1 ENS Live Breaking News

స్వాతంత్య్ర స్ఫూర్తి భావిత‌రాల‌కు అందించాలి..

స్వాతంత్య్ర స్ఫూర్తిని భావిత‌రాల‌ను అందించాల‌ని ప‌లువురు వ‌క్త‌లు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావ‌స్తున్న త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వం, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా స్థానిక మూడులాంత‌ర్లు జంక్ష‌న్ నుంచి ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియం వ‌ర‌కూ ఫిట్ ఇండియా ఫ్రీడం ర‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 150 అడుగుల భారీ జాతీయ ప‌తాకంతో ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ర్యాలీలో చేసిన దేశ‌భ‌క్తి నినాదాల‌తో ప‌ట్ట‌ణం మారుమ్రోగింది. ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో తెలుగుత‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జ‌రిగిన అమృతోత్స‌వ‌ స‌భ‌కు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సందర్భంగా ఆమె అధ్య‌క్షోప‌న్యాసం చేస్తూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని పునఃశ్చ‌ర‌ణ చేసుకొని, దేశ‌ప్ర‌జ‌లు పున‌రంకితం అయ్యేందుకు ఈ ఉత్స‌వాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. అప్ప‌టి త‌రం స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో  పోరాడార‌ని, నేటి త‌రం త‌మ‌లో తాము అంతర్యుద్దం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని అన్నారు. మ‌న‌లో మ‌నకి ఉన్న విబేధాలు, అహంకారాన్ని ప్ర‌క్క‌న‌పెట్టి, అంతా క‌లిసి ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. కుల‌మ‌త‌, ఆడ‌, మ‌గా అన్న తేడాలు లేకుండా, మ‌న‌మంతా భార‌తీయుల‌మ‌న్న భావ‌న ప్ర‌తీఒక్క‌రిలో బ‌ల‌ప‌డాల‌ని, అప్పుడే దేశం అభివృద్ది ప‌థాన ముందుకు వెళ్తుంద‌న్నారు. భార‌తీయ‌త ఒక‌ ఆభ‌ర‌ణ‌మ‌ని, మ‌న భార‌తీయ సంప్ర‌దాయం మ‌హోన్న‌త‌మైన‌ద‌ని, దానిని ప్ర‌తీఒక్క‌రూ గౌర‌వించాల‌ని కోరారు.  స్వేచ్ఛ‌, స్వాతంత్య్ర ఫ‌లాలను నేటి త‌రానికి అందించాల‌ని సూచించారు. సోష‌ల్ మీడియాలో క‌నిపించేవ‌న్నీ నిజాలు కావ‌ని, అందువ‌ల్ల యువ‌త‌రం స్వీయ నియంత్ర‌ణ‌, క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాల‌ని, గుర‌జాడ స్ఫూర్తితో పొరుగువాడికి సాయ‌ప‌డే త‌త్వాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు.

            కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన విజ‌య‌న‌గ‌రం శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, అజాదీ కా అమృతోత్స‌వం ప్ర‌తీభార‌తీయుడు గ‌ర్వంగా జ‌రుపుకొనే కార్య‌క్ర‌మంగా పేర్కొన్నారు. ఈ ఉత్స‌వాల స్ఫూర్తితో దేశాభివృద్దిలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. నేటి యువ‌త‌పైనే మ‌న దేశ పునాదులు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బాధ్యాతాయుతంగా మెల‌గ‌డం ద్వారా, ఆద‌ర్శ‌వంత‌మైన స‌మాజాన్ని సృష్టించుకోవ‌చ్చున‌ని, త‌ద్వారా గ‌ణ‌నీయ‌మైన పురోభివృద్దిని సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కూ, ప్ర‌ధాన మంత్రులు, ముఖ్య‌మంత్రులు అభివృద్ది కోసం కృషి చేస్తున్నార‌ని చెప్పారు. గౌర‌వ‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, విద్య‌, వైద్యానికి పెద్ద‌పీట వేస్తూ, సంక్షేమ‌, అభివృద్ది ఫ‌లాల‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు అందించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని కోల‌గ‌ట్ల‌ కొనియాడారు.

             ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాల‌క‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, మ‌న దేశంలో  పాటించే విలువ‌లు, స్త్రీశ‌క్తికి ఇచ్చే గౌర‌వం, మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. విభిన్న సంస్కృతులు, కులాలు, మ‌తాలు, ప్రాంతాలతో అల‌రారే భార‌త‌దేశం ఒక చిన్న ప్ర‌పంచం లాంటిద‌ని పేర్కొన్నారు.  75 ఏళ్ల క్రితం మ‌న పెద్ద‌లు స్వాతంత్య్రం అనే మ‌హా వృక్షాన్ని నాటార‌ని, వాటి ఫ‌లాల‌ను మ‌నం ఇప్పుడు అనుభ‌విస్తున్నామ‌ని అన్నారు. స్వావ‌లంబ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ర‌స్ప‌ర తోడ్పాటు ద్వారా మ‌నం అభివృద్దిని సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి త‌రానికి అందించ‌డానికే ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. రోట‌రీక్ల‌బ్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, కాపుగంటి ప్ర‌కాష్ త‌దిత‌ర ప్ర‌ముఖులు మాట్లాడారు.

            కార్య‌క్ర‌మంలో డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ‌, ఎన్‌వైకె యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, సెట్విజ్ సిఇఓ వి.విజ‌య‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి అశోక్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిపిఓ సుభాషిణి, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, డిఎస్‌డిఓ వెంక‌టేశ్వ‌ర్రావు, ఇత‌ర అధికారులు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, ఎన్‌సిసి కేడెట్స్‌, రోట‌రీ ప్ర‌తినిధులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, యువ‌జ‌న సంఘాల‌ ప్ర‌తినిధులు, పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-18 05:33:59

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌..

డా.వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ  వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌ వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సం గ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 19వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో మురళీధర్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Devuni kadapa temple

2021-09-17 14:30:40

శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగుకు సర్వం సిద్ధం..

శ్రీకాకుళంజిల్లాలో ఈ నెల 19వ తేదిన జరగనున్న జెడ్.పి.టి.సి, యం.పి.టి.సి  ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  శుక్రవారం జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిచోట్ల ఓట్ల లెక్కింపు జరగబోతుందని, అన్ని లెక్కింపు కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. 19వ తేదీ ఉదయం 8.00 గం.లకు ఓట్లలెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కావున సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6.00 గం.ల నాటికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీచేయడం జరిగిందని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిసి టి.విలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారని, వీరితో పాటు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 38 మండలాలకు గాను జెడ్.పి.టి.సి అభ్యర్ధి మరణించడంతో ఒక జెడ్.పి.టి.సి స్థానానికి ఎన్నిక జరగనందున 37 మండలాల జెడ్.పి.టి.సిలకు గాను 37 టేబుళ్లను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 667 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 66 మంది ఏకగ్రీవం కాగా , మరో 11 చోట్ల ఎం.పి.టి.సి అభ్యర్ధులు మరణించడంతో మిగిలిన 590 స్థానాలకు గాను 590 టేబుళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లావ్యాప్తంగా 68 కౌంటింగ్ హాళ్లను , 612 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 854 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను, 863అసిస్టెంట్ సూపర్ వైజర్లను, 2,584 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను  వెరశి 4,301 మంది సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియకు నియమించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, సిబ్బందికి వేక్సినేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. శనివారం ఉదయం 7.00 గం.లకు కౌంటింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది హాజరవుతారని, వారికి కౌంటింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  పోటీచేసిన అభ్యర్థుల నుండి ఏజెంట్ల వివరాలు తీసుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాసులు జారీచేసే విధంగా ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగునకు సంబంధించి జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని, మైక్ లను వినియోగించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-17 13:58:33

డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి..

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం “డ్రై డే” సందర్భంగా ఆయన 2వ జోన్ 10వ వార్డు పరిధిలో ఐ.ఎస్.జి. నగర్, పాండురంగాపురం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాండురంగాపురంలోని డెంగ్యూ వ్యాధి సోకిన ఐ. చాణక్య ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగ్యూపై తీసుకోవలసిన జాగ్రత్తలను కుటంబ సభ్యులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాండురంగాపురం పరిసరాలలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని, ప్రతి ఇంటికి అతికించిన స్టిక్కర్ పై సంతకం చేయాలని మలేరియా సిబ్బందిని, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. “డ్రై డే” సందర్భంగా అవగాహనా ర్యాలీలు జరిగే విధానాన్ని పరిశీలించారు. అనంతరం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి, వ్యాక్సినేషన్ వేయు ప్రక్రియను పరిశీలించారు. 18 సం. లు పై బడిన, అర్హత గల ప్రతీ ఒక్కరికి మొదటి, రెండవ డోస్ వేయాలని, సిబ్బందిని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసరాలలో మరుగుదొడ్లు, శుభ్రంగా ఉంచాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, శానిటరీ సూపర్వైజర్ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, మలేరియా సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.  

విశాఖసిటీ

2021-09-17 13:45:36

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కౌంటింగ్..

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఓట్ల లెక్కింపు నిర్వ‌హించడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీమతి ఎ. సూర్య‌కుమారి తెలిపారు.  కౌంటింగ్ సమయం లో  ప్రజలు గుమిగూడి ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో  పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్  అనంతరం కూడా విజేతలు రాలీలను చేయకూడదని స్పష్టం చేసారు.   ఈనెల 19న నిర్వహించనున్న జడ్పి టిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఎస్.పి దీపిక ఎం.పాటిల్  తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   జిల్లాలో 549 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 55 స్థానాల్లో ఏకగ్రీవం అయినాయని, 34  జెడ్.పి.టి.సి  లకు గాను 3 ఏకగ్రీవం అయినాయని తెలిపారు.  34 మండలాలకు గాను 31 చోట్ల  కౌంటింగ్  ప్రక్రియ  జరుగుతోందన్నారు.  కౌంటింగ్ కోసం 83 హాల్స్ నందు 820  టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.  ఇందు కోసం 34 మంది ఆర్.ఓ లు, 88 మంది ఎ.ఆర్.ఓ లు, 956 మంది కౌంటింగ్ పర్యవేక్షకులు, 1872 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు, 75 మంది స్ట్రాంగ్  రూం ఇంచార్జ్ లను నియమించడం జరిగిందన్నారు. .  కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలన్నారు.  ఇప్ప‌టికే వివిధ ద‌శ‌ల్లో సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, శుక్ర‌, శ‌నివారాల్లో తుదివిడ‌త శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన  మూడంచెల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్.పి దీపిక పాటిల్ తెలిపారు. ర్యాలీల కోసం అనుమతి లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వద్ద   సిసి కెమెరాలు, డ్రోన్స్, వీడియో గ్రఫీ ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అవసరమైన చోట రోప్ పార్టీ లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు డివిజిన్లలో  ఇద్దరు అదనపు ఎస్.పి లను ఇంచార్జ్ లుగా పర్యవేక్షిస్తారని అన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-17 13:41:18

పార‌ద‌ర్శ‌కంగా ఓట్ల లెక్కింపు జరపాలి..

పార‌ద‌ర్శ‌కంగా, ప‌క‌డ్భంధీగా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. ఈ నెల 19న నిర్వ‌హించ‌నున్న‌ జెడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, ఆర్ఓలకు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముందుగా మండ‌లాల వారీగా లెక్కింపున‌కు జ‌రుగుతున్న ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, లెక్కింపు ప్ర‌క్రియ‌లో పాల్గొనే సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండి విధుల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను సంపూర్ణంగా అవ‌గాహ‌న చేసుకొని, వాటిని అమ‌లు చేయాల‌న్నారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో ఆర్ఓల‌దే తుది నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల‌కల్లా మొద‌లు పెట్టాల‌ని, దానికి అనుగుణంగా ముందుగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌న్నారు. 30వేల కంటే అధికంగా ఓట్లు ఉన్న చోట‌, అద‌నంగా సిబ్బందిని వినియోగించుకోవాల‌ని సూచించారు. సెల్‌ఫోన్ల‌ను అమ‌తించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు.  ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. లెక్కింపు ప్ర‌క్రియ‌లో పాల్గొనే సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ల‌కు వేక్సినేష‌న్ పూర్త‌యిన‌ట్లు స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. స‌ర్టిఫికేట్ లేని వారంద‌రికీ త‌క్ష‌ణ‌మే కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించి, ఫ‌లితాన్ని బ‌ట్టి లోప‌లికి అనుమ‌తించాల‌ని సూచించారు. కేంద్రాల‌వ‌ద్ద మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఏజెంట్ల‌ను అటూఇటూ తిర‌గ‌డానికి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఓట్ల‌ను లెక్కించే విధానాన్ని, పాటించాల్సిన నిబంధ‌న‌ల‌ను, కేంద్రాలు, బ‌ల్ల‌ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా, జిల్లా ఎన్నిక‌ల శిక్ష‌ణ నోడ‌ల్ ఆఫీస‌ర్ ఎస్‌.అప్ప‌ల‌నాయుడు వివ‌రించారు. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, డిఎఫ్ఓ వెంక‌టేష్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-17 13:38:26

సెంటు భూమికి కూడా సాగునీరు అందిస్తాం..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి సెంటు భూమికి కూడా సాగునీటిని అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి వసతి గృహంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ  తన నియోజక వర్గంలో గల తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరుచేస్తూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల సభాపతి హర్షం వ్యక్తం చేసారు. కళాశాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, ప్రధానంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులకు అభినందనలు తెలిపారు. తాను చేసే ఈ ప్రయత్నానికి సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందించిన  శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు సభాపతి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.   జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు వెన్నెలవలసలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాలను గత మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇది అభినందనీయమని గుర్తుచేసారు. ఇవేకాకుండా పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలసలో యన్.టి.ఆర్. గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, వంశధార హైలెవెల్ కెనాల్, నారాయణపురం, నాగావళి అనుసంధాన ప్రోజెక్ట్, పట్టణ ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్పుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞాతాభివందనాలు తెలియజేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాలో మరికొన్ని పెద్ద ప్రోజెక్టులు క్లియర్ కాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే నేరేడి బ్యారెజ్ క్లియరెన్స్ అయిందని, దానిపై ఒడిషా ముఖ్యమంత్రితో చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలిపారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కూడా త్వరలో క్లియర్ కాబోతుందని, నేరేడి క్లియరెన్స్ వలన  వంశధార – బాహుదా నదుల అనుసంధానానికి పెద్దఎత్తున ప్రయత్నం జరగబోతుందని అన్నారు. నేరెడి బ్యారెజ్ పై  ఇన్విస్టిగేషన్, సర్వే కూడా జరుగుతుందని, ఈ రెండు నదులు అనుసంధానం చేసుకోగలిగితే జిల్లాలో సెంటు భూమికి కూడా సాగునీటిని అందించేందుకు వీలు కలుగుతుందని సభాపతి స్పష్టం చేసారు. ఇది చిరకాలం నాటి  కల అని, ఆ కల త్వరలో నిజం కాబోతుందని, ఆ కల నిజం అయ్యేందుకు     రాష్ట్ర ముఖ్యమంత్రి అవిరళమైన కృషిచేస్తున్నట్లు వివరించారు. ఇవేకాకుండా కిడ్నిరోగుల కోసం ఆసుపత్రి, ఉద్దాన ప్రాంత ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు, నరసన్నపేటలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ వంటి వాటిని ప్రభుత్వం ఇప్పటికే మంజూరుచేసిందని గుర్తుచేసారు.  ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుండి జిల్లాకు 70 వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చే పరిస్థితికి ప్రభుత్వం క్లియర్ చేసిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జిల్లాకు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రిని కోరగా తక్షణమే స్పందిస్తూ సుజల స్రవంతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. దీనివలన  రణస్థలం, పొందూరు, లావేరు మండలాల్లో ప్రతీ సెంటు భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్ కు సంబంధించి రైతాంగానికి చెల్లించవలసిన నష్టపరిహారాన్ని త్వరలో అందించి ఆ పనులను కూడా పెద్దఎత్తున పూర్తిచేసుకొని ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు దాన్ని కనెక్ట్ చేయబోతున్నట్లు సభాపతి స్పష్టం చేసారు. తద్వారా మరో 18 వేల ఎకరాలకు సాగునీటిని అందించే పరిస్థితి రాబోతుందని సభాపతి వివరించారు. ఈ విధంగా ఇరిగేషన్ , ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ పై పెద్ద ఎత్తున దృష్టిసారించి ప్రభుత్వం ముందుకువెళ్తుందని అన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ విమర్శలు వస్తున్నాయని,  విమర్శలు సహజమని, అయితే సద్విమర్శలు, సహేతుకమైన విమర్శలు చేస్తే తప్పక వాటిని స్వీకరిస్తామని, అంతేగాని లేనిపోని ఆరోపణలు చేయరాదని హితవు పలికారు.  

Srikakulam

2021-09-17 13:07:40

ఎస్వీ యూపీ స్కూలులో ప్లే క్లాస్ తరగతులు..

తిరుమల స్థానికుల విజ్ఞప్తి మేరకు టిటిడి ఈఓ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభించినట్టు జెఈఓ  సదాభార్గవి తెలిపారు. ఈ మేరకు జెఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించి ప్లే క్లాస్ తరగతుల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానికులు వారి పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య కోసం తిరుపతికి పంపించలేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమల ఎస్వీ పాఠశాలలోనే ఈ తరగతులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు. అనంతరం భోజనం నాణ్యతను పరిశీలించారు. త్వరలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి కావాల్సిన వసతులపై చర్చించాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆమె విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వసతులు, విద్య గురించి చర్చించగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిఈఓ  గోవిందరాజన్, పాఠశాల హెచ్ఎం  కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tirumala

2021-09-17 12:17:29

టిటిడిలో కొత్త ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారం..

యానాంకు చెందిన  మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే  ఎపి.నందకుమార్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శుక్రవారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జెఈవో సదాభార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. అనంతరం ఆలయం వెలుపల మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డులో తనకు మొదటిసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. గతంలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవ చేశానని, అయితే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య భక్తునిగా స్వామివారి భక్తులకు సేవ చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆలయం వెలుపల  ఎపి.నందకుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో తనకు ధర్మకర్తల మండలి సభ్యునిగా అవకాశం వచ్చిందని, సాధారణ సేవకునిగా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Tirumala

2021-09-17 12:14:59

ఎస్వీబీసీలో అన్నమయ్య కీర్తనల ప్రచారం..

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి  ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా  విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించేందుకు " ఆదివో అల్లదివో '' పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హించాల‌ని నిర్ణయించామన్నారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో యువ‌త‌కు పోటీలు నిర్వ‌హిస్తామని చైర్మన్ వివరించారు. టిటిడి రికార్డు చేసిన 4 వేల  సంకీర్తనల  నుంచే ఈ పోటీలు నిర్వ‌హించ‌డం జరుగుతుందన్నారు. తద్వారా యువతను భక్తి మార్గంలో నడిపించేందుకు ఇదొక వేదిక అవుతుందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆసక్తి కలిగిన గాయనీ గాయకుల నుంచి ఎస్వీబీసీ వెబ్సైట్ లోను, నేరుగాను దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25 , 26 వ తేదీల్లో  ఎస్వీబీసీ కార్యాలయంలో సెలెక్షన్స్ నిర్వహిస్తారని శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.  నేరుగా రాలేని వారికి 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూమ్ ద్వారా సెలెక్షన్స్ జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ కన్నడ, హింది చానళ్ళు ప్రారంభమవుతాయనీ, ఈ చానళ్ల ద్వారా  కూడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్  సాయి కృష్ణ యాచెంధ్ర, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, ఎస్వీబీసీ డైరెక్టర్  శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2021-09-17 12:10:26

సివిల్స్ పరీక్షకు ఏర్పాటు పూర్తిచేయాలి..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 10వ తేదీన  జరగనున్న నేపథ్యంలో జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని యూపీఎస్సీ పరీక్షల నిర్వాహకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శుక్రవారం యూపీఎస్సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లాల కలక్టర్ లతో మాట్లాడారు. 10-10-2021  ఆదివారం ఉదయం పేపర్- I 9.30 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం పేపర్- II 2.30 నుంచి 4.30 వరకూ జరుగుతాయన్నారు. పరీక్షలకు  అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందుగా హాజరవ్వాలన్నారు. పరీక్షా విధివిధానాలను తప్పక పాటించాలన్నారు.పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో కుర్చీలు, బెంచీలతో పాటు  నిరంతర విద్యుత్ సరఫరా , ఫ్యాన్స్,టాయిలెట్స్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు.  పరీక్షలురాసే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ తో వైద్య సిబ్బంది ని  అందుబాటులో ఉంచాలన్నారు.          జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున మాట్లాడుతూ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖలో 32 పరీక్షా కేంద్రాల లో 12,166 మంది అభ్యర్థులు పరీక్షలను రాయ నున్నారన్నారు. పరీక్షా కేంద్రాల లో ఏర్పాట్లను పర్యవేక్షించుటకు ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-17 12:08:58

శ్రీకాకుళంలో 19న ఎంపీటీసి ఓట్ల లెక్కింపు..

జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 19వ తేదిన జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై శుక్రవారం మండల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పది చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోందన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తక్షణం తనిఖీ చేసి అవసరమగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్ చేయడం, బందో బస్తు, సిబ్బంది, తదితర ఏర్పాట్లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కౌంటింగ్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6 గంటల నాటికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.  ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. సిసి టివిలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని ఆయన చెప్పారు. కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది అవసరం ఉంటుందని, గతంలో రిజర్వ్ సిబ్బందితో పాటు కేటాయింపు సైతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలో జెడ్పీటీసీ కి 37 టేబుల్స్, ఎంపిటిసికి 590 టేబుల్స్ ఏర్పాటుకు గతంలోనే కార్యాచరణ తయారు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి వాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ :
కౌంటింగ్ సిబ్బందికి శని వారం శిక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శని వారం ఉదయం 7 గంటల నాటికి కౌంటింగ్ కేంద్రాల వద్ద హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చించారు.

కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేయాలి..
కౌంటింగ్ ఏజెంట్ల నియామకం తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోటీ చేసిన అభ్యర్థులకు వెంటనే సమాచారం అందించి ఏజెంట్ల వివరాలు సమర్పించాలని ఈసుకోవాలని ఆయన అన్నారు. ఏజెంట్ల వివరాలు పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాస్ లు జారీ చేయాలని ఆయన సూచించారు. శని వారం నాటికి పాస్ లు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

144 సెక్షన్ విధింపు..
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్ల ఆయన చెప్పారు.  జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతి లేదు..
లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.  మైక్ లను వినియోగించరాదని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిధిలో పండాల్స్, మైక్ లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయరాదన్నారు. అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేయాలని, బందో బస్తు ఏర్పాటులో ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్.శ్రీరాములు నాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, జిల్లా పరిషత్ సీఈఓ బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్.కూర్మారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-17 12:07:40

కౌంటింగ్ కి పూర్తిస్థాయి ఏర్పాట్లుచేయాలి..

ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ప్రశాంత వాతావరణంలో  ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ,సీ పీ లు, ఎస్పీలు , జిల్లా పరిషత్ సీఈఓ లతో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.  ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్దఅవసరమైన  మౌలిక వసతులతో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు వీడియో కవరేజ్ చేయాలన్నారు.కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన మెటీరియల్ ను అందించాలన్నారు . ఏజెన్సీ ప్రాంత మండలాలలో మరియు సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లిఖార్జున మాట్లాడుతూ విశాఖజిల్లాలో కౌంటింగ్  ఏర్పాట్లు కు అన్నీ సిద్ధం చేయడం జరిగిందని  సీఎస్ కు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన 612 ఎం పీ టీ సీ లు, 37 జెడ్ పీ టీ సీ స్థానాలకు 79  కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 587 ఎంపీటీసి,568 జెడ్ పీటీసి కౌంటింగ్ టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్దన్నారు . పది శాతం రిజర్వ్ సిబ్బంది తో కలిపి మొత్తం 3811 మంది కౌంటింగ్ సిబ్బంది ని నియమించడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియో కవరేజ్  ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదన్నారు. గురువారం సాయంత్రం  కౌంటింగ్ సిబ్బందికి  మొదటిసారి శిక్షణను ఇవ్వడం జరిగిందని, శుక్రవారం కూడా మరొకసారి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతీ నియోజక వర్గానికి పరిశీలన నిమిత్తం ప్రత్యేక అధికారి ని నియమించడం జరిగిందన్నారు. కౌంటింగ్ సంబంధిత మెటీరియల్ను సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల  వద్ద 144 సెక్షన్ ఏర్పాటు కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలు,మరియూ సమస్యాత్మక కేంద్రాల వద్ద స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితులలో అవసరమైన  సిబ్బంది కొరకు 10 శాతం అదనపు  కౌంటింగ్ సిబ్బందిని రిజర్వు లో సిద్ధం చేసుకోవడం జరుగుతున్నదన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్ పి బి కృష్ణా రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున, డి పి ఓ కృష్ణ కుమారి తదితరులు హాజరయ్యారు.


Visakhapatnam

2021-09-17 11:56:34

నైపుణ్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..

నైపుణ్యంలో ఉచిత శిక్షణ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.సి. కార్పొరేషన్ ఇడి కె. రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  DSCSCS లిమిటెడ్, శ్రీకాకుళం -NSFDC- స్కిల్ ట్రైనింగ్/PM -DAKSH -షార్ట్, మీడియం మరియు లాంగ్ టర్మ్ స్కిలింగ్ ప్రోగ్రామ్లు-ట్రేడ్లు, ఇండస్ట్రీ లింక్డ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కార్యక్రమంలో నిరుద్యోగ SC అభ్యర్థులు తమ పేర్లు https://emdaksh.dosje.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. వెబ్ డెవలప్పర్ (అంతర్జాల వృద్ధికారుడు) గా 3 నెలల 5 రోజులుగా శిక్షణ ఉంటుందని, డిగ్రీ/ వెబ్ డిజైన్ లో డిప్లమా, మీడియా డిజైన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత డిప్లొమా/విద్యార్హత ఉండాలని,  క్యాడ్లో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలల కాలం ఉంటుందని, డిప్లమా/ మెకానికల్ లో డిగ్రీ /ప్రొడ్ ఇంజనీరింగ్ లేదా సమానమైనది ఉండాలని, AI-బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు కు 4 నెలల శిక్షణ కాలం ఉంటుందని,  విద్యార్హత సైన్స్ కంప్యూటర్లో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, సీన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/సమాచారం టెక్నాలజీ ఉండాలని ఆ ప్రకటనలో వివరించారు.  క్లౌడ్ ఆర్కిటెక్ట్ కోర్సు కు 4 నెలలు శిక్షణా కాలం ఉంటుందని, దీనికి విద్యార్హత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ సైన్స్ కంప్యూటర్ సోన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలని, అడ్వాన్స్డ్ ఎక్సెల్లో సర్టిఫికెట్ కోర్సుకు 1.5 నెలల కాలం ఉంటుందని, ఇంటర్ పాస్ మరియు అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉండాలని తెలిపారు.  భద్రతా విశ్లేషకుడు కోర్సు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ కోర్సు చేసి ఉండాలని, దేశీయ  డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు కు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, 10వ తరగతి పాస్ మరియు దాని కంటే ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. CNC మిల్లింగ్ లో సర్టిఫికెట్ కోర్సు కు 6 నెలలు పాటు శిక్షణ  కాలం ఉంటుందని, 10 వ తరగతి ఉత్తీర్ణత మరియు అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు.  CNC టెక్నాలజీలో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలలు పాటు శిక్షణ ఉంటుందని, మెకానికల్/ప్రొడ్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమానమైనది ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  అభ్యర్థుల వయోపరిమితి 18-45 సంవత్సరాల మధ్య ఉండాలని, అభ్యర్థుల వివరాలను అప్లోడ్ చేయడానికి సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం

2021-09-15 14:40:04