1 ENS Live Breaking News

కమిషనర్ లక్ష్మీశకు SCRWA శుభాకాంక్షలు..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)  కమిషనర్ గా లక్ష్మీశ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు .. పరిశుభ్రతకు  తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా కృషిచేస్తానని  మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు .. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు  జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు . విశాఖ నగరాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు .కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్య ప్రకాష్ (కిరణ్),సభ్యులు కొండ్రి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2021-10-30 15:48:05

మూమెంట్, టూర్ డైరీలు నిర్వహించాల్సిందే..

జీవిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్. జి.లక్ష్మీశ ఆదేశించారు. శనివారము నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన  3వ జోన్ లోని 17, 18, 19 వార్డు పరిధిలోని జాలరి పేట నేతాజీ నగర్ ఆదర్శ నగర్ తదితర ప్రాంతాలలోని  6 సచివాలయాలను సందర్శించారు.  సచివాలయంలోని ప్రజలకు అందించే సేవలు,  సంక్షేమ పథకాల పోస్టర్లును పరిశీలించి,  సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు కొన్ని తెలుగులోనూ, కొన్ని ఆంగ్లంలోనూ ఉండడం గమనించి పోస్టర్లు ఇంగ్లీషు, తెలుగులో  అందరూ చదివే విధంగా  ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.  కార్యదర్శుల యొక్క మూమెంట్ రిజిస్టర్, డైరీలను, బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యదర్శులు వారు నిర్వహిస్తున్న విధులు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వార్డు సచివాలయంలో ఉన్న కార్యదర్శులు  కూడా సంక్షేమ పధకాల యొక్క పూర్తి వివరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సచివాల్యాలలో వాడే ప్రతి రిజిస్టర్ ప్రభుత్వ రిజిస్టర్ కాబట్టి అందులో సంతకం పెట్టి,  సచివాలయం ముద్ర వేయాలని కార్యదర్శులకు సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందాలని ఉద్దేశంతో వార్డు సచివాలయ  వ్యవస్థను ప్రవేశపెట్టిందని,  ప్రజలు ఎన్నో ఆశలతో సంక్షేమ పథకాల కొరకు సచివాలయాలకు వస్తారని,  అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందేలా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు.  ప్రజలు పెట్టుకున్న అర్జీలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని లేని యెడల శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ పర్యటనలో కార్పొరేటర్లు గేదల లావణ్య, గొలగాని మంగవేణి, నోల్లి నూకరత్నం, జోనల్ కమిషనర్ శివప్రసాద్,  ఎఎంఒహెచ్ డాక్టరు రమణ మూర్తి, కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాస్, ఎపీడి పద్మావతి సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-30 14:50:47

దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ కు ఘనసన్మానం..

శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్రకు ఘన స్వాగతం లభించింది. బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు  గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు ఛైర్మన్ కు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. దేవాంగ కుల సమస్యలను రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ ఈ సందర్భంగా వివరించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

Srikakulam

2021-10-30 14:23:24

ఆదిత్యునికి దేవాంగ కార్పోరేషన్ చైర్మన్ పూజలు..

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత అయిన అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర చేనేత దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ ఆలయ మర్యాదలతో , వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను ఛైర్మన్ కు అందజేసారు. అనంతరం అనివేటి మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని ఛైర్మన్ కు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు  గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు, సభ్యులు గుంటముక్కల పాపారావు, చప్పటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Arasavilli

2021-10-30 14:22:18

జివిఎంసీ కమిషనర్ లక్ష్మీషా కి గంట్ల సత్కారం..

మహావిశాఖనగర పాలక సంస్థ కమిషనర్ గా చేరిన డా.లక్ష్మీషా ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రినుబాబు కలిసి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అప్పన్న చిత్రపటాన్ని బహుకరించారు. మంచి అధికారిగా పేరున్నమీరు విశాఖ నగరపాలక సంస్థకు కమిషనర్ గా రావడం ఎంతో ఆనందంగా వున్నదన్నారు. మంచి నగరానికి మంచి అధికారి వస్తే వాటి యొక్క ఫలితాలు అదేస్థాయిలో వుంటాయని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విశాఖలో మంచి వాతావరణం, అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల కలయిక వుంటుందని కమిషనర్ కి వివరించారు.

జివిఎంసీ

2021-10-30 14:19:33

అభివృద్ది వైపు అడుగులు వేయండి..

ప్ర‌భుత్వం అందిస్తున్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకొని, అభివృద్ది దిశ‌గా అడుగులు వేయాల‌ని మహిళా సంఘాల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. త‌మ‌పై తాము న‌మ్మ‌కం ఉంచి, ఆలోచ‌నా ప‌రిధిని విస్తృతం చేసుకొని, పెద్ద‌పెద్ద ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. స్థానిక టిటిడిసిలో శ‌నివారం జ‌రిగిన జిల్లా స‌మాఖ్య 206వ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్ర‌స్తుతం మ‌హిళా సంఘాలు స్వ‌యం ఉపాధి యూనిట్లను స్థాపించుకొనేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. ఆర్థికంగా ఎదుగుద‌ల‌కు ఇదొక గొప్ప అవ‌కాశామ‌ని పేర్కొన్నారు. సంఘాలు ముందుకు వ‌స్తే, శిక్ష‌ణ‌, ఇత‌రత్రా స‌హ‌కారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, తెల్ల కార్డుల‌కోసం ఆశ‌ప‌డ‌కుండా, తామే ఆదాయ‌ప‌న్ను చెల్లించే స్థాయికి ఎద‌గాల‌ని,  ప‌దిమందికి ఉపాధి క‌ల్పించాల‌ని కోరారు. చిన్న‌చిన్న యూనిట్ల‌ను కాకుండా, పెద్ద యూనిట్ల‌ను స్థాపించుకొనేలా సంఘాలు ముందుకు రావాల‌ని, ఉన్న‌తంగా ఆలోచించాల‌ని సూచించారు. స‌మావేశ భ‌వ‌నాలు లేని మండ‌లాల్లో, క‌మ్యూనిటీ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేస్తున్నామ‌ని వెళ్ల‌డించారు.  ఆంగ్ల‌భాష‌పై ప‌ట్టు సంపాదించుకొనేందుకు మ‌హిళ‌లు ప్ర‌య‌త్నించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.  

          జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, స్వ‌యం ఉపాధి యూనిట్ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుందని అన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న చేయూత‌, చేదోడు, తోడు, ఆస‌రా త‌దిత‌ర ప‌థ‌కాల డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్టి, స్వ‌యం ఉపాధి యూనిట్ల‌ను స్థాపించాల‌ని కోరారు. దీనికి అద‌నంగా స్త్రీనిధి, ఉన్న‌తి, బ్యాంకు లింకేజీ  త‌దిత‌ర మార్గాల అద‌న‌పు రుణాలు తీసుకొని, యూనిట్ల‌ను స్థాపించుకొనే వెసులుబాటు ఉంద‌ని సూచించారు. మ‌హిళ‌లు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సాంకేతిక స‌హ‌కారాన్ని అందిస్తామ‌న్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటుగా, ఇప్ప‌టికే న‌డుస్తున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా పూర్తి స‌హ‌కారాన్ని అందించ‌డం ద్వారా, సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని అధికారులకు జెసి సూచించారు. ప‌లు అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ, త‌మ శాఖ‌ల ప‌రిధిలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు.

          ఈ స‌మావేశంలో డిఆర్‌డిఏ ఏపిడి కె.సావిత్రి, టిపిఎంయు ఏపిడి స‌త్యంనాయుడు, జిల్లా స‌మాఖ్య అధ్య‌క్షులు చింత‌ప‌ల్లి వెంక‌ట‌ల‌క్ష్మి, ఉపాధ్య‌క్షులు పీడిక రేవ‌తి, కోశాధికారి బోడ‌సింగి స‌న్యాస‌మ్మ‌, కార్య‌ద‌ర్శి కాగాన మేరీ, ఉప కార్య‌ద‌ర్శి సిరిశెట్టి సింహాచ‌లం, వివిధ శాఖ‌ల అధికారులు, ఎఫ్ఎస్‌పిలు, ఏసిలు, ఎపిఎంలు, మెప్మా సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-30 12:38:33

పింఛ‌న్ దారులంద‌రికీ కోవిడ్ వేక్సిన్..

న‌వంబ‌రు 1వ తేదీన జిల్లాలోని పింఛ‌న్ దారులంద‌రికీ కోవిడ్ వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని, వేక్సిన్ వేసిన త‌రువాతే, వారికి పింఛ‌న్ ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. వ‌లంటీర్ తోపాటుగా, ఎఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ కూడా పింఛ‌న్ దారుల ఇళ్ల‌కు వెళ్లి, ఇప్ప‌టివ‌ర‌కు వేక్సిన్ వేయించుకోనివారికి ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని సూచించారు.  కోవిడ్‌ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పై క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో శ‌నివారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ,  1వ తేదీకి అవ‌స‌రమైన వేక్సిన్‌ల‌ను ముందుగానే సిద్దం చేసుకోవాల‌ని ఆదేశించారు. వేక్సిన్ వేసిన వెంట‌నే, వారి డేటాను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వేక్సిన్ వేయించుకోవ‌డానికి ముందుకు రాని పింఛ‌న్ దారులు, ఇత‌రుల వ‌ద్ద‌కు వెళ్లి, న‌చ్చ‌జెప్పి వారిని ఒప్పించాల‌ని వైద్యాధికారుల‌ను ఆదేశించారు. స్థానిక స‌ర్పంచ్‌లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల స‌హాకారాన్ని కూడా తీసుకోవాల‌ని సూచించారు. ఏ ఒక్క పించ‌న్ దారుడూ వేక్సిన్ వేయించుకోకుండా ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.  పిహెచ్‌సిలు, క్ల‌ష్ట‌ర్లు, వ‌లంటీర్ల వారీగా జ‌రిగిన స‌ర్వే నివేదిక‌ల‌ను మ‌రోసారి త‌నిఖీ చేయాల‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో చాలాచోట్ల వేక్సినేష‌న్ పూర్త‌యిన‌ప్ప‌టికీ, వారి డేటా ఆన్‌లైన్లో అప్లోడ్ కాలేద‌ని అన్నారు. జిల్లాలో వేక్సినేష‌న్ శ‌త‌శాతం పూర్తి చేసేందుకు ప్ర‌తీ వైద్యాధికారీ కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న్‌ , డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-30 12:35:11

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీకై వినతి..

విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం స్కూల్‌ ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున్‌ను కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లిఖార్జున్‌ను శ్రీనుబాబు కలసి గత ఐదేళ్లుగా ఫీజు రాయితీలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల కాఫీలను కలెక్టర్‌కు అందజేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు ఆయా కాఫీలను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌ అక్రిడెషన్లు వేగవంతంగా జారీ చేయాలని తద్వారా హెల్త్‌ ఇన్యూరెన్స్‌, బస్‌ పాసు,రైల్వే పాసులకు దోహదం చేస్తుందన్నారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం వినతిపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఫీజు రాయితీ ఉత్తర్వులు మంజూరుకానున్నట్లు శ్రీనుబాబు చెప్పారు.

Visakhapatnam

2021-10-30 05:45:15

పొందూరులో మిని ఖాదీ క్లస్టర్లకు ప్రతిపాదన..

శ్రీకాకుళం జిల్లా పొందూరులో మినీ ఖాదీ క్లస్టర్ ప్రతిపాదనలు సిద్ధమైంది. ప్రాథమికంగా మూడు మినీ ఖాదీ క్లస్టర్ లను ఏర్పాటు చేయుటకు చేనేత జౌళి శాఖ ప్రతిపాదనలు తయారు చేశారు. అందులో 2 పొందూరులో, ఒకటి తోలాపిలో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించారు. ఒక్కో మినీ క్లస్టర్ కు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం సహాయం అందిస్తుంది. లబ్ధిదారులు పది శాతం మాత్రమే వాటాగా పెట్టాల్సి ఉంటుంది. మినీ క్లస్టర్ ప్రాజెక్టు వలన చేనేత కార్మికులకు చేనేత(వీవింగ్), డయింగ్ /డిజైనింగ్, ఐటి/మేనేజీరియల్ రంగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ లభిస్తుంది. శిక్షణా కాలంలో రోజుకు 300 రూపాయలు స్టైపెండ్ కూడా అందించడం జరుగుతుంది. "సమర్థ" పథకం క్రింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మగ్గాలు, ఆధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాల వివరాలు, తదితర సమాచారం తెలుస్తుంది.  ఆధునిక డిజైన్లను ఆవిష్కరించేందుకు డిజైన్ డెవలప్మెంట్ అధికారిని నియామకం జరుగుతుంది.  వీటన్నిటితో వేతనాలు పెరుగుదల వచ్చి ఆర్థికంగా, సామాజికంగా చేనేతకారులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ లలో పాల్గొనే అవకాశాలు పెరుగుతుంది. సమగ్రమైన అభివృద్ధికి సహకారం అందుతుంది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సొంత స్థలం కలిగి ఉన్న చేనేతకారులు వ్యక్తిగత వర్క్ షెడ్ ను నిర్మించుటకు రూ.1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 25 శాతం లబ్ధిదారు భరించాలి. 1000 చదరపు మీటర్ల లో ఉమ్మడి వర్క్ షెడ్ నిర్మాణానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది.ఇందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 10 శాతం లబ్దిదారులు భరించాలి. ఆమదాలవలస నియోజకవర్గంలో 5, 6 మినీ క్లస్టర్ లు ఏర్పాటు చేయుటకు అవకాశం ఉంది. ఇందులో మొదటగా మూడు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత మినీ క్లస్టర్ లపై శుక్రవారం పొందూరులో అవగాహన కార్యక్రమం జరిగింది.

 రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రమించే నిత్య కార్మికుడు చేనేతకారుడు అని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా చేనేత వస్త్రాలు నిలిచిందని స్పీకర్ అన్నారు. ఆధునిక ఫ్యాషన్ మోజులోపడి చేనేత వస్త్రాలను విడిచిపెట్టామని, అదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోనే పోటీదారుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ వ్యూహాలు పరిగణలోకి తీసుకావాలని, సహకారాన్ని అందించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాన్ని అందిపుచ్చుకోవాలని స్పీకర్ కోరారు. నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలను చేనేతకారులు అందిస్తుందని ఆయన అన్నారు. పొందూరు పరిధిలో 290 మగ్గాలు ఉన్నాయని దాంతోపాటు దేవరవలస, అక్కులపేట, ఉప్పెన వలస, లావేరు తదితర ప్రాంతాలు చేనేత కార్మికులకు ప్రసిద్ధి చెందినవని అన్నారు. మినీ క్లస్టర్ స్థాయి నుండి మెగా క్లస్టర్ స్థాయికి ప్రయత్నం చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేతకారులలో పేదరికం పోవాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

 జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం వస్త్రాలు బ్రాండ్ ఇమేజ్ గా మారాలని అందుకు అందరూ సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంద కోట్ల వరకు ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు జిల్లాలో అవకాశముందని అందుకు అన్ని చేనేత సంఘాలు సమైక్యంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఆరు వేల మంది చేనేతకారులు ఉన్నప్పటికీ మినీ పరిశ్రమ స్థాయిలో ఏర్పాటు చేయుటకు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు.  ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించుటకు సిద్ధంగా ఉందని గుర్తించాలని చెప్పారు.

చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు (రాజమండ్రి) బి .ధనుంజయ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి చేయూతను అందిస్తున్నాయన్నారు. ముద్రా రుణాలు, పొదుపు నిధి తదితర అంశాలను ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఖాదీ వస్త్రాలతో స్పీకర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు షేక్ అబ్దుల్ రషీద్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పిటిసి లోలుగు కాంతారావు, చేనేతకారులు పైడిలింగం, రమణ మూర్తి, నాగరాజు, స్థానిక సర్పంచ్ లక్ష్మి , జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-29 12:06:34

పత్రికల్లో వార్తలొస్తేనే స్పందిస్తారా..

పత్రికలలో వార్తలు వస్తేనే సమస్యలపై స్పందిస్తారా అంటూ సిబ్బంది తీరుపై నగర మేయర్ మహమ్మద్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు.నగరంలోని 18 వ డివిజన్ పరిధిలోని గుల్జార్ పేట్ లో అమ్మవారిశ్యాల వీధిలో దెబ్బతిన్న డ్రైనేజీలు, స్కావెంజర్  లైన్లను గురువారం మేయర్  పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం,దెబ్బతిన్న డ్రైన్ లపై పత్రికలలో  వస్తే తప్ప సంబంధిత సచివాలయాల కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సచివాలయంలో పరిధిలో తిరిగితే సమస్యలు తెలుస్తాయని,కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని మేయర్ ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చారని మీరు పనిచేయకుంటే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారన్నారు.వెంటనే గుల్జార్ పేటలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని మేయర్  ఆదేశించారు. అనంతరం అదిముర్తి నగర్ లోని 25వ సచివాలయంను మేయర్ వసీం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిమ్ ను పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.ఆయా  కార్యక్రమాలలో   కార్పొరేటర్లు ముంతాజ్ బేగం,కమల్ భూషణ్,లీలావతి, ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,కార్యదర్శి  సంఘం శ్రీనివాసులు, డిఈ సుధారాణి ,ఏ ఈ  నాగజ్యోతి , నాయకులు దాదు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-28 09:38:33

ఓటిఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి..

స‌చివాల‌య ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందించే దిశగా గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం న‌వ‌ర‌త్నాలు ద్వారా అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ అందించేలా సిబ్బంది కృషిచేయాల‌న్నారు. కోవిడ్ నుంచి ప్ర‌జ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు టీకాయే మార్గమ‌ని, అందువ‌ల్ల ప్ర‌తిఒక్క‌రూ కోవిడ్ టీకా తీసుకొనేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. న‌గ‌రంలోని ఉల్లివీధి-2 వార్డు స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితిపై ఆరా తీశారు. స‌చివాల‌యం ప‌రిధిలో ఇంకా అర్హులైన వారిలో ఎంత‌మంది వ్యాక్సిన్ వేయించుకోలేద‌ని తెలుసుకొని వారంద‌రినీ త‌క్ష‌ణం వ్యాక్సినేష‌న్ చేయాల‌ని ఆదేశించారు. స‌చివాల‌య రికార్డుల‌ను ప‌రిశీలించి ఇ-సేవ విన‌తుల ప‌రిష్కారంపై తెలుసుకున్నారు. గృహాల ల‌బ్దిదారుల‌కు నామ‌మాత్ర‌పు ధ‌ర‌తో హ‌క్కులు క‌ల్పించే ఓ.టి.ఎస్‌.ప‌థ‌కంపై స‌చివాల‌య ప‌రిధిలో చేసిన ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల్లో దీనిపై విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సూచించారు. సిబ్బంది స‌కాలంలో విధుల‌కు హాజ‌రై చిత్త‌శుద్దితో సేవ‌లందించాల‌ని హిత‌వుపలికారు.

Vizianagaram

2021-10-27 13:53:56

దాతల సహకారంతోనే ఆలయాల అభివృద్ధి..

దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యపడుతుందని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. బుధవారం సింహద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన అనంతరం హుండీ లెక్కింపులో పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తాను అధికారులు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని వివరించామన్నారు. సింహగిరిపైన, కొండ దిగువున భక్తులకు ఉచిత సాత్రాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మంచినీరు, మరుగుదోడ్లు వంటి కనీస సౌకర్యాలు మరిన్ని కల్పించాలని కోరామన్నారు. కొండ దిగువన వరహ పుష్కరిణి అభివృద్ధి చేయాలని, అక్కడ ఉన్న స్మశానానికి వెళ్లే రహదారులను మెరుగుపర్చాలని ఈవో ఎంవీ సూర్యకళను కోరినట్టు కోరారు. సింహగిరిపైన ఆలయ వర్గాలు నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు భక్తులు ప్రశంసలు పొందుతున్నాయన్నారు. సంతానలక్ష్మీ యంత్రంగల కప్పస్తంభంకు భక్తుల నుంచి తాకిడి పెరిగిందన్నారు. ఎవ్వరితే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని సంతానాన్ని కోరుకుంటారో వారి కోర్కికులు నేరవేరుతాయన్నారు.ప్రతి ఒక్కరూ దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Simhachalam

2021-10-27 13:18:41

ఆక్వాకల్చర్ పరిశ్రమల అభివ్రుద్ధికి ప్రోత్సహకాలు.. ఫిషరీష్ డిడి నిర్మలకుమారి

విజయనగరం జిల్లాలో ఆక్వాకల్చర్ పరిశ్రమలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో ఆక్వా కల్చర్ సాగు, పరిశ్రమలు, అభివ్రుద్ధి తదితర అంశాలపై హేచరీ యజమానులు, మత్స్యకార రైతులు, సీడ్ డీలర్లతో జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆక్వా రంగ అభివృద్ధికి చాల కృషి చేస్తుందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ ఆదేశానుసారం  జిల్లా వ్యాప్తంగా ఆక్వారంగ పరిశ్రమలను అభివ్రుద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చేప, రొయ్యల మేత సరఫరా, APSADA చట్టం ద్వారా ఆక్వా కల్చర్ సాగు, ఇతర సంభందిత కార్యకలాపాలకు అనుమతులు ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. పీనియస్ మొనోడాన్ రొయ్య పిల్ల ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ, వివిధ సైజుల గల రొయ్యలకు తగినట్లు ధరల నిర్ణయం, నియంత్రణ  వంటి అంశాల్లో కూడా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆక్వా సాగు చేస్తున్న ప్రతీ ఎకరాను ఇ-క్రాప్ లో నమోదు చేసి ప్రభుత్వ ద్వారా వచ్చే సదుపాయాలకు మార్గం సుగమం చేస్తున్నట్టుఆమె వివరించారు. ప్రతి సచివాలయానికి ఒక మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి వినియోగదారుల వద్దకే నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను చేరవేసి తద్వారా చేప, రొయ్యల తలసరి వినియోగం పెంపుదలకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది, గ్రామ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-23 12:37:40

కార్మికుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత..

కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. శనివారం  60 సంవత్సరాల పైబడి వున్న కార్మికుల స్థానంలో వారి పిల్లలకి అవకాశాలు కల్పిస్తూ మేయర్ ఛాంబర్ లో మేయర్ వసీం చేతుల మీదుగా ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగర పాలక సంస్థ లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వయోభారం వల్ల ఇబ్బందులు పడుకూడదన్న ఉద్దేశ్యం తో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.అకింతబావంతో పనిచేయాలని సూచించారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు  పరిష్కరించే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తోందన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు  అనిల్ కుమార్ రెడ్డి ,కమల్ భూషణ్, బాబా ఫక్రుద్దీన్, మునిశేఖర్, చంద్రమోహన్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రలేఖ ,కార్యదర్శి సంఘం శ్రీనివాసులు,నాయకులు దాదు, రాధాకృష్ణ, కుల్లాయి స్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-23 10:48:17