1 ENS Live Breaking News

ఒప్పంద ఉద్యోగులకు అండగా ఉంటాం

అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ లో ఒప్పంద ఉద్యోగులకు అన్ని విధాలా  అండగా ఉంటామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. 60 సంవత్సరాల పైబడి పదవి విరమణ పొందిన 22 మంది ఒప్పంద కార్మికుల కుటుంబీకులకు సోమవారం ఒప్పంద కార్మికులుగా నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో మేయర్ పాటు డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనేక ఏళ్ల పాటు ఒప్పంద కార్మికులుగా సేవలు చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు తోడుగా ఉండాలన్న భావనతో తిరిగి ఒప్పంద కార్మికులుగా తీసుకోవడం జరిగిందన్నారు.అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్ ,లీలావతి, రహంతుల్లా బాలంజనేయులు కార్యదర్శి సంగం శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి నాయకులు రాధాకృష్ణ, దాదు, దాదా ఖలందర్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-04 15:12:18

జనసురక్ష పథకాలు అర్హులకి అందాలి..

భారత ప్రభుత్వం తలపెట్టిన జన శ్రేయోదాయక ప్రాయోజిత పథకాలు అర్హులైన ప్రతి పౌరునికి అందేలా చర్యలు తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి జనధన యోజన ( పి.ఎం.జె.డి.వై ), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.యస్.బి.వై ), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై ), అటల్ పెన్షన్ యోజన ( ఏ.పి.వై ) మొదలైన జన సురక్ష పథకాలను భారత ప్రభుత్వం అమలుచేస్తుందని, ఈ పథకాలను  అర్హులైన ప్రతి పౌరునకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక సేవల విభాగం అన్ని జాతీయ బ్యాంకుల మేనేజింగ్ డైరక్టర్లు, సి.ఇ.ఓలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా యస్.ఎల్.బి.సి రాష్ట్రంలోని అన్ని జిల్లాల లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిందని తెలిపారు. ఈ నెల 31వరకు అన్ని బ్యాంకులు  ఈ పథకాలపై క్యాంపులను నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. కావున జిల్లాలోని అన్ని బ్యాంకు బ్రాంచుల్లోని సిబ్బంది, మేనేజర్లు, ఫీల్డ్ సిబ్బంది, బ్యాంకు మిత్రాలు, ఆర్ధిక అక్షరాస్యతా కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేసి జన సురక్ష పథకాలు శతశాతం ప్రతీ పౌరునికి అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. 

Srikakulam

2021-10-04 15:08:10

పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ..

విశాఖజిల్లాలో 1వ తేదీన 2022 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితా  ప్రకటించడం జరుగుతుందని డిఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు.  సోమవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా జిల్లాలో 38 పోలింగ్ కేంద్రాల లొకేషన్ లను మార్చడం జరిగిందని, 12 కేంద్రాలకు సంబంధించి భవనాల పేరు మార్చారని, కొత్తగా ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగిందని వారికి వివరించారు.  ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రేస్, బిజెపి, సిపియం, వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 14:55:26

అక్రమ మద్యం పై చర్యలు తీసుకోవాలి..

రాష్ట్రంలో అక్రమ మద్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ 13 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు.  సోమవారం ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలసి  అన్ని జిల్లాల  జిల్లా కలెక్టర్లు ఎస్.పి.లు ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దిశ యాప్ వాడకాన్ని విస్తృత పరచాలని గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టర్  ఏ. మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గ్రామ సచివాలయ స్థాయిలో దిశా యాప్ పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీసు, ఎక్సైజు, అటవీ శాఖ అధికారులతో కలసి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో గంజాయి అక్రమ రవాణా పై దాడులు చేయడం, కేసులు పెట్టడం, సాగును గుర్తించి ధ్వంసం చేయడం మొదలైన చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టడం, నల్ల బెల్లాన్ని,  బెల్లపు ఊటను  గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.వి. ఎన్. బాబ్జి రావు, అడిషనల్ ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-04 14:53:15

మా..ఎన్నికలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బందరులో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,,  ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.   

bandar

2021-10-04 13:37:31

ధ‌ర్మ ప్ర‌చారం కోసం గీతాగాన య‌జ్ఞం పోటీలు..

సనాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లో గీతాగాన య‌జ్ఞం పేరిట శ్లోక ప‌ఠ‌న పోటీలు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి పరిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ శ్రీ‌వారి భ‌క్తుల కోసం అర్చ‌క‌స్వాముల సాయంతో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ్ర‌త విధానానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు భ‌క్తుల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర నామ‌కోటి రాయించాల‌ని, ఇందుకోసం పుస్త‌కాలు సిద్ధం చేసుకోవ‌డం, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చ‌డం త‌దిత‌ర అంశాల‌తో విధి విధానాలు రూపొందించాల‌ని సూచించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుప‌తిలో భ‌క్తులు సంచ‌రించే అలిపిరి, ఎయిర్ పోర్టు, రైల్వేస్టేష‌న్ త‌దిత‌ర ప్రాంతాల్లో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు పెంచాల‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ‌ల 516 గోశాల‌ల‌ను టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌కు అనుసంధానం చేసి త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించాల‌న్నారు. టిటిడి త‌యారు చేస్తున్న అగ‌ర‌బ‌త్తుల‌కు భ‌క్తుల నుండి డిమాండ్ ఉంద‌ని, ఉత్ప‌త్తి మ‌రింత పెంచాల‌ని గోశాల అధికారుల‌ను ఆదేశించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీ ద్వారా స్వామి, అమ్మ‌వార్ల ఫొటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త్వ‌రిత‌గ‌తిన త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. దేశీయ గోవుల కొనుగోలు కోసం ఒక క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని, క‌మిటీ స‌భ్యులు ఉత్త‌ర భార‌త‌దేశంలో ప‌ర్య‌టించి గోవుల‌ను కొనుగోలు చేయాల‌ని ఈవో ఆదేశించారు. ఉద్యోగుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల‌ని వైద్య విభాగం అధికారుల‌కు సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి టిటిడి ఉద్యోగులంద‌రికీ నూత‌న గుర్తింపు కార్డులు మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-10-04 11:26:55

వేక్సినేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీకాకుళం జిల్లాలో మొబైల్ వేక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాకలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మొబైల్ వేక్సినేషన్ వాహనాలను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేర్ ఇండియా సహకారంతో జిల్లాకు రెండు మొబైల్ వేక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ వాహనాల్లో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు వేక్సినేటర్లు పనిచేస్తారని  తెలిపారు.  టెక్కలిలో గల జిల్లా ఆసుపత్రి, సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం అధీనంలో ఈ రెండు వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, హైరిస్క్ ప్రాంతాల్లో వేక్సినేషన్ పెద్దఎత్తున అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సంచార పరీక్షా కేంద్రాలు ఏ విధంగా పనిచేసాయో అదేవిధంగా ఇవి పనిచేస్తాయని చెప్పారు.   దీని ద్వారా ప్రజలకు మరింత చేరువలో వేక్సినేషన్ కార్యక్రమం అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేసారు. తక్కువ వేక్సినేషన్ కవరేజ్ అయిన ప్రాంతాలలో మొబైల్ వేక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని వివరించారు. ఇప్పటివరకు మొదటి డోసు, రెండవ డోసు తీసుకోలేని వారితో పాటు 18 ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్ వేక్సినేషన్ వేయడం జరుగుతుందని చెప్పారు. మొబైల్ వాహనాల ద్వారా అందిస్తున్న వేక్సినేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  డా. కె.అప్పారావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-04 07:54:00

శ్రీ ప్రసన్న స్వామికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ..

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె,  కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం మూల విరాట్‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వార్‌కు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి, ధ‌్వ‌జ‌స్తంభం, ఇత‌ర ప‌రివార‌ దేవ‌త‌ల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. కాగా రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగ‌నున్నాయి. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ  కస్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్  శ్రీ‌నివాసులు, కంక‌ణబ‌ట్ట‌ర్ సూర్య‌కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.

Appalayagunta

2021-10-03 09:04:40

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అల్లూరి మల్లీశ్వరి..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అల్లూరి మ‌ల్లిశ్వ‌రి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో అదనపు టిటిడి నిబందనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి ధర్మకర్తల మండలిలో స్థానం లభించడం అంటే శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి పిలుపు వచ్చిననట్టేనన్నారు. తనకు పదవి అప్పగించినందుకు ఆమె సీఎం వైఎస్ జగన్ కు అభినందనలు తెలియజేశారు..

కాకినాడ రూరల్

2021-10-01 09:46:59

18 ఏళ్ళ లోపు వరైనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాల్సిందే..

 తిరుమల  శ్రీవారి దర్శనానికి వచ్చే 18 ఏళ్ళు లోపు వయస్సు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకుని రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.  తిరుమల అన్నమయ్య భవన్ వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియాతో ఈవో మాట్లాడారు. కోవిడ్ వ్యాపి నివారణలో భాగంగా, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృస్థి లో ఉంచుకుని,  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేసుకున్న  సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తేవాలని నిబంధన విధించామన్నారు. 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ లేనందువల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని ఈవో చెప్పారు. అక్టోబర్ 11 వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.  అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో పునర్నిర్మించిన నడక దారి పైకప్పును సిఎంప్రారంభి స్తారన్నారు. దీంతో పాటు అలిపిరిలో దాత నిర్మించిన గోమందిరం, తిరుమలలో దాత నిర్మించిన బూందీ పోటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ఆసుపత్రిని కూడా ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు.

Tirumala

2021-10-01 08:47:10

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో విధిగా గాంధీ జ‌యంతి..

విజయనగరం జిల్లాలో మండ‌లం నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సంస్థ‌ల్లో అక్టోబ‌రు 2న మ‌హాత్ముని జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గాంధీ జ‌యంతి వేడుక‌లు త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ మేర‌కు జిల్లా అధికారుల‌కు శుక్ర‌వారం ఆదేశాలు జారీచేశారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌య కాంప్లెక్స్‌లో కార్యాల‌యాలు క‌లిగిన ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు శ‌నివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ సిబ్బందితో స‌హా క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీజీ విగ్ర‌హం వ‌ద్ద నిర్వ‌హించే వేడుక‌ల‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొన్నారు. అన్ని చోట్ల కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Vizianagaram

2021-10-01 08:43:26

యూజర్ చార్జితో ప్రభుత్వ క్రీడామైదానలు..

విజయనగరం జిల్లాలో పలు  ప్రైవేటు పాఠశాలల్లో  క్రీడా మైదానాలు లేనందున విద్యార్ధులకు  క్రీడలకు అవకాశం ఉండడం లేదని, అటువంటి  పాఠశాలలను  గుర్తించి  సమీప ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం కల్పించాలని సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి డా. మహేష్ కుమార్ తెలిపారు.  శుక్రవారం తన ఛాంబర్ లో ప్రస్తుతం జరుగుతున్న  క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు,  ఉపాధి హామీ నిధులతో సర్వ శిక్షా అభియాన్ ద్వారా చేపట్టిన క్రీడా క్షేత్రాల పురోగతి పై ఆయా ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు  ప్రభుత్వ  పాఠశాలలకు యూజర్ చార్జి లను చెల్లించి వాటి క్రీడా మైదానాలను వినియోగించుకునేలా అన్ని పాఠశాలలకు ఒక సర్కులర్ పంపాలని జిల్లా విద్యా  శాఖాధికారి  సత్యసుధ కు ఆదేశించారు. అదే విధంగా కళాశాలల వారు కూడా వినియోగించుకునేలా చూడాలని ఆర్.ఐ.ఓ , డి.వి.ఈ.ఓ లకు ఆదేశించారు.   ప్రభుత్వ ఉద్యోగులకు కూడా  డిపార్టుమెంటల ఫెస్ట్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ పోటీలకు  ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను  రూపొందించాలని సెట్విజ్ సి.ఈ.ఓ విజయ్ కుమార్ కు సూచించారు.  ఈ సమావేశం లో  హౌసింగ్ జె.సి మయూరి అశోక్,  చీఫ్ కోచ్ వెంకటేశ్వర రావు,  ఈ లు, డి ఈ లు శాప్ సిబ్బంది హాజరైనారు. 


Vizianagaram

2021-10-01 08:41:59

ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్‌పై ఇంటింటి స‌ర్వే..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  పేరుకుపోయిన‌ గృహ‌నిర్మాణ రుణాల‌కు సంబంధించి, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌ ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. గృహ‌నిర్మాణ శాఖ నుంచి త‌క్ష‌ణ‌మే ల‌బ్దిదారుల జాబితాల‌ను తీసుకొని, స‌చివాల‌యాల వారీగా విడ‌దీయాల‌ని సూచించారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు, వివిధ మండ‌లాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, గృహ‌నిర్మాణ‌శాఖ‌ అధికారుల‌తో, శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఓటిఎస్ ప‌థ‌కం గురించి ముందుగా ల‌బ్దిదారుల‌కు వివ‌రించి, దానిని వినియోగించుకొనేలా చూడాల‌న్నారు. గ‌తంలో రుణం తీసుకున్న ల‌బ్దిదారుల జాబితాల‌ను ఇప్ప‌టికే ఆన్‌లైన్లో ఉంచ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ జాబితాల‌ను తీసుకొని, స‌చివాల‌యాల వారీగా మ్యాపింగ్ చేయాల‌న్నారు. ఆయా సచివాల‌యాల‌కు జాబితాల‌ను పంపించి, వ‌లంటీర్లు, ఇత‌ర సిబ్బంది చేత ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. రుణం తీసుకున్న‌వారు, తీసుకున్న రుణాన్ని తీర్చేసిన వారు, ఇత‌రుల‌కు ఇళ్ల‌ను విక్ర‌యించిన వారు, ఆ ప్ర‌దేశం నుంచి వ‌ల‌స పోయిన వారు ఇలా వివిధ కేట‌గిరీల‌ను రూపొందించాల‌ని సూచించారు.  ఈ నెల 4 నుంచి స‌ర్వే ప్రారంభించి, 7వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. స‌కాలంలో స‌ర్వే పూర్తి చేయించే బాధ్య‌త తాశీల్దార్లు, ఎంపిడిఓల‌దేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.    వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్, మ‌యూర్ అశోక్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామ‌చంద్ర‌రావు, డిపిఓ సుభాషిణి, తాశీల్దార్లు, ఎంపిడిఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-01 08:40:24

తీరప్రాంత భద్రతపై మరింతగా ద్రుష్టిసారించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌లో భాగ‌స్వామ్యం క‌లిగిన అన్ని ప‌క్షాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి సూచించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌పై జిల్లాస్థాయి క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌తన గురువారం జ‌రిగింది. తీర‌ప్రాంత భ‌ద్ర‌త విష‌యంలో మ‌త్స్య‌కారుల‌తో స‌మ‌న్వ‌య పరచాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నిర్మలకుమారికి సూచించారు. తీర‌ప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్య‌క్తుల స‌మాచారం తెలుసుకోవ‌డం వంటి అంశాల్లో మ‌త్స్య‌కారుల స‌హ‌కారం తీసుకోవ‌ల‌సి వుంద‌న్నారు. భ‌ద్ర‌తా సంస్థ‌లు తీర‌ప్రాంతంలో నివ‌సించే మ‌త్స్య‌కారుల‌కు హైసెక్యూరిటీ గుర్తింపుకార్డులు జారీచేయ‌డం ద్వారా కొత్త వ్య‌క్తుల స‌మాచారం తెలుసుకోవ‌చ్చ‌న్నారు. మ‌త్స్య‌కారుల‌కు వి.హెచ్‌.ఎఫ్‌. ప‌రిక‌రాలు అంద‌జేసి త‌ద్వారా స‌ముద్రం నుంచి తీర‌ప్రాంతానికి బోట్ల‌లో వ‌చ్చే వారి స‌మాచారం తెలుసుకోవ‌డం, స‌ముద్రంలో  జ‌రిగే ప్ర‌మాదాలు, ఇత‌ర సంఘ‌ట‌న‌ల గురించిన స‌మాచారం తెలుసుకొనే వీలుంటుంద‌ని పేర్కొన్నారు. పూస‌పాటిరేగ మండ‌లం చింత‌ప‌ల్లిలోని మెరైన్ పోలీసు స్టేష‌న్‌కు ప్ర‌హారీగోడ నిర్మాణం, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌పై చ‌ర్చించారు. మ‌త్స్య‌కారులు వి.హెచ్‌.ఎఫ్‌. సెట్ల ద్వారా ప్ర‌మాదాలు, ఇత‌ర స‌మాచారాన్ని తీర‌ర‌క్ష‌ణ ద‌ళం(కోస్ట్ గార్డ్‌)కు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి వివ‌రించారు. ప్ర‌తి నెలా ఒక నిర్ణీత‌ తేదీన తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌కు సంబంధించిన స‌మావేశాలు జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి. కిషోర్ కుమార్‌, తీర‌ర‌క్ష‌ణ విభాగం అడిష‌న‌ల్ ఎస్పీ విమ‌ల‌కుమారి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, డి.ఎస్‌.పి. అనిల్ కుమార్‌, మ‌త్స్య‌శాఖ డి.డి. నిర్మ‌లాకుమారి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-30 13:08:30

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి..

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మెరుగైన చర్యలు తీసుకుని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గులాబ్ తుఫాను నేపథ్యంలో భీమిలీ నియోజకవర్గ పరిథిలోని నాలుగు వార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ, సచివాలయ సిబ్బందితో భీమిలి క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగు వార్డుల్లో కూడా కరెంటు, తాగునీరు సమస్య లేకుండా చూడాలని.  పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి.. నిర్వాసితులకు భోజన సౌకర్యం కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా పంపుల ద్వారా కానీ.. ట్యాంకర్ల ద్వారా కానీ సరఫరా చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని మోటార్లుతో తోడం చాలాని అన్నారు. ప్రజల సౌకర్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 08933229535 ను అందుబాటులో ఉంచాలని అన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరో 24 గంటలపాటు ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. స్థానికంగా ఉండే సమస్యలను సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు.  ఇకపై తాను కూడా విధిగా సచివలయాలు సందర్శిస్తానని అన్నారు. నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ వెంకటరమణ, తహా సిల్లారు, ఈశ్వరరావు, ఇతర అధికారులు, నియోజకవర్గ ఇంచార్జీ ముత్తంశెట్టి మహేష్, 1వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామ్ నాయుడు, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

Bheemili

2021-09-28 14:13:12