1 ENS Live Breaking News

తూ.గో.జిలో 7వేల హెక్టార్లలో వరిపంట నీటముంపు..

తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ కాస్త గట్టిగానే కొట్టింది జిల్లాలో 7వేల హెక్టార్లలో వరపంట నీటమునిగినట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్. విజయకుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట పండుతుండగా ప్రస్తుతం ఏడువేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ప్రస్తుతం పంటచేలో చేరిన నీరుని తొలగించే కార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతులు ఎవరూ ఆందోలన చెందాల్సిన పనిలేదని, గ్రామాలు, మండలాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు సూచనలు సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.

Kakinada

2021-09-28 05:40:39

అక్టోబరు 1 నుంచి గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్లు..

తూర్పుగోదావరి జిల్లాలో పశువుల గాలికుంటు వ్యాధికి అక్టోబరు 1 నుంచి వేక్సిన్లు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం  ఆయన కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో 8లక్షల 80వేల పశువులకు ఈ వేక్సిన్ అందించనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే మండలాల వారీగా ఇండెంట్లు తయారుచేసినట్టు ఆయన మీడియాకి వివరించారు. వాటిని మండల కేంద్రాలకు పంపి అక్టోబరు 1 నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తామన్నారు.

Kakinada

2021-09-28 05:32:21

పర్యాటక అభివృద్ధికి జిల్లాలో పుష్కల అవకాశాలు..

పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా పర్యాటక శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. సెప్టెంబర్ 27, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పై మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో ముందుగా టూరిజం ప్యాకేజీకి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ విజయ దర్శిని ని ప్రారంభించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఇతర  వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ ద్వారా పర్యాటకులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం సర్క్యూట్ లలో పర్యాటక అభివృద్ధి కి అనుకూల ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి పరిచి పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటకానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి పి.ఎన్.వి. లక్ష్మినారాయణ, ఎన్. ఐ. సి. అధికారులు నరేంద్ర, బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:58:42

రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్.ఆర్.ఐ. రూ.25వేలు విరాళం..

విజయనగరం జిల్లాలో సుధామై వెల్ఫేర్ అసోసియేషన్  అధ్యక్షులు, ఎన్.ఆర్.ఐ. అయిన సుధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.25 వేలు విరాళం అందించారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి సోమవారం చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం  అందించిన సుధాకృష్ణని కలెక్టర్  అభినందించారు. మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా రెడ్ క్రాస్ ద్వారాఎక్కువ మందికి సేవలు అందించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:04:40

విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ‌కే అధిక ప్రాధాన్య‌త..

తుఫాను వ‌ల్ల దెబ్బ‌తిన్న విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ పున‌రుద్ద‌ర‌ణ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.ఆదిత్య‌నాథ్ దాస్ ఆదేశించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాతోనే అన్ని ర‌కాల స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు ముడిప‌డి వుంటాయ‌ని అందువ‌ల్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పున‌రుద్ద‌రించాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌.ఇ.ని ఆదేశించారు. జిల్లాలో గులాబ్ తుఫాను అనంత‌ర ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ యంత్రాంగం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ప‌రిశీల‌న నిమిత్తం సోమ‌వారం జిల్లాకు వ‌చ్చిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాలో తుఫాను కార‌ణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌కు జ‌రిగిన న‌ష్టాలు, పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌పై ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శికి ఇ.పి.డి.సి.ఎల్‌. ప‌ర్యవేక్ష‌క ఇంజ‌నీర్ మ‌సిలామ‌ణి వివ‌రించారు. జిల్లాలో 33/11 కె.వి. విద్యుత్ స‌బ్‌స్టేష‌న్లు 110 పున‌రుద్ద‌రించామ‌ని, 34 పునరుద్ద‌రించాల్సి వుంద‌ని, 11 కె.వి. స‌బ్‌స్టేష‌న్‌లు 423లో 135 మాత్ర‌మే పున‌రుద్ద‌రించాల్సి వుంద‌ని, డిస్ట్రిబ్యూష‌న్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లు ఇంకో 50 వ‌ర‌కు ఏర్పాటు చేయాల్సి వుంద‌ని వివ‌రించారు. ఈరోజు రాత్రికే స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశించారు.

తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌రిస్థితిపై స‌మీక్షిస్తూ ర‌క్షిత నీటిప‌థ‌కాల ద్వారా నీటి స‌ర‌ఫ‌రాకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. అన్ని ప‌థ‌కాల‌కు ప్ర‌త్యామ్నాయ సోర్స్‌లు వున్నాయ‌ని, వాటి ద్వారా ఎలాంటి స‌ర‌ఫ‌రా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఎస్‌.ఇ. శివానంద‌ప్ర‌సాద్ వివ‌రించారు. అవ‌స‌ర‌మైన చోట ట్యాంక‌ర్ల ద్వారా కూడా తాగునీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు.

భారీవ‌ర్షాల‌కు సాలూరు మండ‌లం మామిడిప‌ల్లి గ్రామం నీట మునిగింద‌ని, అక్క‌డ పి.హెచ్‌.సి. కూడా పూర్తిగా నీటిలో మునిగి వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి వివ‌రించారు. అయితే గ్రామ ప్ర‌జ‌ల‌కు పున‌రావాస శిబిరాలు ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌స్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ముఖ్యంగా ర‌హ‌దారుల‌పై వున్న కాజ్‌వేల పైనుంచి నీరు ప్ర‌వ‌హించే చోట రాక‌పోక‌ల‌కు అవ‌కాశం లేకుండా అక్క‌డ కాపలా ఏర్పాటు చేయాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదేశించారు. నీటి ప్ర‌వాహం దాటుకొని వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డంవ‌ల్ల కొట్టుకొనిపోయే ప్ర‌మాదం వుంటుంద‌ని అందువ‌ల్ల పోలీసు శాఖ రోడ్లు భవ‌నాల శాఖ‌తో క‌ల‌సి ఆయా ప్ర‌దేశాల్లో కాప‌లాదారుల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లాలో రోడ్లు తెగిపోవ‌డం వ‌ల్ల బాహ్య‌ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలు ఏవైనా వున్న‌దీ లేనిదీ సి.ఎస్‌.ఆరా తీశారు. అటువంటి గ్రామాలు ఏమీ లేవ‌ని అధికారులు వివ‌రించారు.

జిల్లాలో రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిస్థితిని జ‌ల‌వ‌న‌రులశాఖ ఉత్త‌రాంధ్ర‌  చీఫ్ ఇంజ‌నీర్ సుగుణాక‌ర‌రావు వివ‌రించారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని కిందికి విడుద‌ల చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం సాగునీటి ప్రాజెక్టుల వ‌ల్ల ఎలాంటి వ‌ర‌ద‌ముప్పు లేద‌ని తెలిపారు. విశాఖ‌లో మేఘాద్రిగెడ్డ జ‌లాశ‌యం నుంచి నీటి విడుద‌ల కార‌ణంగా విశాఖ ఎయిర్ పోర్టు ముంపున‌కు గుర‌య్యే అంశంపై కూడా చీఫ్ సెక్ర‌ట‌రీ చ‌ర్చించారు. మేఘాద్రిగెడ్డ జ‌లాశ‌యం పూర్తిగా నిండింద‌ని జ‌లాశ‌యం నుంచి నీటివిడుద‌ల త‌ప్ప‌ద‌ని తెలిపారు. జిల్లాలో చిన్న‌నీటి చెరువులు పూర్తిగా నిండి వున్నందున వాటికి గండ్లు ప‌డే ముప్పు వుంద‌ని తెలిపారు.

వైద్య ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్త‌త‌పై కూడా సి.ఎస్‌. స‌మీక్షించారు. జిల్లాలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌న్నింటికీ డీజిల్ జ‌న‌రేట‌ర్లు వున్నాయ‌ని జె.సి. డా.మ‌హేష్ కుమార్ తెలిపారు. పి.హెచ్‌.సిల‌కు కూడా జ‌న‌రేట‌ర్లు వున్నాయ‌ని విద్యుత్ స‌ర‌ఫరా లేన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు వున్న‌ట్టు చెప్పారు. అన్ని పి.హెచ్‌.సి.ల ప‌రిధిలో వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ర‌మ‌ణ కుమారి వివ‌రించారు.
తుఫాను సంద‌ర్భంగా నిత్యావ‌స‌ర స‌రుకుల‌న్నీ డిపోల ప‌రిధిలో అందుబాటులో వుంచామ‌ని జె.సి. డా.కిషోర్ కుమార్ వివ‌రించారు. 357 తుఫాను ముప్పు వుండే రేష‌న్ షాపుల‌ను గుర్తించామ‌ని, ఈ షాపుల్లో త‌గిన‌న్ని నిత్యావ‌స‌ర స‌రుకుల నిల్వ‌లు సిద్ధంచేసి వుంచామ‌న్నారు.

తుఫాను సంద‌ర్భంగా పోలీసు యంత్రాంగం ద్వారా కూడా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డి.ఐ.జి. కాళిదాస్ వెంక‌ట రంగారావు, ఎస్‌.పి. ఎం.దీపిక‌ల‌కు సూచించారు.

స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌ మ‌యూర్ అశోక్‌, డి.ఆర్‌.ఓ. ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిపిఓ సుభాషిణి, వ్య‌వ‌సాయ శాఖ డి.డి. నంద్‌, ఉద్యాన‌శాఖ డి.డి. శ్రీ‌నివాస‌రావు, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ఇ.ఇ. రామ‌చంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:02:39

పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు..

పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం పలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. గజపతినగరం సమీపంలోని పురిటిపెంటలో, తుఫాను బాధితులకోసం బాలికల పాఠశాలలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పాల్తేరు కల్యాణమండపం సమీపంలో, చంపావతి నదిని ఆనుకొని, పురిపాకల్లో నివాసం ఉంటున్న 16 మందికి, ముందుజాగ్రత్త చర్యగా అక్కడినుంచి తరలించి, ఈ కేంద్రంలో పునరావాసం కల్పించారు.  బాధితులతో ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికీ కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయంపై ఆరా తీశారు. బాధితులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.  ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీవో బిహెచ్ భవానిశంకర్, తాసిల్దార్ అరుణకుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Gajapatinagaram

2021-09-27 11:39:49

భారత్‌ బంద్‌కు విశాఖలో జర్నలిస్టుల మద్దతు..

జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫేడరేషన్‌,ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం నాటి భారత్‌ బంద్‌కు  వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడేరేషన్‌ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్‌ అర్భన్‌ అధ్యక్షుడు పి.నారాయణ నేతృత్వంలో పలువరు జర్నలిస్టులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్రం వర్కింగ్‌ జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను రద్దు చేసిందని, తక్షణమే వాటిని పునరుద్దరించాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు. వర్కింగ్‌ .జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలని, తామంతా కేంద్రాన్ని గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌ కమిటీ నియమించిన నేటి వరకూ జర్నలిస్టులకు న్యాయం జరగలేదున్నారు. తక్షణమే ఆ కమిటీ తన నివేదిక ద్వారా వర్కింగ్‌ జర్నలిస్టులను ఆదుకోవాలన్నారు.  అంతేకాకుండా అనేక కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగిందని, వాటికి కూడా ప్రత్యామ్నయం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో  జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బందర్‌ శివప్రసాద్‌,కార్యవర్గ ప్రతినిధులు మధు,కొండలరావు,బొప్పన రమేష్‌ తదితర ప్రతినిధుల పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-27 11:22:01

ప్రజలను పదే పదే సచివాలయాలకి తిప్పొద్దు..

పనుల కోసం  సచివాలయంకు వచ్చే ప్రజలను పదే పదే తిప్పొద్దని సిబ్బందికి నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని 45 వ సచివాలయంను సోమవారం మేయర్  ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియ ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికులతో మేయర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంకు ఏదైనా పనిమీద వస్తే సరిగా స్పందించడం లేదని, అవి కావాలి ఇవి కావాలి అని పదే పదే తిప్పుతారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన వేగవంతంగా అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తీసుకువచ్చారన్నారు.మీ నిర్లక్ష్యం మూలంగా ఆ వ్యవస్థ కు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.పని మీద వచ్చే వారికి సంబంధించి ఏదైనా రికార్డులు, పేపర్లు అవసరం అయితే   వాటి వివరాలు ఒకేసారి చెప్పాలని,ఒక్కోసారి ఒక్కొక్కటి అడగడం వల్ల టైమ్ వేస్ట్ తప్పా పనులు ముందుకు సాగవన్నారు.ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాని మేయర్ సూచించారు.కార్యక్రమంలో  కార్పొరేటర్లు  కమల్ భూషణ్,అనిల్ కుమార్ రెడ్డి లతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2021-09-27 10:54:58

కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ పొందడిలా..

కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ ప్రజలకు అందించడానికి ఉచిత టోల్ ఫ్రీ నెంబరు  18004250325 ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. ఈనెంబరుకి ఫోన్ చేసి ఆధార్, ఫోన్ నెంబరు, పేరు వివరాలు తెలియజేస్తే ఆన్ లైన్ సర్టిఫికేట్లు అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. ఇపుడు చాలా చోట్ల కోవిడ్ వేక్సినేషన్ సర్టిఫికేట్లు అడుగుతున్న ద్రుష్ట్యా ప్రజల సౌకర్యార్ధం దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు.

Kakinada

2021-09-27 10:54:01

బాదితుల సహాయంలో విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి..

గులాబ్ తుపాను ప్రభావంతో విశాఖలోని ఏఎస్ఆర్ నగర్  ఆశ్రయం పొందుతున్న 25 కుటుంబాలకు అర్భన్ తహశీల్ధార్ జ్నానవేణి సోమవారం అల్పాహారం, ఆహారం దగ్గరుండి అందజేశారు. గత రెండు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్నిరకాల సదుపాయలను అందజేస్తున్నది. వాటిని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎవరికి ఎలాంటి అత్యవసర సహాయం కావాల్సి వచ్చినా తక్షణమే చూస్తున్నారు. వారికి మంచినీరు, కొవ్వుత్తులు అందజేశారు. అటు ప్రభుత్వం కూడా తుపాను బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైంది. 

Visakhapatnam

2021-09-27 09:19:06

గులాబ్‌పై యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా వుండాలి..

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన గులాబ్ తుఫాను ఈ అర్ధ‌రాత్రికి శ్రీకాకుళం జిల్లా క‌ళింగ‌ప‌ట్నం- ఒడిశాలోని గోపాల్‌పూర్ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని, ఈ తుఫాను ప్రభావం జిల్లాపై అవ‌కాశం వుంటుంద‌ని అందువ‌ల్ల జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మిష‌న‌ర్ కె.క‌న్న‌బాబు సూచించారు. తుఫాను వ‌ల్ల 80 కిలోల వేగంతో బ‌ల‌మైన గాలులు వీచే అవ‌కాశం ఉంటుంద‌ని దీని కార‌ణంగా చెట్లు ప‌డిపోవ‌డం వ‌ల్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డం, విద్యుత్ స్థంభాలు కూలిపోవ‌డం వ‌ల్ల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయ‌ని, ఇలాంటి ఇబ్బందులు ఏర్ప‌డిన‌పుడు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌తో సంబంధిత అధికారులు సిద్ధంగా వుండాల‌న్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ తుఫాను ప్ర‌భావానికి గుర‌య్యే అవ‌కాశం వుంటుంద‌న్నారు.
 తుఫాను స‌న్న‌ద్ధ‌త‌పై జిల్లా యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను విప‌త్తుల క‌మిష‌న‌ర్ ఆదివారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఉన్నతాధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప‌రంగా చేప‌ట్టిన ముందస్తు చ‌ర్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. విద్యుత్ స్థంభాల పున‌రుద్ద‌ర‌ణ కోసం జిల్లాలో 2 మాత్ర‌మే డ్రిల్ల‌ర్‌లు ఉన్నాయ‌ని, మ‌రో2 డ్రిల్ల‌ర్లు వుంటే విద్యుత్ స్థంభాల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు వేగంగా చేప‌ట్టే అవ‌కాశం ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం మాత్ర‌మే న‌మోదు అయ్యింద‌న్నారు. ఎలాంటి న‌ష్టాలు సంభ‌వించ‌లేద‌న్నారు. రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు విప‌త్తుల స‌మ‌యంలో చెట్ల‌ను తొల‌గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డే అధునాత‌న ప‌రికరాలు, యంత్రాలు స‌ర‌ఫ‌రా చేశామ‌ని, వాటిని వినియోగించి తుఫాను అనంత‌ర ప‌రిస్థితుల్లో ర‌వాణాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌కు విప‌త్తులను ఎదుర్కోవ‌డంలో త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌డం, తీర గ్రామాల ప్రజ‌ల‌కు తుఫానులు ఎదుర్కోవ‌డంపై అవ‌గాహ‌న క‌లిగించ‌డం ద్వారా విప‌త్తుల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. తుఫాను తీరం దాటే స‌మ‌యంలో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తాయ‌ని ఆ సమ‌యంలో ఇళ్ల‌లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జిల్లాలో ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్‌. బృందాల‌ను సిద్ధంచేశామ‌ని జిల్లా ఎస్‌.పి. ఎం.దీపిక వివ‌రించారు. జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌పై సంతృప్తి వ్య‌క్తంచేస్తూ గులాబ్ తుఫానును స‌మ‌ర్ధంగా ఎదుర్కోగ‌ల‌ద‌నే విశ్వాసం త‌న‌కుంద‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ ప‌ద్మావ‌తి, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా ఎస్‌.ఇ. శివానంద ప్ర‌సాద్‌, జిల్లా ఫైర్ ఆఫీస‌ర్ జె.మోహ‌న‌రావు, మ‌త్స్య‌శాఖ డిడి నిర్మ‌లాకుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై స‌మీక్ష‌..

జిల్లాలో మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై కూడా ఆ శాఖ క‌మిష‌న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కె.క‌న్న‌బాబు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించారు. స్థానికంగా ల‌భించే మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను వినియోగించేలా ప్రోత్స‌హించాల‌ని, మ‌త్స్య ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ స‌దుపాయాలు క‌ల్పించ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. జిల్లాలో మ‌త్స్య ఉత్ప‌త్తుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ని, చెరువుల్లో చేప‌ల ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారి వివ‌రించారు.

Vizianagaram

2021-09-26 12:19:28

ప్రజాసంబంధాల బలోపేతానికి పి.ఆర్.ఎస్.ఐ. కృషి..

ఉత్తమ ప్రజాసంబంధాలను నెలకొల్పడంలో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడంలో భారత ప్రజా సంబంధాల సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ గత 3 దశాబ్థాలుగా విశేషకృషి చేస్తూ వస్తోందని పిఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డి.సి.ఐ.) విశ్రాంత అధికారి కె.రామారావు పేర్కొన్నారు. పి.ఆర్.ఎస్.ఐ. విశాఖ శాఖ ఆదివారం హోటల్ దసపల్లా లో నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. పి.ఆర్.నిపుణులు కాలానుగుణంగా వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విశాఖ శాఖ ఛైర్మన్ పి.ఎల్.కె.మూర్తి మాట్లాడుతూ, కోవిడ్19 సమయంలో  సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని ప్లాస్మా దాతలను గుర్తించి అవసరమైన వారికి అనుసంధానం చేయడం,  మాస్క్ లు, శానిటైజర్లు,
ఆహర పదార్థాల పంపిణీతో పాటు పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వైస్ ఛైర్మన్ ఆర్.పి.శర్మ మాట్లాడుతూ, విశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల అధికారులకు త్వరలో వివిధ అంశాలపై  వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యదర్శి ఎమ్.కె.వి.ఎల్.నరసింహం మాట్లాడుతూ, సంస్థ తరపున ప్రజా సక్షేమానికి  ప్రభుత్వాలు తీసుకునే పలు నిర్ణయాలు ప్రజలకు అర్థం అయ్యేవిధంగా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కోశాధికారి ఎన్.వి.నరసింహం విశాఖ శాఖ వ్యయ ప్రణాళికను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత విభాగం ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ జాతీయ స్థాయిలో  విశాఖ శాఖకు పేరు ప్రఖ్యాతులు రావడం వెనక ప్రస్తుత, గత కార్యవర్గం చేసిన కృషి ఉందన్నారు. సభ్యుల సంఖ్య పెరిగేలా కృషిచేయాలని, విద్యార్థులకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా యువత పాత్ర పెరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలో శాఖ బలోపేతానికి పలువురు సభ్యులు  సూచనలు చేశారు. సంస్థ మాజీ అధ్యక్షుడు కె.రామారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.పి.సి. పీఆర్వో టి.మల్లయ్య, కాయర్ బోర్డు మేనేజర్ వెంకట్రామన్, సీనియర్ సభ్యులు వై.శ్రీనివాసకుమార్,పి.ఎస్.ఎన్.మూర్తి, బి. విక్రమ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-26 12:00:33

చిల్డ్రన్స్ థియేటర్ లో పర్యాటక దినోత్సవం..

విశాఖలో ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వి.ఎమ్.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయం పై మంత్రి స్థానిక సర్క్యూట్ హౌస్ లో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా, స్టేక్ హోల్డర్స్ అయిన హోటల్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్వెస్టర్స్, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరిని కలుపుకుని పర్యాటక రంగాన్ని, పర్యాటక ప్రదేశాలను అభివృద్థి చేస్తామన్నారు. పర్యాటక రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి “అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ” ఇవ్వడం జరుగుతుందన్నారు. పర్యాటక రంగాన్ని “ఆర్గనైజ్డ్ సెక్టార్” గా అభివృద్థికి కృషి చేస్తామని తెలిపారు. టూరిజం ఆపరేటర్లను శాఖాపరంగా రిజిస్ట్రేషన్లు గావిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల అభివృద్థికి ప్రైవేట్ ఆపరేటర్స్ ను ప్రోత్సహిస్తామన్నారు. పర్యాటక దినోత్సవం రోజున ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా  సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇన్వెస్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వి.ఎమ్.ఆర్.డి.ఎ. టూరిజం ప్రాంతాలలో ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు.పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద సముద్రతీరం ఉందన్నారు. రాష్ట్రంలో  ప్రకృతి సహజమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. అందరి భాగస్వామ్యంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ. ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, పైడా కృష్ణ ప్రసాద్ ఎ.పి.ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, హోటలియర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ పవన్ కార్తీక్, ఎ.పి.టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-24 13:33:46

సేవను రాజ‌కీయ చేయ‌డం బాధాక‌రం..

టిటిడి జారీ చేసిన అక్టోబ‌రు నెల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటాను జియో సంస్థ స‌బ్ డొమైన్‌తో టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌డంపై సామాజిక మాధ్య‌మాల్లో జ‌రిగిన దుష్ప్ర‌చారాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం ఖండించారు. జియో సంస్థ సేవా భావంతో ముందుకొచ్చింద‌ని, ఈ అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. జియో సంస్థ క్లౌడ్ ప‌రిజ్ఞానం ద్వారా ఒకటిన్న‌ర‌ గంట వ్య‌వ‌ధిలోనే స‌మ‌ర్థ‌వంతంగా 2.39 ల‌క్ష‌ల టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలు క‌ల్పించామ‌న్నారు.   ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు జియో సంస్థ దాదాపు రూ.3 కోట్లు విలువైన సాంకేతిక స‌హ‌కారం, మౌలిక స‌దుపాయాలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింద‌న్నారు. కొన్ని మీడియా ఛాన‌ళ్లు, సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని టిటిడిపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ భ‌క్తుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నార‌ని చెప్పారు. భ‌క్తులు, తిరుప‌తి ప్ర‌జ‌లు, టిటిడి ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

             ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఆగ‌స్టు, సెప్టెంబ‌రు నెల‌ల్లో ఎదురైన సాంకేతిక స‌మ‌స్య‌లపై భ‌క్తుల నుండి ప‌లు సూచ‌న‌లు, ఫిర్యాదులు అందాయ‌న్నారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థ‌ల స‌హ‌కారంతో ప‌రిష్క‌రించిన‌ట్టు చెప్పారు. అయితే ఇలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ప‌లు మార్గాల‌ను అన్వేషించామ‌ని, ఇందులో భాగంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌ను వినియోగించుకునేందుకు అమెజాన్‌, జియో, బుక్ మై షో, అభిబ‌స్ లాంటి సంస్థ‌ల‌ను సంప్ర‌దించామ‌ని వివ‌రించారు. వీరిలో జియో సంస్థ రూ.3 కోట్లు విలువైన క్లౌడ్ సేవ‌ల‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింద‌ని తెలిపారు. అయితే tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో స‌మ‌యాభావం వ‌ల్ల జియో మార్ట్ స‌బ్ డొమైన్ వినియోగించాల్సి వ‌చ్చింద‌న్నారు. వ‌చ్చే నెలలో పూర్తిగా టిటిడి డొమైన్‌లోనే ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు.   టిటిడి మంచి ఉద్దేశంతో భ‌క్తుల‌కు టికెట్ల జారీ ప్ర‌క్రియను ఎంతో చ‌క్క‌గా అమ‌లుచేస్తుండ‌గా, కొంత‌మంది అదేప‌నిగా సంస్థ ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లేలా వివిధ మాధ్య‌మాల‌లో అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు.

Tirumala

2021-09-24 13:14:43