1 ENS Live Breaking News

ఈ క్రాప్, ఈకేవైసీ సత్వరమే పూర్తిచేయాలి..

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ప్ర‌ధాన ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాలుగా కూడా సేవలందించ‌నున్న‌నేప‌థ్యంలో మొత్తం ప్ర‌క్రియ‌పై క్షేత్ర‌స్థాయి అధికారులు అవగాహ‌న పెంపొందించుకోవాల‌ని జాయింట్ కలెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జ.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి జేసీ (ఆర్‌) జి.ల‌క్ష్మీశ‌.. జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు పురోగ‌తిపై చ‌ర్చించ‌డంతో పాటు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌తలో భాగంగా ఈ-క్రాప్ బుకింగ్ వెరిఫికేష‌న్‌, ఈ-కేవైసీ ప్ర‌క్రియను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని ఆదేశించారు. కేవ‌లం ధాన్యం కొనుగోలుకే కాకుండా వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కు కూడా ఈ-క్రాప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణకు సంబంధించి జ‌రుగుతున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నాణ్య‌తా త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు. డ్రోన్ స‌ర్వేకు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌ను పూర్తిచేయాల‌న్నారు. ద‌శ‌ల వారీగా జిల్లా మొత్తం స‌మ‌గ్ర భూ స‌ర్వే జ‌ర‌గ‌నున్నందున అందుకు అధికారులు స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక స్పంద‌న ద్వారా అందుతున్న అర్జీల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జేసీ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌.. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో అమ‌ల‌వుతున్న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలుపై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అదే విధంగా స‌చివాల‌యాల సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని ఆదేశించారు. మండల స్థాయిలో జరుగుతున్న ఆసరా కార్యక్రమాలు విజయవంతం చేయడంతోపాటు చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు కార్య‌క్ర‌మానికి సంబంధించి క్ల‌స్ట‌ర్ మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని భార్గ‌వ్‌తేజ ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌, వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ జీ.వీరేశ్వరప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎస్వో పి. ప్రసాదరావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-10-12 14:00:14

అక్రమ మద్యం నిర్మూళన పటిష్టంగా జరగాలి..

తూర్పుగోదావరిజిల్లాలో అక్రమ మద్యం నిర్మూలనకు పోలీస్, అటవీ, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ లక్ష్మీ శ.. పోలీస్, అటవీ, ఎక్సైజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల అధికారులతో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ  మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకు ఎక్సైజ్, అటవీ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. అక్రమ మద్యం, నాటు సారా తయారీ వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. అటవీ, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ వీసీలో కాకినాడ అడిషనల్ ఎస్పీ కె.కుమార్, డీఫ్ వో ఐకెవి రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ ఎస్.లక్ష్మీకాంత్, డీఆర్డీఎ పీడీ కె.శ్రీరమణి సీపీవో పి.త్రినాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2021-10-12 13:55:25

జ‌ల జీవ‌న్ మిష‌న్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద చేప‌ట్టిన ప‌నుల‌న్నీ పూర్తిచేసి సి.పి.డ‌బ్ల్యు.ప‌థ‌కాల ద్వారా పూర్తి స్థాయిలో గ్రామాల‌కు తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా అధికారుల‌ను ఆదేశించారు. ప‌నులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని కొళాయిల ద్వారా అందించాల‌న్నారు. జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఇంజ‌నీర్ల‌తో తాగునీటి స‌ర‌ఫ‌రా, ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ తదిత‌ర అంశాల‌పై జెడ్పీ ఛైర్మ‌న్ మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ర‌క్షిత తాగునీటి సౌక‌ర్యంలేని బోర్లు లేని గ్రామాలు, మారుమూల గిరిజ‌న గ్రామాలు, కొండ‌శిఖ‌ర గ్రామాల‌కు సంబంధించి జెడ్పీ నిధుల‌తో తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించేందుకు వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని సూచించారు. భోగాపురం మండ‌లంలో తీర‌గ్రామాల్లో ర‌క్షిత త్రాగునీటి స‌ర‌ఫ‌రా అవ‌స‌ర‌మైన గ్రామాల‌ను గుర్తించి ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌న్నారు. గులాబ్ తుఫాను కార‌ణంగా దెబ్బ‌తిన్న ర‌క్షిత నీటి ప‌థ‌కాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు పూర్తిచేసి విద్యుత్ శాఖ స‌హ‌కారంతో ఆయా ప‌థ‌కాల‌ను పూర్తిస్థాయిలో పున‌రుద్ద‌రించాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిల్లా ప‌రిష‌త్ సి.ఇ.ఓ. టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఎస్‌.ఇ. శివానంద కుమార్‌, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా విభాగం ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-12 13:46:20

మహిళా సాధికారతే సీఎం ప్రధాన లక్ష్యం..

రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళా సంక్షమానికి నిరంతరం కృషి చేస్తున్నారని  ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. మంగళవారం జియ్యమ్మ వలస మండలంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎం.పి.పి బొంగు సురేష్ అధ్యక్షత వహించారు.  కార్యక్రమంలో మండలంలో జీవనోపాధికి,  హౌసింగ్ బ్యాంక్ లింకేజిద్వారా  323 మంది మహిళలకు కోటి ముప్పది ఐదు లక్షలు రూపాయల విలువ గల చెక్కును, వై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత క్రింద 1091 సంఘాలలో గల 12266 మంది సభ్యులకు 5.83 కోట్లు రూపాయలు చెక్కులను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ప్రోజెక్ట్ అధికారి స్వయం సహాయక సంఘాలు మహిళలకు అందజేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతు మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నాలుగు విడతలుగా వై.ఎస్.ఆర్.ఆసరా అందజేయడం జరుగుతుందని మాటిచ్చిన ముఖ్యమంత్రి మొదటి విడతగా 630 కోట్లు మీ వ్యక్తిగత ఖాతాలు కమచేయడం జరిగింది. నేడు రెండవ విడతగా సుమారు 600 కోట్లు మీ ఖాతాలలో జమచేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పక అమలు చేస్తూ మహిళలకు అండగా నిలిచిన ముఖ్య మంత్రి అన్నారు.

   మహిళ ద్వారా కుటుంభానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని మహిళల పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధి అభివృధికి వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివద్ధి చెందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబాలు ఎలా అభివృధి చెందాయో సభ్యులు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృదికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన  ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రితో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలతో అభిషేకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   వై.ఎస్.ఆర్ క్రాంతి పథం ఎ.పి.డి సత్యం నాయుడు, ఎం.పి.డి.ఓ, విజయ లక్ష్మి, తహసిల్దార్ శ్రీరామూర్తి, జెడ్.పి.టి.సి ముడడ్ల శశికళ, సర్పంచ్ రాములు, వైఎస్.ఆర్.సి.పి.నాయకులు, మండలంలో మహిళా సంఘాల సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది,  అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Jiyyammavalasa

2021-10-12 13:44:53

అద్దె బకాయిలు తక్షణమే చెల్లించండి..

ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పోరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ లలో వ్యాపారాలు చేస్తున్నవారంతా తక్షణమే అద్దె బకాయిలు చెల్లించి రసీదులు పొందాలని యస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మార్కాపురం కోర్టు సెంటర్ లో ఉన్న యస్సీకార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. ఇక్కడి సముదాయంలో 11 షాపులుండగా రూ.7 లక్షలు అద్దె బకాయిలు కావాల్సి వుందన్నారు. 1984లో కార్పోరేషన్ ద్వారా నిర్మించిన షాపులకు రూ.50  అద్దె నిమిత్తం ఒకొక్క షాపుకు నిర్ణయించగా 1998లో రూ.500 కు పెంచారన్నారు. అయినా గత 22 సంవత్సరాలుగా అద్దె విషయంలో ఎటువంటి మార్పుచేయలేదని పేర్కొన్నారు. అయితే వాణిజ్య సముదాయం కట్టి 37 సంవత్సరాలు దాటడం వలన భవన మరామత్తులు చేయవల్సి ఉన్నదని అన్నారు. నిరుపేద యస్సీల జీవనబృతి నిమిత్తం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసారు. అద్దె బకాయిలు కట్టి రసీదు పొందాలని సూచించారు. అంగీకరించిన వ్యాపారులు వారం పది రోజులలో బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈడి  వెంట యస్సీ కార్పోరేషన్ సిబ్బంది ఉసురుపాటి శ్రీను, తేళ్ళ విజయ్, వ్యాపారులు ఐజాక్, చింతగుంట్ల విజయమ్మా తదితరులు ఉన్నారు.

ప్రకాశం

2021-10-12 09:53:21

ప్రోత్సాహంతోనే ప్రతిభకు మెరుగులు..

సమాజములో  ఏ రంగంలోనైనా ప్రోత్సాహాంతోనే  ప్రతిభకు మెరుగులు దిద్దడానికి ఆస్కారం వుంటుందని ఏ.పి. రాష్ట్ర 'మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీతమ్మధార వి.జె.ఎఫ్. వినోద వేదికలో మంగళవారం జరిగిన "3 రోజులు మోహిని యాట్టం సదస్సు ముగింపు, కళాజీవా పురస్కారం లు- 2021 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతకు, సమైక్యతకు ప్రతీక మన విశాఖ నగరమని అన్నారు. గాయత్రి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాండ్రే గుల రామ్ కుమార్ మాట్లాడుతూ బాలల్లో కళానైపుణ్యానికి ఇటు వంటి సదస్సులు అవసరమని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంస్థ ను ఆయన అభినందించారు.సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక  ఆహ్వానితులు . వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఎంతో మంది 'అంతర్జాతీయ స్థాయి ఖాతిని పొందిన కళాకారులు విశాఖలో ఉన్నారన్నారు. కొరియోగ్రఫీలో వైవిధ్యం ఉండడంతో ఎటువంటి కళాభిమానులనైనా ఇట్టే ఆకట్టుకోగలరన్నారు. చిత్ర కళలో జాతీయ పురస్కారాలు అందుకుంటున్న సి. సంధ్యా శంకర పట్నాయక్, సినీ కొరియోగ్రఫర్, మోహినియాట్టం శిక్షకురాలు వినిత వర్గీషే (కేరళ) లను "కళాజివా పురస్కారం-2021 " తో కాయల ఘనంగా సత్కరించారు. కొరియోగ్రఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బ్రహ్మకుమారి రామేశ్వరి, వీ జే ఎఫ్. కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఎ.పి.డిప్లొమో ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. మహేశ్వర రెడ్డి , కె.వి.ఆర్. మిత్ర మండలి ప్రతినిధి కె. సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Seethammadara

2021-10-12 07:12:15

డయల్ యువర్ మేయర్ కు 36 ఫోన్ కాల్స్..

జివిఎంసి లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 36 ఫోన్ కాల్స్ వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు.  ఒకటవ (భీమిలి) జోనుకు 03, రెండవ జోనుకు 03, మూడవ జోనుకు 04, నాలుగవ జోనుకు 03, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 13, ఏడవ (అనకాపల్లి) జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 03, యు.సి.డి. విభాగమునకు 01, మొత్తము 36 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.               

జివిఎంసీ

2021-10-11 15:03:32

బాల బాలికలు ఇద్దరూ సమానమే..

బాలబాలికలు ఇద్దరూ సమానమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.సి.చంద్రనాయక్ పేర్కొన్నారు.    సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబంలో బాలురు బాలికలు ఇద్దరూ సమానమే తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. సామాజిక వివక్ష కారణంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భ్రూణ హత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో పెద్ద ఎత్తున చైతన్యం అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల బాలికల లో తండ్రి పాత్ర కీలకమని, గ్రామస్థాయిలో ముఖ్యంగా నిరక్షరాస్యులు అయినటువంటి తల్లిదండ్రులు, ప్రజల్లో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. భ్రూణ హత్యలు సమాజంలో మాయని మచ్చగా మిగులుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం బాగా ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో వెయ్యి మంది బాలురకు 953 మంది బాలికలు ఉన్నారనీ ఇంతటి వ్యత్యాసం సరికాదని అసమతౌల్య స్థితికి దారితీస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఒక మహిళను ఎక్కువ మంది పెళ్లి చేసుకునే సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. ఇటువంటి వ్యవస్థ ఆదర్శవంతమైన సమాజానికి మంచిది కాదని స్పష్టం చేశారు. మహిళల పురోగతి ఎక్కడ ఉంటుందో ఆ సమాజం అన్ని విధాల రాణిస్తుందని పేర్కొన్నారు. బ్రూణ హత్యలు నివారించి బాలికల నిష్పత్తి పెంచాలన్నారు. బ్రూణ హత్యలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ఇంటింటికీ వెళ్ళినప్పుడు బ్రూణ హత్యలు పై గర్భిణీలు, తల్లులకు వివరించాలని సూచించారు.  

అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాధరావు మాట్లాడుతూ బాలబాలికల మధ్య తీవ్రమైన వ్యత్యాసం వలన సామాజిక పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. డి.ఎస్.పి ఎం.మహేంద్రనాథ్ మాట్లాడుతూ బాలికల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. హత్యల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు నివారించాలని పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, భ్రూణ హత్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. బాలికలు, మహిళల పట్ల సమాజంలో వివిధ కోణాలలో దుష్కృత్యాలు జరుగుతున్నాయని అటువంటి సంస్కృతి నుండి బయట పడాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలను గూర్చి అవగాహన పొందాలని అవసరం అయినప్పుడు వాటిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగం హెడ్ డాక్టర్ వాణి మాట్లాడుతూ బాలికల జనంలో పురుషుల పాత్ర ప్రధానమని, ఈ విషయాన్ని సమాజానికి అవగాహన చెందే వరకు తెలియజేయాల్సిన అవసరం ఉందనీ చెప్పారు.  ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నాయుడు డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్య రావు వైద్యులు వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 14:58:24

జీవిఎంసీ స్పందనకు 36 ఫిర్యాదులు..

జివిఎంసి లో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో 36 ఫిర్యాదులు వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనతో కలసి సమావేశ మందిరం ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.  ఇందులో రెండవ జోనుకు 04, మూడవ జోనుకు 08, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 07, మొత్తము 35 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, ఎ.డి.హెచ్. ఎం.దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, గణేష్ బాబు, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.              

జివిఎంసీ

2021-10-11 14:55:46

నగరవాసుల సహకారంతోనే స్వచ్ఛ కాకినాడ..

నగరవాసుల సహకారం ఉంటేనే స్వచ్చ్ కాకినాడ సాధ్యపడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం ఉదయం 10వ వార్డులో పర్యటించిన ఆయన పారిశుధ్య కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ కాకినాడ ప్రజలు స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, అదే ఉత్సాహంతో ఈ సారి కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమతోపాటు తమ చుట్టుపక్కల వారు కూడా పరిసరాలను కలుషితం చేయకుండా చూడాలన్నారు. స్ధానిక పారిశుధ్య కార్మికుల పనితీరుపై అసంత్రుప్తిని వ్యక్తం చేసిన ఆయన విధులలో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-10-11 13:36:45

కోటప్పకొండపై ప్రెస్ అకాడమీ చైర్మన్ పూజలు..

కోటప్పకొండపై కొలువైయున్న శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయంలో దేవిరెడ్డి శ్రీనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి  రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కు త్రికోటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అంతకు ముందు కోటప్పకొండ దేవస్థానం చేరుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ అబ్ధుల్ రఫీక్, త్రికోటేశ్వర స్వామి ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి, నరసరావుపేట తహాశీల్ధార్ రమణా నాయక్ లు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలను అందజేశారు. అనంతరం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దంపతులు తాడేపల్లిలోని స్వగృహానికి బయలుదేరి వెళ్ళారు.

Kotappakonda

2021-10-11 12:56:37

పురోగతికి మహిళా సారికాధికరత అవసరం..

సమాజ పురోగతికి  మహిళా సారికాధికరత అవసరమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం అక్కులుపేట గ్రామంలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. సభాపతి మాట్లాడుతూ సమాజం పురోగతి సాధించాలoటే మహిళలకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన చెప్పారు. ఆసరా కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా ఇప్పటికీ రెండు విడతలుగా రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుల నిమిత్తం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని విద్యా దీవెన, వసతి దీవెన తో మరింత సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం క్రింద రైతులకు ఏడాదికి 13,500 రూపాయలు చెల్లిస్తున్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వాహనమిత్ర , జగనన్న తోడు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బెoడి గోవిందరావు, బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 12:50:21

ఆసరా సహాయంతో ఆర్థికంగా బలపడాలి..

ఆసరా సహాయం కుటుంబాల ఆర్థిక బలోపేతానికి వినియోగించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామ పంచాయతీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత నిధులు విడుదల సంబరాలకు ముఖ్య అతిథిగా  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. ఆశీస్సులు, ఆ దేవుని చల్లని దీవెనలతో దేశంలో అత్యుత్తమ సీఎంలలో జగన్ మూడవ స్థానంలో ఉన్నారన్నారు. రాజకీయాలు అంటే గొప్ప పాలన, పారదర్శకత అనుకునేలా తీర్చిదిద్దారని ఆయన చెప్పారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో గొప్ప చదువులు చదువుకావాలని ముఖ్య మంత్రి ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టారని తెలిపారు. పేదల ఇళ్ళు కోసమని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాతిక వేల కోట్ల రూపాయలతో భూసేకరణ చేసి లక్షలాది కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని నింపామని చెప్పారు. వైయస్సార్ ఆసరా నిధులను కుటుంబాల ప్రగతి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించుకావాలని ఆయన కోరారు. పలు ప్రైవేటు భాగస్వాములతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, వాటిలో దేని ద్వారా ప్రయోజనం కలుగుతుందో వాటిని ఎన్నుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికార అనధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 12:49:03

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి..

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్య‌క్ర‌మానికి  వచ్చిన అర్జీల‌ను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ సునీత‌ త‌దిత‌రులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన అర్జీలు, రీఓపెన్ అర్జీల ప‌రిష్కారంలో పురోగ‌తిపై జేసీ లక్ష్మీశ  స‌మీక్షించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల ప‌రిధిలో ఉన్న కోర్టు కేసులపై  ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ఈ అంశంపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాల‌న్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి  ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్ష‌న్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల స‌ర్వే తదితరాలకు సంబంధించి సుమారు 425 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-11 12:46:51

మైనార్టీ పేదలకు సాయం అభినందనీయం..

అనంతపురంలో మైనార్టీ పేదలకు జమాతే ఇస్లామి హింద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆదర్శ నగర్లో జమాతే ఇస్లామి హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధి కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభ  కార్యక్రమంలో మేయర్ తోపాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ఇస్లామి లేని వారికి ఉన్నవారు ఇమ్మని చెపుతోందని జమాతే ఇస్లామి హింద్ ఇస్లాం ధర్మాన్ని పాటిస్తోందని అభినందించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్, వైకాపా నాయకులు కొండ్రేడ్డి ప్రకాష్ రెడ్డి,జమాతే ఇస్లామి హింద్ సంస్థ ప్రతినిధులు సాదిక్, యాసిర్ అహ్మద్,వలీ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-11 12:35:59