1 ENS Live Breaking News

విశాఖ జిల్లా స్పందనకు 255 అర్జీలు..

‘స్పందన’లో  వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని   జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన, స్పందన’కార్యక్రమములో ప్రజల నుండి  వినతులను స్వీకరించారు. ఈ రోజు ‘స్పందన’లో 255 అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరు అధికారుల సమావేశంలో  మాట్లాడుతూ నిన్న జరిగిన ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి వోట్లు లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించారని అభినందించారు. తదుపరి కలెక్టరు కోవిడ్ ప్రోటోకాల్ పై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో   జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్  (హౌసింగ్) కల్పనా కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) అదితీసింగ్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి గోవిందరావు, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-09-20 12:19:11

రేపు జిల్లాలో గురజాడ జయంతి వేడుకలు..

న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ అప్పారావు 159వ జ‌యంతోత్స‌వాన్ని మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఒక తెలిపారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గుర‌జాడ స్వ‌గృహంలో ఉద‌యం 9 గంట‌ల‌కు, మ‌హాక‌వి చిత్ర‌ప‌టానికి పూల‌మాలాంక‌ర‌ణ‌తో ఈ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. అక్క‌డినుంచి త‌ర‌లివెళ్లి, మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌ నృత్య క‌ళాశాల స‌మీపంలోని గుర‌జాడ కాంస్య విగ్ర‌హం వ‌ద్ద ఉద‌యం 10 గంట‌ల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కూ, జూమ్ మీటింగ్ ద్వారా, పాఠ‌శాల‌, క‌ళాశాల‌, విశ్వ‌విద్యాల‌య విద్యార్థుల‌చే గుర‌జాడ దేశ‌భ‌క్తి గేయాలాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, పుర ప్ర‌ముఖులు, సాహితీవేత్త‌లు, ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

Vizianagaram

2021-09-20 12:09:54

గురజాడ ఆశయ సాధనకు కృషి చేయాలి..

స్వంత లాభం కొంత మానుకొని, పొరుగువానికి తోడు పడవోయ్  అన్న మహా కవి గురజాడ ఆశయ సాధనకు  మనమందరం కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు.   సెప్టెంబర్ 21 మహాకవి గురజాడ 159 వ  జయంతిని కోవిడ్ నిబంధనల మధ్య అన్ని వర్గాల ప్రజలు, విద్యార్ధులు, సాహితీ, స్వచ్చంద సంస్థల సహకారం తో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గురజాడ నడయాడిన విజయనగరం లో కలెక్టర్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులందరికి, గురజాడ అభిమానులకు శుభాకాంక్షలను అందజేశారు.  మహాకవి గురజాడ  ఒక సంఘ  సంస్కర్త,  అభ్యుదయ వాది,  దేశ భక్తుడు కనుకనే  దేశమును ప్రేమించుమన్నా – మంచి యన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించగలిగారని తెలిపారు.  ఈ గేయం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుందని  అన్నారు. ముఖ్యంగా ఈ గీతం లో ఆ కవి రాసిన ప్రతి వాక్యం ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.  దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ - వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ ..గట్టి మేల్ తల పెట్ట వోయ్ అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి  ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.   కన్యా శుల్కం  నాటకం తో ఎన్నో తరాలుగా సమాజం లో నాటుకుపోయిన దురాచారం పై తన కలం తో పోరాడిన యోధుడని,   పండిత భాషను  వ్యావహారిక భాష గా అందించడం లో  ఎనలేని కృషి చేసిన భాషాభిమానియని,   ఆ  మహనీయుడు   నడయాడిన ఈ   నేల  పునీతంఅని  అభివర్ణించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పేర్కొన్న విధంగా  గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడని అన్నారు.  ఆయన రచనల రూపం లో అందరిలో చిరస్మరణీయునిగా నిలుస్తారని,  అయన జయంతి సందర్భంగా గురజాడ గృహం లో , గురజాడ కూడలి లో  జరపనున్న ఉత్సవాలకు స్వచ్చందంగా హాజరు కావాలని కోరారు.

Vizianagaram

2021-09-20 11:51:37

విజయనగరం స్పందనకు 205 వినతులు..

విజయనగరం జిల్లా  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 205 వినతులు అందాయి.  ఈ వినతులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్  కుమార్, డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు  స్వీకరించారు.   ముఖ్యంగా పించన్లు,  ఇంటి స్థలాలు,  అమ్మఒడి ,  రేషన్ కార్డు లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి.  ఆయా శాఖల అధికారులకు పంపుతూ  వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన వినతులు 37,రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 168 వినతులు అందాయి. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ  స్పందన వినతులు మున్సిపల్, ఐ.సి.డి.ఎస్,  విద్యా శాఖల వద్ద ఎక్కువగా పెండింగ్  ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. అధికారులంతా గడువు దాటకుండా వినతులను పరిష్కరించాలని సూచించారు.

Vizianagaram

2021-09-20 11:14:59

విజయనరగరం జిల్లా డీఈఓగా ఎన్.స‌త్య‌సుధ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్‌.స‌త్య‌సుధ సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమె ఇంత‌కుముందు గుంటూరు ఆర్‌జెడి కార్యాల‌యంలో స‌హాయ సంచాల‌కులుగా ప‌నిచేస్తూ, ప‌దోన్న‌తితో డిఇఓగా జిల్లాకు వ‌చ్చారు. కొద్దిరోజుల క్రితం వ‌ర‌కూ ఇక్క‌డ‌ డిఇఓగా ప‌నిచేసిన జి.నాగ‌మ‌ణి, జాయింట్ డైరెక్ట‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది బ‌దిలీ కావ‌డంతో, ఈ పోస్టు ఖాళీ అయ్యింది. ప్ర‌స్తుతం ఇన్‌ఛార్జి డిఇఓగా ప‌నిచేస్తున్న ఏడి ల‌క్ష్మ‌ణ‌రావు నుంచి ఆమె బాధ్య‌త‌లు తీసుకున్నారు. స‌త్య‌సుధ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించేముందు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారిని క‌లిసి అనుమ‌తి తీసుకున్నారు.  

Vizianagaram

2021-09-20 10:52:23

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియోగా జి.వాణీమోహన్ ప్రమాణస్వీకారం..

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ,  క‌మిష‌న‌ర్ జి.వాణి మోహ‌న్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా,  జీవ‌న్‌రెడ్డి,  మూరంశెట్టి రాములు,  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ స‌భ్యులుగా సోమ‌వారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్)  సుధారాణి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో  లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-20 10:03:46

శాస్త్రోక్తంగా క‌ల్యాణవేంక‌టేశ్వ‌రుని ప‌విత్రోత్స‌వాలు..

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి  పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 నుంచి  10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు,  పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి మూలమూర్తుల‌కు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.  సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  పార్వ‌తి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  విష్ణుబ‌ట్టాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  నాగ‌రాజు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Narayanavanam Temple

2021-09-20 09:59:15

హెచ్ఐవీపై యువత అవగాహన పెంచుకోవాలి..

యువ‌త ఆరోగ్యంగా వుంటేనే ఆనందంగా వుంటామ‌నే విష‌యాన్నిగుర్తించి చెడు వ్యస‌నాల‌కు, ప్రలోభాల‌కు లోనుకాకుండా దూరంగా వుండ‌టం ద్వారా త‌మ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ కుమారి అన్నారు. హెచ్‌.ఐ.వి. వ్యాప్తి యువ‌త‌లోనే అధికంగా ఉంద‌ని, ఎంద‌రో యువ‌త తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సులో ఈ వ్యాధి బారిన ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో హెచ్‌.ఐ.వి. చికిత్సకోసం ఏ.ఆర్‌.టి. కేంద్రాల‌కు వ‌స్తున్న వారిలో 15 నుంచి 30 ఏళ్ల వారే అధికంగా వుంటున్నార‌ని చెప్పారు. యువ‌త ఈ వ్యాధి ప‌ట్ల అప్రమ‌త్తంగా వుండాల‌ని, ఒక‌సారి ఈ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వినియోగించాల్సి వుంటుంద‌ని అందువ‌ల్ల ఈ వ్యాధికి గురికాకుండా స్వీయ‌నియంత్రణ‌తో వుండాల‌న్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేర‌కు జిల్లాలో యువ‌త‌కు హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్ పై అవ‌గాహ‌న క‌లిగించేందుకోసం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ‌ క‌ళాజాత‌ల ద్వారా చేప‌ట్టిన 20 రోజుల ప్రచార కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్‌.ఓ. సోమ‌వారం క‌లెక్టర్ కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డా.ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ 2030 నాటికి హెచ్‌.ఐ.వి. ర‌హిత దేశంగా నిల‌పాల‌నే ల‌క్ష్యంతో భార‌త ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని, దీనిలో భాగంగా ప్రజ‌ల్లో దీనిపై వీధినాటిక‌ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేప‌డుతున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ పై కూడా ఈ బృందాలు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ర‌మ‌ణ‌కుమారి కోరారు. ప్రజ‌లు కోవిడ్ బారిన ప‌డ‌కుండా వుండేందుకు త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై ప్రజ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు ప‌ర్యవేక్షిస్తున్న అద‌న‌పు వైద్య ఆరోగ్య అధికారి డా.ఎల్‌.రామ్మోహ‌న్ మాట్లాడుతూ రెండు క‌ళాజాత బృందాల ఆధ్వర్యంలో38 వీధినాటిక‌ ప్రద‌ర్శన‌లు నిర్వహించి అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, వ్యాప్తి చెంద‌కుండా సోక‌కుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల‌నే అంశంపై క‌ళాబృందాల స‌భ్యులు అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్స్‌, స‌హృద‌య న‌ట‌స‌మాఖ్య త‌దిత‌ర రెండు క‌ళా బృందాలు ఈ క‌ళాజాత‌ ప్రద‌ర్శన‌లు నిర్వహిస్తాయ‌ని డి.పి.ఎం. బాలాజీ పేర్కొన్నారు. స‌మాచార శాఖ ఏ.డి. ర‌మేష్‌, జిల్లా పాజిటివ్ నెట్ వ‌ర్కు, వైద్య సిబ్బంది, ఎన్‌.జి.ఓ. ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-20 09:29:07

పూర్ణాహుతితో ముగిసిన అమ్మవారి పవిత్రోత్సవాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రో త్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తార‌ని చెప్పారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తొంద‌న్నారు. సెప్టెంబ‌రు 18న ప్రారంభ‌మైన పవిత్రోత్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయ‌ని తెలిపారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందున‌,  ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనాల‌ని భావించే భ‌క్తుల కొర‌కు ఎస్వీబీసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ సేవ‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.  ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో జెఈవో  స‌దా భార్గ‌వి, ఆలయ డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, సూపరింటెండెంట్‌  శేష‌గిరి,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  రాజేష్ పాల్గొన్నారు.

Tiruchanur

2021-09-20 08:48:12

26, 27 రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ పర్యటన..

ఈ నెల 26, 27  తేదీలలో  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చిత్తూరు  జిల్లాలో పర్యటించ నున్నట్లు  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  ఒక ప్రకటన లో తెలిపారు.  రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చైర్మన్  జంగా కృష్ణముర్తి , కమిటీ సభ్యులు (శాసన సభ్యులు)  బొత్సా  అప్పలనరసయ్య,  అన్నమ రెడ్డి అదిప్ రాజు ,  బుర్రా మధుసూదన్ యాదవ్,  ఎన్. వెంకటే గౌడ ,  రమేష్ బాబు సింహాద్రి,   కె. పెద్దిరెడ్డి,   వెంకటరామిరెడ్డి,  బొల్లా బ్రహ్మ నాయుడు, పి. జి. వి. ఆర్. నాయుడు, దువ్వారపు రామారావు ( ఎం ఎల్ సి) లు ఈ నెల 26 న  వెలగపూడి నుండి బయలుదేరి తిరుమల చేరుకొని బస చేస్తారు.  తేది 27 న ఉదయం తిరుమల  శ్రీవారిని దర్శించుకొని, తిరుపతి పద్మావతి  అతిధి గృహం చేరుకుంటారు.  ఉదయం  11.00 గంటల నుండి బి. సి. సంఘాలు, వ్యక్తుల  నుండి  వినతులు స్వీకరించి,  11.30 గంటలకు  టి. టి. డి. లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ,  మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా ఉన్నతాదికారులతో అమలు అవుతున్న బి సి సంక్షేమ పథకాలపై  సమీక్ష  నిర్వహించి వై. ఎస్. ఆర్. కడప  బయలు దేరనున్నారని  కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.  

Tirupati

2021-09-20 06:24:36

అప్పన్నకు కాకినాడ ఎంపీ వంగాగీత పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీత దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ ఎంపీకి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎంపీ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-20 03:59:20

తూ.గో. 86 ఎంపీటీసీలు ఏకగ్రీవాలు..4 మరణాలు..

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం1184 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గతంలోనే 86 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆ తరువాత 4 అభ్యర్ధులు మ్రుతిచెందారు ఆపై 999 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో వైఎస్సార్సీపీ764 స్థానాలు, టిడిపి 110, జనసేన 93, స్వతంత్రులు 19, బిఎస్పీ1, బిజెపీ 2, సీపీఎం 7, ఐఎన్సీ1, సీట్లు సాధించాయి. ఇకజెడ్పీటీసీలు 61 సీట్లకు వైఎస్సార్సీపీ 58, టిడిపి1, జనసేన1, సమయాభావం, ఓట్లు తడిసిపోవడం ఎంపీటీసీల్లో 2 స్థానాలు, జెడ్పీటీసీల్లో 1 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి వుంది. 

Kakinada

2021-09-20 03:42:41

తూ.గో.జి.లో గట్టి పోటీ ఇచ్చిన టిడిపి, జనసేన..

తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు బాగానే పోటీ ఇచ్చాయి. టిడిపి అయితే  ఎంపీటీసీల్లో 11శాతం సీట్లును గెలుచుకోగా, జనసేన తొమ్మిది శాతం గెలుచుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లు కూడా తమ బలాన్ని నిరూపించుకొని 19 సీట్లను గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో సీపీఎం, బిఎస్పీ, ఐఎన్సీ ఒక్కో సీటు గెలుచుకోగా, సీపీఎం ఎప్పటిలోగా 7 సీట్లు,  బీజేపీ 2 సీట్లు గెలుచుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చాయి.

Kakinada

2021-09-20 02:21:50

తూ.గో.జి.లో వార్ వన్ సైడ్ అయిపోయింది..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తూర్పోగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 999 స్థానాలకు వైఎస్సార్సీపీ764 స్థానాలు, టిడిపి 110, జనసేన 93, స్వతంత్రులు 19, బిఎస్పీ1, బిజెపీ 2, సీపీఎం 7, ఐఎన్సీ1, సీట్లు సాధించాయి. ఇకజెడ్పీటీసీలు 61 సీట్లకు వైఎస్సార్సీపీ 58, టిడిపి1, జనసేన1, సమయాభావం, ఓట్లు తడిసిపోవడం ఎంపీటీసీల్లో 2 స్థానాలు, జెడ్పీటీసీల్లో 1 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి వుంది. వాటిని అధికారులు ఉదయం 10గంటల తరువాత ప్రకటించే అవకాశం వుందని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

Kakinada

2021-09-20 02:21:01

కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మాణం..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో  వైఎస్సార్సీపీలో విభేధాలు రచ్చకెక్కాయి. దీనితో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు మేయర్‌ పావనికి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు. కాకినాడ మేయర్ మార్పు అనివార్యం కానుంది..

Kakinada

2021-09-20 02:19:31