1 ENS Live Breaking News

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ..

విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షులు, ఉపాధ్య‌క్షుల‌ ఎన్నిక‌కు ఆదివారం నోటిఫికేష‌న్ ను జారీ చేసిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ముగిసిన అనంత‌రం, సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు, 25న జిల్లా ప‌రిష‌త్‌కు అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆమె ప్రక‌టించారు. జిల్లాలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. మొత్తం జిల్లాలోని 34 జెడ్‌పిటిసి స్థానాల‌కు గానూ, 3 స్థానాలు ఏక‌గ్రీవంగా వైసిపి గెలుచుకోవ‌డంతో, మిగిలిన‌ 31 స్థానాల‌కు ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టామ‌న్నారు. ఈ 31 స్థానాల‌ను కూడా వైసిపి పార్టీ గెలుచుకుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తం జెడ్‌పిటిసి ఎన్నిక‌ల్లో 9,17,724 ఓట్లు పోల‌య్యాయ‌ని, వాటిని లెక్కించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.
                 జిల్లాలో 549 స్థానాల‌కు గానూ, 55 స్థానాలు ఇదివ‌ర‌కే ఏక‌గ్రీవం అయ్యాయ‌ని, ఎన్నిక‌లు జ‌రిగిన 487 స్థానాల‌కు గానూ పోలైన సుమారు 9,04,302 ఓట్లను ఆదివారం లెక్కించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 389 స్థానాల‌ను, టిడిపి 86 స్థానాల‌ను, బిజెపి ఒక స్థానాన్ని, స్వ‌తంత్రులు 11 స్థానాల‌ను గెలుచుకున్నార‌ని చెప్పారు. ఐదుచోట్ల రీకౌంటింగ్ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. బాడంగిలో ఓట్లు త‌డిచిపోవ‌డంతో, 25 ఓట్ల‌ను ప్ర‌క్క‌కు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అయితే అక్క‌డ సుమారు 300 ఓట్ల మెజారిటీతో టిడిపి గెలుపొంద‌డంతో, ఎటువంటి ఇబ్బందీ లేకుండా స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింద‌ని చెప్పారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన రాజ‌కీయ పార్టీల‌కు, ప్ర‌జ‌ల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి క‌లెక్ట‌ర్‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియా స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-19 15:12:20

టిటిడి ట్రస్టు బోర్డు సభ్యుడిగా టంగుటూరి..

తిరుమల తిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా  టంగుటూరి మారుతిప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ మారుతిప్రసాద్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-19 06:52:54

తూ.గో.జిలో కౌంటింగ్ సర్వం సిద్దం..కలెక్టర్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం కాకినాడ అశోక్ నగర్ లో మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కాకినాడ గ్రామీణం, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, యూ కొత్తపల్లి మండలాల స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పరిశీలించారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లేక్కింపు  ప్రక్రియకు సంబంధించి 7డివిజన్ లలో 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి అన్ని అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం తుది ఓట్ల లెక్కింపు ప్రారంభించి మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయడం జరుగుతుందని దీనికి అనుగుణంగనే టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎటువైపు నుంచి ఏజెంట్లు, సిబ్బంది రావాలి, బారికేడ్లు ఏర్పాట్లు, తదితర అంశాలపై కలెక్టర్ హరికిరణ్ అధికారులకు పలు సూచనల చేశారు. గొల్లప్రోలు మండలనికి సంబంధించి  శిక్షణకు హాజరయిన కౌంటింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి, ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన పద్ధతులు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
     అనంతరం కలెక్టర్ హరికిరణ్ రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు మండలాలకు  సంబంధించిన స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్ని కృష్ణ, డీడీ హార్టికల్చర్ రామ్మోహన్ రావు, సీపీవో పీ.బాలాజీ, ఎమ్ హెచ్వో డా.పృథ్వీచరణ్, కాకినాడ గ్రామీణం  ఎంపీడీవో పీ.నారాయణమూర్తి,
తహసిల్థార్ వీ మురళీకృష్ణ, కరప మండలం ఎంపీడీవో కె.స్వప్న, తహసిల్దార్ విశ్వేశ్వరరావు, పెదపూడి మండలం ఎంపీడీవో పి.విజయభాస్కర్, తహసిల్దార్ టీ.సుభాష్, సామర్లకోట మండల తహసీల్దార్ జితేంద్ర, తాళ్లరేవు మండలం ఎంపీడీవో పి.విజయ్ థామస్, తహసిల్దార్ జీ.చినబాబు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-09-18 14:08:37

విశాఖజిల్లాలో కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడండి..

విశాఖజిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపు గా చేపట్టి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎలా పరిశీలకులు ఎం ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్లో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణాధికారి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విశ్వేశ్వరరావు లతో సమావేశమై ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై చర్చించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం  ఆయన భీమునిపట్నం ఆనందపురం హలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలించారు.

Visakhapatnam

2021-09-18 13:48:39

8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కావాలి..

ఎం .పి .టి.సి., జెడ్.పి.టి.సి., ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబందించి అన్ని కౌంటింగ్ హాల్స్ వద్ద ఉదయం 8గంటల కల్లా ప్రారంభించాలని  అందుకు తగిన ఏర్పాట్లుతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  ఓట్ల లెక్కింపు    అధికారులను, సిబ్బందిని  ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు  కౌంటింగ్ ఏజెంట్లకు సంబందిత రిటర్నింగ్ అధికారులు గుర్తింపు కార్డులను ఇచ్చి లోపలకు పంపించాలన్నారు.  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా  సామాజిక దూరం పాటిస్తూ  సీటింగ్ ఏర్పాట్లను చేయాలన్నారు. 
 19వ తేది ఆదివారం ఓట్ల లెక్కింపు పురస్కరించుకొని  శనివారం జిల్లా కలెక్టర్ అనకాపల్లి, మునగపాక, అచ్చుతాపురం మండలాలలో  పర్యటించి  అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ అధికారులు, సిబ్బందితో  కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను  పగడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు.  నిరంతర విద్యుత్తు , గాలి, వెలుతురు ఉండాలని  శానిటేషన్, నిరంతర నీటి సౌకర్యం, తదితర మౌళిక వసతులతో సిద్దంగా ఉండాలన్నారు.  అచ్చుతాపురం జెడ్.పి.హెచ్ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ అక్కడి విద్యార్ధులతోను, టీచర్లతోను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులు తమ పాఠశాలలో ఆట స్థలం  పాడైపోయిందని, బాగు చేయించాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందిస్తూ నాడు – నేడు పనులలో భాగంగా గ్రౌండుకు మరమ్మత్తులను చేయించాలని  ప్రధానోపద్యాయులను  ఆదేశించారు.  
 కలెక్టర్ పర్యటనలో అనకాపల్లి ఆర్.డి.ఓ., సీతారామరావు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,ఇతర అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-09-18 13:39:49

రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయండి..

అనంతపురం నగరంలో రోడ్ల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శనివారం  నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తో కలసి మేయర్  పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం  సప్తగిరి సర్కిల్ ,హాస్పిటల్ రోడ్డు, యస్ యస్ ప్యారడైస్ ముందు, ఆర్ట్స్ కాలేజీ వద్ద ,ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర, వేమన టెలిఫోన్ భవన్ వద్ద తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులు జరుగుతున్నట్లు అధికారులు మేయర్ కు వివరించారు. నాణ్యత తో పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాంజినేయులు, డిఈ కృష్ణారావు, ఏఈ శంకర్,  సెక్రెటరీ కే తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-18 12:12:29

వైఎస్సార్ కంటివెలుగు నిరుపేదలకు వరం..

వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం పేదలకు  వరమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అనంతపురం 21 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మహాత్మాగాంధీ స్కూల్ లో వైయస్సార్ ఇంటింటా కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష 3వ దశ  కార్యక్రమం ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్  పాల్గొని చికిత్స లు అందిస్తున్న తీరును పరిశీలించారు. అన్ని అవయవాలు కళ్ళు ఎంతో ముఖ్యమైనవని కంటిచూపు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వృద్దులే కాకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ, ఆపరేషన్ లు ఉచితంగా చేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు చంద్రలేఖ, కమల్ భూషణ్,బాలాంజినేయులు,స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-18 10:17:54

కోవిడ్ 3వ దశను దైర్యంగా ఎదుర్కోవాలి..

కోవిడ్ - 19 మూడవ దశను ఎదుర్కొనుటకు అంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు చూసుకోవాలని సూచించారు.   వైద్యులు, సిబ్బంది, మెడిషన్, తదితర వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా జరగాలని, రెండవ డోసు ఖచ్చితంగా వేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డెంగ్యూ కేసు బలగలో నమోదు అయ్యిందని, కమీషనర్లు శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీకాకుళం ఓబులేసు, రాజాం ఆమదాలవలస, పలాస - కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్లు రమేష్, సుధాకర్, రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-18 10:08:31

అప్పన్న ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఈమేరకు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవిత్రోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకుంటే తెలిసీ, తెలియక చేసిన తప్పులను స్వామి క్షమిస్తారని నమ్మిక ఉందన్నారు. కరోనా పూర్తిస్థాయిలో సమసిపోయి జనజీవనం సాధారణ మార్గంలోకి రావాలని స్వామిని కోరుకున్నట్టు గంట్ల చెప్పారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Simhachalam

2021-09-18 08:36:57

బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్ వైవీ..

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్  వైవి సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ 
ఈఈ  శివరామ కృష్ణ, ఎఈవో  మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి,  కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-18 08:28:14

కౌంటింగ్ కేంద్రాలో పూర్తి వసతులుండాలి..

విజయనగరం జిల్లాలో ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద తగినంత గాలి, వెళుతురు , తాగు నీరు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్  ఏ.సూర్య కుమారి ఆదేశించారు.  చీపురుపల్లి నియోజక వర్గం కు సంబంధించిన చీపురుపల్లి, గుర్ల, మేరకముడిదాం, గరివిడి మండలాల  కౌంటింగ్  ను  ఏర్పాటు చేసిన గరివిడి ఎస్.డి.ఎస్  కళాశాలలో ఏర్పాట్లను  శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు.  అక్కడ జరిగుతున్న కౌంటింగ్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. సిబ్బంది  అటెండన్స్ , వాక్సినేషన్ వేసుకుంది లేనిదీ అడిగారు. అనంతరం  స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించారు. మెరకముడిదాం  జెడ్ పి టి సి ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు జెడ్ పి టి సి లు,  ఎం.పి.టి సి  ల కౌంటింగ్ కోసం 10 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ ను తనిఖీ చేసిన కలెక్టర్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటించేలా సీటింగ్ ఏర్పాటు గావించాలన్నారు.   ఎన్నికల ఫలితాలను గేట్ ముందు ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.  ఫలితాల కోసం లోపలకి వచ్చేవారిని  అనుమంతించ వద్దన్నారు.  కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ప్రతి  పని లో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు.  ఈ కార్యక్రమం లో ప్రత్యేక అధికారి, ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి. ఎం.పి.డి.ఓ లు , తహశీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-18 08:24:41

సంస్కరణలను కఠినంగా అమలు చేయాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో  నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శాఖాపరమైన సమీక్షల కోసం శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) ఎంవి శేషగిరిబాబు, డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను వారి నివాసంలో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. అనంతరం జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ  నకిలీ చలానాల కేసుల తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యాలయాలను తనిఖీ చేసి భవిష్యత్తులో పొరపాట్లకు అవకాశం లేని విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పర్యటనను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. నకిలీ చలానాల రికవరీ వేగిరం చేయాలని, దర్యాప్తును సత్వరమే పూర్తి చేసి నివేదిక అందజేయాలని కోరారు. శనివారం నుంచి పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఐజి సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ అర్.సత్య నారాయణ, నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ బీఎస్ఎన్.రమణారావు, సిబ్బంది బాలన్న తదితరులు ఉన్నారు.

Srikakulam

2021-09-18 07:37:54

కాణిపాకం వినాయకుడికి టిటిడి పట్టు వస్త్రాలు..

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి కి డిప్యూటీ సిఎం  నారాయణ స్వామి, శాసన సభ్యులు ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో శ్రీ వెంకటేసు స్వాగతం పలికారు.  అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఆలయ ఈవో కు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో వెంకటేసు టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు   స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు. వకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ ఈఈ  శివరామ కృష్ణ, ఎఈవో  మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి,  కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-18 07:30:31

కౌంటింగ్ అయ్యేవరకూ మద్యం బంద్..

విశాఖ జిల్లాలో ఈ నెల 19న ఆధివారం  ఎం .పి.టి.సి., జెడ్.పి.టి.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం మైన వాతావరణంలో సజావుగా నిర్వహణకు  అన్ని రకాల ఏర్పాట్లతో  సిద్దంగా  ఉండాలని అధికారులను  జిల్లా కలెక్టర్  డా. ఎ.మల్లిఖార్జున  ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకు  జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం  దుకాణాలు, బార్ లు, టి.సి.ఎస్ షాపులు, క్లబ్స్, క్యాంటీన్స్, టూరిజం బార్ లు , ఎ.పి.ఎస్.బి.సి.ఎల్ డపాట్స్ మూసివేసి సంపూర్ణ డ్రైడె  పాటించాలని కలెక్టర్  ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా,మద్యం  అమ్మకాలు జరగకుండా పూర్తి నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో నైనా నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే చట్ట ప్రకారం సంబందిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Visakhapatnam

2021-09-18 05:44:35