1 ENS Live Breaking News

జీవివనరులు అంతరించిపోకుండా చూడాలి..

గ్రామీణ ప్రాంతాలలో జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు గ్రామ స్థాయిలో నియమించబడిన కమిటీ లు పూర్తి స్థాయిలో పనిచేసి జీవవనరులు అంతరించిపోకుండా  ప్రజలలో అవగాహన కల్పించాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపుల్ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జీవ వైవిద్య బోర్డు కార్యదర్శి నలినీమోహన్ అన్నారు. చిత్తూరులో బుధవారం ఆయన జీవవైవిద్యాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎన్ జి ఓ లు, ఇతర ఔత్సాహిక వ్యక్తుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిద్యాన్ని సమతుల్యత చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందని, 2002 లో ఏర్పాటైన బోర్డు 2006 లో కార్యకలాపాలను ప్రారంభించిందని, క్షేత్ర స్థాయి నుండి జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు జీవ వనరులను ఏ విధంగా పెంచుకోవాలని అందుకు చేపట్టాల్సిన చర్యల గురించి స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు గా ఏర్పాటు కావడం జరిగిందని, ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తూ స్థానిక ఎన్ జి ఓ ల సహాయం తో స్వచ్ఛంధ సేవకు వచ్చిన సామాజిక స్పృహ ఉన్న వారితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోందని అన్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు చిరు ధాన్యాలు ఎంత అవసరమో, వ్యక్తి ఆరోగ్యం గా ఉండడానికి ఔషధ మొక్కలు ఎంతో అవసరం అని, ఈ ఔషధ మొక్కలు పెంచడానికి గ్రామీణ ప్రాంతాలలో, మున్సిపాలిటీ లలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ జీవ వైవిద్య మండలి ప్రభుత్వానికి సలహా ఇస్తూ జీవ వైవిద్యానికి అటవీ ప్రాంతాలలో పాటుపడుతున్నామో అదే విధంగా మానవులు ఉన్న ప్రాంతాలలో పెంచడానికి వారిలో అవగాహన కల్పించడానికి కృషి చేస్తామన్నారు. చెట్లు మొక్కలు పెరగడానికి సూక్ష్మ జీవులు ఏ విధంగా అవసరమో ఆ సూక్ష్మ జీవులు పెరగానికి చెట్లు కూడా అంతే అవసరమని, ఎరువులు క్రిమి సంహారక మందులు లేని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యమని, ఆరోగ్య విలువలు కలిగిన ఆహార పధార్థాలను పండించి మానవుని జీవితాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్ పి ఛైర్మన్, సి ఇ ఓ, ఇతర అధికారు, అనధికారులతో కమిటీ ఉంటుందని, కలెక్టర్ కొన్ని చోట్ల ఛైర్మన్ గా ఉంటారని టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మండలస్థాయిలో ఎంపిడిఓలు, తహశీల్దార్లు, గ్రామీణ స్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బంది, సర్పంచ్ ఛైర్మన్ లు గా ఉంటారని, అందరూ వనరులు అంతరించి పోకుండా జీవ వనరులను పెంపొందించే మొక్కలు, పశువులు, సూక్ష్మ జీవులు, వృక్షాలను పెంపొందించి జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ సోమ శేఖర్ తో పాటు పలువురు జిల్లా అధికారులు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  అంతకు మునుపు జీవవైవిద్య కార్యదర్శి వాణిమోహన్ జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ను  కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Chittoor

2021-09-22 07:59:07

మైనార్టీ విద్యార్ధులకు ప్రభుత్వ స్కాలర్ షిప్పులు..

జాతీయ ఉప‌కార వేతనాల‌కోసం అర్హులైన‌ మైనారిటీ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. దీనికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను, ఫ్లెక్సీల‌ను బుధ‌వారం క‌లెక్ట‌ర్ ఆవిష్కరించారు. నేష‌న‌ల్‌ మైనారిటీ స్కాల‌ర్‌షిప్పులు గురించి, వాటికి ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానంపైనా విద్యార్థుల‌కు పూర్తిగా అవ‌గాహ‌న క‌ల్పించడం కోసం విస్తృతంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా మైనారిటీల సంక్షేమ‌శాఖ స‌హాయ సంచాల‌కులు బి.అరుణ‌కుమారి మాట్లాడుతూ, నేష‌న‌ల్‌ స్కాల‌ర్‌షిప్పుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసే విధానాన్ని, అర్హ‌త‌ల‌ను వివ‌రించారు. ముస్లింలు, క్రైస్త‌వులు, బౌద్దులు, జైనులు, సిక్కులు, పార్సీకులు త‌దిత‌ర మైనారిటీ  విద్యార్థులు ఎన్ఎస్‌పి యాప్ ద్వారా లేదా, లేదా నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు. ప్రీమెట్రిక్ స్కాల‌ర్ షిప్పుల‌కోసం త‌ల్లితండ్రుల‌ వార్షికాదాయం రూ.ల‌క్ష లోపు, పోస్టు మెట్రిక్ స్కాల‌ర్‌షిప్స్ కోసం వార్షికాదాయం రూ.2ల‌క్ష‌ల లోపు, మెరిట్ క‌మ్ మీన్స్ స్కాల‌ర్‌షిప్పుల‌కోసం వార్షికాదాయం రూ.2.5లక్ష‌ల లోపు ఉండాల‌ని తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థుల‌కు ఏడాదికి రూ.1000-రూ.5,000, పోస్టు మెట్రిక్ విద్యార్థుల‌కు రూ.6,000- రూ.12,000, మెరిట్ క‌మ్ మీన్స్ స్కాల‌ర్‌షిప్పుల (వృత్తి విద్యాకోర్సులు) క్రింద రూ.25,000-రూ.30,000 వ‌ర‌కూ కేంద్ర‌ప్ర‌భుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంద‌ని వివ‌రించారు. ఇత‌ర వివ‌రాల‌కోసం క‌లెక్ట‌రేట్లోని త‌మ కార్యాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని ఏడి అరుణ‌కుమారి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ మ‌తాల‌ పెద్ద‌లు ఎంఎస్ఎస్ భాషా, ఆర్‌.ఎస్‌.జాన్‌, ఎం.పాల్‌స‌న్‌, బిష‌ప్ డాక్ట‌ర్ కెజె ఫిలోనియ‌న్‌, ఫాస్ట‌ర్ సునీల్, వి.జాన్ వెస్లీ, జ‌స్వీర్‌సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-22 06:33:20

సచివాలయాల్లో బయో మెట్రిక్ తప్పసరి..

గ్రామ/ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కార్యాలయంలోకి రాగానే సకాలం లో బయో మెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలని ఆయా సచివాలయ పరిధిలో పని చేసే వాలంటీర్లు వారంలో మూడు రోజుల పాటు బయో మెట్రిక్ హాజరు వేయాలని, స్పందన కార్యక్రమం లో వచ్చే అర్జీలకు అత్యంత ప్రదాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది సకాలంలో బయో మెట్రిక్ వేయాలని, వాలంటీర్లు కూడా నిర్ణయించిన మేరకు సోమ, బుదు, శుక్రవారాల్లో బయో మెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలు లేదా పట్టణాల్లో నివసించే ప్రజల సమస్యల కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని, సర్వీసు డెలివరీ విషయంలో నిర్ణీత సమయం లోపల సేవలను అందించాలని, చిత్తూరు జిల్లాలోని కొంగరెడ్డిపల్లి సచివాలయం, తిరుపతి లోని యూనియన్ ఆఫీసు సచివాలయం గత నెలలో ఎటువంటి సేవలు అందించ లేదని అన్నారు. ఒక నెల రోజుల పాటు సేవల వివరాలను పరిశీలించడం జరిగిందని, ఎం.పి.డి.ఓ లు, కమిషనర్లు దీని పై మరింత దృష్టి పెట్టి సేవలను పెంచాలన్నారు. సకాలంలో 30 సేవల కన్నా తక్కువ సేవలు అందించిన సేవల్లో పలు సచివాలయాలు ఉన్నాయని, వీటన్నిటిని సకాలంలో పూర్తి అయ్యేలా స్పందించాలన్నారు. ఎం.పి.డి ఓ లు, కమిషనర్ లు ఎప్పటికప్పుడు సర్వీసు రిక్వెస్ట్ లను పరిశీలించి సంబందిత అధికారులతో సంప్రదించి గడువు లోగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పలు డిపార్ట్ మెంట్ లకు సంబందించిన పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని అందులో విధ్యుత్, సదరన్ సర్టిఫికేట్ ల మంజూరు, మునిసిపల్ వ్యవహారాలకు సంబందించిన సమస్యలు ఉన్నాయని చివరకు ఎం.పి.డి.ఓ ల పరిధిలో ఉన్న జాబ్ కార్డులు కార్డులు కూడా అందించ లేదన్నారు. రవాణా శాఖ కు సంబందించి ఎల్.ఎల్.ఆర్ లు, వాహన మిత్ర ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, చేయూత, కాపు నేస్తం,  నేతన్న నేస్తం, రైతు భరోసా, మత్స్య కార భరోసా, జగనన్న తోడు వంటి పధకాలకు సంబందించిన లబ్ది దారుల సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, ధరఖాస్తు వచ్చిన వెంటనే నిర్ణీత గడువు లోపల వారి సమస్య కు పరిష్కారo చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, సచివాలయాల పరిధిలో సమస్యలను స్వీకరించి వారి రశీదు ఇచ్చి సంబందిత శాఖలకు పంపి సకాలంలో వారి సమస్యలు పరిష్కారం అయ్యే లా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ లు పాల్గొన్నారు.

Chittoor

2021-09-21 12:30:49

7రోజుల్లో 87వేల మందికి కోవిడ్ వేక్సినేషన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సోమ, మంగ‌ళ‌వారాల్లో చేప‌ట్టిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో మొద‌టి డోసు శ‌త‌శాతం పూర్తిచేయాల‌ని, రెండో డోసు గ‌డువు స‌మీపించిన వారికి ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్టామ‌న్నారు. రెండు రోజుల్లో జిల్లాలో 87 వేల మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. సోమ‌వారం 66,599 మందికి, మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మ‌యానికి 20వేల మందికి వ్యాక్సిన్ వేసిన‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని కోరారు. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతం చేయ‌డంలో కృషిచేసిన వ‌లంటీర్లు, ఆశ కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులు, ఎంపిడిఓలు, స‌చివాల‌య సిబ్బంది అంద‌రికీ క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు.

Vizianagaram

2021-09-21 12:28:06

గుర‌జాడ స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందిస్తాం..

మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు త‌న ర‌చ‌న‌ల ద్వారా చెప్పిన సూక్తులు ఎప్ప‌టికీ అనుస‌ర‌ణీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అన్నారు. ఆయ‌న విజ‌య‌న‌గ‌రంవాసి కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతి వేడుక‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా గుర‌జాడ స్వ‌గృహంలోని ఆయ‌న చిత్ర‌ప‌టానికి, విగ్ర‌హానికి, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, శాస‌న‌మండ‌లి స‌భ్యులు పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, పెనుమ‌త్స సురేష్‌బాబు, మేయ‌ర్ వి.విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ రేవ‌తీదేవి, ఇత‌ర ప్ర‌ముఖులు, అధికారులు  పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం గుర‌జాడ స్వ‌గృహం నుంచి, మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల స‌మీపంలోని గుర‌జాడ కాంస్య విగ్ర‌హం వ‌ర‌కూ, మ‌హాక‌వి విర‌చిత‌ దేశ‌భ‌క్తి గీతాలాప‌న‌ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. గుర‌జాడ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. గుర‌జాడ గీతాల‌ను విద్యార్థులు శ్రావ్యంగా ఆల‌పించారు.

             ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఆయ‌న సూక్తుల‌తో కూడిన బోర్డుల‌ను పాఠ‌శాల‌ల్లో, గ్రామ స‌చివాల‌యాల్లో ఏర్పాటు చేయ‌డం ద్వారా, గుర‌జాడ ఆశ‌యాల‌ను నేటి త‌రానికి వివ‌రిస్తామ‌ని చెప్పారు. మ‌హాక‌వి దేశ‌భ‌క్తి గేయాన్ని పాఠ‌శాల‌ల్లో ప్రార్ధ‌నాగీతంగా మార్చేందుకు కృషి చేస్తామ‌ని అన్నారు. గుర‌జాడ ప‌లుకులు నిత్య‌నూత‌న‌మ‌ని పేర్కొన్నారు. మ‌హాక‌వి వార‌సులుగా ఆయ‌న జ్ఞాప‌కాల‌ను ప‌దిల‌ప‌ర‌చ‌డానికి, ఆయ‌న ఆశ‌యాల సాధించేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

             ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, గుర‌జాడని స్మ‌రిస్తూ, ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు నిరంత‌రం కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ పొరుగువాడికి సాయ‌ప‌డాల‌న్న‌దే మ‌హాక‌వి ప‌లుకుల‌ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. గుర‌జాడ వార‌సులుగా అది విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌కు అల‌వాటేన‌ని, ఆయ‌న బాట‌నే న‌డుస్తున్నామ‌న‌ అన్నారు. మ‌హాక‌వి గొప్ప‌ద‌నాన్ని చాటిచెప్పేందుకు, ఆయ‌న జ్ఞాప‌కాల‌ను ప‌దిల‌ప‌రిచేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. గుర‌జాడ అప్పారావు స్వ‌గృహాన్ని స్మార‌క చిహ్నంగా మార్చ‌డ‌మే కాకుండా, ఆ ప్ర‌క్క‌నున్న స్థ‌లాన్ని కూడా ప్ర‌భుత్వం కొనుగోలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. గుర‌జాడ కాంస్య విగ్ర‌హం ఉన్న ఐలండ్‌ను మరింత అభివృద్ది చేయ‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు  వెళ్ల‌డించారు. కుల‌మ‌త‌వ‌ర్గ విబేధాలు లేకుండా, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించ‌డం ద్వారా, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి సైతం గుర‌జాడ మార్గాన్ని అనుస‌రిస్తున్నార‌ని ఎంఎల్ఏ అన్నారు.

           ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, స‌మాజ ఉద్ద‌ర‌ణే మ‌హాక‌వి పలుకుల వెనుక‌నున్న ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. మ‌నిషి త‌న వ్య‌క్తిగ‌త స్వార్ధాన్ని విడిచిపెట్టి, దేశం కోసం కృషి చేయాల‌న్న‌ది గుర‌జాడ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తి ఉన్నా లేకున్నా, ఆయ‌న సందేశం మాత్రం స‌మాజంలో చిర‌స్థాయిగా నిలిచిఉంటుంద‌ని అన్నారు.  క‌వులు, క‌ళాకారులు, సామాజిక వేత్త‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌కూడ‌ద‌ని కోరారు.

           గుర‌జాడ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, జిల్లా వ్యాప్తంగా పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న‌, వ‌క్తృత్వం, అభిన‌య పోటీల విజేత‌ల‌కు అతిథుల చేతుల‌మీదుగా బ‌హుమ‌తులను అంద‌జేశారు.  ప్ర‌ధ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తుల‌ను వ్యాస‌ర‌చ‌న పోటీలో ఎ.కీర్త‌న‌(కెజిబివి, పార్వ‌తీపురం), ఎం.లీల (జెడ్‌పిహెచ్ఎస్‌, జొన్న‌వ‌ల‌స‌), కె.కిశోర్‌(జెడ్‌పిహెచ్ఎస్‌, మోపాడ‌) గెలుచుకున్నారు. వ‌క్తృత్వ పోటీలో పి.హేమాంజ‌లి (ఎపిఎంఎస్‌, కొత్త‌వ‌ల‌స‌), కె.శైలు(జెడ్‌పిహెచ్ఎస్‌, ర‌ఘుమండ‌), టి.మౌనిక (జెడ్‌పిహెచ్ఎస్‌, గొల్జాం) గెలుచుకున్నారు. మోనో యాక్ష‌న్ (అభిన‌యం) పోటీలో డి.రాకేష్ ప్రేమ్ (గుర‌జాడ ప‌బ్లిక్ స్కూల్‌), జె.ల‌లిత (హోలీక్రాస్ హైస్కూల్‌), బి.శ్రావ‌ణి (కెఎస్ఆర్ పురం) గెలుపొందారు. ప్ర‌ముఖ చిత్ర‌కారిణి ప్ర‌వ‌ల్లిక వేసిన గుర‌జాడ చిత్రాన్ని క‌లెక్ట‌ర్, ఎంఎల్ఏ ఆవిష్క‌రించారు. ఈ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా గుర‌జాడ వార‌సులు వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్‌, ఇంద‌ర‌ల‌ను స‌న్మానించారు.

           ఈ కార్య‌క్ర‌మంలో గుర‌జాడ వార‌సులు వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్‌, ఇందిర‌, ల‌లిత‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, జిల్లా ప‌ర్యాట‌కాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ ఏడి డి.ర‌మేష్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిపిఎం బి.ప‌ద్మావ‌తి, డిపిఓ సుభాషిణి, డిఇఓ స‌త్య‌సుధ‌, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ శివానంద‌కుమార్‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి వైవి ర‌మ‌ణ‌, బిసి కార్పొరేష‌న్ ఇడి ఆర్‌వి నాగ‌రాణి, మ‌హారాజా సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌వి ప్ర‌స‌న్న‌కుమారి, యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య త‌దిత‌ర అధికారులు, గుర‌జాడ సాహితీ స‌మాఖ్య కార్య‌ద‌ర్శి కోల‌గ‌ట్ల ప్ర‌తాప్‌, భీశెట్టి బాబ్జి, బి.శివారెడ్డి, డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, స్వ‌రూప‌, ఎం.రామ్మోహ‌న్ త‌దిత‌ర వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, నాయ‌కులు, విద్యార్థులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

క‌న్యాశుల్కం ప్ర‌ద‌ర్శ‌న‌

           మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, స్థానిక మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో,  క‌న్యాశుల్కం నాట‌కంలోని బొంకుల‌దిబ్బ ఘ‌ట్టాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ ఘ‌ట్టాన్ని పూర్తిగా మ‌హిళ‌లే ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. గిరీశంగా బిహెచ్ సూర్య‌ల‌క్ష్మి, వెంక‌టేశంగా ఎస్‌.ఐశ్వ‌ర్య‌, ఫొటోగ్రాఫ‌ర్ పంతులు నౌక‌రుగా ఎస్‌.స‌త్య‌ల‌త అభిన‌యం ఆక‌ట్టుకుంది. ఈ నాట‌క ఘ‌ట్టానికి ఈపు విజ‌య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సూర్య‌ల‌క్ష్మి నిర్వ‌హ‌ణా సార‌థ్యంలో జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి, ఎంఎల్‌సి పాల‌క‌పాటి ర‌ఘువ‌ర్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌వి ప్ర‌సన్న‌కుమారి, డిపిఆర్ఓ డి.ర‌మేష్ త‌ద‌త‌రులు తిల‌కించారు.

వినూత్నం  - జూమ్ ద్వారా  గురజాడ గేయాలాపన
పాల్గొన్న 90 పాఠశాలల విద్యార్ధులు
              గురజాడ 159 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి వినూత్న ఆలోచన చేసారు.  కోవిడ్ ను దృష్టి లోపెట్టుకొని ప్రత్యక్షంగా విద్యార్ధులు పాల్గొన లేని పరిస్థితి ఉన్నందున వారందరిని జూన్ ద్వార పాల్గొని గురజాడ విరచిత గేయాన్ని  దేశమును ప్రేమించుమన్నా –మంచి యన్నది పెంచుమన్నా  ఒకేసారి సామూహికంగా ఆలపించే ఏర్పాటు చేసారు.  ముందుగా మహారాజా సంగీత కళాశాల  వారు పాడి  వినిపించగా తదుపరి అందరూ అదే  బాణీ లో పాడారు.  ఈ కార్యక్రమం లో  34 మండల ప్రధాన కేంద్రాల్లో నున్న పాఠశాలల, 5 మున్సిపల్, 25 కే జి బివి పాఠశాలల, 11 డిగ్రీ కళాశాలల విద్యార్ధులతో పాటు కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులు,  గిరిజన విశ్వ విద్యాలయం, సెంచూరియన్ విద్యార్ధులు,  6 ఇంజినీరింగ్  కళాశాలల విద్యార్ధులు , జిల్లా విద్య శాఖ, మున్సిపల్ కమీషనర్, సాంస్కృతిక కలశాల ల నుండి  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ  గురజాడ  గీతాన్ని ఆలపించిన తర్వాత విద్యార్ధులకు ఆ గేయం  అర్ధాన్ని, భావాన్ని అర్ధం అయ్యేలా ఉపాధ్యాయులు  వివరించాలని అన్నారు.  వినూత్నంగా అందరిని కలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులైన వారందరికి అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమం లో కలక్టరేట్ నుండి కలెక్టర్ తో పాటు జే. సి లు డా. కిషోర్ కుమార్, జే. వెంకట రావు, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, ఐ అండ్ పి ఆర్  ఎ.డి డి. రమేష్,  రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి డి. కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-21 12:14:07

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..

పౌష్టికాహారం తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ  గురుకులం జిల్లా కన్వీనర్ వై.యశోద లక్ష్మి అన్నారు. పెద్దపాడు సాంఘిక సంక్షేమ గురుకులంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యశోద లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు  పోషకాహారం అవసరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి గర్భంలో ఉన్నప్పటి నుండే మంచి ఆహారం అందించుటకు కృషి చేస్తున్నాయని అన్నారు. చిన్నారులు అన్ని కూరగాయలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయలు, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్య పరిస్థితులు మెండుగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం పొందటం వలన  శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారని మెదడు చురుగ్గా పని చేస్తుందని వివరించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కూరగాయలు, పండ్లు, ఆహారపదార్థాలతో పౌష్ఠిాహార ప్రదర్శన నిర్వహిస్తూ మంచి ఆహారం తీసుకునే విధానాలు వివరించారు.

Srikakulam

2021-09-21 12:12:01

అన్నవరం దేవస్థాన ప్రత్యేక అహ్వానితునిగా ఎమ్మెల్యే పర్వత..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వాణీమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామివారిని నేరుగా సేవచేసుకునే భాగ్యం ప్రత్యేక ఆహ్వానితునిగా రావడం అద్రుష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనను బోర్టులోకి ప్రత్యేక ఆహ్వానితుగా నియమించడం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Annavaram

2021-09-21 12:00:18

నిరుపేదలకు శ్రీవారి ఉచిత దర్శనం..

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింద‌ని ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌ అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈఓ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే 9 రోజుల్లో రాష్ట్రంలో టిటిడి ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన 500 నుంచి 1000 మంది భ‌క్తుల‌ను బ‌స్సుల్లో ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్ డిపిపి, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వేద పారాయ‌ణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు అంద‌జేయాలని అధికారులకు సూచించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

          బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్ర‌హ్మోత్స‌వాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్త‌యిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. వాహ‌నసేవలు జ‌రిగే ప్రాంత‌మైన ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో చిన్న బ్ర‌హ్మ‌ర‌థం ఏర్పాటు చేయాల‌న్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో భ‌క్తుల‌కు, విఐపిల‌కు ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు సూచించారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని కూడ‌ళ్లు ఇత‌ర ముఖ్య‌మైన ప్రాంతాల్లో శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్న‌ప్ర‌సాదాల్లో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను ఆదేశించారు. వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ప‌రిమిత సంఖ్య‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. పారిశుద్ధ్యం చ‌క్క‌గా ఉండాల‌ని, క్ర‌మం తప్ప‌కుండా నీటి నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు.

       అంతకుముందు టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, అక్టోబ‌రు 6న అంకురార్ప‌ణ జ‌రుగుతాయ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, అక్టోబ‌రు 12న స్వ‌ర్ణ‌ర‌థం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ స‌మావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు,  గోవిందరాజ దీక్షితులు, టిటిడి జెఈవో  స‌దా భార్గ‌వి, అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య‌, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో  ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  ట్రాన్స్‌పోర్టు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్  శేషారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, హెచ్‌డిపిపి ప్రోగ్రామింగ్ అధికారి విజ‌య‌సార‌థి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి ఇత‌ర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-21 11:39:13

తూ.గో.జి.లో మళ్లీ 144 సెక్షన్ అమలు..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా కోవిడ్-19 నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకూ రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ 144 సెక్షన్ అమలుకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ మేరకు కర్ఫ్యూ సమయంలో ఆరుబయట వ్యక్తుల సంచారాన్ని నిషేదిస్తూ,  ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా, మిగిలిన అన్ని షాపులు, సంస్థలు, కార్యాలయాలను విధిగా మూసివేయాలని ఆదేశించారు. అలాగే ఏదేని ప్రదేశంలో 5గురు కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడ రాదని తెలిపారు.  ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005, ఐపిసి-188 సెక్షన్ ల క్రింద చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 

Kakinada

2021-09-21 11:27:50

ఎయిర్ పోర్టు భూసేకరణ వేగవంతం చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ జి.సి. కిశోర్ కుమార్ మంగ‌ళ‌వారం త‌న ఛాంబర్‌లో సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, సాంకేతిక ప్ర‌క్రియ‌ల‌ను త్వ‌రిత‌గతిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అవార్డు అయిన భూముల‌కు సంబంధించి అంగీకారం తీసుకొని సంబంధిత బ‌కాయిలు చెల్లించాల‌ని సూచించారు. వివాదాలు ఉన్న‌టువంటి స్థ‌లాల్లో రీ స‌ర్వే చేయించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చెప్పారు. ఎ. రావివ‌ల‌స‌, గూడెపువ‌ల‌స ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను జేసీ ఈ సంద‌ర్భంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న భూముల గురించి ఆరా తీశారు. స‌ర్వే, రెవెన్యూ అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సూచించారు. స‌మావేశంలో ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్‌, కె.ఆర్.ఆర్‌.సి. ఎస్‌డీసీ పద్మావ‌తి, డీటీలు, స‌ర్వే విభాగ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-21 11:18:01

పాలిటెక్నిక్ కు భవనాల పరిశీలించిన స్పీకర్..

వ్యవసాయ పాలిటెక్నిక్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట చర్యలు చేపడుతున్నట్లు శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజ్, డిగ్రీ కళాశాలలకు స్థల పరిశీలన, వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజ్ కు తాత్కాలిక భవనాల కొరకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం మంగళ వారం పరిశీలించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుండి  వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ తరగతులు  ప్రారంభించుటకు చర్యలు చేపడుతున్నారు. తాత్కాలికంగా తరగతులు ప్రారంభించుటకు  నిరుపయోగంగా ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు స్పీకర్ సీతారాం చెప్పారు. అనంతరం అక్కడ తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వ్యవసాయ కళాశాల మంజూరు కావడం ముదావాహమని ఆయన చెప్పారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో కళాశాలను మంజూరు చేశారని ఆయన అన్నారు. జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే నని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతిక విద్యను అభ్యసించి నైపుణ్యాలు సాధించాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగం లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చు కోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, అధికారులు, అనదికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-21 08:11:13

కలెక్టర్ సూర్యకుమారి వినూత్న ఆలోచన.. జూమ్ లో గురజాడ గేయాలాపన..

గురజాడ 159 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి వినూత్న ఆలోచన చేసారు.  కోవిడ్ ను దృష్టిలోపెట్టుకొని ప్రత్యక్షంగా విద్యార్ధులు పాల్గొనలేని పరిస్థితి ఉన్నందున వారందరిని జూమ్ ద్వారా పాల్గొని గురజాడ విరచిత గేయాన్ని  దేశమును ప్రేమించుమన్నా –మంచి యన్నది పెంచుమన్నా  ఒకేసారి సామూహికంగా ఆలపించే ఏర్పాటుచేసారు. ముందుగా మహారాజా సంగీత కళాశాల వారు పాడి  వినిపించగా తదుపరి అందరూ అదే  బాణీ లోపాడారు.  ఈకార్యక్రమం లో  34 మండల ప్రధాన కేంద్రాల్లో నున్న పాఠశాలల , 5 మున్సిపల్  , 25 కే జి బివి పాఠశాలల, 11 డిగ్రీ కళాశాలల విద్యార్ధులతో పాటు కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులు,  గిరిజన విశ్వ విద్యాలయం, సెంచూరియన్ విద్యార్ధులు,  6 ఇంజినీరింగ్  కళాశాలల విద్యార్ధులు , జిల్లా విద్య శాఖ, మున్సిపల్ కమీషనర్, సాంస్కృతిక కలశాల ల నుండి  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ  గురజాడ  గీతాన్ని ఆలపించిన తర్వాత విద్యార్ధులకు ఆ గేయం  అర్ధాన్ని, భావాన్ని అర్ధం అయ్యేలా ఉపాధ్యాయులు  వివరించాలని అన్నారు.  వినూత్నంగా అందరిని కలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులైన వారందరికి అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమం లో కలక్టరేట్ నుండి కలెక్టర్ తో పాటు జే. సి లు డా. కిషోర్ కుమార్, జే. వెంకట రావు, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, ఐ అండ్ పి ఆర్  ఎ.డి డి. రమేష్,  రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి డి. కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-21 07:21:26

సింహగిరిపై సర్పాలను రక్షించిన సిబ్బంది..

సింహగిరి క్షేత్రంపై చెత్తాచెదారాన్ని తొలగించే క్రమంలో కనిపించిన సర్పాలను ఫారెస్టు సిబ్బంది ప్పత్యేకంగా వాటిని పట్టుకొని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. సోమవారం సింహగరిపై గోశాల ప్రాంతంలో చెత్తలను తొలగించే క్రమంలో కొన్ని సర్పాలు దర్శనమిచ్చాయి. దీనితో అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని జాగ్రత్త పట్టుకున్నారు. అటివీ సిబ్బంది. అధికంగా పసరు పాములు ఇక్కడ అధికంగా వున్నాయి. వాటిని స్నేక్ స్టిక్ సహాయంతో పట్టుకొని డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సర్పాలను రత్నగిరి క్షేత్ర సమీపంలో చంపకూడదనే ఈ ఏర్పాట్లు చేసినట్లు ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు.

Simhachalam

2021-09-21 06:57:50

చిత్తూరు జిల్లా స్పందనకు 236 అర్జీలు..

సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అని గ్రామ సచివాలయం లో కూడా స్పందన అర్జీలను ఇవ్వవచ్చనని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. సోమవారం నాడు స్పందన కార్యక్రమం వద్దు అని ప్రకటించినా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు రావడంతో జిల్లా కలెక్టర్  చొరవ తీసుకుని అప్పటికప్పుడే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 236 మంది లబ్ధిదారుల నుంచి వారి వారి సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన 131,వివిధ డిపార్ట్ మెంట్లకు సంభందించి51, డి ఆర్ డి ఏ కు 35,హౌసింగ్ కు 10, సివిల్ సప్ప్లైస్ కి 02,పోలీసు శాఖకు 02 సమస్యలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్లు రాజా బాబు, వెంకటేశ్వర, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, సివిల్ సప్లైస్ అధికారి శివరాం ప్రసాద్, జెడి అగ్రికల్చర్ దొరసాని తదితరులు పాల్గొన్నారు.

Chittoor

2021-09-20 14:28:05

జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై మండల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణం పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ వహించాలని, లబ్ధిదారులకు ప్రేరణ కల్పించి త్వరితగతిన గృహాలు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు. పనులు పూర్తి అయిన మేరకు బిల్లులను అప్లోడ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. పునాదుల స్థాయి నుండి ఇతర స్థాయిలకు నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్ , గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. గణపతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కూర్మా రావు, ఆర్డీవో ఐ.కిషోర్  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-20 14:25:17