1 ENS Live Breaking News

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అల్లూరి మల్లీశ్వరి..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అల్లూరి మ‌ల్లిశ్వ‌రి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో అదనపు టిటిడి నిబందనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి ధర్మకర్తల మండలిలో స్థానం లభించడం అంటే శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి పిలుపు వచ్చిననట్టేనన్నారు. తనకు పదవి అప్పగించినందుకు ఆమె సీఎం వైఎస్ జగన్ కు అభినందనలు తెలియజేశారు..

కాకినాడ రూరల్

2021-10-01 09:46:59

18 ఏళ్ళ లోపు వరైనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాల్సిందే..

 తిరుమల  శ్రీవారి దర్శనానికి వచ్చే 18 ఏళ్ళు లోపు వయస్సు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకుని రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.  తిరుమల అన్నమయ్య భవన్ వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియాతో ఈవో మాట్లాడారు. కోవిడ్ వ్యాపి నివారణలో భాగంగా, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృస్థి లో ఉంచుకుని,  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేసుకున్న  సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తేవాలని నిబంధన విధించామన్నారు. 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ లేనందువల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని ఈవో చెప్పారు. అక్టోబర్ 11 వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.  అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో పునర్నిర్మించిన నడక దారి పైకప్పును సిఎంప్రారంభి స్తారన్నారు. దీంతో పాటు అలిపిరిలో దాత నిర్మించిన గోమందిరం, తిరుమలలో దాత నిర్మించిన బూందీ పోటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ఆసుపత్రిని కూడా ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు.

Tirumala

2021-10-01 08:47:10

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో విధిగా గాంధీ జ‌యంతి..

విజయనగరం జిల్లాలో మండ‌లం నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సంస్థ‌ల్లో అక్టోబ‌రు 2న మ‌హాత్ముని జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గాంధీ జ‌యంతి వేడుక‌లు త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ మేర‌కు జిల్లా అధికారుల‌కు శుక్ర‌వారం ఆదేశాలు జారీచేశారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌య కాంప్లెక్స్‌లో కార్యాల‌యాలు క‌లిగిన ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు శ‌నివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ సిబ్బందితో స‌హా క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీజీ విగ్ర‌హం వ‌ద్ద నిర్వ‌హించే వేడుక‌ల‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొన్నారు. అన్ని చోట్ల కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Vizianagaram

2021-10-01 08:43:26

యూజర్ చార్జితో ప్రభుత్వ క్రీడామైదానలు..

విజయనగరం జిల్లాలో పలు  ప్రైవేటు పాఠశాలల్లో  క్రీడా మైదానాలు లేనందున విద్యార్ధులకు  క్రీడలకు అవకాశం ఉండడం లేదని, అటువంటి  పాఠశాలలను  గుర్తించి  సమీప ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం కల్పించాలని సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి డా. మహేష్ కుమార్ తెలిపారు.  శుక్రవారం తన ఛాంబర్ లో ప్రస్తుతం జరుగుతున్న  క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు,  ఉపాధి హామీ నిధులతో సర్వ శిక్షా అభియాన్ ద్వారా చేపట్టిన క్రీడా క్షేత్రాల పురోగతి పై ఆయా ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు  ప్రభుత్వ  పాఠశాలలకు యూజర్ చార్జి లను చెల్లించి వాటి క్రీడా మైదానాలను వినియోగించుకునేలా అన్ని పాఠశాలలకు ఒక సర్కులర్ పంపాలని జిల్లా విద్యా  శాఖాధికారి  సత్యసుధ కు ఆదేశించారు. అదే విధంగా కళాశాలల వారు కూడా వినియోగించుకునేలా చూడాలని ఆర్.ఐ.ఓ , డి.వి.ఈ.ఓ లకు ఆదేశించారు.   ప్రభుత్వ ఉద్యోగులకు కూడా  డిపార్టుమెంటల ఫెస్ట్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ పోటీలకు  ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను  రూపొందించాలని సెట్విజ్ సి.ఈ.ఓ విజయ్ కుమార్ కు సూచించారు.  ఈ సమావేశం లో  హౌసింగ్ జె.సి మయూరి అశోక్,  చీఫ్ కోచ్ వెంకటేశ్వర రావు,  ఈ లు, డి ఈ లు శాప్ సిబ్బంది హాజరైనారు. 


Vizianagaram

2021-10-01 08:41:59

ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్‌పై ఇంటింటి స‌ర్వే..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  పేరుకుపోయిన‌ గృహ‌నిర్మాణ రుణాల‌కు సంబంధించి, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌ ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. గృహ‌నిర్మాణ శాఖ నుంచి త‌క్ష‌ణ‌మే ల‌బ్దిదారుల జాబితాల‌ను తీసుకొని, స‌చివాల‌యాల వారీగా విడ‌దీయాల‌ని సూచించారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు, వివిధ మండ‌లాల తాశీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, గృహ‌నిర్మాణ‌శాఖ‌ అధికారుల‌తో, శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఓటిఎస్ ప‌థ‌కం గురించి ముందుగా ల‌బ్దిదారుల‌కు వివ‌రించి, దానిని వినియోగించుకొనేలా చూడాల‌న్నారు. గ‌తంలో రుణం తీసుకున్న ల‌బ్దిదారుల జాబితాల‌ను ఇప్ప‌టికే ఆన్‌లైన్లో ఉంచ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ జాబితాల‌ను తీసుకొని, స‌చివాల‌యాల వారీగా మ్యాపింగ్ చేయాల‌న్నారు. ఆయా సచివాల‌యాల‌కు జాబితాల‌ను పంపించి, వ‌లంటీర్లు, ఇత‌ర సిబ్బంది చేత ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. రుణం తీసుకున్న‌వారు, తీసుకున్న రుణాన్ని తీర్చేసిన వారు, ఇత‌రుల‌కు ఇళ్ల‌ను విక్ర‌యించిన వారు, ఆ ప్ర‌దేశం నుంచి వ‌ల‌స పోయిన వారు ఇలా వివిధ కేట‌గిరీల‌ను రూపొందించాల‌ని సూచించారు.  ఈ నెల 4 నుంచి స‌ర్వే ప్రారంభించి, 7వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. స‌కాలంలో స‌ర్వే పూర్తి చేయించే బాధ్య‌త తాశీల్దార్లు, ఎంపిడిఓల‌దేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.    వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్, మ‌యూర్ అశోక్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిప్యుటీ సిఇఓ కె.రామ‌చంద్ర‌రావు, డిపిఓ సుభాషిణి, తాశీల్దార్లు, ఎంపిడిఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-01 08:40:24

తీరప్రాంత భద్రతపై మరింతగా ద్రుష్టిసారించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌లో భాగ‌స్వామ్యం క‌లిగిన అన్ని ప‌క్షాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి సూచించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌పై జిల్లాస్థాయి క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌తన గురువారం జ‌రిగింది. తీర‌ప్రాంత భ‌ద్ర‌త విష‌యంలో మ‌త్స్య‌కారుల‌తో స‌మ‌న్వ‌య పరచాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నిర్మలకుమారికి సూచించారు. తీర‌ప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్య‌క్తుల స‌మాచారం తెలుసుకోవ‌డం వంటి అంశాల్లో మ‌త్స్య‌కారుల స‌హ‌కారం తీసుకోవ‌ల‌సి వుంద‌న్నారు. భ‌ద్ర‌తా సంస్థ‌లు తీర‌ప్రాంతంలో నివ‌సించే మ‌త్స్య‌కారుల‌కు హైసెక్యూరిటీ గుర్తింపుకార్డులు జారీచేయ‌డం ద్వారా కొత్త వ్య‌క్తుల స‌మాచారం తెలుసుకోవ‌చ్చ‌న్నారు. మ‌త్స్య‌కారుల‌కు వి.హెచ్‌.ఎఫ్‌. ప‌రిక‌రాలు అంద‌జేసి త‌ద్వారా స‌ముద్రం నుంచి తీర‌ప్రాంతానికి బోట్ల‌లో వ‌చ్చే వారి స‌మాచారం తెలుసుకోవ‌డం, స‌ముద్రంలో  జ‌రిగే ప్ర‌మాదాలు, ఇత‌ర సంఘ‌ట‌న‌ల గురించిన స‌మాచారం తెలుసుకొనే వీలుంటుంద‌ని పేర్కొన్నారు. పూస‌పాటిరేగ మండ‌లం చింత‌ప‌ల్లిలోని మెరైన్ పోలీసు స్టేష‌న్‌కు ప్ర‌హారీగోడ నిర్మాణం, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌పై చ‌ర్చించారు. మ‌త్స్య‌కారులు వి.హెచ్‌.ఎఫ్‌. సెట్ల ద్వారా ప్ర‌మాదాలు, ఇత‌ర స‌మాచారాన్ని తీర‌ర‌క్ష‌ణ ద‌ళం(కోస్ట్ గార్డ్‌)కు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి వివ‌రించారు. ప్ర‌తి నెలా ఒక నిర్ణీత‌ తేదీన తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌కు సంబంధించిన స‌మావేశాలు జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి. కిషోర్ కుమార్‌, తీర‌ర‌క్ష‌ణ విభాగం అడిష‌న‌ల్ ఎస్పీ విమ‌ల‌కుమారి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, డి.ఎస్‌.పి. అనిల్ కుమార్‌, మ‌త్స్య‌శాఖ డి.డి. నిర్మ‌లాకుమారి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-30 13:08:30

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి..

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మెరుగైన చర్యలు తీసుకుని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గులాబ్ తుఫాను నేపథ్యంలో భీమిలీ నియోజకవర్గ పరిథిలోని నాలుగు వార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ, సచివాలయ సిబ్బందితో భీమిలి క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగు వార్డుల్లో కూడా కరెంటు, తాగునీరు సమస్య లేకుండా చూడాలని.  పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి.. నిర్వాసితులకు భోజన సౌకర్యం కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా పంపుల ద్వారా కానీ.. ట్యాంకర్ల ద్వారా కానీ సరఫరా చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని మోటార్లుతో తోడం చాలాని అన్నారు. ప్రజల సౌకర్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 08933229535 ను అందుబాటులో ఉంచాలని అన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరో 24 గంటలపాటు ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. స్థానికంగా ఉండే సమస్యలను సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు.  ఇకపై తాను కూడా విధిగా సచివలయాలు సందర్శిస్తానని అన్నారు. నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ వెంకటరమణ, తహా సిల్లారు, ఈశ్వరరావు, ఇతర అధికారులు, నియోజకవర్గ ఇంచార్జీ ముత్తంశెట్టి మహేష్, 1వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామ్ నాయుడు, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

Bheemili

2021-09-28 14:13:12

తుపాను వ్యార్ధాల నీరు నిల్వలేకుండా చూడండి..

 తుఫాను వర్షాల కారణంగా నీరు నిలిచి రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఉదయం కలెక్టరు అధికారుల తో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భముగా కలక్టరు మాట్లాడుతూ వర్షాల కారణంగా నీరు నిలిచి పోయి పలు వ్యాధులకు కారణమవుతుందని, కాబట్టి నీరునిల్వ ఉండకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్ గావించాలన్నారు. నీటి ట్యాంకుల ను డ్రై చేయాలని సూచించారు. బుధవారం   డ్రైడే  పాటించాలన్నారు.  బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్యాంకుల ను శుభ్ర పరచి డ్రై చేయాలని సూచించారు.  నీరు నిల్వ ఉంటే దోమలు బ్రీడింగ్ జరుగుతుంది కాబట్టి  నిలువ నీటిని తప్పని సరిగా పారబోయించాలన్నారు.  పల్లపు ప్రాంతాల లో  మట్టి, రాళ్ళతో నింపాలన్నారు.  పంచాయితీ సిబ్బంది, ఆశా , ఎ.ఎన్.ఎమ్. లు, గ్రామ సేక్రటేరియట్ సిబ్బంది,, వాలంటీర్లు, పోలీస్ లు, ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.  డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర వ్యాదులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా క్లోరినేషన్ చేసిన   శుభ్రమైన నీటిని ట్యాంకర్ల తో సరఫరా చేయాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైధ్యాధికారులకు సూచించారు.  
కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగించాలన్నారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పి.అరుణ్ బాబు,  జి.వి.ఎం .సి. కమిషనర్ జి.సృజన, జిల్లా వైద్యాధికారి డా. సూర్యనారాయణ,  సి.ఇ.ఓ జిల్లా పరిషత్ నాగార్జున సాగర్,  డి.పి. ఒ కృష్ణకుమారి, ఎస్.ఇ, పంచాయితీరాజ్ రవీంద్ర, డ్వామా పిడి సంధీప్ తదితర అధికారులు  టెలి కాన్ఫరెన్స్  లో పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-09-28 13:51:56

లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలి..జెసి..

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీ.ఎం.ఆర్) సరఫరాను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ రైస్ మిల్లర్ల ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో  సివిల్ సప్లయ్  అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జేసీ లక్ష్మీశ  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ  జిల్లాలో రబీ సీజన్ సీఎంఆర్ బియ్యాన్ని  ఖరీఫ్ సీజన్ ధాన్యం సెకరణ ప్రారంభం కాకముందే పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బియ్యం సరఫరాను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు పంపిణీ చేసే మధ్యాహ్న భోజన పథకం‌, అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్ట్ ఫైడ్ బియ్యాన్ని సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఎఫ్.సీ.ఐ కి ఇచ్చే బాయిల్డ్ రైస్ పంపిణీ కూడా వేగవంతం చేయాలని జేసీ లక్ష్మీ శ రైస్ మిల్లర్ల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీఎంఆర్ బియ్యాన్ని
 గడువు లోపల పంపిణీ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందని రైస్ మిల్లర్ల ప్రతినిధులు జేసీ కి తెలిపారు.  ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లయ్ ఇ. లక్ష్మీరెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, ఇతర రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-28 11:45:27

115 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి ముంపు..

తూర్పుగోదావరి జిల్లాలో115 ఎకరాల్లో ఉద్యాన పంటలు(అరటి, కర్రపెండలం, కూరగాయలు) నీటమునిగినట్టు ప్రాధమిక అంచనా వేసిసట్టు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబ్ తుపాను ఉద్యాన పంటలపై ప్రభావం చూపిందన్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున  ముంపు పెరిగే అవకాశాలున్నాయన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. ఏఏ మండలాల్లో పంట ముంపు జరిగిందో అక్కడ గ్రామీణ ఉద్యాన సహాయకులు, అధికారులతో విచారణ చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.

Kakinada

2021-09-28 11:40:19

ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు..

శ్రీకాకుళం జిల్లాలో ‘‘గులాబ్ తుఫాన్” వలన నాగావళి నది ముంపు ప్రాంతాల ప్రజల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నాగావళి నదిలో నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని, తద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. మహిళా మండల వీధి, తురాయి చెట్టు వీధి,వైష్ణపు వీధి,లెప్రసీ కాలనీ, హెచ్‌.బి.కాలనీ,మంగువారితోట తదితర నాగావళి ముంపు ప్రాంతాలను మంగళవారం ఉదయం స్వయంగా సందర్శించారు.  వరద నీరు నగరంలోని లోతట్టు ప్రాంతాలలో చేరుతున్నందున ఇంజిన్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.  నాగావళి నది ఉధృతి మరింతగా ఉండే అవకాశం ఉన్నందున సదరు ప్రాంత ప్రజలకు పునరావాసా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ఎన్.టి.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల, మంగువారి తోట నగర పాలక ప్రాథమిక పాఠశాల, టి.పి.ఎం. నగర పాలక ఉన్నత పాఠశాలలను సిద్ధం చేయడం జరిగిందని, ముంపు ప్రాంతాల ప్రజలు వారి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని ఆయన ముంపు ప్రాంతాల ప్రజలను కోరారు. 

Srikakulam

2021-09-28 09:59:50

నష్ట పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం..

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాను లో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం  అన్నారు బుధవారం తుఫాను లో నష్టపోయిన పొందూరు మండలంలోని రెడ్డి పేట, దల్లి పేట, బానాం, చిన కొంచాడ, రెల్లిగెడ్డ లను పరిశీలించారు. గులాబ్ తుఫానుకు బొప్పాయి, అరటి, మొక్క జొన్న తదితర ఉద్యాన పంటలు బాగా నష్టపోయాయని తెలిపారు. ఉద్యాన పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆయన వివరించారు. నష్ట పోయిన రైతులకు సముచిత పరిహారం అందించుటకు కృషి చేస్తామని అన్నారు. బొప్పాయి కిలో ధర రూ.17 ఉండగా, ప్రస్తుతం రూ.3 నుండి 6 ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు దీనమైన పరిస్థితికి చేరుకున్నారని ఆయన చెప్పారు. అధికార బృందాలు జిల్లాలో పర్యటించి ప్రతి రైతు నష్టపోయిన పంట వివరాలను, ఇతర ఆస్తులు వివరాలు నమోదు చేస్తారని ఆయన వివరించారు. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొని వాస్తవ వివరాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల నష్ట పరిహారం అందడంలో సమస్య ఉండరాదని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని, అన్యాయం ఎక్కడా జరగరాదని స్పీకర్ వివరించారు. సర్వే పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. రైతులు కష్టాల్లో ఉన్నారని ఆ సమయంలోనే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని,  వారి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నారాయణపురం ప్రాంతంలో వరి నీట మునిగి ఉందని వివరించారు. రెల్లి గడ్డ పనుల్లో నాణ్యత లోపంతో గతంలో చేయడం వలన ప్రస్తుతం రైతులు నష్టోతున్నారని స్పీకర్ సీతారాం అన్నారు.  పూర్తిస్థాయిలో నిర్మించి రైతులకు ఇస్తామని అన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల అవసరం మేరకు గుర్తించి ప్రతిపాదిస్తామని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాంతారావు, ఎంపీపీ ఉషారాణి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె .శ్రీధర్, స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-28 09:56:08

తూ.గో.జిలో 7వేల హెక్టార్లలో వరిపంట నీటముంపు..

తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ కాస్త గట్టిగానే కొట్టింది జిల్లాలో 7వేల హెక్టార్లలో వరపంట నీటమునిగినట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్. విజయకుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట పండుతుండగా ప్రస్తుతం ఏడువేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ప్రస్తుతం పంటచేలో చేరిన నీరుని తొలగించే కార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతులు ఎవరూ ఆందోలన చెందాల్సిన పనిలేదని, గ్రామాలు, మండలాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు సూచనలు సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.

Kakinada

2021-09-28 05:40:39

అక్టోబరు 1 నుంచి గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్లు..

తూర్పుగోదావరి జిల్లాలో పశువుల గాలికుంటు వ్యాధికి అక్టోబరు 1 నుంచి వేక్సిన్లు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం  ఆయన కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో 8లక్షల 80వేల పశువులకు ఈ వేక్సిన్ అందించనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే మండలాల వారీగా ఇండెంట్లు తయారుచేసినట్టు ఆయన మీడియాకి వివరించారు. వాటిని మండల కేంద్రాలకు పంపి అక్టోబరు 1 నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తామన్నారు.

Kakinada

2021-09-28 05:32:21