1 ENS Live Breaking News

బాదితుల సహాయంలో విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి..

గులాబ్ తుపాను ప్రభావంతో విశాఖలోని ఏఎస్ఆర్ నగర్  ఆశ్రయం పొందుతున్న 25 కుటుంబాలకు అర్భన్ తహశీల్ధార్ జ్నానవేణి సోమవారం అల్పాహారం, ఆహారం దగ్గరుండి అందజేశారు. గత రెండు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్నిరకాల సదుపాయలను అందజేస్తున్నది. వాటిని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎవరికి ఎలాంటి అత్యవసర సహాయం కావాల్సి వచ్చినా తక్షణమే చూస్తున్నారు. వారికి మంచినీరు, కొవ్వుత్తులు అందజేశారు. అటు ప్రభుత్వం కూడా తుపాను బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైంది. 

Visakhapatnam

2021-09-27 09:19:06

గులాబ్‌పై యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా వుండాలి..

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన గులాబ్ తుఫాను ఈ అర్ధ‌రాత్రికి శ్రీకాకుళం జిల్లా క‌ళింగ‌ప‌ట్నం- ఒడిశాలోని గోపాల్‌పూర్ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని, ఈ తుఫాను ప్రభావం జిల్లాపై అవ‌కాశం వుంటుంద‌ని అందువ‌ల్ల జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మిష‌న‌ర్ కె.క‌న్న‌బాబు సూచించారు. తుఫాను వ‌ల్ల 80 కిలోల వేగంతో బ‌ల‌మైన గాలులు వీచే అవ‌కాశం ఉంటుంద‌ని దీని కార‌ణంగా చెట్లు ప‌డిపోవ‌డం వ‌ల్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డం, విద్యుత్ స్థంభాలు కూలిపోవ‌డం వ‌ల్ల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయ‌ని, ఇలాంటి ఇబ్బందులు ఏర్ప‌డిన‌పుడు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌తో సంబంధిత అధికారులు సిద్ధంగా వుండాల‌న్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ తుఫాను ప్ర‌భావానికి గుర‌య్యే అవ‌కాశం వుంటుంద‌న్నారు.
 తుఫాను స‌న్న‌ద్ధ‌త‌పై జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను విప‌త్తుల క‌మిష‌న‌ర్ ఆదివారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఉన్నతాధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప‌రంగా చేప‌ట్టిన ముందస్తు చ‌ర్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. విద్యుత్ స్థంభాల పున‌రుద్ద‌ర‌ణ కోసం జిల్లాలో 2 మాత్ర‌మే డ్రిల్ల‌ర్‌లు ఉన్నాయ‌ని, మ‌రో2 డ్రిల్ల‌ర్లు వుంటే విద్యుత్ స్థంభాల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు వేగంగా చేప‌ట్టే అవ‌కాశం ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం మాత్ర‌మే న‌మోదు అయ్యింద‌న్నారు. ఎలాంటి న‌ష్టాలు సంభ‌వించ‌లేద‌న్నారు. రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు విప‌త్తుల స‌మ‌యంలో చెట్ల‌ను తొల‌గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డే అధునాత‌న ప‌రికరాలు, యంత్రాలు స‌ర‌ఫ‌రా చేశామ‌ని, వాటిని వినియోగించి తుఫాను అనంత‌ర ప‌రిస్థితుల్లో ర‌వాణాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌కు విప‌త్తులను ఎదుర్కోవ‌డంలో త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌డం, తీర గ్రామాల ప్రజ‌ల‌కు తుఫానులు ఎదుర్కోవ‌డంపై అవ‌గాహ‌న క‌లిగించ‌డం ద్వారా విప‌త్తుల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. తుఫాను తీరం దాటే స‌మ‌యంలో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తాయ‌ని ఆ సమ‌యంలో ఇళ్ల‌లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జిల్లాలో ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్‌. బృందాల‌ను సిద్ధంచేశామ‌ని జిల్లా ఎస్‌.పి. ఎం.దీపిక వివ‌రించారు. జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌పై సంతృప్తి వ్య‌క్తంచేస్తూ గులాబ్ తుఫానును స‌మ‌ర్ధంగా ఎదుర్కోగ‌ల‌ద‌నే విశ్వాసం త‌న‌కుంద‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ ప‌ద్మావ‌తి, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా ఎస్‌.ఇ. శివానంద ప్ర‌సాద్‌, జిల్లా ఫైర్ ఆఫీస‌ర్ జె.మోహ‌న‌రావు, మ‌త్స్య‌శాఖ డిడి నిర్మ‌లాకుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై స‌మీక్ష‌..

జిల్లాలో మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై కూడా ఆ శాఖ క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కె.క‌న్న‌బాబు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించారు. స్థానికంగా ల‌భించే మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను వినియోగించేలా ప్రోత్స‌హించాల‌ని, మ‌త్స్య ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ స‌దుపాయాలు క‌ల్పించ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జిల్లాలో మ‌త్స్య ఉత్ప‌త్తుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ని, చెరువుల్లో చేప‌ల ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారి వివ‌రించారు.

Vizianagaram

2021-09-26 12:19:28

ప్రజాసంబంధాల బలోపేతానికి పి.ఆర్.ఎస్.ఐ. కృషి..

ఉత్తమ ప్రజాసంబంధాలను నెలకొల్పడంలో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడంలో భారత ప్రజా సంబంధాల సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ గత 3 దశాబ్థాలుగా విశేషకృషి చేస్తూ వస్తోందని పిఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డి.సి.ఐ.) విశ్రాంత అధికారి కె.రామారావు పేర్కొన్నారు. పి.ఆర్.ఎస్.ఐ. విశాఖ శాఖ ఆదివారం హోటల్ దసపల్లా లో నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. పి.ఆర్.నిపుణులు కాలానుగుణంగా వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విశాఖ శాఖ ఛైర్మన్ పి.ఎల్.కె.మూర్తి మాట్లాడుతూ, కోవిడ్19 సమయంలో  సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని ప్లాస్మా దాతలను గుర్తించి అవసరమైన వారికి అనుసంధానం చేయడం,  మాస్క్ లు, శానిటైజర్లు,
ఆహర పదార్థాల పంపిణీతో పాటు పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వైస్ ఛైర్మన్ ఆర్.పి.శర్మ మాట్లాడుతూ, విశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల అధికారులకు త్వరలో వివిధ అంశాలపై  వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యదర్శి ఎమ్.కె.వి.ఎల్.నరసింహం మాట్లాడుతూ, సంస్థ తరపున ప్రజా సక్షేమానికి  ప్రభుత్వాలు తీసుకునే పలు నిర్ణయాలు ప్రజలకు అర్థం అయ్యేవిధంగా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కోశాధికారి ఎన్.వి.నరసింహం విశాఖ శాఖ వ్యయ ప్రణాళికను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత విభాగం ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ జాతీయ స్థాయిలో  విశాఖ శాఖకు పేరు ప్రఖ్యాతులు రావడం వెనక ప్రస్తుత, గత కార్యవర్గం చేసిన కృషి ఉందన్నారు. సభ్యుల సంఖ్య పెరిగేలా కృషిచేయాలని, విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా యువత పాత్ర పెరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలో శాఖ బలోపేతానికి పలువురు సభ్యులు  సూచనలు చేశారు. సంస్థ మాజీ అధ్యక్షుడు కె.రామారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.పి.సి. పీఆర్వో టి.మల్లయ్య, కాయర్ బోర్డు మేనేజర్ వెంకట్రామన్, సీనియర్ సభ్యులు వై.శ్రీనివాసకుమార్,పి.ఎస్.ఎన్.మూర్తి, బి. విక్రమ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-26 12:00:33

చిల్డ్రన్స్ థియేటర్ లో పర్యాటక దినోత్సవం..

విశాఖలో ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వి.ఎమ్.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయం పై మంత్రి స్థానిక సర్క్యూట్ హౌస్ లో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా, స్టేక్ హోల్డర్స్ అయిన హోటల్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్వెస్టర్స్, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరిని కలుపుకుని పర్యాటక రంగాన్ని, పర్యాటక ప్రదేశాలను అభివృద్థి చేస్తామన్నారు. పర్యాటక రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి “అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ” ఇవ్వడం జరుగుతుందన్నారు. పర్యాటక రంగాన్ని “ఆర్గనైజ్డ్ సెక్టార్” గా అభివృద్థికి కృషి చేస్తామని తెలిపారు. టూరిజం ఆపరేటర్లను శాఖాపరంగా రిజిస్ట్రేషన్లు గావిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల అభివృద్థికి ప్రైవేట్ ఆపరేటర్స్ ను ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటక దినోత్సవం రోజున ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా  సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇన్వెస్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వి.ఎమ్.ఆర్.డి.ఎ. టూరిజం ప్రాంతాలలో ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు.పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద సముద్రతీరం ఉందన్నారు. రాష్ట్రంలో  ప్రకృతి సహజమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. అందరి భాగస్వామ్యంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ. ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, పైడా కృష్ణ ప్రసాద్ ఎ.పి.ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, హోటలియర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ పవన్ కార్తీక్, ఎ.పి.టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-24 13:33:46

సేవను రాజ‌కీయ చేయ‌డం బాధాక‌రం..

టిటిడి జారీ చేసిన అక్టోబ‌రు నెల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటాను జియో సంస్థ స‌బ్ డొమైన్‌తో టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌డంపై సామాజిక మాధ్య‌మాల్లో జ‌రిగిన దుష్ప్ర‌చారాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం ఖండించారు. జియో సంస్థ సేవా భావంతో ముందుకొచ్చింద‌ని, ఈ అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. జియో సంస్థ క్లౌడ్ ప‌రిజ్ఞానం ద్వారా ఒకటిన్న‌ర‌ గంట వ్య‌వ‌ధిలోనే స‌మ‌ర్థ‌వంతంగా 2.39 ల‌క్ష‌ల టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలు క‌ల్పించామ‌న్నారు.   ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు జియో సంస్థ దాదాపు రూ.3 కోట్లు విలువైన సాంకేతిక స‌హ‌కారం, మౌలిక స‌దుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింద‌న్నారు. కొన్ని మీడియా ఛాన‌ళ్లు, సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని టిటిడిపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ భ‌క్తుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నార‌ని చెప్పారు. భ‌క్తులు, తిరుప‌తి ప్ర‌జ‌లు, టిటిడి ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

             ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఆగ‌స్టు, సెప్టెంబ‌రు నెల‌ల్లో ఎదురైన సాంకేతిక స‌మ‌స్య‌లపై భ‌క్తుల నుండి ప‌లు సూచ‌న‌లు, ఫిర్యాదులు అందాయ‌న్నారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థ‌ల స‌హ‌కారంతో ప‌రిష్క‌రించిన‌ట్టు చెప్పారు. అయితే ఇలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ప‌లు మార్గాల‌ను అన్వేషించామ‌ని, ఇందులో భాగంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌ను వినియోగించుకునేందుకు అమెజాన్‌, జియో, బుక్ మై షో, అభిబ‌స్ లాంటి సంస్థ‌ల‌ను సంప్ర‌దించామ‌ని వివ‌రించారు. వీరిలో జియో సంస్థ రూ.3 కోట్లు విలువైన క్లౌడ్ సేవ‌ల‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింద‌ని తెలిపారు. అయితే tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో స‌మ‌యాభావం వ‌ల్ల జియో మార్ట్ స‌బ్ డొమైన్ వినియోగించాల్సి వ‌చ్చింద‌న్నారు. వ‌చ్చే నెలలో పూర్తిగా టిటిడి డొమైన్‌లోనే ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు.   టిటిడి మంచి ఉద్దేశంతో భ‌క్తుల‌కు టికెట్ల జారీ ప్ర‌క్రియను ఎంతో చ‌క్క‌గా అమ‌లుచేస్తుండ‌గా, కొంత‌మంది అదేప‌నిగా సంస్థ ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లేలా వివిధ మాధ్య‌మాల‌లో అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు.

Tirumala

2021-09-24 13:14:43

వచ్చే బ్రహ్మోత్సవాలనికి అనువాదం పూర్తిచేయాలి..

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు నేతృత్వంలో జరుగుతున్న అష్టాదశ పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి పండిత మండలిని ఆదేశించారు.   శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన పండిత మండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఈవో మాట్లాడుతూ, అష్టాదశ పురాణాల్లో ఇప్పటిదాకా నాలుగు పురాణాల అనువాదం పూర్తయిందని,  మిగిలిన 14 పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిచేయాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే మరింతమంది పండితుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.  పండిత మండలి సభ్యులు  ప్రస్తుతం నెలకు వారం రోజులు ఈ కార్యక్రమం మీద పనిచేస్తున్నారని చెప్పారు.  ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ  తేదీ దాకా పండితులను పిలిపించి పురాణాల అనువాద కార్యక్రమం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురాణ అనువాద కార్యక్రమం కోసం తిరుపతికి వచ్చే పండితుల తో పాటు,  వారి భార్యకు కూడా ఉచిత వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న గరుడ పురాణం పారాయణానికి విశేష స్పందన వస్తోందని ఈవో చెప్పారు. కోవిడ్  మొదటి  ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో నిర్వహించిన సుందరకాండ, భగవద్గీత, విరాటపర్వం  పారాయణాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన మండలికి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పద్దెనిమిది పురాణాలను  ప్రసారం  చేస్తామన్నారు. పండిత మండలి సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో పురాణాల అనువాదం చేయాలన్నారు.  నేటి తరానికి పురాణ,  ఇతిహాసాల గురించి తెలియజేసి వారిని సరైన మార్గంలో పయనించేలా ప్రయత్నం చేయడం టిటిడికే సాధ్యమవుతుందని ఈవో జవహర్ రెడ్డి వివరించారు. సనాతన ధర్మ ప్రచారం కోసం పండిత మండలి పురాణ అనువాద కార్యక్రమాన్ని నిర్దేశిత సమయం లోపు పూర్తిచేయాలని ఆయన చెప్పారు.  పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ,  శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులు రెడ్డి,  పండిత పరిషత్ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య,  శ్రీపాద సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో పండిత మండలి సభ్యులకు శ్రీవారి ప్రసాదాలను అందించారు.

Tirumala

2021-09-24 13:09:08

ట్రస్ట్ బోర్డు స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా టిటిడి ఈఓ..

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద ఉద‌యం 10.05 గంట‌ల‌కు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు,  సుధారాణి, లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-24 12:23:44

సిటిజన్ ఔట్ రీచ్ ను పరిశీలించిన కమిషనర్..

ప్రభుత్వ సేవలు ప్రజలకు తెలిసేలా సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్  దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బంది ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని 20వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్  సి.హెచ్. నాగ నరసింహారావు    మాట్లాడుతూ  సచివాలయం ద్వారా అందిస్తున్న పథకాలను ,సేవలను పొందుతున్న విధానాన్ని గురించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వయంగా  విచారించారు. సచివాలయ సిబ్బంది తాలూకు ఫోన్ నెంబర్లను ప్రతి ఇంటికి అందాయో లేదో వాకబు చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్  సత్యనారాయణ గారు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-24 10:12:01

మాట నిలబెట్టుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి..

కురుపాం నియోజకవర్గంలోని నాగావళి నదిపై కొమరాడ మండలంలో నిర్మిస్తున్న పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి పుష్ప శ్రీవాణి చొరవతో ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న వంతెనను గత ఏడాదిలో అధికారులతో కలిసి పుష్ప శ్రీవాణి సందర్శించి నిలిచిపోయిన పనులను పరిశీలించిన విషయం  తెలిసిందే. కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉన్నాయని, మరో 9 పంచాయతీలు మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి  నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి 50-60 కిలోమీటర్ల దాకా వెళ్లాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాలమధ్యన నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కొమరాడ మండలానికి చెందిన అన్ని పంచాయితీల ప్రజలు ఆరు, ఏడు కిలోమీటర్ల ప్రయాణంతోనే అటు కొమరాడకు, ఇటు కురుపాంకు చేరుకుంటారని, ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తీరి పోతాయని కొమరాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన వంతెన నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, మంజూరు చేసిన నిధులు కూడా రాకపోవడంతో ఈ వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణంగా నిర్మాణంలో జరిగిన ఆలస్యం తో రూ. 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ. 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగానే అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అయితే నిధుల మంజూరులో జాప్యం కారణంగా వంతెన నిర్మాణంలో ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేసిన పుష్ప శ్రీవాణి ఎక్కువగా గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలుచేసే ఈ వంతెన నిర్మాణానికి ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తామని, రాబోయే నోడల్ ఏజెన్సీ సమావేశంలోనే దీనికి అనుమతిని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈ వంతెన నిర్మాణానికి రూ.7 కోట్లను కేటాయించారు. ఇది కాకుండా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా మరో రూ.7 కోట్లను కూడా కలుపుకొని మొత్తం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్.500 ను జారీ చేసింది. ఈ నిధుల మంజూరుతో పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. దీంతో నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం కొమరాడ ప్రజలు కంటున్న కల కూడా నెరవేరనుంది.

Kurupam

2021-09-24 09:51:20

సత్యదేవుని బంగీ ప్రసాదం రేట్లు పెంపు..

అన్నవరం రత్నగిరి శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి ప్రసాదం ఇక ప్రయం అయ్యింది. స్వామివారి బంగీప్రసాదం రూ.15 నుంచి 20కి పెంచుతూ పాలకవర్గం ఆమోదం తెలిపిందని ఈఓ వేండ్ర త్రినాధ్ తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన రేట్లు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఈఓ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కౌంటర్ల పెంచిన రేట్లను ప్రదర్శిస్తున్నట్టు ఆయన వివరించారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముడి సరుకు ధరలు పెరిగిన కారణంగా రాష్ట్ర అధికారుల సూచనల మేరకు పెంచి ట్రస్టుబోర్డులో తీర్మానించినట్టు  ఈఓ మీడియాకి వివరించారు.

Annavaram

2021-09-24 09:14:19

జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వాలదే..

జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక ఉద్యమ కారులు బొలిశెట్టి సత్యనారాయణ(సత్య) అన్నారు. శుక్రవారం ఇక్కడి పోర్టు స్డేడియంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా బోలిశెట్టి మాట్లాడుతూ మూడు దశాబ్ధాలకుపైగా జర్నలిస్టుల సంక్షేమానికి వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం కృషి చేస్తుందన్నారు.క్రమం తప్పకుండా ఇంటర్‌ మీడియాతో పాటు రాష్ట్రస్దాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలపై ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన  విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మాట్లాడుతూ విమ్స్‌లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా వైద్యసేవలందించడంతో పాటు, వెయ్యి రూపాయాల వరకూ అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. కొవిడ్‌ సమయంలో కూడా అధిక సంఖ్యలో జర్నలిస్టులకు స్పెషల్‌ కేర్‌ తీసుకుని వైద్యం అందించామని, ప్రస్తుతం విమ్స్‌లో ఆధునాతన వైద్యసేవలందిస్తున్నామన్నారు. పేదల వైద్యులు, లక్ష్మీగాయిత్రి అధినేత డాక్టర్‌ కాండ్రేగుల రామ్‌కుమార్‌ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ వంతు సహయ,సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు.విజెఎఫ్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లు నిర్వహించిన ఘనత  విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు,నాగబొయిన నాగేశ్వరరావు,పైల భాస్కరరావు సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్‌, శేఖర్‌ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-24 07:51:55

ఉత్పత్తుల ఎగుమతులకు సబ్ కమిటీలు..

సీఫుడ్స్, మెరైన్ ఉత్పత్తులు, ఫార్మా, కాయర్ మొదలైన రకాలను  అభివృద్ది చేసి ఎగుమతులను చేపట్టడానికి  సబ్ కమిటీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమలు, మరియు ఎగుమతుల ప్రోత్సాహక  కమిటి (డిఐఇపిసి) చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో డిఐఇపిసి సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఫార్మా , బల్క్ డ్రగ్స్ ఎగుమతులకు సంబందించి ప్రతి 10 రోజులకు  సబ్ కమిటీలు సమావేశాలను నిర్వహించాలన్నారు.  వీటికి సంబందించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్  రామలింగరాజు మాట్లాడుతూ  జిల్లాలో ఫార్మాకంపెనీలు 120 యూనిట్లు ఫార్మా హబ్ గా ఏర్పాటయ్యాయని,  మరో 50 ప్రతిపాదనలు  వివిద దశలలో  ఉన్నాయన్నారు. అచ్చుతాపురం ఎస్.ఇ.జెడ్ లో 27 కంపెనీలు నిర్మాణపు పనులలో  ఉన్నాయని, ఏడు  కంపెనీలు ప్రోడక్షన్ కు సిద్దంగా ఉన్నాయన్నారు. సీఫుడ్, మెరైన్ ప్రోడక్ష్స్ సబ్ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2,16,457 మెట్రిక్ టన్నుల  సీఫుడ్ ను వైజాగ్ పోర్టు ద్వారా ఎగుమతి చేయడం జరిగిందన్నారు. సింగిల్ డస్క్ పోర్టల్ లో 26.8.2021 నుండి 22.09.2021 నాటికి 90 దరఖాస్తులు వచ్చాయని  56 దరఖాస్తులను ఆమోదించగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.  2010-15 & 2015-20 సంవత్సరాలలో  ఎం .ఎస్.ఎం .ఇ ఆన్ లైన్ క్లెయింలు 21-9-2021 నాటికి 82 క్లెయింలు రాగా 70 క్లెయింలకు రూ.4,83,46,867/-లకు  ఆమోదించడం జరిగిందని, 12క్లెయింలు  రిజక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలోఎ.పి.ఐ.ఐ.సి, జి.వి.ఎం.సి., వి.ఎం.ఆర్.డి.ఎ.,    ట్రాన్స్ కో, ప్యాక్టరీలు, పొల్యూషన్, ఫైర్, తదితర శాఖల అధికారులు, కమిటీ మెంబర్లు హాజరైయారు .

Visakhapatnam

2021-09-23 13:38:03

డ్రైనేజీల్లో బాటిల్స్, చెత్త వేస్తే కఠిన చర్యలు..

సింహగిరిపైనున్న డ్రైనేజీల్లో వాటర్ బాటిల్స్, చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్తే కఠన చర్యలు తీసుకుంటామని షాపులనిర్వాహకులు ఈఓ ఎంవీ సూర్యకళ హెచ్చరించారు. గురువారం సింహరిపై డ్రేనేజీలు పరిశుభ్రతను ఆమె పరిశీలించారు.  కొన్ని షాపుల వద్ద చెత్తను ఉండటాన్ని ఆమె గమనించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, షాపుల నిర్వహాకులు చెత్త డంప్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. షాపు నుంచి వచ్చిన చెత్తా చెదారాన్ని డస్టు బిన్స్ ఏర్పాటుచేసుకుని వారే కిందకి తీసుకెళ్లాలని చెప్పారు. డ్రైనేజీల్లో కవర్లు, ప్లాస్టిక్ , చెత్త ఉండటాన్ని ఆమె చూశారు. కొంతమంది బల్క్ గా చెత్త డప్ చేస్తున్నారన్న నిర్దారణకు వచ్చారు. షాపులవారితోనూ మాట్లాడారు. ఇకపై సీసీ కెమెరాలు చూసి మరీ చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయ పరిసరాల్లో, కొండపైన శుచి శుభ్రత పాటించాలని..ఈ సందర్భంగా శుభ్రత, పరిశుభ్రత విషయంలో గాంధీ మహాత్ముని సూక్తిని అందరికీ గుర్తు చేశారు.

Simhachalam

2021-09-23 08:24:18

బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం..

ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం గణనీయంగా పెరిగిందని దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి జరగాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లాంటి దుర్ఘటనలు, ఘర్షణలకు బహిరంగ మద్య సేవనం ప్రధాన కారణమని వివరించారు. చట్టాలలో మార్పు తెచ్చి బహిరంగ మద్య సేవనం పై కఠిన చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్టం చేయడం ద్వారా నాటుసారా,అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నివారించగలమని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మద్య సేవనాన్ని నివారించగలమని తెలిపారు.గ్రామ/ వార్డు సచివాలయలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ అందించి వారి ఉద్యోగ  నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని  నిర్ములంచడం ఒక బాధ్యతగా పేర్కొనాలని తెలిపారు.రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ  ప్రభుత్వ ధ్యేయమైనా మద్య రహిత సమాజం లో భాగంగా మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

Tadepalli

2021-09-23 06:17:13