1 ENS Live Breaking News

తుపాను వ్యార్ధాల నీరు నిల్వలేకుండా చూడండి..

 తుఫాను వర్షాల కారణంగా నీరు నిలిచి రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఉదయం కలెక్టరు అధికారుల తో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భముగా కలక్టరు మాట్లాడుతూ వర్షాల కారణంగా నీరు నిలిచి పోయి పలు వ్యాధులకు కారణమవుతుందని, కాబట్టి నీరునిల్వ ఉండకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్ గావించాలన్నారు. నీటి ట్యాంకుల ను డ్రై చేయాలని సూచించారు. బుధవారం   డ్రైడే  పాటించాలన్నారు.  బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్యాంకుల ను శుభ్ర పరచి డ్రై చేయాలని సూచించారు.  నీరు నిల్వ ఉంటే దోమలు బ్రీడింగ్ జరుగుతుంది కాబట్టి  నిలువ నీటిని తప్పని సరిగా పారబోయించాలన్నారు.  పల్లపు ప్రాంతాల లో  మట్టి, రాళ్ళతో నింపాలన్నారు.  పంచాయితీ సిబ్బంది, ఆశా , ఎ.ఎన్.ఎమ్. లు, గ్రామ సేక్రటేరియట్ సిబ్బంది,, వాలంటీర్లు, పోలీస్ లు, ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.  డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర వ్యాదులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా క్లోరినేషన్ చేసిన   శుభ్రమైన నీటిని ట్యాంకర్ల తో సరఫరా చేయాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైధ్యాధికారులకు సూచించారు.  
కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగించాలన్నారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పి.అరుణ్ బాబు,  జి.వి.ఎం .సి. కమిషనర్ జి.సృజన, జిల్లా వైద్యాధికారి డా. సూర్యనారాయణ,  సి.ఇ.ఓ జిల్లా పరిషత్ నాగార్జున సాగర్,  డి.పి. ఒ కృష్ణకుమారి, ఎస్.ఇ, పంచాయితీరాజ్ రవీంద్ర, డ్వామా పిడి సంధీప్ తదితర అధికారులు  టెలి కాన్ఫరెన్స్  లో పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-09-28 13:51:56

లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలి..జెసి..

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీ.ఎం.ఆర్) సరఫరాను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ రైస్ మిల్లర్ల ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో  సివిల్ సప్లయ్  అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జేసీ లక్ష్మీశ  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ  జిల్లాలో రబీ సీజన్ సీఎంఆర్ బియ్యాన్ని  ఖరీఫ్ సీజన్ ధాన్యం సెకరణ ప్రారంభం కాకముందే పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బియ్యం సరఫరాను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు పంపిణీ చేసే మధ్యాహ్న భోజన పథకం‌, అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్ట్ ఫైడ్ బియ్యాన్ని సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఎఫ్.సీ.ఐ కి ఇచ్చే బాయిల్డ్ రైస్ పంపిణీ కూడా వేగవంతం చేయాలని జేసీ లక్ష్మీ శ రైస్ మిల్లర్ల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీఎంఆర్ బియ్యాన్ని
 గడువు లోపల పంపిణీ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందని రైస్ మిల్లర్ల ప్రతినిధులు జేసీ కి తెలిపారు.  ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లయ్ ఇ. లక్ష్మీరెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, ఇతర రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-28 11:45:27

115 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటి ముంపు..

తూర్పుగోదావరి జిల్లాలో115 ఎకరాల్లో ఉద్యాన పంటలు(అరటి, కర్రపెండలం, కూరగాయలు) నీటమునిగినట్టు ప్రాధమిక అంచనా వేసిసట్టు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబ్ తుపాను ఉద్యాన పంటలపై ప్రభావం చూపిందన్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున  ముంపు పెరిగే అవకాశాలున్నాయన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. ఏఏ మండలాల్లో పంట ముంపు జరిగిందో అక్కడ గ్రామీణ ఉద్యాన సహాయకులు, అధికారులతో విచారణ చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.

Kakinada

2021-09-28 11:40:19

ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు..

శ్రీకాకుళం జిల్లాలో ‘‘గులాబ్ తుఫాన్” వలన నాగావళి నది ముంపు ప్రాంతాల ప్రజల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నాగావళి నదిలో నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని, తద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. మహిళా మండల వీధి, తురాయి చెట్టు వీధి,వైష్ణపు వీధి,లెప్రసీ కాలనీ, హెచ్‌.బి.కాలనీ,మంగువారితోట తదితర నాగావళి ముంపు ప్రాంతాలను మంగళవారం ఉదయం స్వయంగా సందర్శించారు.  వరద నీరు నగరంలోని లోతట్టు ప్రాంతాలలో చేరుతున్నందున ఇంజిన్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.  నాగావళి నది ఉధృతి మరింతగా ఉండే అవకాశం ఉన్నందున సదరు ప్రాంత ప్రజలకు పునరావాసా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం ఎన్.టి.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల, మంగువారి తోట నగర పాలక ప్రాథమిక పాఠశాల, టి.పి.ఎం. నగర పాలక ఉన్నత పాఠశాలలను సిద్ధం చేయడం జరిగిందని, ముంపు ప్రాంతాల ప్రజలు వారి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని ఆయన ముంపు ప్రాంతాల ప్రజలను కోరారు. 

Srikakulam

2021-09-28 09:59:50

నష్ట పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం..

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాను లో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం  అన్నారు బుధవారం తుఫాను లో నష్టపోయిన పొందూరు మండలంలోని రెడ్డి పేట, దల్లి పేట, బానాం, చిన కొంచాడ, రెల్లిగెడ్డ లను పరిశీలించారు. గులాబ్ తుఫానుకు బొప్పాయి, అరటి, మొక్క జొన్న తదితర ఉద్యాన పంటలు బాగా నష్టపోయాయని తెలిపారు. ఉద్యాన పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆయన వివరించారు. నష్ట పోయిన రైతులకు సముచిత పరిహారం అందించుటకు కృషి చేస్తామని అన్నారు. బొప్పాయి కిలో ధర రూ.17 ఉండగా, ప్రస్తుతం రూ.3 నుండి 6 ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు దీనమైన పరిస్థితికి చేరుకున్నారని ఆయన చెప్పారు. అధికార బృందాలు జిల్లాలో పర్యటించి ప్రతి రైతు నష్టపోయిన పంట వివరాలను, ఇతర ఆస్తులు వివరాలు నమోదు చేస్తారని ఆయన వివరించారు. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొని వాస్తవ వివరాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల నష్ట పరిహారం అందడంలో సమస్య ఉండరాదని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని, అన్యాయం ఎక్కడా జరగరాదని స్పీకర్ వివరించారు. సర్వే పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. రైతులు కష్టాల్లో ఉన్నారని ఆ సమయంలోనే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని,  వారి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నారాయణపురం ప్రాంతంలో వరి నీట మునిగి ఉందని వివరించారు. రెల్లి గడ్డ పనుల్లో నాణ్యత లోపంతో గతంలో చేయడం వలన ప్రస్తుతం రైతులు నష్టోతున్నారని స్పీకర్ సీతారాం అన్నారు.  పూర్తిస్థాయిలో నిర్మించి రైతులకు ఇస్తామని అన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల అవసరం మేరకు గుర్తించి ప్రతిపాదిస్తామని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాంతారావు, ఎంపీపీ ఉషారాణి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె .శ్రీధర్, స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-28 09:56:08

తూ.గో.జిలో 7వేల హెక్టార్లలో వరిపంట నీటముంపు..

తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ కాస్త గట్టిగానే కొట్టింది జిల్లాలో 7వేల హెక్టార్లలో వరపంట నీటమునిగినట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్. విజయకుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట పండుతుండగా ప్రస్తుతం ఏడువేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ప్రస్తుతం పంటచేలో చేరిన నీరుని తొలగించే కార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతులు ఎవరూ ఆందోలన చెందాల్సిన పనిలేదని, గ్రామాలు, మండలాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు సూచనలు సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.

Kakinada

2021-09-28 05:40:39

అక్టోబరు 1 నుంచి గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్లు..

తూర్పుగోదావరి జిల్లాలో పశువుల గాలికుంటు వ్యాధికి అక్టోబరు 1 నుంచి వేక్సిన్లు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం  ఆయన కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో 8లక్షల 80వేల పశువులకు ఈ వేక్సిన్ అందించనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే మండలాల వారీగా ఇండెంట్లు తయారుచేసినట్టు ఆయన మీడియాకి వివరించారు. వాటిని మండల కేంద్రాలకు పంపి అక్టోబరు 1 నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తామన్నారు.

Kakinada

2021-09-28 05:32:21

పర్యాటక అభివృద్ధికి జిల్లాలో పుష్కల అవకాశాలు..

పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా పర్యాటక శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. సెప్టెంబర్ 27, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పై మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో ముందుగా టూరిజం ప్యాకేజీకి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ విజయ దర్శిని ని ప్రారంభించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ఇతర  వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీ ద్వారా పర్యాటకులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం సర్క్యూట్ లలో పర్యాటక అభివృద్ధి కి అనుకూల ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి పరిచి పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటకానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి పి.ఎన్.వి. లక్ష్మినారాయణ, ఎన్. ఐ. సి. అధికారులు నరేంద్ర, బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:58:42

రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్.ఆర్.ఐ. రూ.25వేలు విరాళం..

విజయనగరం జిల్లాలో సుధామై వెల్ఫేర్ అసోసియేషన్  అధ్యక్షులు, ఎన్.ఆర్.ఐ. అయిన సుధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.25 వేలు విరాళం అందించారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి సోమవారం చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం  అందించిన సుధాకృష్ణని కలెక్టర్  అభినందించారు. మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా రెడ్ క్రాస్ ద్వారాఎక్కువ మందికి సేవలు అందించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:04:40

విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ‌కే అధిక ప్రాధాన్య‌త..

తుఫాను వ‌ల్ల దెబ్బ‌తిన్న విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ పున‌రుద్ద‌ర‌ణ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.ఆదిత్య‌నాథ్ దాస్ ఆదేశించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాతోనే అన్ని ర‌కాల స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు ముడిప‌డి వుంటాయ‌ని అందువ‌ల్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పున‌రుద్ద‌రించాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌.ఇ.ని ఆదేశించారు. జిల్లాలో గులాబ్ తుఫాను అనంత‌ర ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ యంత్రాంగం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ప‌రిశీల‌న నిమిత్తం సోమ‌వారం జిల్లాకు వ‌చ్చిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాలో తుఫాను కార‌ణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌కు జ‌రిగిన న‌ష్టాలు, పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌పై ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శికి ఇ.పి.డి.సి.ఎల్‌. ప‌ర్యవేక్ష‌క ఇంజ‌నీర్ మ‌సిలామ‌ణి వివ‌రించారు. జిల్లాలో 33/11 కె.వి. విద్యుత్ స‌బ్‌స్టేష‌న్లు 110 పున‌రుద్ద‌రించామ‌ని, 34 పునరుద్ద‌రించాల్సి వుంద‌ని, 11 కె.వి. స‌బ్‌స్టేష‌న్‌లు 423లో 135 మాత్ర‌మే పున‌రుద్ద‌రించాల్సి వుంద‌ని, డిస్ట్రిబ్యూష‌న్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లు ఇంకో 50 వ‌ర‌కు ఏర్పాటు చేయాల్సి వుంద‌ని వివ‌రించారు. ఈరోజు రాత్రికే స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశించారు.

తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌రిస్థితిపై స‌మీక్షిస్తూ ర‌క్షిత నీటిప‌థ‌కాల ద్వారా నీటి స‌ర‌ఫ‌రాకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. అన్ని ప‌థ‌కాల‌కు ప్ర‌త్యామ్నాయ సోర్స్‌లు వున్నాయ‌ని, వాటి ద్వారా ఎలాంటి స‌ర‌ఫ‌రా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఎస్‌.ఇ. శివానంద‌ప్ర‌సాద్ వివ‌రించారు. అవ‌స‌ర‌మైన చోట ట్యాంక‌ర్ల ద్వారా కూడా తాగునీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు.

భారీవ‌ర్షాల‌కు సాలూరు మండ‌లం మామిడిప‌ల్లి గ్రామం నీట మునిగింద‌ని, అక్క‌డ పి.హెచ్‌.సి. కూడా పూర్తిగా నీటిలో మునిగి వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి వివ‌రించారు. అయితే గ్రామ ప్ర‌జ‌ల‌కు పున‌రావాస శిబిరాలు ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌స్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ముఖ్యంగా ర‌హ‌దారుల‌పై వున్న కాజ్‌వేల పైనుంచి నీరు ప్ర‌వ‌హించే చోట రాక‌పోక‌ల‌కు అవ‌కాశం లేకుండా అక్క‌డ కాపలా ఏర్పాటు చేయాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదేశించారు. నీటి ప్ర‌వాహం దాటుకొని వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డంవ‌ల్ల కొట్టుకొనిపోయే ప్ర‌మాదం వుంటుంద‌ని అందువ‌ల్ల పోలీసు శాఖ రోడ్లు భవ‌నాల శాఖ‌తో క‌ల‌సి ఆయా ప్ర‌దేశాల్లో కాప‌లాదారుల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లాలో రోడ్లు తెగిపోవ‌డం వ‌ల్ల బాహ్య‌ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలు ఏవైనా వున్న‌దీ లేనిదీ సి.ఎస్‌.ఆరా తీశారు. అటువంటి గ్రామాలు ఏమీ లేవ‌ని అధికారులు వివ‌రించారు.

జిల్లాలో రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిస్థితిని జ‌ల‌వ‌న‌రులశాఖ ఉత్త‌రాంధ్ర‌  చీఫ్ ఇంజ‌నీర్ సుగుణాక‌ర‌రావు వివ‌రించారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని కిందికి విడుద‌ల చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం సాగునీటి ప్రాజెక్టుల వ‌ల్ల ఎలాంటి వ‌ర‌ద‌ముప్పు లేద‌ని తెలిపారు. విశాఖ‌లో మేఘాద్రిగెడ్డ జ‌లాశ‌యం నుంచి నీటి విడుద‌ల కార‌ణంగా విశాఖ ఎయిర్ పోర్టు ముంపున‌కు గుర‌య్యే అంశంపై కూడా చీఫ్ సెక్ర‌ట‌రీ చ‌ర్చించారు. మేఘాద్రిగెడ్డ జ‌లాశ‌యం పూర్తిగా నిండింద‌ని జ‌లాశ‌యం నుంచి నీటివిడుద‌ల త‌ప్ప‌ద‌ని తెలిపారు. జిల్లాలో చిన్న‌నీటి చెరువులు పూర్తిగా నిండి వున్నందున వాటికి గండ్లు ప‌డే ముప్పు వుంద‌ని తెలిపారు.

వైద్య ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్త‌త‌పై కూడా సి.ఎస్‌. స‌మీక్షించారు. జిల్లాలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌న్నింటికీ డీజిల్ జ‌న‌రేట‌ర్లు వున్నాయ‌ని జె.సి. డా.మ‌హేష్ కుమార్ తెలిపారు. పి.హెచ్‌.సిల‌కు కూడా జ‌న‌రేట‌ర్లు వున్నాయ‌ని విద్యుత్ స‌ర‌ఫరా లేన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు వున్న‌ట్టు చెప్పారు. అన్ని పి.హెచ్‌.సి.ల ప‌రిధిలో వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ర‌మ‌ణ కుమారి వివ‌రించారు.
తుఫాను సంద‌ర్భంగా నిత్యావ‌స‌ర స‌రుకుల‌న్నీ డిపోల ప‌రిధిలో అందుబాటులో వుంచామ‌ని జె.సి. డా.కిషోర్ కుమార్ వివ‌రించారు. 357 తుఫాను ముప్పు వుండే రేష‌న్ షాపుల‌ను గుర్తించామ‌ని, ఈ షాపుల్లో త‌గిన‌న్ని నిత్యావ‌స‌ర స‌రుకుల నిల్వ‌లు సిద్ధంచేసి వుంచామ‌న్నారు.

తుఫాను సంద‌ర్భంగా పోలీసు యంత్రాంగం ద్వారా కూడా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డి.ఐ.జి. కాళిదాస్ వెంక‌ట రంగారావు, ఎస్‌.పి. ఎం.దీపిక‌ల‌కు సూచించారు.

స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌ మ‌యూర్ అశోక్‌, డి.ఆర్‌.ఓ. ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిపిఓ సుభాషిణి, వ్య‌వ‌సాయ శాఖ డి.డి. నంద్‌, ఉద్యాన‌శాఖ డి.డి. శ్రీ‌నివాస‌రావు, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు ఇ.ఇ. రామ‌చంద్ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-27 12:02:39

పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు..

పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం పలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. గజపతినగరం సమీపంలోని పురిటిపెంటలో, తుఫాను బాధితులకోసం బాలికల పాఠశాలలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పాల్తేరు కల్యాణమండపం సమీపంలో, చంపావతి నదిని ఆనుకొని, పురిపాకల్లో నివాసం ఉంటున్న 16 మందికి, ముందుజాగ్రత్త చర్యగా అక్కడినుంచి తరలించి, ఈ కేంద్రంలో పునరావాసం కల్పించారు.  బాధితులతో ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికీ కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయంపై ఆరా తీశారు. బాధితులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.  ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీవో బిహెచ్ భవానిశంకర్, తాసిల్దార్ అరుణకుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Gajapatinagaram

2021-09-27 11:39:49

భారత్‌ బంద్‌కు విశాఖలో జర్నలిస్టుల మద్దతు..

జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫేడరేషన్‌,ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం నాటి భారత్‌ బంద్‌కు  వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడేరేషన్‌ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్‌ అర్భన్‌ అధ్యక్షుడు పి.నారాయణ నేతృత్వంలో పలువరు జర్నలిస్టులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్రం వర్కింగ్‌ జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను రద్దు చేసిందని, తక్షణమే వాటిని పునరుద్దరించాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు. వర్కింగ్‌ .జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలని, తామంతా కేంద్రాన్ని గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌ కమిటీ నియమించిన నేటి వరకూ జర్నలిస్టులకు న్యాయం జరగలేదున్నారు. తక్షణమే ఆ కమిటీ తన నివేదిక ద్వారా వర్కింగ్‌ జర్నలిస్టులను ఆదుకోవాలన్నారు.  అంతేకాకుండా అనేక కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగిందని, వాటికి కూడా ప్రత్యామ్నయం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో  జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బందర్‌ శివప్రసాద్‌,కార్యవర్గ ప్రతినిధులు మధు,కొండలరావు,బొప్పన రమేష్‌ తదితర ప్రతినిధుల పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-27 11:22:01

ప్రజలను పదే పదే సచివాలయాలకి తిప్పొద్దు..

పనుల కోసం  సచివాలయంకు వచ్చే ప్రజలను పదే పదే తిప్పొద్దని సిబ్బందికి నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని 45 వ సచివాలయంను సోమవారం మేయర్  ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియ ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికులతో మేయర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంకు ఏదైనా పనిమీద వస్తే సరిగా స్పందించడం లేదని, అవి కావాలి ఇవి కావాలి అని పదే పదే తిప్పుతారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన వేగవంతంగా అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తీసుకువచ్చారన్నారు.మీ నిర్లక్ష్యం మూలంగా ఆ వ్యవస్థ కు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.పని మీద వచ్చే వారికి సంబంధించి ఏదైనా రికార్డులు, పేపర్లు అవసరం అయితే   వాటి వివరాలు ఒకేసారి చెప్పాలని,ఒక్కోసారి ఒక్కొక్కటి అడగడం వల్ల టైమ్ వేస్ట్ తప్పా పనులు ముందుకు సాగవన్నారు.ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాని మేయర్ సూచించారు.కార్యక్రమంలో  కార్పొరేటర్లు  కమల్ భూషణ్,అనిల్ కుమార్ రెడ్డి లతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2021-09-27 10:54:58

కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ పొందడిలా..

కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ ప్రజలకు అందించడానికి ఉచిత టోల్ ఫ్రీ నెంబరు  18004250325 ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. ఈనెంబరుకి ఫోన్ చేసి ఆధార్, ఫోన్ నెంబరు, పేరు వివరాలు తెలియజేస్తే ఆన్ లైన్ సర్టిఫికేట్లు అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. ఇపుడు చాలా చోట్ల కోవిడ్ వేక్సినేషన్ సర్టిఫికేట్లు అడుగుతున్న ద్రుష్ట్యా ప్రజల సౌకర్యార్ధం దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు.

Kakinada

2021-09-27 10:54:01