1 ENS Live Breaking News

పింఛ‌న్ దారులంద‌రికీ కోవిడ్ వేక్సిన్..

న‌వంబ‌రు 1వ తేదీన జిల్లాలోని పింఛ‌న్ దారులంద‌రికీ కోవిడ్ వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని, వేక్సిన్ వేసిన త‌రువాతే, వారికి పింఛ‌న్ ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. వ‌లంటీర్ తోపాటుగా, ఎఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ కూడా పింఛ‌న్ దారుల ఇళ్ల‌కు వెళ్లి, ఇప్ప‌టివ‌ర‌కు వేక్సిన్ వేయించుకోనివారికి ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని సూచించారు.  కోవిడ్‌ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పై క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో శ‌నివారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ,  1వ తేదీకి అవ‌స‌రమైన వేక్సిన్‌ల‌ను ముందుగానే సిద్దం చేసుకోవాల‌ని ఆదేశించారు. వేక్సిన్ వేసిన వెంట‌నే, వారి డేటాను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వేక్సిన్ వేయించుకోవ‌డానికి ముందుకు రాని పింఛ‌న్ దారులు, ఇత‌రుల వ‌ద్ద‌కు వెళ్లి, న‌చ్చ‌జెప్పి వారిని ఒప్పించాల‌ని వైద్యాధికారుల‌ను ఆదేశించారు. స్థానిక స‌ర్పంచ్‌లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల స‌హాకారాన్ని కూడా తీసుకోవాల‌ని సూచించారు. ఏ ఒక్క పించ‌న్ దారుడూ వేక్సిన్ వేయించుకోకుండా ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.  పిహెచ్‌సిలు, క్ల‌ష్ట‌ర్లు, వ‌లంటీర్ల వారీగా జ‌రిగిన స‌ర్వే నివేదిక‌ల‌ను మ‌రోసారి త‌నిఖీ చేయాల‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో చాలాచోట్ల వేక్సినేష‌న్ పూర్త‌యిన‌ప్ప‌టికీ, వారి డేటా ఆన్‌లైన్లో అప్లోడ్ కాలేద‌ని అన్నారు. జిల్లాలో వేక్సినేష‌న్ శ‌త‌శాతం పూర్తి చేసేందుకు ప్ర‌తీ వైద్యాధికారీ కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న్‌ , డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-30 12:35:11

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీకై వినతి..

విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం స్కూల్‌ ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున్‌ను కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లిఖార్జున్‌ను శ్రీనుబాబు కలసి గత ఐదేళ్లుగా ఫీజు రాయితీలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల కాఫీలను కలెక్టర్‌కు అందజేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు ఆయా కాఫీలను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌ అక్రిడెషన్లు వేగవంతంగా జారీ చేయాలని తద్వారా హెల్త్‌ ఇన్యూరెన్స్‌, బస్‌ పాసు,రైల్వే పాసులకు దోహదం చేస్తుందన్నారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం వినతిపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఫీజు రాయితీ ఉత్తర్వులు మంజూరుకానున్నట్లు శ్రీనుబాబు చెప్పారు.

Visakhapatnam

2021-10-30 05:45:15

పొందూరులో మిని ఖాదీ క్లస్టర్లకు ప్రతిపాదన..

శ్రీకాకుళం జిల్లా పొందూరులో మినీ ఖాదీ క్లస్టర్ ప్రతిపాదనలు సిద్ధమైంది. ప్రాథమికంగా మూడు మినీ ఖాదీ క్లస్టర్ లను ఏర్పాటు చేయుటకు చేనేత జౌళి శాఖ ప్రతిపాదనలు తయారు చేశారు. అందులో 2 పొందూరులో, ఒకటి తోలాపిలో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించారు. ఒక్కో మినీ క్లస్టర్ కు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం సహాయం అందిస్తుంది. లబ్ధిదారులు పది శాతం మాత్రమే వాటాగా పెట్టాల్సి ఉంటుంది. మినీ క్లస్టర్ ప్రాజెక్టు వలన చేనేత కార్మికులకు చేనేత(వీవింగ్), డయింగ్ /డిజైనింగ్, ఐటి/మేనేజీరియల్ రంగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ లభిస్తుంది. శిక్షణా కాలంలో రోజుకు 300 రూపాయలు స్టైపెండ్ కూడా అందించడం జరుగుతుంది. "సమర్థ" పథకం క్రింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మగ్గాలు, ఆధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాల వివరాలు, తదితర సమాచారం తెలుస్తుంది.  ఆధునిక డిజైన్లను ఆవిష్కరించేందుకు డిజైన్ డెవలప్మెంట్ అధికారిని నియామకం జరుగుతుంది.  వీటన్నిటితో వేతనాలు పెరుగుదల వచ్చి ఆర్థికంగా, సామాజికంగా చేనేతకారులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ లలో పాల్గొనే అవకాశాలు పెరుగుతుంది. సమగ్రమైన అభివృద్ధికి సహకారం అందుతుంది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సొంత స్థలం కలిగి ఉన్న చేనేతకారులు వ్యక్తిగత వర్క్ షెడ్ ను నిర్మించుటకు రూ.1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 25 శాతం లబ్ధిదారు భరించాలి. 1000 చదరపు మీటర్ల లో ఉమ్మడి వర్క్ షెడ్ నిర్మాణానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది.ఇందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 10 శాతం లబ్దిదారులు భరించాలి. ఆమదాలవలస నియోజకవర్గంలో 5, 6 మినీ క్లస్టర్ లు ఏర్పాటు చేయుటకు అవకాశం ఉంది. ఇందులో మొదటగా మూడు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత మినీ క్లస్టర్ లపై శుక్రవారం పొందూరులో అవగాహన కార్యక్రమం జరిగింది.

 రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రమించే నిత్య కార్మికుడు చేనేతకారుడు అని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా చేనేత వస్త్రాలు నిలిచిందని స్పీకర్ అన్నారు. ఆధునిక ఫ్యాషన్ మోజులోపడి చేనేత వస్త్రాలను విడిచిపెట్టామని, అదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోనే పోటీదారుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ వ్యూహాలు పరిగణలోకి తీసుకావాలని, సహకారాన్ని అందించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాన్ని అందిపుచ్చుకోవాలని స్పీకర్ కోరారు. నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలను చేనేతకారులు అందిస్తుందని ఆయన అన్నారు. పొందూరు పరిధిలో 290 మగ్గాలు ఉన్నాయని దాంతోపాటు దేవరవలస, అక్కులపేట, ఉప్పెన వలస, లావేరు తదితర ప్రాంతాలు చేనేత కార్మికులకు ప్రసిద్ధి చెందినవని అన్నారు. మినీ క్లస్టర్ స్థాయి నుండి మెగా క్లస్టర్ స్థాయికి ప్రయత్నం చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేతకారులలో పేదరికం పోవాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

 జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం వస్త్రాలు బ్రాండ్ ఇమేజ్ గా మారాలని అందుకు అందరూ సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంద కోట్ల వరకు ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు జిల్లాలో అవకాశముందని అందుకు అన్ని చేనేత సంఘాలు సమైక్యంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఆరు వేల మంది చేనేతకారులు ఉన్నప్పటికీ మినీ పరిశ్రమ స్థాయిలో ఏర్పాటు చేయుటకు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు.  ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించుటకు సిద్ధంగా ఉందని గుర్తించాలని చెప్పారు.

చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు (రాజమండ్రి) బి .ధనుంజయ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి చేయూతను అందిస్తున్నాయన్నారు. ముద్రా రుణాలు, పొదుపు నిధి తదితర అంశాలను ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఖాదీ వస్త్రాలతో స్పీకర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు షేక్ అబ్దుల్ రషీద్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పిటిసి లోలుగు కాంతారావు, చేనేతకారులు పైడిలింగం, రమణ మూర్తి, నాగరాజు, స్థానిక సర్పంచ్ లక్ష్మి , జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-29 12:06:34

పత్రికల్లో వార్తలొస్తేనే స్పందిస్తారా..

పత్రికలలో వార్తలు వస్తేనే సమస్యలపై స్పందిస్తారా అంటూ సిబ్బంది తీరుపై నగర మేయర్ మహమ్మద్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు.నగరంలోని 18 వ డివిజన్ పరిధిలోని గుల్జార్ పేట్ లో అమ్మవారిశ్యాల వీధిలో దెబ్బతిన్న డ్రైనేజీలు, స్కావెంజర్  లైన్లను గురువారం మేయర్  పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం,దెబ్బతిన్న డ్రైన్ లపై పత్రికలలో  వస్తే తప్ప సంబంధిత సచివాలయాల కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సచివాలయంలో పరిధిలో తిరిగితే సమస్యలు తెలుస్తాయని,కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని మేయర్ ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చారని మీరు పనిచేయకుంటే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారన్నారు.వెంటనే గుల్జార్ పేటలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని మేయర్  ఆదేశించారు. అనంతరం అదిముర్తి నగర్ లోని 25వ సచివాలయంను మేయర్ వసీం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిమ్ ను పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.ఆయా  కార్యక్రమాలలో   కార్పొరేటర్లు ముంతాజ్ బేగం,కమల్ భూషణ్,లీలావతి, ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,కార్యదర్శి  సంఘం శ్రీనివాసులు, డిఈ సుధారాణి ,ఏ ఈ  నాగజ్యోతి , నాయకులు దాదు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-28 09:38:33

ఓటిఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి..

స‌చివాల‌య ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందించే దిశగా గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం న‌వ‌ర‌త్నాలు ద్వారా అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ అందించేలా సిబ్బంది కృషిచేయాల‌న్నారు. కోవిడ్ నుంచి ప్ర‌జ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు టీకాయే మార్గమ‌ని, అందువ‌ల్ల ప్ర‌తిఒక్క‌రూ కోవిడ్ టీకా తీసుకొనేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. న‌గ‌రంలోని ఉల్లివీధి-2 వార్డు స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితిపై ఆరా తీశారు. స‌చివాల‌యం ప‌రిధిలో ఇంకా అర్హులైన వారిలో ఎంత‌మంది వ్యాక్సిన్ వేయించుకోలేద‌ని తెలుసుకొని వారంద‌రినీ త‌క్ష‌ణం వ్యాక్సినేష‌న్ చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌య రికార్డుల‌ను ప‌రిశీలించి ఇ-సేవ విన‌తుల ప‌రిష్కారంపై తెలుసుకున్నారు. గృహాల ల‌బ్దిదారుల‌కు నామ‌మాత్ర‌పు ధ‌ర‌తో హ‌క్కులు క‌ల్పించే ఓ.టి.ఎస్‌.ప‌థ‌కంపై స‌చివాల‌య ప‌రిధిలో చేసిన ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల్లో దీనిపై విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సూచించారు. సిబ్బంది స‌కాలంలో విధుల‌కు హాజ‌రై చిత్త‌శుద్దితో సేవ‌లందించాల‌ని హిత‌వుపలికారు.

Vizianagaram

2021-10-27 13:53:56

దాతల సహకారంతోనే ఆలయాల అభివృద్ధి..

దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యపడుతుందని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. బుధవారం సింహద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన అనంతరం హుండీ లెక్కింపులో పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తాను అధికారులు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని వివరించామన్నారు. సింహగిరిపైన, కొండ దిగువున భక్తులకు ఉచిత సాత్రాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మంచినీరు, మరుగుదోడ్లు వంటి కనీస సౌకర్యాలు మరిన్ని కల్పించాలని కోరామన్నారు. కొండ దిగువన వరహ పుష్కరిణి అభివృద్ధి చేయాలని, అక్కడ ఉన్న స్మశానానికి వెళ్లే రహదారులను మెరుగుపర్చాలని ఈవో ఎంవీ సూర్యకళను కోరినట్టు కోరారు. సింహగిరిపైన ఆలయ వర్గాలు నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు భక్తులు ప్రశంసలు పొందుతున్నాయన్నారు. సంతానలక్ష్మీ యంత్రంగల కప్పస్తంభంకు భక్తుల నుంచి తాకిడి పెరిగిందన్నారు. ఎవ్వరితే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని సంతానాన్ని కోరుకుంటారో వారి కోర్కికులు నేరవేరుతాయన్నారు.ప్రతి ఒక్కరూ దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Simhachalam

2021-10-27 13:18:41

ఆక్వాకల్చర్ పరిశ్రమల అభివ్రుద్ధికి ప్రోత్సహకాలు.. ఫిషరీష్ డిడి నిర్మలకుమారి

విజయనగరం జిల్లాలో ఆక్వాకల్చర్ పరిశ్రమలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో ఆక్వా కల్చర్ సాగు, పరిశ్రమలు, అభివ్రుద్ధి తదితర అంశాలపై హేచరీ యజమానులు, మత్స్యకార రైతులు, సీడ్ డీలర్లతో జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆక్వా రంగ అభివృద్ధికి చాల కృషి చేస్తుందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ ఆదేశానుసారం  జిల్లా వ్యాప్తంగా ఆక్వారంగ పరిశ్రమలను అభివ్రుద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చేప, రొయ్యల మేత సరఫరా, APSADA చట్టం ద్వారా ఆక్వా కల్చర్ సాగు, ఇతర సంభందిత కార్యకలాపాలకు అనుమతులు ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. పీనియస్ మొనోడాన్ రొయ్య పిల్ల ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ, వివిధ సైజుల గల రొయ్యలకు తగినట్లు ధరల నిర్ణయం, నియంత్రణ  వంటి అంశాల్లో కూడా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆక్వా సాగు చేస్తున్న ప్రతీ ఎకరాను ఇ-క్రాప్ లో నమోదు చేసి ప్రభుత్వ ద్వారా వచ్చే సదుపాయాలకు మార్గం సుగమం చేస్తున్నట్టుఆమె వివరించారు. ప్రతి సచివాలయానికి ఒక మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి వినియోగదారుల వద్దకే నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను చేరవేసి తద్వారా చేప, రొయ్యల తలసరి వినియోగం పెంపుదలకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది, గ్రామ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-23 12:37:40

కార్మికుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత..

కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. శనివారం  60 సంవత్సరాల పైబడి వున్న కార్మికుల స్థానంలో వారి పిల్లలకి అవకాశాలు కల్పిస్తూ మేయర్ ఛాంబర్ లో మేయర్ వసీం చేతుల మీదుగా ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగర పాలక సంస్థ లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వయోభారం వల్ల ఇబ్బందులు పడుకూడదన్న ఉద్దేశ్యం తో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.అకింతబావంతో పనిచేయాలని సూచించారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు  పరిష్కరించే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తోందన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు  అనిల్ కుమార్ రెడ్డి ,కమల్ భూషణ్, బాబా ఫక్రుద్దీన్, మునిశేఖర్, చంద్రమోహన్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రలేఖ ,కార్యదర్శి సంఘం శ్రీనివాసులు,నాయకులు దాదు, రాధాకృష్ణ, కుల్లాయి స్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-23 10:48:17

నూతన పరిశ్రమలకు అన్నిరకాల చేయూత..

విజయనగరం  జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్ చేసుకోడానికి అనుకూలమైన వాతావరణం ఉందని,  పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే  వారికీ అన్ని రకాలుగా చేయూత నివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు.   అందుకు సరైన ప్రతిపాదనల తో , సంబంధిన డాక్యుమెంట్లతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు.   శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉంది , అవకాశాలు ఉన్నాయి కాని   ఏ ఏ పరిశ్రమలకు ఎలాంటి మార్కెటింగ్ ఉంటుందనే అంశాల పై కూడా అవగాహన ఉండాలన్నారు.   ముఖ్యంగా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, గిరిజన ఉత్పతులు , చేనేతలు, చేతి వృత్తులు,  చిరు ధాన్యాల గ్రేడింగ్, ఆర్గానిక్ ఉత్పతులు ,   మాంగో ప్రాసెసింగ్, జనప నార, తేనే, కూరగాయల ఉత్పతులకు సంబంధించిన పరిశ్రమలకు ఎక్కువగా మార్కెటింగ్  అవకాశాలు ఉన్నాయని, ఇందులో తక్కువ పెట్టుబడి తో ప్రారంభించవచ్చని అన్నారు.   బ్యాంకర్స్ తో ఉన్న సమస్యలను పరిస్కారానికి ఈ నెల 28 న లీ పారడైస్ లో లోన్ మేళ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరయితే, బ్యాంకర్ లతో ముఖ ముఖి  మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చని  తెలిపారు.  ఈ కార్యక్రమం లో విశాఖపట్నం నుండి హాజరైన ప్రముఖ వాణిజ్య వేత్త , ఛాంబర్  అఫ్ కామర్స్  మాజీ  అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ   కంటకపల్లి లో 40 ఎకరాల్లో  పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయితే  ఆ స్థలానికి రహదారులు, విద్యుత్, నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ ను కోరారు.   మోటార్ వాహనాల  అవసరత ఎక్కువగా ఉందని, అయితే  డ్రైవర్ల కొరత వలన ఆ  ఫీల్డ్  పెద్దగా అభివృద్ధి కావడం లేదని అన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ  డ్రైవింగ్ స్కూల్ ద్వారా హెవీ వెహికల్ శిక్షణలు ఇచ్చి డ్రైవర్ లను తయారు చేయడానికి  చర్యలు తీసుకుంటామని తెలిపారు.  స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా డిమాండ్ ఉన్న కోర్స్ లకు శిక్షణలు అందించడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణలు పొందిన వారికి త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. 

 డిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల వారికీ యూనిట్ల  స్థాపనకు  బ్యాంకు గ్యారంటీ లతో పాటు సేల్ డీడ్  లు అడుగుతున్నారని, అందువలన ఆసక్తి ఉన్నప్పటికీ  యూనిట్ ల స్థాపనకు ముందుకు రావడం లేదని అన్నారు.  కలెక్టర్ స్పందిస్తూ అజెండా  లో పెట్టి ఎస్.ఎల్.బి.సి లో  ఉన్న నిబంధనలను చర్చించి  , బ్యాంకర్ లతో మాట్లాడి  తగు పరిష్కారాన్ని కనుగొంటామని అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్  శ్రీధర్ మాట్లాడుతూ  సెప్టెంబర్ నుండి నేటి వరకు  జిల్లాలో సింగల్ డెస్క్ పోర్టల్  లో 55  దరఖాస్తులు అందాయని, 33 దరఖాస్తులు అనుమతి పొందాయని , 20  దరఖాస్తులు పలు  కారణాలతో పెండింగ్ ఉన్నాయని,  2 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని  తెలిపారు.  ఈ కార్యక్రమం లో  సంయుక్త కలెక్టర్ లు డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు,  ఎం.ఎస్.ఎం.ఈ , స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్, స్టీల్ ప్లాంట్ , ఫాప్సి, డిక్కీ నుండి ప్రతినిధులు, కమిటి సభ్యులు, అధికారులు  పాల్గొన్నారు.  

Vizianagaram

2021-10-23 10:36:21

100 కోట్ల కరోనాటీకా మైలు రాయి వేడుకలు..

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో 100 కోట్ల మైలురాయి దాటిందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వేడుకలు  జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ చేసి తమ సంతోషాన్ని పాలుపంచుకున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా మన దేశంలో వేక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరిగిందని, ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని దాటామని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు గుర్తుచేసారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే మనదేశం తొలిస్థానంలో ఉందని వైద్య సిబ్బందితో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. దీనికి సహకరించిన వైద్య శాఖ, ఇతర శాఖల సిబ్బంది మరియు ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. వ్యాక్సినేషన్ తొలి రోజుల్లో ప్రజలు కొంత మేర భయబ్రాంతులకు గురైనప్పటికీ అనతికాలంలోనే ప్రజల్లో అవగాహన పెరిగి ముందుకు వచ్చారని, తద్వారా 100 కోట్ల మైలురాయిని దాటడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అతిత్వరలో శతశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దేశంలో , రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.  జిల్లాలో మొదటి డోసు 16 లక్షల 9వేల 662 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, రెండవ డోసు 8 లక్షల 41 వేల 484 మందికి వేయడంతో ఇప్పటివరకు 24 లక్షల 51 వేల 146 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, త్వరలోనే జిల్లాలో కూడా శతశాతం వ్యాక్సినేషన్ జరగనున్నట్లు ఆయన తెలిపారు.    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స్వరాజ్యలక్ష్మీ, అర్బన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. జె.కృష్ణమోహన్ , వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2021-10-22 15:38:10

సీఎం జగన్ కు మహిళలు అండగా నిలవాలి..

అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన సుభిక్షంగా ఉందని, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత కొనియాడారు. మహిళలకు ఒక అన్నగా, అండగా ఉంటూ, వారిని ఆర్ధికంగా, సామాజికంగా,  రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్.కోట మండలం గోపాలపల్లిలో రూ.7.5 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని, శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వనిత మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించేందుకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి పై, ప్రతిపక్ష టిడిపి నాయకులు అవాకులు, చెవాకులు ప్రేలుతూ, సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో అసభ్యకరంగా దూషిస్తున్నారని అన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోయిన టిడిపి, తమ ఉనికి చాటుకోడానికే  ఇలా వ్యవహారిస్తోందని   విమర్శించారు. డ్వాక్రా మహిళలను రుణ మాఫి పేరిట గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఇటీవలే రెండో విడత ఆసరా విడుదల చేయడంతో, మహిళలకు ప్రభుత్వం పై మరింత నమ్మకం, అభిమానం పెరిగాయని అన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలని మంత్రి కోరారు.   ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. ఇంతటి మహిళా పక్షపాతిని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని చంద్రబాబు కార్పోరేటీకరణ చేస్తే.... ఆ రెండింటినీ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన, దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రమేనని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆర్డిడి చిన్మయి, పిడి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో బిహెచ్ భవానీశంకర్, జెడ్పిటిసి ఎం.వెంకటలక్ష్మి, వైస్ ఎంపిపి ఐ.సుబ్బలక్ష్మి, వైసీపీ నాయకులు ఐ.రఘురాజు, ఎంపిడివో శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-22 15:24:13

టిటిడి గ్రంధాలను ఆవిష్కరించిన చైర్మన్..

తిరుమల తిరుపతి దేవస్థానం పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ముద్రించిన అగ్నిమ‌హాపురాణం(ప్ర‌థ‌మ భాగం), ఉత్త‌ర హ‌రివంశం (ప్ర‌థ‌మ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం తిరుమ‌లలోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆవిష్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ స‌నాత‌న హైందవ ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఇతిహాసాల‌ను, పురాణాల‌ను స‌ర‌ళ‌మైన తెలుగులోకి అనువ‌దించి సామాన్య పాఠ‌కులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. అగ్నిమ‌హాపురాణంలో మొత్తం 383 అధ్యాయాల్లో 11 వేల‌కు పైగా శ్లోకాలు ఉన్నాయ‌ని, ప్ర‌థ‌మ భాగంలో 209 ఆధ్యాయాల్లో 5,780 శ్లోకాలు ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం సంస్కృత‌ విశ్రాంతాచార్యులు డా. కె.ప్ర‌తాప్ తెలుగులోకి చ‌క్క‌గా అనువ‌దించార‌ని వివ‌రించారు. అదేవిధంగా శ్రీ నాచ‌న సోమ‌న ర‌చించిన ఉత్త‌ర హ‌రివంశం గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయ‌ని, వీటిని రెండు సంపుటాలుగా శ్రీ కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యం తెలుగు విశ్రాంతాచార్యులు  డా. తుమ్మ‌పూడి కోటేశ్వ‌ర‌రావు తెలుగులోకి అనువ‌దించార‌ని చెప్పారు. ఈ రెండు గ్రంథాల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌కు, ఇత‌ర పండిత ప‌రిష‌త్ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌తాభినందనలు తెలియ‌జేశారు.  టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు పూర్వ‌ ప్ర‌త్యేకాధికారి డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య మాట్లాడుతూ భ‌గ‌వంతుడు వేదాల్లో చెప్పిన విష‌యాల‌ను అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా విశ‌దీక‌రించేందుకు 18 పురాణాలను వేద‌వ్యాసుల వారు ర‌చించార‌ని చెప్పారు. అగ్నిపురాణంలోని అంశాల‌ను అగ్నిదేవుడు వ‌శిష్టుడికి చెప్పారని, మాన‌వ‌జీవితం సార్థ‌క‌మ‌య్యేందుకు కావాల్సిన అన్ని విష‌యాలు ఇందులో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ గ్రంథంలో శ్లోకాల‌కు తాత్ప‌ర్యం, విశేషాంశాల‌ను తెలియ‌జేశామ‌న్నారు. టిటిడిలో పురాణాల అనువాదం ఒక మ‌హాయ‌జ్ఞంలా జ‌రుగుతోంద‌ని చెప్పారు. మ‌హాభార‌తానికి అనుబంధంగా ఉన్న గ్రంథం ఉత్త‌ర హ‌రివంశం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మ‌య్య‌,  పండిత ప‌రిష‌త్ స‌భ్యులు డా. కొంపెల్ల రామ‌సూర్య‌నారాయ‌ణ‌, డా. శ్రీ‌పాద స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, డా. శ్రీ‌పాద సుబ్ర‌మ‌ణ్యం, డా. ధూళిపాళ ప్ర‌భాక‌ర కృష్ణ‌మూర్తి, డా. తూమాటి సంజీవ‌రావు, డా. సాయిరాం సుబ్ర‌మ‌ణ్యం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. రేమెళ్ల రామకృష్ణ శాస్త్రి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, డా. స‌ముద్రాల ద‌శ‌ర‌థ్, డా.ఎన్.నరసింహాచార్యులు  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-22 13:06:46

అంగన్వాడీ కేంద్రాలను తరుచగా తనిఖీచేయాలి..

మహిళల భద్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ,  ఆర్ధిక భారం అయినా  లెక్క చేయకుండా  నిధులను కేటాయిస్తోందని  రాష్ట్ర  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  గత ప్రభుత్వం  500 కోట్ల ను కేటాయిస్తీ ఈ ప్రభుత్వం 1800  కోట్ల రూపాయలను కేటాయించి మహిళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని అన్నారు. జిల్లా  రిషత్ సమావేశ మందిరం లో ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లతో సమీక్షించారు. సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు తమ పరిధి లోనున్న అంగన్వాడి కేంద్రాలను  రెగ్యులర్ గా తనిఖీలు  తనిఖీలు చేయాలనీ ఆదేశించారు.  క్షేత్ర స్థాయి లో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ్, పోషణ్ ప్లస్ కార్యక్రమాల క్రింద అందిస్తున్న  ఎండు ఖర్జూరం, బెల్లం, చిక్కీలు, గుడ్లు నాణ్యంగా ఉండడం లేదని కొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయని,  ఈ పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని అన్నారు . నాణ్యమైన సరుకులు రానపుడు  డెలివరీ తీసుకోకుండా తిరిగి పంపించి వేయాలని అన్నారు.   స్టాక్ వచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేసుకోవాలని, నాణ్యత లేని వాటిని సరఫరా చేసిన వారికి నోటీసు లు జారి చేయాలనీ సూచించారు.  తరచుగా అంగన్వాడి  కేంద్రాలను తనిఖీ చేస్తుంటేనే అక్కడి లోపాలు అధికారుల దృష్టికి వస్తాయని, లోపాలను సవరించుకుంటే  గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.  ఈ తనిఖీలతో అంగన్వాడీ కేంద్రాల్లో బోగస్ నమోదును కూడా తగ్గించవచ్చని అన్నారు.   ఒక తనిఖీ కి  మరొకసారి వెళ్లి చేసిన తనిఖీ కి మధ్య జరిగిన మార్పులను కూడా గుర్తించాలన్నారు.  ప్రభుత్వం గర్భిణీల, బాలింతల, పసి పిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు వృద్ధా కాకుండా లబ్ది దారులకు అందిన నాడే  ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని అన్నారు.   రాష్ట్రం లో క్లిష్హ్త మైన  ఆర్ధిక పరిస్థితి  ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలను అమలుచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటీ మీరంతా చిత్త శుద్ధితో పని చేయాలనీ హితవు పలికారు.  ఈ సందర్భంగా మంత్రి  బాలల గృహం,  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మహిళా  ప్రాంగణం, వన్ స్టాప్ సెంటర్, ట్రాఫికింగ్,  జువనైల్ హోం, వయో వృద్ధులు, సదరం   తదితర  శాఖల పని తీరుపై సమీక్షించారు. సదరం క్యాంపు లను ప్రతి నియోజక వర్గం లో నిర్వహించాలన్నారు.   దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపకరణాల పై అందరికీ అవగాహన కలిగించాలన్నారు.
 
అంగన్వాడి కేంద్రాలకు జిల్లా పరిషత్ నిధులు: చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు 
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పని తీరు భేష్ గా ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాస రావు కొనియాడారు.  కోవిడ్ తర్వాత కేంద్రాలను తిరిగి ప్రారంభించారని,  అసలైన లబ్ది దారులకు పౌష్టి కాహారం అందేలా చూడాలని అన్నారు.   బాల్య వివాహాలను నిరోధించడం లో ఐ.సి.డి.ఎస్ శాఖ పాత్ర అభినందనీయమని అన్నారు.  ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.  శాఖ లో  జిల్లాలో ఖాళీ గ ఉన్న పోస్ట్ లను నింపడం ద్వారా మరింత మెరుగైన సేవలను అందించవచ్చని, పోస్ట్ లను వీలున్నంత తొందరగా నింపాలని మంత్రిని కోరారు.  అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల కోసం జిల్లా పరిషత్ నిధులను కేటాయిస్తామని చైర్మన్  ప్రకటించగా  మంత్రి స్పందిస్తూ  అంగన్వాడీల అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు  ధన్యవాదాలు తెలిపారు. అరకు పార్లమెంట్ సభ్యులు  గొట్టేటి మధ్హవి మాట్లాడుతూ మైదాన ప్రాంతాల కంటే గిరిజన గ్రామాల పై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తోందని,  గిరిజనులు  అంగన్వాడీ కార్యకర్తలనే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు.  గిరిజనులకు ఆరోగ్యం, ఆహారం పై పెద్దగా అవగాహనా ఉండదని, అంగన్వాడీ లే పెద్ద దిక్కని, వారికీ పౌష్టికాహారం పై అవగాహనా కల్పించడమే కాక అందించడం లో కూడా శ్రద్ధ చూపాలన్నారు.   సంయుక్త కలెక్టర్ అభివృద్ధి  డా.మహేష్ కుమార్   క్షేత్ర స్థాయి  తనిఖీలకు ఒక షెడ్యుల్ తయారు చేస్తామన్నారు. స్టాక్ వెరిఫికేషన్  చేసి నాణ్యత లేని సరఫరా దారులకు  నోటీసు లు జరీ చేసేందుకు నిర్ణీత ప్రోఫార్మ  తయారు చేసి అన్ని సెక్టర్ లకు పంపిస్తామన్నారు.  సాదరం కోసం త్వరలో మెగా క్యాంపు  నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  సమావేశం అనంతరం  బాల్య వివాహాల రద్దు పై, దిశా మొబైల్ యాప్ , దిశా సేవలు పై వరల్డ్ విజన్ ముద్రించిన కర పత్రాలను, పోస్టర్  లను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో శాసన సభ్యులు కోలగట్ల వీర భద్ర స్వామి,   ప్రాంతీయ  ఉప సంచాలకులు చిన్మయి దేవి, పి.డి మహిళా అభివృద్ధి ఛైర్పర్సన్ శాంతకుమారి  తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-22 12:50:22

ప్రభుత్వ భూముల పరిరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలి..

రెవిన్యూ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేందిగా వుండాల‌ని, ప్రభుత్వ భూముల విష‌యంలో నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు బాధ్యత‌గా, అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి త‌హ‌శీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అవ‌స‌రాల నిమిత్తం సేక‌రించిన భూముల‌ను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో న‌మోదు చేసేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి ప్రక్రియ‌నుపూర్తి చేసి భ‌విష్యత్తులో ఆ భూముల‌పై ఎలాంటి వివాదాలు త‌లెత్తకుండా చూడాల‌న్నారు. క‌లెక్టర్ కార్యాల‌యంలో జిల్లా రెవిన్యూ అధికారుల స‌మావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. తెలుగుత‌ల్లి చిత్రప‌ టం వ‌ద్ద జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి జ్యోతి ప్రజ్వల‌న చేసి స‌మావేశాన్ని ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రెవిన్యూ అధికారుల స‌మావేశం నిర్వహించ‌డం ఆనందంగా వుంద‌న్నారు. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా ప్రత్యక్ష స‌మావేశాలు నిర్వహించ‌లేద‌ని పేర్కొన్నారు. తొలి ద‌శ‌ కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డంలో ఈ జిల్లా ఇత‌ర జిల్లాల కంటే ముందువ‌రుస‌లో నిలిచింద‌న్నారు. జిల్లాలో 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సుగ‌ల వారిలో 92.5 శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌ని, 18 ఏళ్లకు పైబ‌డిన వారిలో 65శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌న్నారు. ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ప‌రిస్థితులు, ఖ‌చ్చిత‌మైన‌ డేటా సేక‌ర‌ణ‌కోసం రెవిన్యూ శాఖ కే బాధ్యత‌లు అప్పగిస్తార‌ని, రెవిన్యూశాఖకు ఏ ప‌ని అప్పగించినా వాస్తవిక‌మైన స‌మాచారం త్వరితంగా సేక‌రించి అందిస్తుంద‌నే న‌మ్మకం వుంద‌న్నారు. ఎలాంటి ఆ న‌మ్మకాన్ని నిల‌బెట్టేలా అధికారులు వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. రెవిన్యూ శాఖ‌కు సంబంధించి ప్రజలు త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ప‌దే ప‌దే కార్యాల‌యాల‌కు రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా త్వర‌గా ప‌రిష్కరించాల‌ని సూచించారు. గ్రామ స‌చివాల‌యాల నుంచి వ‌చ్చిన స‌మ‌స్యలు ఎంత కాల వ్యవ‌ధిలో ప‌రిష్కారం అవుతున్నాయో ప్రతి వారం స‌మీక్షించాల‌న్నారు. గ్రామ స‌చివాల‌యాల త‌నిఖీల ద్వారా నిర్దిష్ట ప్రయోజ‌నం క‌లిగేలా త‌హ‌శీల్దార్లు చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు.

 స‌చివాల‌యం త‌నిఖీ చేసిన‌పుడు గ్రామంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చిన రెవిన్యూ సంబంధ స‌మ‌స్యలు ఏవిధంగా ప‌రిష్కరిస్తున్నారు, స‌కాలంలో స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాలు ప‌రిశీలించాల‌న్నారు. రేషన్ కార్డు దారులకు సంబంధించి ఇ-కేవైసి తదితర సమస్యలను పరిష్కరించి రేషన్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బియ్యం పంపిణీ చేసే వాహనాలకు సంబంధించి ఆపరేటర్ల ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసే విధంగా ఎం.పి.డి.ఓ. లతో సమన్వయము చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జే.వెంకట రావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావనా, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, డి.ఎస్.ఓ. పాపారావు, భూసేకరణ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-22 12:46:37