1 ENS Live Breaking News

పార‌ద‌ర్శ‌కంగా ఓట్ల లెక్కింపు జరపాలి..

పార‌ద‌ర్శ‌కంగా, ప‌క‌డ్భంధీగా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. ఈ నెల 19న నిర్వ‌హించ‌నున్న‌ జెడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, ఆర్ఓలకు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముందుగా మండ‌లాల వారీగా లెక్కింపున‌కు జ‌రుగుతున్న ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, లెక్కింపు ప్ర‌క్రియ‌లో పాల్గొనే సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండి విధుల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను సంపూర్ణంగా అవ‌గాహ‌న చేసుకొని, వాటిని అమ‌లు చేయాల‌న్నారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో ఆర్ఓల‌దే తుది నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల‌కల్లా మొద‌లు పెట్టాల‌ని, దానికి అనుగుణంగా ముందుగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌న్నారు. 30వేల కంటే అధికంగా ఓట్లు ఉన్న చోట‌, అద‌నంగా సిబ్బందిని వినియోగించుకోవాల‌ని సూచించారు. సెల్‌ఫోన్ల‌ను అమ‌తించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు.  ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. లెక్కింపు ప్ర‌క్రియ‌లో పాల్గొనే సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ల‌కు వేక్సినేష‌న్ పూర్త‌యిన‌ట్లు స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. స‌ర్టిఫికేట్ లేని వారంద‌రికీ త‌క్ష‌ణ‌మే కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించి, ఫ‌లితాన్ని బ‌ట్టి లోప‌లికి అనుమ‌తించాల‌ని సూచించారు. కేంద్రాల‌వ‌ద్ద మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఏజెంట్ల‌ను అటూఇటూ తిర‌గ‌డానికి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఓట్ల‌ను లెక్కించే విధానాన్ని, పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను, కేంద్రాలు, బ‌ల్ల‌ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా, జిల్లా ఎన్నిక‌ల శిక్ష‌ణ నోడ‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌.అప్ప‌ల‌నాయుడు వివ‌రించారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, డిఎఫ్ఓ వెంక‌టేష్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-17 13:38:26

సెంటు భూమికి కూడా సాగునీరు అందిస్తాం..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి సెంటు భూమికి కూడా సాగునీటిని అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి వసతి గృహంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ  తన నియోజక వర్గంలో గల తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరుచేస్తూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల సభాపతి హర్షం వ్యక్తం చేసారు. కళాశాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, ప్రధానంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులకు అభినందనలు తెలిపారు. తాను చేసే ఈ ప్రయత్నానికి సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందించిన  శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు సభాపతి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.   జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు వెన్నెలవలసలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాలను గత మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇది అభినందనీయమని గుర్తుచేసారు. ఇవేకాకుండా పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలసలో యన్.టి.ఆర్. గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, వంశధార హైలెవెల్ కెనాల్, నారాయణపురం, నాగావళి అనుసంధాన ప్రోజెక్ట్, పట్టణ ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్పుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞాతాభివందనాలు తెలియజేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాలో మరికొన్ని పెద్ద ప్రోజెక్టులు క్లియర్ కాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే నేరేడి బ్యారెజ్ క్లియరెన్స్ అయిందని, దానిపై ఒడిషా ముఖ్యమంత్రితో చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలిపారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కూడా త్వరలో క్లియర్ కాబోతుందని, నేరేడి క్లియరెన్స్ వలన  వంశధార – బాహుదా నదుల అనుసంధానానికి పెద్దఎత్తున ప్రయత్నం జరగబోతుందని అన్నారు. నేరెడి బ్యారెజ్ పై  ఇన్విస్టిగేషన్, సర్వే కూడా జరుగుతుందని, ఈ రెండు నదులు అనుసంధానం చేసుకోగలిగితే జిల్లాలో సెంటు భూమికి కూడా సాగునీటిని అందించేందుకు వీలు కలుగుతుందని సభాపతి స్పష్టం చేసారు. ఇది చిరకాలం నాటి  కల అని, ఆ కల త్వరలో నిజం కాబోతుందని, ఆ కల నిజం అయ్యేందుకు     రాష్ట్ర ముఖ్యమంత్రి అవిరళమైన కృషిచేస్తున్నట్లు వివరించారు. ఇవేకాకుండా కిడ్నిరోగుల కోసం ఆసుపత్రి, ఉద్దాన ప్రాంత ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు, నరసన్నపేటలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ వంటి వాటిని ప్రభుత్వం ఇప్పటికే మంజూరుచేసిందని గుర్తుచేసారు.  ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుండి జిల్లాకు 70 వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చే పరిస్థితికి ప్రభుత్వం క్లియర్ చేసిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జిల్లాకు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రిని కోరగా తక్షణమే స్పందిస్తూ సుజల స్రవంతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. దీనివలన  రణస్థలం, పొందూరు, లావేరు మండలాల్లో ప్రతీ సెంటు భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్ కు సంబంధించి రైతాంగానికి చెల్లించవలసిన నష్టపరిహారాన్ని త్వరలో అందించి ఆ పనులను కూడా పెద్దఎత్తున పూర్తిచేసుకొని ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు దాన్ని కనెక్ట్ చేయబోతున్నట్లు సభాపతి స్పష్టం చేసారు. తద్వారా మరో 18 వేల ఎకరాలకు సాగునీటిని అందించే పరిస్థితి రాబోతుందని సభాపతి వివరించారు. ఈ విధంగా ఇరిగేషన్ , ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ పై పెద్ద ఎత్తున దృష్టిసారించి ప్రభుత్వం ముందుకువెళ్తుందని అన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ విమర్శలు వస్తున్నాయని,  విమర్శలు సహజమని, అయితే సద్విమర్శలు, సహేతుకమైన విమర్శలు చేస్తే తప్పక వాటిని స్వీకరిస్తామని, అంతేగాని లేనిపోని ఆరోపణలు చేయరాదని హితవు పలికారు.  

Srikakulam

2021-09-17 13:07:40

ఎస్వీ యూపీ స్కూలులో ప్లే క్లాస్ తరగతులు..

తిరుమల స్థానికుల విజ్ఞప్తి మేరకు టిటిడి ఈఓ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభించినట్టు జెఈఓ  సదాభార్గవి తెలిపారు. ఈ మేరకు జెఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించి ప్లే క్లాస్ తరగతుల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానికులు వారి పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య కోసం తిరుపతికి పంపించలేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమల ఎస్వీ పాఠశాలలోనే ఈ తరగతులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు. అనంతరం భోజనం నాణ్యతను పరిశీలించారు. త్వరలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి కావాల్సిన వసతులపై చర్చించాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆమె విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వసతులు, విద్య గురించి చర్చించగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిఈఓ  గోవిందరాజన్, పాఠశాల హెచ్ఎం  కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tirumala

2021-09-17 12:17:29

టిటిడిలో కొత్త ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారం..

యానాంకు చెందిన  మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే  ఎపి.నందకుమార్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శుక్రవారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జెఈవో సదాభార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. అనంతరం ఆలయం వెలుపల మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డులో తనకు మొదటిసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. గతంలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవ చేశానని, అయితే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తునిగా స్వామివారి భక్తులకు సేవ చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆలయం వెలుపల  ఎపి.నందకుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో తనకు ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం వచ్చిందని, సాధారణ సేవకునిగా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-17 12:14:59

ఎస్వీబీసీలో అన్నమయ్య కీర్తనల ప్రచారం..

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి  ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా  విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించేందుకు " ఆదివో అల్లదివో '' పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హించాల‌ని నిర్ణయించామన్నారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో యువ‌త‌కు పోటీలు నిర్వ‌హిస్తామని చైర్మన్ వివరించారు. టిటిడి రికార్డు చేసిన 4 వేల  సంకీర్తనల  నుంచే ఈ పోటీలు నిర్వ‌హించ‌డం జరుగుతుందన్నారు. తద్వారా యువతను భక్తి మార్గంలో నడిపించేందుకు ఇదొక వేదిక అవుతుందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆసక్తి కలిగిన గాయనీ గాయకుల నుంచి ఎస్వీబీసీ వెబ్సైట్ లోను, నేరుగాను దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25 , 26 వ తేదీల్లో  ఎస్వీబీసీ కార్యాలయంలో సెలెక్షన్స్ నిర్వహిస్తారని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.  నేరుగా రాలేని వారికి 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూమ్ ద్వారా సెలెక్షన్స్ జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ కన్నడ, హింది చానళ్ళు ప్రారంభమవుతాయనీ, ఈ చానళ్ల ద్వారా  కూడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్  సాయి కృష్ణ యాచెంధ్ర, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, ఎస్వీబీసీ డైరెక్టర్  శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2021-09-17 12:10:26

సివిల్స్ పరీక్షకు ఏర్పాటు పూర్తిచేయాలి..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 10వ తేదీన  జరగనున్న నేపథ్యంలో జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని యూపీఎస్సీ పరీక్షల నిర్వాహకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శుక్రవారం యూపీఎస్సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లాల కలక్టర్ లతో మాట్లాడారు. 10-10-2021  ఆదివారం ఉదయం పేపర్- I 9.30 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం పేపర్- II 2.30 నుంచి 4.30 వరకూ జరుగుతాయన్నారు. పరీక్షలకు  అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందుగా హాజరవ్వాలన్నారు. పరీక్షా విధివిధానాలను తప్పక పాటించాలన్నారు.పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో కుర్చీలు, బెంచీలతో పాటు  నిరంతర విద్యుత్ సరఫరా , ఫ్యాన్స్,టాయిలెట్స్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు.  పరీక్షలురాసే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ తో వైద్య సిబ్బంది ని  అందుబాటులో ఉంచాలన్నారు.          జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున మాట్లాడుతూ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖలో 32 పరీక్షా కేంద్రాల లో 12,166 మంది అభ్యర్థులు పరీక్షలను రాయ నున్నారన్నారు. పరీక్షా కేంద్రాల లో ఏర్పాట్లను పర్యవేక్షించుటకు ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-17 12:08:58

శ్రీకాకుళంలో 19న ఎంపీటీసి ఓట్ల లెక్కింపు..

జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 19వ తేదిన జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై శుక్రవారం మండల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పది చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోందన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తక్షణం తనిఖీ చేసి అవసరమగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్ చేయడం, బందో బస్తు, సిబ్బంది, తదితర ఏర్పాట్లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కౌంటింగ్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6 గంటల నాటికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.  ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. సిసి టివిలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని ఆయన చెప్పారు. కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది అవసరం ఉంటుందని, గతంలో రిజర్వ్ సిబ్బందితో పాటు కేటాయింపు సైతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలో జెడ్పీటీసీ కి 37 టేబుల్స్, ఎంపిటిసికి 590 టేబుల్స్ ఏర్పాటుకు గతంలోనే కార్యాచరణ తయారు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి వాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ :
కౌంటింగ్ సిబ్బందికి శని వారం శిక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శని వారం ఉదయం 7 గంటల నాటికి కౌంటింగ్ కేంద్రాల వద్ద హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చించారు.

కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేయాలి..
కౌంటింగ్ ఏజెంట్ల నియామకం తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోటీ చేసిన అభ్యర్థులకు వెంటనే సమాచారం అందించి ఏజెంట్ల వివరాలు సమర్పించాలని ఈసుకోవాలని ఆయన అన్నారు. ఏజెంట్ల వివరాలు పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాస్ లు జారీ చేయాలని ఆయన సూచించారు. శని వారం నాటికి పాస్ లు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

144 సెక్షన్ విధింపు..
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్ల ఆయన చెప్పారు.  జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతి లేదు..
లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.  మైక్ లను వినియోగించరాదని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిధిలో పండాల్స్, మైక్ లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయరాదన్నారు. అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేయాలని, బందో బస్తు ఏర్పాటులో ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్.శ్రీరాములు నాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, జిల్లా పరిషత్ సీఈఓ బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్.కూర్మారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-17 12:07:40

కౌంటింగ్ కి పూర్తిస్థాయి ఏర్పాట్లుచేయాలి..

ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ప్రశాంత వాతావరణంలో  ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ,సీ పీ లు, ఎస్పీలు , జిల్లా పరిషత్ సీఈఓ లతో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.  ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్దఅవసరమైన  మౌలిక వసతులతో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు వీడియో కవరేజ్ చేయాలన్నారు.కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన మెటీరియల్ ను అందించాలన్నారు . ఏజెన్సీ ప్రాంత మండలాలలో మరియు సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లిఖార్జున మాట్లాడుతూ విశాఖజిల్లాలో కౌంటింగ్  ఏర్పాట్లు కు అన్నీ సిద్ధం చేయడం జరిగిందని  సీఎస్ కు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన 612 ఎం పీ టీ సీ లు, 37 జెడ్ పీ టీ సీ స్థానాలకు 79  కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 587 ఎంపీటీసి,568 జెడ్ పీటీసి కౌంటింగ్ టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్దన్నారు . పది శాతం రిజర్వ్ సిబ్బంది తో కలిపి మొత్తం 3811 మంది కౌంటింగ్ సిబ్బంది ని నియమించడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియో కవరేజ్  ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదన్నారు. గురువారం సాయంత్రం  కౌంటింగ్ సిబ్బందికి  మొదటిసారి శిక్షణను ఇవ్వడం జరిగిందని, శుక్రవారం కూడా మరొకసారి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతీ నియోజక వర్గానికి పరిశీలన నిమిత్తం ప్రత్యేక అధికారి ని నియమించడం జరిగిందన్నారు. కౌంటింగ్ సంబంధిత మెటీరియల్ను సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల  వద్ద 144 సెక్షన్ ఏర్పాటు కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలు,మరియూ సమస్యాత్మక కేంద్రాల వద్ద స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితులలో అవసరమైన  సిబ్బంది కొరకు 10 శాతం అదనపు  కౌంటింగ్ సిబ్బందిని రిజర్వు లో సిద్ధం చేసుకోవడం జరుగుతున్నదన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్ పి బి కృష్ణా రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున, డి పి ఓ కృష్ణ కుమారి తదితరులు హాజరయ్యారు.


Visakhapatnam

2021-09-17 11:56:34

నైపుణ్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..

నైపుణ్యంలో ఉచిత శిక్షణ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.సి. కార్పొరేషన్ ఇడి కె. రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  DSCSCS లిమిటెడ్, శ్రీకాకుళం -NSFDC- స్కిల్ ట్రైనింగ్/PM -DAKSH -షార్ట్, మీడియం మరియు లాంగ్ టర్మ్ స్కిలింగ్ ప్రోగ్రామ్లు-ట్రేడ్లు, ఇండస్ట్రీ లింక్డ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కార్యక్రమంలో నిరుద్యోగ SC అభ్యర్థులు తమ పేర్లు https://emdaksh.dosje.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. వెబ్ డెవలప్పర్ (అంతర్జాల వృద్ధికారుడు) గా 3 నెలల 5 రోజులుగా శిక్షణ ఉంటుందని, డిగ్రీ/ వెబ్ డిజైన్ లో డిప్లమా, మీడియా డిజైన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత డిప్లొమా/విద్యార్హత ఉండాలని,  క్యాడ్లో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలల కాలం ఉంటుందని, డిప్లమా/ మెకానికల్ లో డిగ్రీ /ప్రొడ్ ఇంజనీరింగ్ లేదా సమానమైనది ఉండాలని, AI-బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు కు 4 నెలల శిక్షణ కాలం ఉంటుందని,  విద్యార్హత సైన్స్ కంప్యూటర్లో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, సీన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/సమాచారం టెక్నాలజీ ఉండాలని ఆ ప్రకటనలో వివరించారు.  క్లౌడ్ ఆర్కిటెక్ట్ కోర్సు కు 4 నెలలు శిక్షణా కాలం ఉంటుందని, దీనికి విద్యార్హత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ సైన్స్ కంప్యూటర్ సోన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలని, అడ్వాన్స్డ్ ఎక్సెల్లో సర్టిఫికెట్ కోర్సుకు 1.5 నెలల కాలం ఉంటుందని, ఇంటర్ పాస్ మరియు అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉండాలని తెలిపారు.  భద్రతా విశ్లేషకుడు కోర్సు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ కోర్సు చేసి ఉండాలని, దేశీయ  డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు కు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, 10వ తరగతి పాస్ మరియు దాని కంటే ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. CNC మిల్లింగ్ లో సర్టిఫికెట్ కోర్సు కు 6 నెలలు పాటు శిక్షణ  కాలం ఉంటుందని, 10 వ తరగతి ఉత్తీర్ణత మరియు అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు.  CNC టెక్నాలజీలో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలలు పాటు శిక్షణ ఉంటుందని, మెకానికల్/ప్రొడ్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమానమైనది ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  అభ్యర్థుల వయోపరిమితి 18-45 సంవత్సరాల మధ్య ఉండాలని, అభ్యర్థుల వివరాలను అప్లోడ్ చేయడానికి సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం

2021-09-15 14:40:04

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి..

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జోహార్ రెడ్డి చెప్పారు.  ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి తో కలిసి మంగళవారం ఆయన జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం అనంతరం వీరు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా కార్వేటినగరం పుష్కరిణి వద్ద జరిగిన సమావేశంలో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి  మాట్లాడుతూ,  ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని  టీటీడీ ఆలయాల్లో  పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని,  కోవిడ్  వల్ల పర్యటన ఆలస్యమైందని చెప్పారు. ఆలత్తూరు లోని శ్రీ వరద వేంకటేశ్వర స్వామి ఆలయం, కార్వేటినగరం వేణుగోపాల స్వామి,  ఆలయం కలిగిరి కొండ శ్రీవారి ఆలయాలను మంగళవారం పరిశీలించామని చెప్పారు.  కలికిరి కొండ వెళ్లే భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక,  పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులను శ్రీ వాణి ట్రస్ట్ సమావేశంలో చర్చించి మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్వీబీసి ద్వారా టీటీడీ ప్రతిరోజు ప్రసారం చేస్తున్న భగవద్గీత, గరుడ పురాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలు వీక్షించి ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.  కార్వేటినగరంలో  వేణు గోపాల స్వామి కోనేరు మధ్యలో నిర్మిస్తున్న నీరాలి మండపాన్ని మరింత వెడల్పు చేయాలని కోరారు. టిటిడి కళ్యాణ మండపం లో వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కోరారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తో పాటు ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శివరామకృష్ణ, మనోహర్ పలువురు అధికారులు ఉన్నారు.

Nellore

2021-09-14 11:20:03

పౌష్టికాహారం తక్కువచేస్తే ఫిర్యాదు చేయండి..

ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై బలవర్ధక ఆహారంతోపాటు, పాలు కూడా యాప్ ద్వారా అందించనున్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివి సత్యవాణి తెలియజేశారు. మంగళవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలకు యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చామన్నారు. ఇకపై తల్లులు కూడా ఖచ్చితంగా కేంద్రాని వెళ్లే ఆహారం తీసుకోవాల్సి వుంటుందన్నారు. అదే సమయంలో బలవర్ధక ఆహారంలో తేడాలు వచ్చినా, తక్కువగా అంగన్వాడీలు ఇచ్చినా సిడిపిఓలకు ఫిర్యాదు చేయాలన్నారు.

Kakinada

2021-09-14 11:05:50

హౌసింగ్ లక్ష్యాలను సత్వరమే పూర్తిచేయాలి..

వైయస్సార్ జగనన్న గృహ నిర్మాణాలు అర్హులైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా నిర్దేశించిన  లక్ష్యాల  మేరకు త్వరిత గతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా ఎ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి గృహ నిర్మాణ పనులపై వారంతపు సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు, లేఅవుట్లు కు సంబంధించి గ్రౌండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇసుక కొరత ఉంటున్నదని దానిని అధిగమించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు గృహ నిర్మాణ పనులలో బాధ్యత వహించాలని ఎల్లవేళల పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. కొన్ని మండలాల్లో జీరో గ్రౌండింగ్ లేఅవుట్ లున్నాయని వాటిలో గ్రౌండింగ్ పనులను మొదలు పెట్టాలన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు  సంబంధించి  ఎం జి ఎన్ ఆర్ఈ జి ఎస్ ఫండ్స్ ద్వారా వేగవంతంగా పనులను చేయాలన్నారు.
గ్రామ పంచాయత్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు జనరల్ ఫండ్స్ ను బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ ను తయారు చేసి నివేదికను వెంటనే పంపించాల్సిందిగా ఆదేశించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు ఇతర లేఅవుట్ లలో ఉన్నా కూడా సంబంధిత నివేదికను తయారుచేసి రెండు రోజుల్లో పంపిస్తే నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీరో గ్రౌండింగ్ లేఔట్లకు సంబంధించి వచ్చే మీటింగ్ నాటికి కొంత పురోగతి కనిపించాలన్నారు. లేఅవుట్లలో భూముల చదును కు సంబంధించి పనులను వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాలలో పనులు పూర్ పెర్ఫార్మెన్స్ గా ఉందనీ,కాబట్టి  అలసత్వం వహించవద్దన్నారు. పి ఎం ఏ వై వైయస్సార్ గృహ సముదాయాలకు  మ్యాపింగ్ చేసి పనులను మొదలు పెట్టాలన్నారు. లేఅవుట్ లలో ఇంకా జియో ట్యాగింగ్ చేయని వాటికి వెంటనే చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ ప్రకారం  500 పైబడి  లబ్ధిదారులు ఉన్న పెద్ద లేఅవుట్లలో వర్కర్ల కొరకు షెడ్డు నిర్మించాల్సి ఉంటుందనీ, సంబంధిత నిధులను మంజూరు చేయడం జరుగుతుందని దాని నిర్మాణం పై కూడా దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న లేఅవుట్లు, గృహ నిర్మాణాలలో నిరంతరం నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం, ఏర్పాటు చేయాలని ఇసుక, సిమెంటు ,ఐరన్ అందుబాటులో ఉంచాలన్నారు.
          ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ హౌసింగ్ కల్పనా కుమారి, పీ డి హౌసింగ్ శ్రీనివాస రావు, జెడ్ పీ సి ఈ వో నాగార్జున, ఆర్  డబ్ల్యుఎస్ ఎస్ ఈ రవి కుమార్, పీ ఆర్, ట్రాన్స్ కో, మైన్స్ తదితర శాఖ ల అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-14 10:59:38

వాకర్స్ సమస్యల పరిష్కారానికి కృషి..

అనంతపురంలో వాకర్స్ సమస్యల పరిష్కారంకు కృషిచేస్తానని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. మంగళవారం మేయర్ , డిప్యూటీ మేయర్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి లతో కలసి పిటీసీ లో పర్యటించారు. వాకర్స్ తోపాటు క్రీడాకారులతో వారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిటీసీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని,త్రాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు. అదే విధంగా  వాకింగ్ కోసం వచ్చే వారి కోసం పిటీసీ కి ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్క్  ఏర్పాటు చేయాలని,వాకర్స్ సౌకర్యం కోసం లైట్లు ఏర్పాటు చేయాలని మేయర్ ను కోరారు. దీనిపై మేయర్ వసీం ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి మేయర్,డిప్యూటీ మేయర్ లు సమావేశమై వారి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి,కమల్ భూషణ్,  అనిల్ కుమార్ రెడ్డి , పార్టీ నాయకులు ఖాజా , స్పోర్ట్స్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-09-14 10:58:17

14 నుంచి ఎలుకల నియంత్రణ కార్యక్రమం..

తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకూ సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం చేపడుతున్నట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో తన కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయ అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా కార్యక్రమం చేపట్టి రైతులకు అవగాహన కల్పించనున్నట్టు జెడి మీడియాకి వివరించారు.

Kakinada

2021-09-13 15:50:48

మల్టీకలర్ లో శ్రీవారి స‌ప్త‌గిరి మాసప‌త్రిక..

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో టిటిడి ఆర్ష ధ‌ర్మ ప్ర‌భోదం కోసం 1949వ సంవ‌త్స‌రంలో స‌ప్త‌గిరి ప‌త్రిక‌ను బులెటిన్‌గా ప్రారంభించింద‌ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవ‌త్స‌రం నుండి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, ఆంగ్లం, హిందీ  భాష‌ల్లో, 2014వ సంవ‌త్స‌రం నుండి సంస్కృత భాష‌లో ముద్ర‌ణ ప్రారంభ‌మైంద‌న్నారు. 2016వ సంవ‌త్స‌రం నుంచి స‌ప్త‌గిరిని పూర్తిగా రంగుల్లో పాఠ‌కుల‌కు అందిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టికి 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ప‌త్రిక‌ల్లో అగ్ర‌గామిగా ఉంద‌న్నారు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ఆరు భాష్ల‌ల్లో పునఃప్రారంభ‌మైంద‌ని, ఇందులో అనేక కొత్త శీర్షిక‌ల‌తో, ధారావాహిక‌ల‌తో పాఠ‌కుల‌కు నిరంత‌రాయంగా అందుతుంద‌ని చెప్పారు. అంత‌కుముందు అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ప్లాంట్ వ‌ద్ద శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే,  ఈవో, అద‌న‌పు ఈవోలు  పూజ‌లు నిర్వ‌హించి ప్లాంట్‌ను ప్రారంభించారు. త‌రువాత ప్లాంట్‌లో అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసే యంత్రాల ప‌నితీరును ప‌రిశీలించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి,  సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ  సంజీవ‌య్య‌, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, టీటీడీ సిఇ నాగేశ్వ‌ర‌రావు, గో సంర‌క్ష‌ణ శాల డైరెక్డ‌ర్ డా.హ‌ర‌నాథ‌ రెడ్డి, ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్రతినిధులు  శ్రీ‌నివాస్‌, ఆశోక్‌,  హ‌ర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు  రాధా రమణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-13 14:27:29