమయంలో జరిగే ఉత్సవాలకు దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితాగా వస్తుందని ఈఓ తెలియజేశారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించి రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ఈఓ తెలియజేశారు.

Annavaram

2021-10-13 15:51:33

పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడాలి..

పేద కుటుంబాల్లో పేదరికం రూపుమాపాలని ముఖ్య మంత్రి ధ్యేయమని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరులో వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు నమూనా చెక్కులను స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా రెండో విడతలో భాగంగా పొందూరు మండలంలోని 1319 సంఘాలకు 9 కోట్ల 54 లక్షల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది గా ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పేదరికం పోయి జీవన ప్రమాణాలు మెరుగు పడాలన్నారు. అవినీతి లేని పాలన అందించి పేదరికాన్ని పారద్రోలుతానని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించారని, రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చి రుణమాఫీ చేశారని అదేవిధంగా  ఉచిత విద్యుత్తును అమలుపరిచారని గుర్తుచేశారు. సుదీర్ఘ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చుతూ ముఖ్య మంత్రి మంచి పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ముందు నిలబడి హామీ ఇచ్చామంటే అది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ కన్నా గొప్పది అని ఆయన అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు మంచి విద్యని అందించాలని దానికి కావాల్సిన మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారని వివరించారు. పేదవానికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్య మంత్రి ఆశించారని, అయితే వివిధ కారణాల వలన జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. మహిళలు, రైతులు ఆర్థికంగా బలపడాలని వ్యాపారవేత్తగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. 
 ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి బి.శాంతిశ్రీ, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, వైస్ ఎంపీపీ వండన శ్రీదేవి, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, కొంచాడ రమణ మూర్తి,  గాడు నాగరాజు, పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ బడాణ సునీలు, లోలుగు శ్రీరాముల నాయుడు, గంట్యాడ రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-13 15:19:14