1 ENS Live Breaking News

27 నుంచి జెడ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాప‌రిష‌త్ స్థాయీ సంఘ స‌మావేశాలు అక్టోబ‌రు 27 నుంచి 29 వ‌ర‌కు మూడు రోజుల‌పాటు జిల్లాప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌ర‌గ‌నున్నాయ‌ని ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి టి.వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. మొద‌టి, రెండో స్థాయీ సంఘ స‌మావేశాలు 27న ఉద‌యం 10.30 గం.ల‌కు, 12.30 గం.ల‌కు జెడ్పీ ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న వారి ఛాంబ‌రులో జ‌రుగుతాయ‌న్నారు. 28న ఉద‌యం 10.30 గం.ల‌కు 4వ‌, 12.30 గంట‌ల‌కు 7వ స్థాయీ సంఘ స‌మావేశాలు జెడ్పీ ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న ఆయ‌న ఛాంబ‌రులోనే జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. 29న ఉద‌యం 11 గం.ల‌కు 3వ స్థాయీ సంఘ స‌మావేశం, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు 5వ స్థాయీ సంఘ స‌మావేశం, 4 గంట‌ల‌కు 6వ స్థాయీ సంఘ స‌మావేశం జెడ్పీ మినీ మీటింగ్ హాలులో జ‌రుగుతాయ‌న్నారు. ఆయా స్థాయీ సంఘ స‌భ్యులు, అధికారులు షెడ్యూలు ప్ర‌కారం హాజ‌రు కావాల‌ని కోరారు.

Vizianagaram

2021-10-20 13:26:14

అందుకే ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఆదర్శం..

రథసారధి బాగుంటే రధం సాఫీగా ప్రయాణం చక్కాగా సాగుతుంది.. అదే జిల్లా రథసారధి మనసు పెట్టి పనిచేస్తే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయి..ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరతాయి..అలా జరగాలంటే ఐఏఎస్ లు జిల్లా కార్యాలయాలు వీడి క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. అపుడే ప్రజలు పడే బాధలు తెలుస్తాయి.. అలా ప్రజల బాధలు తెలుసుకోవడానికి విజయనగం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పల్లెబాట పట్టారు. ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్పా మిగిలిన రోజులన్నీ రోజుకో గ్రామం చొప్పున జిల్లా మొత్తం చుట్టేస్తూ..ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారు.. తమ పర్యటనలో చూసిన, తెలుసుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ఎందరో అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. అంతేకాదు విధినిర్వహణలో మండల, డివిజన్ స్థాయి అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏకరవు పెడుతున్నారు. ఒక జిల్లా కలెక్టర్ రోజుకో గ్రామాన్ని తిరగడం చూస్తున్న విజయనగరం జిల్లా అధికారులకు కంటిమీద కునుకు ఉంటం లేదు. సమస్యలు పరిష్కారం అయిపోతాయని కాదు..ఎక్కడ తమ లొసులుగులు, నిర్లక్ష్యం బయటపడుతుందోనని.. ఈ క్రమంలోనే బుధవారం జిల్లా క‌లెక్ట‌ర్  వేపాడ మండ‌లంలో తన పర్యటన చేపట్టారు.. జాకేరులో గ్రామ స‌చివాల‌యం, రైతుభ‌రోసా కేంద్రాల‌ను త‌నిఖీ చేశారు. వాటి ప‌నితీరు, ప్ర‌జ‌ల‌కు ఆయా కార్యాల‌యాల ద్వారా అందుతున్న సేవ‌లు త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. ముందుగా గ్రామ స‌చివాల‌యం త‌నిఖీ చేసి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందుతున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. స‌చివాల‌యానికి వ‌చ్చిన విన‌తులు ఏ మేర‌కు ప‌రిష్కారం అవుతున్న‌దీ తెలుసుకున్నారు. స‌చివాల‌య సిబ్బంది స‌కాలంలో విధుల‌కు హాజ‌రువుతున్న‌దీ లేనిదీ ప‌రిశీలించారు. స‌చివాల‌యంలోని ప‌లు రిజిష్ట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. గ్రామ స‌చివాల‌య సిబ్బంది సిటిజెన్ ఔట్ రీచ్ కార్య‌క్ర‌మంపై అధికంగా దృష్టి సారించి ఆయా ప‌థ‌కాలు ఏవిధంగా అర్హుల‌కు అందుతున్న‌దీ తెలుసుకోవాల‌న్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి వుంటే వారికి ప‌థ‌కాలు అందించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ పై కూడా క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. గ్రామంలో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్న‌దీ ఆరోగ్య స‌హాయ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ లక్ష్యంగా ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం రైతుభరోసా కేంద్రాన్ని ప‌రిశీలించారు. గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుడితో మాట్లాడి ఇ-పంట న‌మోదు, ఇటీవ‌ల వ‌ర్షాల‌కు పంట‌న‌ష్టం వివ‌రాల న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. గ్రామంలో ఏయే పంట‌లు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స‌ర్పంచ్‌, ఎంపిటిసి త‌దిత‌రులు కూడా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు.

Vepada

2021-10-20 13:24:28

ప్లంబింగ్ లో ఉచిత శిక్షణకు ధరఖాస్తులు ఆహ్వానం..

నిర్మాణ రంగం లో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా, ప్లంబర్ లకు రెండురోజుల ఉచిత శిక్షణ కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సహాయ సంచాలకులు ఎస్ వి ఎస్ రవి కుమార్ తెలిపారు.  ఈనెల 26,27 తేదీలలో  విశాఖపట్నం  జిల్లాపరిషత్ వద్ద గల "నేక్"  కేంద్రం లో శిక్షణ ఇస్తామని చెప్పారు. 18 సం..లు నిండి, ప్లంబింగ్ పనిలో  అనుభవం కలిగి ఉండాలని శిక్షణకు ఎటువంటి రుసుము లేదని శిక్షణ రెండు రోజులు ఉచిత భోజనం, స్టేషనరీ సరఫరాతో శిక్షణానంతరం కిర్లోస్కర్ కంపెనీ వారిచే (కే.బీ.ఎల్) సర్టిఫికేట్, కేంద్ర ప్రభుత్వం చే వేరొక సర్టిఫికేట్ అందజేయ బడుతుందని ఆయన వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్ కార్డ్ జిరాక్స్, 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో 22వతేదీ లోగా 8500502395 లేదా 9866883199  ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Visakhapatnam

2021-10-20 11:55:17

చిరు వ్యాపారులకు వడ్డీ నుంచి విముక్తి ..

చిరు వ్యాపారులకు , సంప్రదాయ  వృత్తుల వారికి జగనన్న  తోడు ఎంతో బాసటగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న తోడు నగదు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలోకి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పనలో ఈ కార్యక్రమంతో ప్రభుత్వం తరఫున చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా ఆసరాగా ఉంటుందని చెప్పారు. తోపుడు బళ్ళు, బడ్డీలపై టిఫిన్ వ్యాపారం, కూరగాయలు వ్యాపారం, వీధుల్లో తిరుగుతూ అమ్ముకొనే వారికి బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేందుకు సహాయ సహకారాలు ఉండవని, పూచీ లేనందు వలన బ్యాంకులు రుణాలు ఇవ్వరని తెలిపారు.  ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తీసుకొని రోజు వారీ వచ్చే లాభాన్ని వడ్డీ వ్యాపారులకు చెల్లించాల్సి వస్తుందన్నారు.  ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని , ఇక పై  డిసెంబర్, జూన్ నెలలో  సంవత్సరానికి రెండు సార్లు ఈ కార్యక్రమం ఉంటుందని, రుణాలు  తీసుకున్న తర్వాత తిరిగి పూర్తి గా చెల్లించిన మీదట రుణం మళ్లీ తీసుకోవచ్చునని చెప్పారు. సకాలంలో అప్పులు చెల్లించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.   తీసున్న రుణంను టైం ప్రకారం చెల్లించాలని, ఒకవేళ కట్టకపోతే డ్యూ ఉంటుందని రుణం పొందుటకు కులం, మతం, పార్టీ లేదని అర్హులందరికి ఈ వర్తిస్తుందని వివరించారు. ఈ పధకం క్రింద జిల్లాలో 22,879 మందికి 79.51 లక్షల రూపాయలు లబ్ది చేకూరింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   రాష్ట్ర పట్టణాభి వృద్ధి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ,  జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా.మహేష్ కుమార్, డి.ఆర్.డి.ఏ పి.డి అశోక్, మెప్మా పి.డి సుధాకర్ రావు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం  జగనన్న తోడు లబ్ధిదారులకు  మెగా  చెక్కును  అందజేశారు.

Vizianagaram

2021-10-20 10:54:01

శ్రీరామ చరిత్రను రసరమ్యంగా అందించిన వాల్మీకి..

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ   పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని  పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు , జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  బి.సి.సంక్షేమ శాఖాధికారి డి.కీర్తి, బి సి కులాల కు చెందిన ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-20 10:51:10

పేదల కోసమే 24గంటలు పనిచేస్తున్న సీఎం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్రారంభించిన జగనన్న తోడు కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31465 మందికి లబ్ది చేకూరేలా బ్యాంకులకు కట్టిన వడ్డీ కోటి తొమ్మిది లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి అన్నారు.  లబ్దిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే.. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికీ కొందరు లబ్ధిదారులు బ్యాంకు వడ్డీలు కట్టనివారు త్వరగా చెల్లించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు వారిలో అవగాహన తీసుకురావాలని మంత్రి అన్నారు. వడ్డీ పూర్తిగా కట్టని వారు డిసెంబర్ లోపు పూర్తిగా చెల్లిస్తే.. డిసెంబర్ లొనే జరిగే మలివిడత జగనన్న తోడు కార్యక్రమంలో ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది వీధి వ్యాపారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం పేదలకు స్వర్ణయుగంగా మారిందని మంత్రి ఈసందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణు గోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, విశ్వేశ్వర రావు, ప్రాజెక్టు అధికారి,  డిఆర్‌డిఎ,  పలువురు అధికారులు,లబ్దిదారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-20 08:50:08

12 మందికి నియామక పత్రాలను అందజేత.

శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల  కుటుంబాలలోని 12 మందికి బుధవారం  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ కారుణ్య నియామక పత్రాలను అందజేసారు. కారుణ్య నియామక కమిటీ నిర్ణయం మేరకు  12 మందికి కారుణ్య నియామకాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లవేళల తోడుగా ఉంటుందని, అందులో భాగంగానే నేడు కారుణ్య నియామక పత్రాలను అందిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, సభాపతి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-20 07:33:04

వాల్మీకి రామాయణం ప్రపంచానికే ఆదర్శం

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్  పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ తో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన తరుణమిది అని పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. ఒకనాడు నారద మహర్షిని కూడా దోచుకోబోగా నారదడు ఈ దోపిడి ద్వారా వచ్చిన పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అని అడిగాడని, దానికి భార్య నిరాకరించడంతో ఆత్మసాక్ష్యాత్కారం పొంది నారదుడిని క్షమాపణ కోరి జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు అని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. నారదుని రామ మంత్ర ఉపదేశంతో వాల్మీకి ఉన్నచోటనే తపస్సమాధిలోకి వెళ్లాడని, వల్మీకం నుండి ఉద్భవించినందున వాల్మీకి అయ్యాడని ఉపముఖ్యమంత్రి వివరించారు. అటువంటి మహర్షుల జీవిత చరిత్రలు మనందరికి నేడు ఆదర్శమని, తాను రచించిన రామాయణం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయమని  ఉపముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  

        శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు రామాయణాన్ని వారి బాషలోకి అనువదించుకొని మరీ చదువుతున్నారని, రామయణంలోని ప్రతి ఘట్టం మనందరకీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తండ్రి మాటకోసం రాజ్యాధికారాన్నే వదలిన తనయుడుగా రాముడు, అన్నకోసం సర్వభోగాలను వదలిన తమ్ముడుగా లక్ష్మణుడు, భర్తతోనే తన జీవితమంటూ అడవులకు సైతం వెళ్లిన సతీమణీగా సీత ఇలా అన్ని పాత్రలు మనకు ఆదర్శంగా ఉంటాయని, అందుకే ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని పవిత్ర గ్రంధంగా పూజిస్తారని గుర్తుచేసారు. అటువంటి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని సభాపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-20 07:26:54

స్వ‌చ్ఛ సంక‌ల్పంలో భాగ‌స్వామ్యం కావాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వామ్యం కావాల‌ని ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. మ‌న ప్రాంతాల‌ను మ‌న‌మే ప‌రిశుభ్రంగా ఉంచుకుందామ‌న్నారు. గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సాధించేందుకు.. ఆయ‌న ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు అంద‌రూ క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం కోట జంక్ష‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ చిత్ర‌ప‌ట్టానికి పూల‌మాల వేసి జోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, అధికారులు, ప్ర‌జ‌ల చేత మంత్రి స్వ‌చ్ఛ సంక‌ల్పం ప్ర‌తిజ్ఞ చేయించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ‌ ప్రాంతాల్లో చెత్త త‌రలించేందుకు జిల్లాకు వ‌చ్చిన వాహ‌నాల‌ను మంత్రి, క‌లెక్ట‌ర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దామన్నారు. ఆరోగ్య వంత‌మైన సమాజం నిర్మించేందుకు జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఎవ‌రికి వారే బాధ్య‌త‌గా ఉంటూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని అవ‌స‌రాల దృష్ట్యా మున్సిపాలిటీల‌కు 62, గ్రామ పంచాయ‌తీల‌కు 62 వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని వెల్ల‌డించారు. వీటి ద్వారా ప్ర‌తి ప‌ట్ట‌ణం, ప‌ల్లె ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, స్వ‌చ్ఛ విజ‌య‌న‌గ‌రం నిర్మాణానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. చివ‌రిగా స్వ‌చ్ఛ సంక‌ల్పం తాలూక పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, స్థానిక ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఎమ్మెల్సీలు సురేశ్ బాబు, ర‌ఘువ‌ర్మ‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, డీపీవో సుభాషిణి, మున్సిప‌ల్ కమిష‌న‌ర్ వ‌ర్మ‌, కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్రతినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-20 06:10:33

స్వచ్ఛ సంకల్పదీక్షలో భాగస్వాములు కండి..

పరిసరాల పారిశుద్యాన్ని నిత్య జీవన శైలిగా మలచుకుని ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ జగనన్న స్వచ్చ సంకల్ప దీక్షలో భాగస్వాములు కావాలని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటరులో జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించ నున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమాన్ని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణగోపాలకృష్ణ, కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగాగీతలతో కలిసి ప్రారంభించారు.  అలాగే క్లాప్ లోగోను ఆవిష్కరించి, స్వచ్చాంద్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్ పవర్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించి, గ్రామపంచాయితీలకు అందజేశారు.  ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టనంలో పరిశుబ్రత వెల్లివిరిసే ఆరోగ్యవంతమైన ఆహ్లాదకర పరిసరాలను తీర్చిదిద్దేందుకు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 2వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని  ప్రారంభించారన్నారు.  ఈ కార్యక్రమం క్రింద   గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో  పటిష్టమైన పారిశుద్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర  ప్రభుత్వం సుమారు 100 కోట్ల నిధులతో  వెయ్యి పారిశుద్య వాహనాలను  కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు అందిస్తోందని,  ఇందులో భాగంగా 155 వాహనాలను తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.  ప్రజా భాగస్వామ్యంతో యాంత్రికంగా ఇంటింటి నుండి సేకరణ, వ్యర్థాల శుద్ది, ప్రతి ఇంటిలో కంపోస్ట్ ఎరువుల తయారు చేసేలా ప్రోత్సాహం స్వచ్ఛ సంకల్పం ప్రధాన అంశాలన్నారు.  వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పారిశుద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, వ్యర్థాల నియంత్రణ, శుద్దితో పాటు వాటిని ఎరువుగా మార్చి ఆదాయ వనరుగా మార్చవచ్చునన్నారు.  ప్రతి కుటుంబం ఇంటి వ్యర్థాలను కేంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవాలని ఆయన సూచించారు.  ప్రతిష్టాత్మమైన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాతలుగా నిలవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. 
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బృహత్ సంకల్పాన్ని చేపట్టారన్నారు.  క్లాప్ కార్యక్రమం క్రింద కేటాయించిన వాహనాలను ఆయా గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాల, సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.   చాలా గ్రామాల్లో గుండా ప్రవహిస్తున్న కాలువ గట్లపై ప్రజలు చెత్తను కుప్పలుగా వేస్తున్నారని, వీటి వల్ల వర్షాకాలం సీపేజి వల్ల మంచినీటి కాలువలు కూడా మురుగు కాల్వలుగా మారుతున్నాయన్నారు.  అలాగే  జనావాసాల్లో పందులు స్వేచ్చగా తిరుగుతూ మురుగు కాల్వలను ద్వంసం చేస్తున్నాయని, వీటి నియంత్రణకు పెంపకందారులను ప్రత్యామ్నాయ ఉపాది చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.  జిల్లాలో లూజ్ సాయిల్ నేలలు కావడంతో తడి, చెమ్మ ఎక్కవ కాలం నిలిచి ఉండి మురుగు సమస్య ఎదురౌతోందని, దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.
    రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ  రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాధించవచ్చునని ఉద్దేశంతోనే  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఒక మహోద్యమంలా సాగాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థల పటిష్ట అమలు చేసినందుకు ఇచ్చిన నిర్మల్ గ్రామీణ్ పురస్కారాల్లో తూర్పు గోదావరి జిల్లా ఎప్పుడూ అగ్ర స్థానాల్లో నిలిచేదని మంత్రి వేణు గోపాల కృష్ణ గుర్తుచేస్తూ, ఆదే స్పూర్తితో  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా రోడ్లపై చెత్త వేసే గ్రామాలను గుర్తించి అక్కడ ప్రజలలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వేణుగోపాల కృష్ణ అధికారులకు సూచించారు.
      కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన స్వచ్ఛ సంకల్పం నూరు శాతం సాఫల్యత ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమన్నారు.  దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే పారిశుధ్యం మెరుగుపరచుకోవడం చాలా అవసరమని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని ఎంపీ తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ద్వారా సుమారుగా 11.20 కోట్ల వ్యయంతో 155 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. వీటిని అమలాపురం డివిజన్ కు -39, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్లకు -49, పెద్దాపురం డివిజన్ కి - 31, కాకినాడ డివిజన్ కి-35, రంపచోడవరం డివిజన్ కు-1 చొప్పున వాహనాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాహనాలు  ఆయా గ్రామాలకు చేరుకుని బుధవారం నుంచి చేత్త సేకరణ నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో జడ్.పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ సభికులచేత జగనన్న స్వచ్చ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. 
       ఈ కార్యక్రమంలో  కాకినాడ, పి.గన్నవరం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా.జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,  కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాదు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆర్. చంద్రకళ దీప్తి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ గ్రామీణం, కరప మండలాల జడ్పీటీసీ సభ్యులు ఎన్.రామకృష్ణ, వై.సుబ్బారావు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-19 07:57:02

సచివాలయాలనుమూడు సార్లు తనిఖీ చేయాలి..

విజయనగరం జిల్లాలో అధికారులు గ్రామ, వార్డు  సచివాలయాల వారానికి మూడు రోజులు తనిఖీ చేయాలని సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాల పర్యటనలో  సిబ్బందిన హాజరును  సంబంధిత  స్పందన , ఈ-సేవ దరఖాస్తులు పెండింగ్ లేకుండా డిస్పోస్  జరిగేల చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో కూడా తనిఖీలు చేయాలన్నారు.  ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రారంభిస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నదీ లేనిది తనిఖీ చేయాలన్నారు. ప్రజలకు ఈ పధకాల పట్ల అవగాహన కలిగించే బాధ్యత సచివాలయ సిబ్బంది  పై ఉందని స్పష్టం చేసారు.  సచివాలయ సిబ్బంది  గ్రామాల్లో పర్యటిస్తున్నదీ  లేనిది కూడా ప్రత్యేకా ధికారులు తనిఖీ చేయాలన్నారు.   ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-18 12:50:35

స్పందన అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి..

అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్పందనకు వచ్చే  దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు.  వివిధ సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలుపై 288 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-18 12:45:17

నరేగా పనుల ప్రతిపాదనలు పంపాలి..

ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టనున్న పనుల కోసం అన్ని శాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలను ఈ నెల 22 లోగా  డుమా పి.డి. కి పంపాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  2022-23 కు సంబంధించిన పనులను  నరేగా నుండి నవంబర్ 15 లోపల గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని  పంపవలసి ఉన్నదని తెలిపారు.  సుమారు 500 కోట్ల రూపాయల పనులు నరేగా ద్వారా జరగడానికి అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని  ప్రభుత్వ శాఖలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో ఉపాధి హామీ పనులు,  సచివాలయాల తనిఖీలు, హాజరు , గృహాల వన్ టైం సెటిల్మెంట్ , సుస్థిర అభివృద్ధి తదితర అంశాల పై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పధకం  క్రింద ఇప్పటికే 11 వేల పనులను ప్రతిపాదించడం జరిగిందని,   అయితే ఇంకను ముఖ్యమైన శాఖల ద్వారా ప్రతిపాదనలు రావలసి ఉందని అన్నారు.   హౌసింగ్,  పంచాయతి రాజ్, డి.పి.ఓ, మత్స్య శాఖ, ఆర్.డబ్ల్యు.ఎస్., విద్య శాఖ, పశు సంవర్ధక, అటవీ  తదితర శాఖల నుండి ప్రతిపాదనలు రావాలన్నారు. చెక్ డాం లు ,  స్మశానాల నిర్మాణాలు,  కాంపౌండ్ వాల్స్,  రహదారులు,  ఇంకుడు గుంతలు, నర్సరీలు వ్యవసాయ బావులు, పశువుల షెడ్లు, పశు గ్రాసం అభివృద్ధి తదితర అంశాలను ప్రతిపాదనలో చేర్చవలసి ఉందన్నారు.  ఇంకను ఏవైనా  ప్రజా అవసరాలకు ఉపయోగ పడే పనులున్నా  ప్రతిపాదిన్చాలన్నారు.  గతం లో ఇండ్ల కోసం రుణాలు తీసుకొని చెల్లించలేని లబ్ది దారుల నుండి వన్ టైం సెటిల్ మెంట్ క్రింద చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని,  జిల్లాలో 3.4 లక్షల మంది  లబ్ది దారులు ఉన్నారని, వారందరిని క్షేత్ర స్థాయి లో తనిఖీ లు చేసి జాబితాను సిద్ధం చేయాలనీ ఆదేశించారు.  ఇందుకోసం నియోజక వర్గాల ప్రత్యేకా ధికారులు, మండల ప్రత్యేకాధి కారులు , సచివాలయాల సిబ్బంది  బాధ్యత తీసుకొని వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.   నీతీ అయోగ్ సుస్థిర అభివృద్ధి  సూచీలు  కొన్ని రంగాల్లో వెనకబడి  ఉన్నాయని, అధికారులంతా  ఈ సూచీ ల పై దృష్టి పెట్టాలని  అన్నారు.  విద్యా ప్రమాణాలు,  జెండర్ సమానత, రైట్ టు ఎంప్లొయ్మెంట్, స్కూల్ డ్రాప్ ఔట్స్ ,  టాయిలెట్ల వినియోగం, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాల్లో వెనకబడి ఉన్నామని, ఈ రంగాల్లో ఆయా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.  కోవిడ్ వలన కొన్ని రంగాల్లో వెనకాబడి  ఉండవచ్చని, అండర్ రిపోర్టింగ్ కూడా కొంత కారణం కావచ్చని, వీటిని నోడల్ అధికారి పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-18 12:42:37

గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి కృషి చేయాలి..

గోశాల నిర్వ‌హ‌ణ, గో సంర‌క్ష‌ణ, గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నెల 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి ఆయా విభాగాల అధికారులు కృషి చేయాల‌ని టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం కోరారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ గోస‌మ్మేళ‌నాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు క‌మిటీలు ఏర్పాటు చేశామ‌ని, అధికారులు ఇప్పటినుంచే ముంద‌స్తు ఏర్పాట్ల‌కు సిద్ధం కావాల‌ని సూచించారు. ఇందులో తిరుమ‌ల రిసెప్ష‌న్‌, తిరుప‌తి రిసెప్ష‌న్‌, అకామిడేష‌న్‌, రిజిస్ట్రేష‌న్‌, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ప్ర‌చారం, ఫుడ్ అండ్ హాస్పిటాలిటి, ర‌వాణా, ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్‌, స్టేజ్ డెకరేష‌న్‌, ఎగ్జిబిష‌న్‌, ద‌ర్శ‌నం, స‌న్మాన క‌మిటీలు ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. మొద‌టి రోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు విచ్చేస్తార‌ని, వీరంద‌రికీ తిరుచానూరు ప‌ద్మావ‌తి నిల‌యం, తిరుప‌తిలోని 2, 3 స‌త్రాలు, ఎస్వీ విశ్రాంతిగృహం త‌దిత‌ర ప్రాంతాల్లో బ‌స ఏర్పాటు చేయాల‌న్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని అన్న‌దానం డెప్యూటీ ఈవోలు ఆహారం శుచిగా, రుచిగా అందించాల‌ని ఆదేశించారు. స్వామీజీలను ఆహ్వానించే విష‌యంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. రెండు రోజుల కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ఆధ్వ‌ర్యంలో రికార్డు చేయాల‌ని, స‌మాచారాన్ని క్రోడీక‌రించి సావ‌నీర్ రూపొందించేందుకు చీఫ్ ఎడిట‌ర్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని కోరారు. స్టేజి వ‌ద్ద సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు.    ఈ స‌మావేశంలో యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి  విజ‌య‌సార‌థి, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి త‌దితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-18 12:39:59

ఆరోగ్యకర సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి..

ప్రజలందరికీ జీవన విధానంపై అవగాహన కలిగివుండాలని, మంచి ఆహారం, మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు.    సోమవారం ఐఎంఎ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నేచర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బాలల హక్కుల అవగాహనా కార్యక్రామానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా వుంటే సమాజం ఆరోగ్యంగా వుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, హైమావతి, బాలరాజు, ఐసిడిఎస్. పిడి. రాజేశ్వరి తదితరులు పాల్గోన్నారు.

Vizianagaram

2021-10-18 12:37:29