1 ENS Live Breaking News

విజయనగరం స్పందనకు 396 వినతులు.. 

విజయనగరం జిల్లాలో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కు సోమవారం 396 వినతులు అందాయి.  ఈ వినతులను సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిశోర్  కుమార్,  మయూర్ అశోక్ , జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు  స్వీకరించారు.  డి.ఆర్.డి.ఎ. శాఖకు 70 వినతులు  ముఖ్యంగా పించన్లు, రెవెన్యూ శాఖకు 296  ముఖ్యంగా ఇంటి స్థలాలు,  రేషన్ కార్డు లు, డిసిహెచ్ఎస్ కు 20 వినతులు, డిఎం అండ్ హెచ్ ఓకు వికలాంగు పింఛన్లు తదితర అంశాల పై దరఖాస్తులు అందాయి.  ఆయా శాఖల అధికారులకు పంపుతూ  వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

Vizianagaram

2021-09-13 13:39:17

స్పెషల్ డ్రైవ్ లో 1.32లక్షల మందికి కోవిడ్ వేక్సిన్..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈనెల 11 నుంచి నేటి వ‌ర‌కు నిర్వ‌హించిన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో 1.32 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. సోమ‌వారం రోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 14 వేల మందికి వ్యాక్సిన్ వేసిన‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోని వారికి, రెండో డోసు అవ‌స‌ర‌మైన వారికి క‌ల‌సి మొత్తం 10.18 లక్ష‌ల డోసుల  వ్యాక్సిన్ వేసేందుకు ల‌క్ష్యంగా నిర్దేశించామ‌ని, సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఈ ల‌క్ష్యంలో 13శాతం సాధించామ‌న్నారు. ల‌క్ష్యం మేర‌కు శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ చేసేందుకు త‌దుప‌రి ద‌శ‌ల్లో కూడా వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌డ‌తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Vizianagaram

2021-09-13 13:38:37

17 నుంచి నూతన వార్డు సభ్యులకు శిక్షణ..

తూర్పుగోదావరి జిల్లాలో  సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 5 వరకు మూడు దశలలో 1,103 పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సుమారుగా 11,773 మంది వార్డు సభ్యుల శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయ‌త్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్ఐఆర్‌డీ) డైరెక్టర్ జె.మురళి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకుసోమవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ వార్డు స‌భ్యుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, ఇతర అధికారులు  హాజరయ్యారు. కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ఐఆర్‌డీ డైరెక్టర్ జె.మురళికి జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ వివరించారు. ఈ వీసీలో జిల్లా పరిషత్ పరిపాలనాధికారి సుబ్బారావు, కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పి.నారాయణ మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-13 13:34:24

ఏన్సిడెంట్ జిల్లాలో త్వరగా పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఏన్సిడెంట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో   జిల్లాలో మంజూరైన  సచివాలయాల పోస్టులు, మొదటి దశ, రెండవ దశల్లో విధులలో చేరిన అభ్యర్థులు, వారి ఏన్సిడెంట్ వివరాలు, శాఖా పరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వివరాలు, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. మెమో తీసుకున్న, ఇఓఎల్ పెట్టిన వారిని ఎవరికి ప్రొహిబిషన్ డిక్లర్ చేయవద్దని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రనాయక్, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్,  పశు సంవర్థక శాఖ జెడి కిషోర్, మత్య్స శాఖ జెడి శ్రీనివాసరావు, సర్వే శాఖ ఎడి కుంచె ప్రభాకరరావు, సెరికల్చర్ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 13:24:07

రైతుల సంక్షేమం కోసమే గ్రామాల్లో ఆర్బీకేలు..

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం 10,788 రైతు భ‌రోసా కేంద్రాల‌(ఆర్‌బీకే)లను నిర్మిస్తోందని   రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. సోమ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు త‌దిత‌రాల స‌ర‌ఫ‌రాతో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను రైతుల‌కు 100 % అందించ‌డంలో ఆర్‌బీకేలు కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయన్నారు. అదే విధంగా ఆర్‌బీకేలు విజ్ఞాన కేంద్రాలుగా మారాయ‌ని, వాటిని కొనుగోలు కేంద్రాలుగా కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి గ్రామంలోనూ వ్య‌వ‌సాయ, ఉద్యాన‌, మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క స‌హాయ‌కుల‌ను నియ‌మించి, రైతుల‌కు వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆర్‌బీకేల ద్వారా అందుతున్న సేవ‌లతో ప్ర‌స్తుతం దేశం మొత్తం మ‌న రాష్ట్రం వైపు చూసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. రూ.3,000 కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని, అదే విధంగా రూ.2,000 కోట్ల‌తో ప్ర‌కృతి విప‌త్తుల స‌హాయ నిధిని ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింద‌ని వివ‌రించారు. క‌ల‌లోకూడా ఊహించని విధంగా నేడు రాష్ట్రంలో రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా త‌దిత‌ర ప‌థ‌కాలు రైతుల‌కు అందుతున్న‌ట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినవి కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌యంగా అర‌టి, ప‌సుపు, బ‌త్తాయి, ఉల్లి త‌దిత‌ర ఏడు పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌(ఎంఎస్‌పీ)ల‌ను ప్ర‌క‌టించింద‌ని, రైతుల సంక్షేమంపై ప్ర‌భుత్వానికికున్న చిత్త‌శుద్ధికి ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పొగాకు రైతులు న‌ష్ట‌పోతున్న ప‌రిస్థితిని చూసి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు.  గ‌తంలో మాదిరి కాకుండా ప్ర‌భుత్వ సిబ్బందే నేరుగా రైతులు ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఈ-క్రాప్ బుకింగ్ చేస్తున్నార‌ని, ఈ స‌మాచారం వివిధ ప‌థ‌కాలను పార‌ద‌ర్శ‌కంగా,  జ‌వాబుదారీత‌నంతో అమ‌లుచేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. ఎక్క‌డా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా రైతుల‌కు అందిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేద‌ని, బ‌ఫ‌ర్ స్టాక్‌ను సైతం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. రైతుల‌కు ప‌గ‌టిపూట తొమ్మిది గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని, రూ.1700 కోట్ల‌ను ఫీడ‌ర్ల ఆధునికీక‌ర‌ణకు కేటాయించిన‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. 

ఇన్‌పుట్ రాయితీకి సంబంధించి గ‌త బ‌కాయిల‌ను కూడా చెల్లించ‌డ‌మే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏ సీజ‌న్‌లో జ‌రిగిన పంట న‌ష్టానికి అదే సీజ‌న్‌లో ఆర్థిక స‌హాయం అందిస్తోంద‌ని వివ‌రించారు. రైతులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ప్ర‌తి ఆర్‌బీకేలోనూ బిజినెస్ క‌ర‌స్పాండెంట్ల సేవ‌ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ల‌బ్ధి చేకూర్చేందుకు 4,93,000 క్రాప్ క‌ల్టివేట‌ర్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్‌సీ కార్డులు)ను అందించామ‌ని, వారికి కూడా రైతు భ‌రోసాను ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో రూ.1300 కోట్ల‌తో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేష‌న్‌కు ఊత‌మివ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రైతులు వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ ద్వారా ప్ర‌యోజ‌నం పొందేందుకు వీలుగా ఆర్‌బీకే ప‌రిధిలో క‌స్ట‌మ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను రైతు బృందాల‌తో ఏర్పాటుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు, పురుగుమందులు మాత్ర‌మే అందాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రీ టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తోంద‌ని, ఇప్ప‌టికే తొలిద‌శ‌లో 60 ల్యాబ్‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేస్తోంద‌న్నారు. అదే విధంగా తొలిద‌శ‌లో రూ.212 కోట్ల‌తో మార్కెట్‌యార్డుల‌ను నాడు-నేడు న‌మూనాలో అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ క్లిష్ట స‌మయంలోనూ చెప్పిన విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించిన‌ట్లు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు.

Kakinada

2021-09-13 13:21:27

శ్రీకాకుళం స్పందనకు 299 అర్జీలు..

శ్రీకాకుళంజిల్లాలో సోమవారం నిర్వహించిన స్పందన వచ్చిన అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఆసరా జెసి శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, వ్యవసాయం, విద్యా శాఖ, రేషన్ కార్డులు, తదితర సమస్యలు పై 299 అర్జీలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 10:11:53

తూ.గో.జి.లో 29 సిడిపీఓ పోస్టులు ఖాళీలు..

తూర్పుగోదావరి జిల్లాలోని  29 సిడిపిఓ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివిసత్యవాణి తెలియజేశారు. సోమవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలో 49 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రస్తుతం 20 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఖాళీగా వున్న 29 పోస్టుల భర్తీకై ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆమె తెలియజేశారు. మిగిలిన వారితో కొన్ని కేంద్రాలు ఇన్చార్జిలుగా పనిచేయిస్తున్నామన్నారు. ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీ స్త్రీల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన అన్ని పథకాలు పూర్తిస్థాయిలో అందిస్తున్నట్టు ఆమె వివరించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల అమలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

Kakinada

2021-09-13 10:09:34

కోవిడ్ వాక్సిన్ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే..

కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలం లింగుడుపురం గ్రామంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని ఆయన పేర్కొంటూ మెలియాపుట్టి మండలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగడం పట్ల అధికారులను ప్రశ్నించారు. పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష డోసుల వాక్సిన్ లభ్యంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వేయాలని ఆయన ఆదేశించారు. లక్ష్యాలు పూర్తి చేయని వారిపై చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. వాక్సినేషన్ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేయించాలని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మూడవ దశ కోవిడ్  నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా తోడ్పడగలదని ఆయన పేర్కొంటూ దీనికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన పొందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ అత్యుత్తమ పరిష్కారమని గుర్తించాలని శ్రీకేష్ వివరించారు. వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రాథమిక సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులు వినియోగం పట్ల పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాక్సిన్ వేయించుకోవడం వలన జిల్లాను కోవిడ్ వ్యాప్తి కాకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-13 08:44:06

వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

వంశధార నది పరీవాహక ప్రాంతమైన ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ ప్రవాహ పరిస్థితిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోమవారం రాత్రికి నదిలో 40వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందన్న సమాచారంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ ఎస్. సుగుణాకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమల రావు తదితరులతో జిల్లాలో ప్రస్తుత ప్రాజెక్టులలో ఉన్న నీటిమట్టం పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఒడిస్సాలో కాట్రగడ్డ, గుడారి, మోహన, మహేంద్ర గడ, గుణపూర్,  కాశీనగరం తదితర ప్రాంతాల్లో 31.55 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని ఫలితంగా వంశధార నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు చేరినట్లు వివరించారు. వరద నీటిని కాట్రగడ్డ సైడ్ వియ్యర్ ద్వారా వంశధార ప్రధాన (హిరమండలం) జలాశయంలోకి మళ్లించాలని సూచించారు. జలాశయం సామర్థ్యం 19 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని, ఈ వరద నీటితో మరో టీఎంసీని ఇప్పుడు నిలవ చేయగలమని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలంటే నేరేడి బ్యారేజ్ మాత్రమే శాశ్వత పరిష్కారం కావడంతో ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయని అడిగారు. ఒడిస్సా భూభాగంలో మునిగిపోతున్న నూట ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు, ఇంకా సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్ల రూపకల్పన కోసం రూ.68 కోట్లు ఖర్చు కానున్నాయని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వంశధార ఎస్.ఇ వివరించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందిన తర్వాత బ్యారేజి నిర్మాణం కోసం రూ.600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని చేరవేసి వీలైనంత త్వరగా నేరడి నిర్మాణానికి ప్రజా ప్రతినిధులంతా కృషి చేస్తామని కృష్ణదాస్ చెప్పారు. వంశధార ప్రాజెక్టు కుడి,ఎడమ ప్రధాన కాలువల గట్ల పటిష్టం కోసం ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేశామని, మిగిలిన కాలువల్లో పూడిక తీత పనులకు మరో రూ. 3 కోట్లు మంజూరయ్యాయని, నిధులు వెనక్కి వెళ్లక ముందే వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.

Srikakulam

2021-09-13 06:33:30

తూ.గో.జి.లో 38వేల ఎకరాల్లో బిందుసేద్యం..

తూర్పుగోదావరి జిల్లాలో 38వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం చేపడుతున్నట్టు ఏపీఎంఐపీ పీడి డా.రామ్మోహన్ తెలియజేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 30వేల మంది రైతులకు ఈ ప్రాజెక్టును దగ్గర చేశామన్నారు. అన్ని రకాల పంటలకు ఈ సేద్యాన్ని రైతులకు దగ్గర చేయాలనే లక్ష్యంతో ముందుకి వెళుతున్నట్టు ఆయన వివరించారు. త్వరలోనే వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరువ చేయడంతోపాటు, సామాగ్రిని కూడా అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అన్నిరకాల పంటలకు బిందు, తుంపర సేద్యాన్ని వినియోగించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీఎంఐపీ పీడి వివరించారు.

Kakinada

2021-09-13 06:15:07

తూ.గో.జి.లో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగు..

తూర్పుగోదావరి జిల్లాలో 2950 ఎకరాల్లో సెరీకల్చర్ సాగుచేపడుతున్నట్టు సెరీకల్చర్ డెప్యూటీ డైరెక్టర్ బిఎంవీ రామరాజు తెలియజేశారు. సోమవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పట్టుపరిశ్రమను అభివ్రుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నియమించిన 11 మంది(ఒక్క పోస్టు భర్తీకాలేదు) విలేజ్ సెరీ కల్చర్ సిబ్బంది రైతులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. సాగు వీస్తీర్ణం పెంచేందుకు అన్ని రకాలు చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సాగు చేస్తున్నవారికి ప్రభుత్వం నుంచి అన్నిరకాల రాయితీలు, పథకాలు వర్తింపజేస్తున్నామని సెరీకల్చర్ డిడి వివరిస్తున్నారు.

Kakinada

2021-09-13 05:07:05

2వ రోజు 62 వేల మందికి వ్యాక్సినేష‌న్..

విజ‌య‌న‌గ‌రంజిల్లా వ్యాప్తంగా 81 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల ప‌రిధిలో శ‌ని, ఆదివారాల్లో నిర్వ‌హించిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ మెగా డ్రైవ్ కార్య‌క్ర‌మంలో 1.15 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ చేసిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. జిల్లాలో శ‌నివారం మెగా డ్రైవ్ ద్వారా 52,346 మందికి, ఆదివారం సాయంత్రం 7.30 గంట‌ల వ‌ర‌కు 62వేల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేయ‌డం జ‌రిగింద‌న్నారు. రెండు రోజుల మెగా డ్రైవ్ అంద‌రి స‌హ‌కారంతో విజ‌య‌వంత‌మైంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన వ‌లంటీర్లు, ఆశ కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య కార్త‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది, ఎంపిడిఓలు, వైద్యాధికారులు త‌దిత‌రులంద‌రి కృషి కార‌ణంగా రెండు రోజుల్లో సాధించాల్సిన ల‌క్ష్యంలో 11.25 శాతంకు పైగా సాధించ‌గ‌లిగామ‌న్నారు. జిల్లాలో ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోనివారు, రెండో డోసు తీసుకోవ‌ల‌సిన వారు క‌ల‌సి 10.18 ల‌క్ష‌ల మంది వున్నార‌ని, వీరంద‌రికీ శ‌త‌శాతం వ్యాక్సిన్ వేసే ల‌క్ష్యంతో మెగా డ్రైవ్ కార్యక్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో వుంద‌ని, అందువ‌ల్ల వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం త‌దుప‌రి రోజుల్లో కూడా కొన‌సాగుతుంద‌న్నారు. క్షేత్ర‌స్థాయి సిబ్బంది వ్యాక్సిన్ వేయాల్సిన వారంద‌రినీ పెద్ద ఎత్తున స‌మీక‌రించి వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌కు పెద్ద ఎత్తున త‌ర‌లించ‌డం వ‌ల్లే ఒక్క రోజులో 62 వేల మందికి వ్యాక్సిన్ వేయ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. జిల్లాలో శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ చేసి కోవిడ్ మ‌హ‌మ్మారి బారి నుంచి జిల్లా ప్ర‌జ‌ల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని, అపోహ‌లు వీడి ప్ర‌తి ఒక్క‌రూ ఈ వ్యాక్సిన్ వేసుకోవ‌డం ద్వారా జిల్లాకు థ‌ర్డ్ వేవ్ రాకుండా నివారించ‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు.

విజయనగరం

2021-09-12 14:33:26

వేక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..

విశాఖ  జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. ఆధివారం ఉదయం రేసపువాని పాలెం, ఎం.వి.పి.లలో సచివాలయ కేంద్రాలను, జిల్లాకలెక్టర్ పరిశీలించారు. ఆరిలోవలో  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంను  పరిశీలించి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  ఆనందపురం, పద్మనాభం మండలాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆనందపురం మండలం గిడిజాల  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పధ్మనాభమండలం బి.తాళ్లవలస   ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ పరిశీలించారు. డాక్టర్లను  వ్యాక్సినేషన్  ప్రక్రియ పై  వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మీరు వ్యాక్సినేషన్  వేయించుకునేందుకు సెంటర్ లకు ఎలా వచ్చారని అడిగారు . ఎ.ఎన్.ఎం.లు, ఆశావర్కర్లు, వాలంటీర్ల నుండి మెసేజ్ లు, పోన్ కాల్స్ రావడం జరిగిందని వారి సూచనల మేరకు  వచ్చామని ప్రజలు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  లిస్టులో ఉన్న వారందరికి మెసేజ్ పంపి వ్యాక్సినేషన్ పూర్తిగావించాలని  జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, జి.వి.ఎం .సి వైద్యాధికారి .డా. శాస్త్రి,  తహసిల్దార్లు, మండల అభివృద్ది అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-09-12 13:24:21

4వ రోజు శాస్త్రోక్తంగా బాలబింబ స్థాపన..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం బాలబింబ స్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉద‌యం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బాల‌బింబ స్థాప‌న‌, మ‌ధ్యాహ్నం బింబ‌వాస్తు, మ‌హాశాంతి అభిషేకం చేపట్టారు. సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు, శ‌య‌నాధివాసం, హోత్రం, విశేష హోమం చేప‌డ‌తారు. సెప్టెంబ‌రు 13న సోమవారం ఉద‌యం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, దివ్య‌ప్ర‌బంధ శాత్తుమొర నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.40 నుండి 10 గంట‌ల మ‌ధ్య తులా ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం నిత్య‌క‌ట్ల కైంక‌ర్యం, సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో  ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్  ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 13:05:55

కాణిపాక వినాయకుడికి హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు కాణిపాకం లోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శనానికి వచ్చిన  వీరికి  వేద పండితులు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లను  కార్యనిర్వహణాధికారి  ఎ.వెంకటేశు చేయించారు.అనంతరం వారికి వేదపండితుల ఆశీర్వచనముతో శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను,స్వామి వారి చిత్ర పఠమును అందచేశారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు గారు, డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, ఐరాల ఎమ్మార్వో, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-12 10:54:14