1 ENS Live Breaking News

కోవిడ్ డ్రైవ్ లో 1,00,522 మందికి వేక్సిన్లు పంపిణీ..

చిత్తూరు జిల్లాలో సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 1,20,000 డోసులు వేయుటకు లక్ష్యానికి గాను సాయంత్రం 6.30 గంటలకు 1,00,522 డోసులు వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకనూ కొనసాగుతోందని ఈ ప్రత్యేక డ్రైవ్ లో జిల్లాకు ఒక లక్ష డోసుల కోవిడ్ షీల్డ్, 20 వేల డోసుల కో వ్యాక్సిన్ మందులు సరఫరా అయిందని ఇందులో కో వ్యాక్సిన్ రెండవ డోస్ వారికి మాత్రమే వేయవలసిందిగా అలాగే కోవీ షీల్డ్ రెండవ డోస్ తో పాటు మొదటి డోస్ 18 - 44 వయసు గల వారికి కూడా వేయించాలని ఆదేశించామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను జాయింట్ కలెక్టర్లు హౌసింగ్ మరియు ఆసరా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 35,24,106 డోసుల వ్యాక్సినేషన్ వేయించగా ఇందులో 23,14,552 మొదటి డోస్ లు కాగా 12,09,554 రెండవ డోసులు వ్యాక్సినేషన్ చేశామన్నారు.  ఇందులకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ లు, స్పెషల్ ఆఫీసర్లు, మండల, మునిసిపల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లు, మెడికల్ అధికారులు, తదితర సిబ్బందికి,  జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Chittoor

2021-09-20 14:13:20

జంతువుల పట్ల ప్రతీఒక్కరూ కారుణ్యత చూపించాలి..

జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ కారుణ్యత చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జంతు సంక్షేమ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల సంరక్షణకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పని చేయాలన్నారు. జంతువుల ఆరోగ్యం పట్ల పశుసంవర్ధక శాఖ దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. జంతువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఆయన స్పష్టం చేశారు. జంతువుల రవాణా సమయంలో సౌకర్యాలు లేకుండానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం జరుగుతున్నట్లు ఆరోపణల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రవాణా సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన వసతులతో రవాణా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చెక్ పోస్ట్ లు, ఇతర ప్రాంతాల్లో రవాణా అంశాల పట్ల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.  సోంపేట మండలం రామచంద్రపురం వద్ద మంజూరు చేసిన గోశాలకు అవసరమైన వసతులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. వీధి కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకట్రావును ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం.మురళి మాట్లాడుతూ రామచంద్రాపురం వద్ద గోశాలకు నాలుగు ఎకరాల భూమిని కేటాయించిందని, 21 లక్షల రూపాయలతో షెడ్ల నిర్మాణానికి మంజూరు జరిగిందన్నారు. అయితే కొంత పని మాత్రమే జరిగిందని మిగిలిన పని  కొనసాగించాల్సి ఉందని అన్నారు. సంతలలో పశు వైద్యులు పర్యటించి పశువుల ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తున్నారని చెప్పారు. సంతలలో పశు సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కమిటీ సభ్యులు గ్రీన్ మెర్సీ సంస్థ సీఈఓ కే. రమణ మూర్తి మాట్లాడుతూ జిల్లాను రేబిస్ వ్యాధి రహిత జిల్లాగా చేయుటకు చర్యలు చేపట్టాలని, అందుకు కొన్ని సంస్థలు సహకరించగలవని చెప్పారు. జంతు బలి నిషేధ చట్టం, వన్య ప్రాణి సంరక్షణ చట్టం తదితర వాటిని పక్కాగా అమలు చేయాలని ఆయన కోరారు. బారువ గోశాల నిర్వాహకులు రమణ మూర్తి మాట్లాడుతూ జంతు సంరక్షణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని వాటిని పాటించాలన్నారు. కొన్ని జంతువులు రవాణా సమయం లోనే చనిపోవడం లేదా గాయాల పాలు కావడం జరుగుతుందని వాటిని నివారించుటకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర గోరక్షణ సమాఖ్య అధ్యక్షులు జి. రామకృష్ణ మాట్లాడుతూ జంతు సంరక్షణ కమిటీలను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. జంతు సంరక్షణ పట్ల పాఠశాల స్థాయి నుండే చైతన్య కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో బి లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి. శ్రీనివాసరావు, రవాణా, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-20 14:04:46

నాడు-నేడు లక్ష్యాలను సత్వరమే అధిగమించాలి..

విశాఖజిల్లాలో నాడు –నేడు పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల అధికారులతో నాడు –నేడు  పనుల పురోగతి పై సమీక్షించారు. పి.హెచ్.సి.ల మరమ్మత్తులను త్వరితగతిన చేపట్టాలన్నారు.  వై .ఎస్.ఆర్.అర్బన్ మరియు రూరల్ క్లినిక్ పనులను వేగవంతం చేయాలన్నారు.  పాడేరు మరియు అనకాపల్లి మెడికల్ కాలేజిల నిర్మాణ పనుల  వివరాలను  అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలలో ఇంకా మిగిలి ఉన్న  నాడు – నేడు పనులను పూర్తి చేయాలన్నారు.  గ్రామ సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.  ఎన్.ఆర్.జి.ఎస్ పనులకు సంబందించి లేబర్ బడ్జెట్, 100 శాతం పనిదినాలను  పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనుల తీరును  సెంట్రల్ గవర్నమెంట్ టీమ్  పరిశీలన నిమిత్తం రానున్న నేపధ్యంలో డ్వామా సిబ్బంది, ఎం .పి.డి.ఓిలు సంబంధిత రికార్డులను సిద్దం చేసుకొని ఉండాలన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనుల్లో భాగంగా ప్లాంటేషన్, ఉద్యానపంటలు  అధికమొత్తంలో వేసి పరిరక్షణ భాద్యత చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డ్వామా పి.డి సంధీప్, డి ఇ ఓ లింగేశ్వర రెడ్డి, పంచాయితీరాజ్ఇంజనీరింగు అధికారులు, తదితరులు హాజరయ్యారు. 

Visakhapatnam

2021-09-20 13:34:03

విభిన్నప్రతిభావంతుల విద్యార్ధినులకు ఉచిత వసతి..

శ్రీకాకుళం  జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి, ఆపై తరగతుల వరకు విద్యనభ్యసిస్తున్న విభిన్నప్రతిభావంతుల బాలికలకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించనున్నట్లు విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో చలన సంబంధ, బదిర మరియు అంధ బాలికల కొరకు వసతి గృహాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు. 2021 –22 విద్యా సం.నకు గాను సదరు వసతి గృహము నందు ప్రవేశాలకై  విద్యార్ధినుల తల్లితండ్రులు, స్వచ్ఛంధ సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ వసతి గృహంలో 1వ తరగతి నుండి 10వ తరగతి మరియు ఆపై చదువుతున్న విద్యార్ధులకు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న మరియు ఉపాధిశిక్షణ పొందుతున్న విభిన్నప్రతిభావంతులైన బాలికలకు శిక్షణ కాలంలో వసతి గృహం నందు ఉచిత వసతి కల్పించబడుతుందని అన్నారు. వసతి పొందుతున్న విద్యార్ధినులకు ఉచితంగా పాఠ్యపుస్తకములు, నోట్ బుక్స్, ఏడాదికి నాలుగు జతల యూనిఫారాలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు మొదలైన సదుపాయాలు కల్పించబడునని ఆయన వివరించారు. ఆసక్తి గల విద్యార్ధినుల తల్లితండ్రులు విద్యార్ధి పేరు, చదువు, తల్లితండ్రుల చిరునామా, ఫోన్ నెంబర్, 40శాతం పైబడి వికలాంగత్వ వైద్య ధృవపత్రం, ఆధార్ మరియు రేషన్ కార్డు ప్రతులతో పూర్తిచేసిన దరఖాస్తును సహాయ సంచాలకుల వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ , డి.ఆర్.డి.ఏ కాంప్లెక్స్, శ్రీకాకుళం వారికి నేరుగా గాని, పోస్టు ద్వారా లేదా addwsklm@gmail.com ఈ – మెయిల్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఇతర వివరాల కొరకు 08942 – 240519  లేదా 94945 93926 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Srikakulam

2021-09-20 13:18:33

త్వరలోనే ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు..

ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ,  ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే  మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.   సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత విజయవాడ, పామర్రు , మచిలీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన  పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో అకాల మత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా  కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు  తెలిపారు. కృష్ణాజిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తిప్పే పరిస్థితి లేదని వివరించారు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో జగనన్న ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందన్నారు. సర్వీస్‌ రూల్స్‌ పై తుది నిర్ణయానికి పలువురు ఐఏఎస్‌ అధికారులు ఏకాభిప్రాయానికి గత వారమే వచ్చారన్నారు. ఆర్టీసీ ఎండి, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో తనకు తదుపరి సమావేశం ఉందన్నారు. అనంతరం ఆర్టీసీ త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని మంత్రి ఇచ్చిన హామీపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
                                  స్థానిక నిజాంపేటకు చెందిన మహంకాళి వీర మల్లమ్మ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాను చీటీపాటల నిర్వహకురాలినని 20 మందితో లక్ష రూపాయల చీటీ నడుపుతూ   ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఆయా చీటీపాటలను గత కొన్ని ఏళ్లుగా సమర్ధవంతంగా  నిర్వహిస్తున్నానని, అయితే ఇటీవల కుంచం ఏసు అనే వ్యక్తి 2019  లో  ఆరు చీటీలు కట్టకుండా ఆపేడని, అలాగే 2021 లో మరో మూడు చీటీలతో కలిపి మొత్తం 9 కట్టకుండా ఆపేడని తెలిపింది. అదేమని తాను ప్రశ్నిస్త, ఇక కట్టను పొమ్మని నీకు నాకు ఎటువంటి బాకీ లేదని 40 వేల రూపాయలు ఎగవేసే దురుద్దేశంతో మాట్లాడుతున్నాడని , తమ పెద్ద్దలు ఆ వ్యక్తిని పిలిస్తే, తాను 10 వేల రూపాయలకు మించి చెల్లించనని దబాయిస్తున్నాడని మీరే నాకు న్యాయం చేయాలని వీర మల్లమ్మ మంత్రి పేర్ని నానిను అభ్యర్ధించింది. 
    స్థానిక చిన కరగ్రహారం పల్లెపాలెంలో మోకా బాలచంద్రరావు పంచాయితీలో తీర్మానం లేకుండా అనధికర తాగునీళ్ల కుళాయి ఏర్పాటుచేసుకుని తన దొడ్లోకి పైప్ లైన్ పశువుల కొట్టేం వరకు  పొదిగించుకుని తాగునీటిని వృధా చేస్తున్నాడని , ఇటీవల సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు సైతం  దొరికిపోయాడని కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  స్థానిక  విశ్వబ్రాహ్మణ కాలనీలో అద్దెకుండే మిరియాల కళ్యాణి అనే ఒక మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని  చెప్పింది. తాను ఒక బిర్యాని పాయింట్ సెంటర్లో  పని చేసే కార్మికురాలినని కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేస్తున్న పని కాస్త పోయిందని, తాను అద్దెకి నివసించే ఇంటి యజమాని అద్దె బకాయి చెల్లించామని తీవ్ర వత్తిడి తీస్తున్నాడని ఇంతటి గడ్డు పరిస్థితులలో 20 వేల రూపాయలు చెల్లించలేనని, నెమ్మదిగా చెల్లిస్తానని ఇంటి యజమానికి మీరు ఒక మాట సహాయం చేయాలని తనకు ఎక్కడైనా హోటల్ లో పని ఇప్పించాలని  ఆ మహిళ మంత్రిని కోరింది. 

Machilipatnam

2021-09-20 12:49:37

ఓటరు సవరణ విజయవంతంగా పూర్తిచేయాలి..

ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022 ను సజావుగా నిర్వహించాలని ఈ నెల 30 లోపల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్  అన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022 ను జిల్లాలో సజావుగా నిర్వహించాలని ఈ కార్యక్రమం నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్న దని అయితే అక్టోబర్ 31 లోపల ఫ్రీ రివ్యూ పూర్తి చేయాలని, ఇందుకు సంబందించి డబుల్ ఎంట్రీస్, మరణించిన వారు వివరాల కోసం బూట్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించి ఫారం లో వారి వివరాలను పూర్తిగా నింపి గరుడా యాప్ లో నింపాలని అన్నారు.  ఎస్.ఎస్.ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) 2022  ప్రిపరేషన్ యాక్టివిటీస్, రేషనలైజేషన్ యాక్టివిటీ, గరుడ మొబైల్ యాప్, ఓటర్స్ హెల్ప్లైన్ మొబైల్ యాప్, ఈఆర్ఓఎన్ఈటి ఫార్మ్స్ పురోగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఆర్.ఓ లు, ఈ.ఆర్.ఓ లు, ఇతర సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పగడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమం పగడ్బందీగా జరగాలని, ఏదైనా గ్రామంలో పోలింగ్ నిర్వహించే భవనాలు, పాతవి అయిన, ఇరుకు అయిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కారణాలను చూపి పోలింగ్ కేంద్రాలను మార్చుకోవచ్చునని అన్నారు. ఈ నెల 31 లోపల ఈ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పూర్తి చేసి, రాజకీయ పార్టీల వారికి సమాచారం అందించిన తరువాత జిల్లా స్థాయిలో  రాజకీయ పార్టీలతో సమావేశం 3వ తేదీ న నిర్వహిస్తామన్నారు. బి.ఎల్ ఓ లు గా వి.ఆర్.ఎ లు, ఆశాలు, అంగన్ వాడి, విధ్యుత్ శాఖ, మహిళా పోలీసు లాంటి వారిని నియమించ కూడదన్నారు. బి.ఎల్.ఓ లు ఎ.ఈ ఆర్ ఓ లతో కలిసి పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులు ఉంటే అక్కడ ఉన్న ఓటర్లతో చర్చించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతిపాదనలను పంపాలనిఅన్నారు.కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వ్యక్తుల వివరాలను ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. బి.ఎల్.ఓలు విధిగా సందర్శించి గరుడ యాప్ లో పొందుపరచాలని చెప్పారు. నవంబరు 1వ తేదీన సమీకృత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు డి.ఆర్.ఓ ఎం.ఎస్.మురళి, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Chittoor

2021-09-20 12:32:33

క్రాప్స్ విలేజ్ పనులను వేగవంతం చేయాలి..

తిరుపతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న క్రాప్స్ విలేజ్ పనులను వేగ వంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టూ రిజమ్ అండ్ రీ సర్చ్ రీజనల్ డైరెక్టర్ ప్రభాకరన్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎ.డి. సత్యమూర్తి, ఆర్కి టెక్చర్ రమేష్, ఆర్ అండ్ బి ఇంజినీర్లు సుధాకర్ రెడ్డి, సుజాత, డి.ఆర్.డి.ఎ పి.డి తులసి మరియు కాంట్రాక్ట్ ప్రతినిధులతో కలిసి క్రాఫ్ట్ విలేజ్ పనులను సమీక్షించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి శ్రీకాళహస్తి ల మధ్య టూరిజం ను అభివృద్ది చేసేందుకు పానగల్లు గ్రామం వద్ద 9 ఎకరాల్లో టూరిజం శాఖ చేస్తున్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రస్తుతం కోవిడ్ నిబందనల మేరకు పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కాంట్రాక్టర్ లను ఆదేశించారు. టూరిజం అండ్ రీ సర్చ్ రీజనల్ డైరెక్టర్ ప్రభాకరన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వచ్చే ఆగష్టు నాటికి ప్రదాన మంత్రి చేతుల మీదుగా ప్రారంబించాలని ఆదేశాలు రావడం జరిగిందని, ఈ ప్రాంతంలో వివిధ సాంప్రధాయ హస్త కళలను  అభివృద్ది చేసే దిశగా ఈ నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా స్థానిక కళాకారులకు గుర్తింపు లబిస్తుందని, నైపుణ్యత పెంచుకునేందుకు వస్తువులకు సంబందించి డిజైన్ చేసేందుకు మరియు మార్కెటింగ్ సౌకర్యం పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ సంధర్భంగా డి.ఆర్.డి.ఎ పి.డి తులసి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం 9.55 కోట్లతో ప్రారంభమైందని, ఇప్పటి వరకు ప్రభుత్వం 4.775 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి ఆ తరువాత ఇంటీరియల్ డిసైన్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Tirupati

2021-09-20 12:31:15

విశాఖ జివిఎంసీ స్పందనకు 50 ఫిర్యాదులు..

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రుజన ప్రజల నుంచి నేరుగా స్వీకరించిన ఫిర్యాదులు రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 06, నాలుగవ జోనుకు 05, అయిదవ జోనుకు 07, ఆరవ జోనుకు 05, ఎనిమిదవ జోనుకు 01, మెయిన్ ఆఫీసు నకు 24, మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శివ ప్రసాద్ రాజు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.    

జివిఎంసీ

2021-09-20 12:27:40

డయల్ యువర్ కమిషనర్ కు 17 కాల్స్..

డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17 ఫోన్ కాల్స్, స్పందనలో 50 ఫిర్యాదులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన  తెలిపారు. సోమవారం పాత సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు.  రెండవ జోనుకు 01, మూడవ జోనుకు 03, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 01, ఆరవ జోనుకు 06, ఎనిమిదవ జోనుకు 05, మొత్తము 17 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శివ ప్రసాద్ రాజు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. 

జివిఎంసీ

2021-09-20 12:26:30

విశాఖ జిల్లా స్పందనకు 255 అర్జీలు..

‘స్పందన’లో  వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని   జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన, స్పందన’కార్యక్రమములో ప్రజల నుండి  వినతులను స్వీకరించారు. ఈ రోజు ‘స్పందన’లో 255 అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరు అధికారుల సమావేశంలో  మాట్లాడుతూ నిన్న జరిగిన ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి వోట్లు లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించారని అభినందించారు. తదుపరి కలెక్టరు కోవిడ్ ప్రోటోకాల్ పై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో   జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్  (హౌసింగ్) కల్పనా కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) అదితీసింగ్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి గోవిందరావు, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-20 12:19:11

రేపు జిల్లాలో గురజాడ జయంతి వేడుకలు..

న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతోత్స‌వాన్ని మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఒక తెలిపారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గుర‌జాడ స్వ‌గృహంలో ఉద‌యం 9 గంట‌ల‌కు, మ‌హాక‌వి చిత్ర‌ప‌టానికి పూల‌మాలాంక‌ర‌ణ‌తో ఈ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. అక్క‌డినుంచి త‌ర‌లివెళ్లి, మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌ నృత్య క‌ళాశాల స‌మీపంలోని గుర‌జాడ కాంస్య విగ్ర‌హం వ‌ద్ద ఉద‌యం 10 గంట‌ల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కూ, జూమ్ మీటింగ్ ద్వారా, పాఠ‌శాల‌, క‌ళాశాల‌, విశ్వ‌విద్యాల‌య విద్యార్థుల‌చే గుర‌జాడ దేశ‌భ‌క్తి గేయాలాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, పుర ప్ర‌ముఖులు, సాహితీవేత్త‌లు, ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

Vizianagaram

2021-09-20 12:09:54

గురజాడ ఆశయ సాధనకు కృషి చేయాలి..

స్వంత లాభం కొంత మానుకొని, పొరుగువానికి తోడు పడవోయ్  అన్న మహా కవి గురజాడ ఆశయ సాధనకు  మనమందరం కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు.   సెప్టెంబర్ 21 మహాకవి గురజాడ 159 వ  జయంతిని కోవిడ్ నిబంధనల మధ్య అన్ని వర్గాల ప్రజలు, విద్యార్ధులు, సాహితీ, స్వచ్చంద సంస్థల సహకారం తో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గురజాడ నడయాడిన విజయనగరం లో కలెక్టర్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులందరికి, గురజాడ అభిమానులకు శుభాకాంక్షలను అందజేశారు.  మహాకవి గురజాడ  ఒక సంఘ  సంస్కర్త,  అభ్యుదయ వాది,  దేశ భక్తుడు కనుకనే  దేశమును ప్రేమించుమన్నా – మంచి యన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించగలిగారని తెలిపారు.  ఈ గేయం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుందని  అన్నారు. ముఖ్యంగా ఈ గీతం లో ఆ కవి రాసిన ప్రతి వాక్యం ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.  దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ - వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ ..గట్టి మేల్ తల పెట్ట వోయ్ అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి  ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.   కన్యా శుల్కం  నాటకం తో ఎన్నో తరాలుగా సమాజం లో నాటుకుపోయిన దురాచారం పై తన కలం తో పోరాడిన యోధుడని,   పండిత భాషను  వ్యావహారిక భాష గా అందించడం లో  ఎనలేని కృషి చేసిన భాషాభిమానియని,   ఆ  మహనీయుడు   నడయాడిన ఈ   నేల  పునీతంఅని  అభివర్ణించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పేర్కొన్న విధంగా  గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడని అన్నారు.  ఆయన రచనల రూపం లో అందరిలో చిరస్మరణీయునిగా నిలుస్తారని,  అయన జయంతి సందర్భంగా గురజాడ గృహం లో , గురజాడ కూడలి లో  జరపనున్న ఉత్సవాలకు స్వచ్చందంగా హాజరు కావాలని కోరారు.

Vizianagaram

2021-09-20 11:51:37

విజయనగరం స్పందనకు 205 వినతులు..

విజయనగరం జిల్లా  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 205 వినతులు అందాయి.  ఈ వినతులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్  కుమార్, డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు  స్వీకరించారు.   ముఖ్యంగా పించన్లు,  ఇంటి స్థలాలు,  అమ్మఒడి ,  రేషన్ కార్డు లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి.  ఆయా శాఖల అధికారులకు పంపుతూ  వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన వినతులు 37,రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 168 వినతులు అందాయి. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ  స్పందన వినతులు మున్సిపల్, ఐ.సి.డి.ఎస్,  విద్యా శాఖల వద్ద ఎక్కువగా పెండింగ్  ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. అధికారులంతా గడువు దాటకుండా వినతులను పరిష్కరించాలని సూచించారు.

Vizianagaram

2021-09-20 11:14:59

విజయనరగరం జిల్లా డీఈఓగా ఎన్.స‌త్య‌సుధ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్‌.స‌త్య‌సుధ సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమె ఇంత‌కుముందు గుంటూరు ఆర్‌జెడి కార్యాల‌యంలో స‌హాయ సంచాల‌కులుగా ప‌నిచేస్తూ, ప‌దోన్న‌తితో డిఇఓగా జిల్లాకు వ‌చ్చారు. కొద్దిరోజుల క్రితం వ‌ర‌కూ ఇక్క‌డ‌ డిఇఓగా ప‌నిచేసిన జి.నాగ‌మ‌ణి, జాయింట్ డైరెక్ట‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది బ‌దిలీ కావ‌డంతో, ఈ పోస్టు ఖాళీ అయ్యింది. ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జి డిఇఓగా ప‌నిచేస్తున్న ఏడి ల‌క్ష్మ‌ణ‌రావు నుంచి ఆమె బాధ్య‌త‌లు తీసుకున్నారు. స‌త్య‌సుధ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించేముందు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారిని క‌లిసి అనుమ‌తి తీసుకున్నారు.  

Vizianagaram

2021-09-20 10:52:23

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియోగా జి.వాణీమోహన్ ప్రమాణస్వీకారం..

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ,  క‌మిష‌న‌ర్ జి.వాణి మోహ‌న్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా,  జీవ‌న్‌రెడ్డి,  మూరంశెట్టి రాములు,  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ స‌భ్యులుగా సోమ‌వారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్)  సుధారాణి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో  లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-20 10:03:46