1 ENS Live Breaking News

నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న గ్రామ సచివాలయాలు,  రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ ల్రైబరీలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి పనులను స్వయంగా పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కెలు, బిఎంసిలు, డి.ఎల్.బిలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన నిర్మాణపు పనుల్లో  30 శాతం పురోగతి సాధించడం పట్ల అసహనం వ్యక్తం చేసారు.  మిగిలిన జిల్లాలతో పోలిస్తే జిల్లాలో పురోగతి అధ్వాన్వంగా ఉందని, అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసినప్పటికీ పనుల పురోగతి మాత్రం కనిపించడం లేదని, పనులు పూర్తిచేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాని అధికారుల నిర్లక్ష్యం వలన సుమారు రూ.100 కోట్ల నిధులు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి అధికారులకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాల్సి ఉండగా, ఇంతవరకు 20 నుండి 30 శాతం లక్ష్యాలను పూర్తిచేయడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.  ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సహకారంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తే తప్పా నెలాఖరు నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించలేరని హితవు పలికారు. నిర్ధేశించిన లక్ష్యాలపై అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి అనుకున్న సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న బిల్లులు సమర్పించడంలో కొంత పురోగతి కనిపించిందని, పనులు పూర్తిచేసి బిల్లులు పెండింగులో ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే సిమెంటు సరఫరా లేదని అధికారులు తెలిపారని, వాటిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న మండలాల్లో రెవిన్యూ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-09 14:48:20

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ సత్యదేవుని దేవస్థానంలో స్వామివారి హుండీల ద్వారా ఒక కోటి 95 లక్షల 39వేల 657 రూపాయాలు ఆదాయం వచ్చిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. గురువారం దేవస్థానంలో స్వామివారి పరకామణి లెక్కింపు జరింగింది. అందులో భక్తుల నుంచి నగదుతో పాటు 90 గ్రాముల బంగారం, 15 వెండి వచ్చిందని మీడియాకి తెలియజేశారు. కోవిడ్  నిబంధనలు అనుసరిస్తూ హుండీల ఆదాయం లెక్కింపు చేసినట్టు ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన పీఆర్వో కొండలరావు,  అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అన్నవరం

2021-09-09 14:37:48

ఖాతాదారులకు మంచి సేవలు అందించాలి..

ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ పదవ వార్షికోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఖాతాదారులకు మంచి సేవలు అందించడం వలన బ్యాంకుల పట్ల నమ్మకం పెరుగుతుందని, వాటి సేవలు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అన్నారు. బ్యాంకులతో ప్రతి వ్యక్తికి సంబంధం ఉంటుందని ఆయన పేర్కొంటూ ఇంటికి సంబంధించిన ప్రణాళికలు, పొదుపు, వ్యయాలతో బ్యాంకు ఖాతాలు ముడిపడి ఉంటాయని అన్నారు. సామాన్యునికి బ్యాంకులతో బలమైన బంధం ఉంటుందని, సమాజంలో  నిరక్షరాస్యత తదితర కారణాల వలన వినియోగదారులు ఎక్కువగా ప్రత్యక్షంగా బ్యాంకు సేవలు వినియోగించుకుంటా రని ఆయన చెప్పారు. బ్యాంకు సిబ్బంది  ప్రజా సంబంధాలు ఉండాలని, సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. భారతీయ స్టేట్ బ్యాంకు రీజనల్ మేనేజర్ తపోదన్ దేహారీ మాట్లాడుతూ బ్యాంకు శాఖలు వినియోగదారులకు మంచి సేవలను అందించుటకు ఎప్పుడు కృషి చేస్తున్నామన్నారు. డిజిటల్ బాగా అందుతున్నాయని ఆయన వివరించారు. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ డబ్ల్యు. కిరణ్ బాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఎస్.బి.ఐ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ క్లబ్ లో ఉందన్నారు. ఖాతాదారుల పూర్తి సహాయ సహకారాలు వలన ఇది సాధ్యం అయిందని చెప్పారు. శాఖలో అతి తక్కువ సమయంలో ఖాతాదారులకు సేవలు అందించడం లక్ష్యంగా పని జరుగుతోందన్నారు. విశ్రాంత తహశీల్దార్ డి.పి. దేవ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ శాఖ సొంత శాఖగా పరిగనిస్తున్నామని అన్నారు. ఖాతాదారులకు హాకర్స్ నుండి భద్రత ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి చిన్నారావు మాట్లాడుతూ బ్యాంకు సేవలు బాగున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్.రమేష్, బ్యాంకు అధికారులు పి.ఎస్.కామేశ్వర రావు, పుష్ప, ఇతర సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-09 11:20:03

మ‌రిన్ని పుర‌స్కారాలు గెలుచుకోవాలి..కలెక్టర్

ప్ర‌తిభ‌ను మెరుగుప‌ర్చుకొని, మ‌రిన్ని అవార్డుల‌ను సాధించి జిల్లాకు గొప్ప‌పేరు తేవాల‌ని, ఇన్‌స్పైర్ అవార్డు గ్ర‌హీత ర‌మేష్‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి అభినందించారు. జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్ అవార్డును గెలుచుకున్న‌, గంట్యాడ మండ‌లం బుడ‌త‌నాప‌ల్లి పాఠ‌శాల 9వ త‌ర‌గ‌తి విద్యార్థి బొబ్బిలి ర‌మేష్‌, ఉపాధ్యాయులు గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అవార్డు గ్ర‌హీత‌ ర‌మేష్‌కు క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, త‌న సంత‌కంతో కూడిన‌ పుస్త‌కాన్ని బ‌హూక‌రించారు. అత‌ని కుటుంబ నేప‌థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అవార్డు సాధించిన అంశాల‌పై ప్ర‌శ్నించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ నిర్మాణంలో గ‌ణిత స‌హ‌కారం అన్న త‌న ప్రాజెక్టుకు అవార్డు వ‌చ్చింద‌ని ర‌మేష్ తెలిపారు. త‌క్కువ విస్తీర్ణంలో, త‌క్కువ ఖ‌ర్చుతో మ‌రుగుదొడ్డి ట్యాంకును మ‌రియు మ‌రుగుదొడ్ల‌ను నిర్మించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలిపారు.  దీనివ‌ల్ల ప్ర‌భుత్వం ఇచ్చిన డ‌బ్బుతోనే ప్ర‌తీ ఇంటికీ మ‌రుగుదొడ్డి నిర్మించుకోవ‌చ్చని ఆయ‌న క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.  బాగా చ‌దువుకోవాల‌ని, మ‌రిన్ని అవార్డుల‌ను సాధించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు. సాధ‌న ద్వారా అన్ని అంశాల‌పైనా బాగా ప‌ట్టు సాధించవ‌చ్చ‌ని సూచించారు. జిల్లాకు జాతీయ స్థాయి అవార్డును తీసుకురావ‌డం అభినంద‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌శంసించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.ల‌క్ష్మ‌ణరావు, రాజీవ్ విద్యామిష‌న్‌ ఏపిసి డి.కీర్తి, ప్రాజెక్టుకు గైడ్స్‌గా వ్య‌వ‌హ‌రించిన లెక్క‌ల టీచ‌ర్లు ఆర్‌.స‌త్యారావు, కె.భాస్క‌ర‌రావు, జిల్లా సైన్సు అధికారి బ‌ల్లా శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-09 10:32:14

ఒంటిమిట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు..

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన  చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్  రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Ontimitta

2021-09-09 10:28:14

లబ్దిదారుల జాబితాలు నోటీసు బోర్డులో పెట్టాలి..

ప్రజలకు అందించే సేవలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా లను తప్పనిసరిగా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం కె.వి పల్లి మండలం లోని గ్యారంపల్లి  గ్రామ  సచివాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయము ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించకపోవడం పట్ల  అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలు మార్గదర్శకాలు గురించి కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామంలో 2596 మంది జనాభా ఉన్నారు అని ఇందులో 45 సంవత్సరాలు నిండిన వారు 652 మంది ఉండగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అందరికీ పూర్తి అయిందని 18 సంవత్సరాల పైబడిన వారు నాలుగు వందల ముప్పై మందిని గుర్తించాలని కలెక్టర్ కు తెలిపారు. గ్రామములు మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని 530 ఎకరాలలో వేరుశెనగ , 535 ఎకరాలలో వరి పంట, టమోటా మామిడి పంటలు వేయడం జరిగిందని ఇందుకు సంబంధించి ఈ క్రాఫ్ బుకింగ్ కార్యక్రమం పూర్తి అయిందని ఈ కేవైసీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భూ ఆక్రమణలు గురించి శ్రద్ధగా చూడాలని, రికార్డులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉండాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అధిక దిగుబడి పొందేందుకు వేరుశెనగలో పొలంబడి కార్యక్రమంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. గ్యారం పల్లి నుంచి శెట్టి వారి పల్లి వరకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం ను పరిశీలించారు. ఉద్యానవన పంటల కింద     వెంకటరమణా రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మామిడి పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తోంది అనే వివరాలు గురించి ప్రశ్నించారు . ఈ సందర్భంగా ఆయన మూడు ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో జయప్రకాశ్ అని రైతు సాగుచేస్తున్న టమోటా పరిశీలించారు. మల్చింగ్ వేయడం ద్వారా కలుపు నివారించడం వలన రైతులు అదనపు ఆదాయం వస్తుందని కూలీల ఖర్చును లేకుండా చేసుకోగలగు తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టమోటా మార్కెట్ ను ఏ విధంగా చేసుకుంటున్నారని మంచి ధరలు లభించాలంటే ఈ పద్దతిని పాటిస్తే బాగుంటుంది అని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ తాసిల్దారు నాగ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

గ్యారంపల్లి

2021-09-09 10:27:02

ఒంటిమిట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు..

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన  చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్  రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Ontimitta

2021-09-09 09:09:06

నగరంలో వ్యాధులు ప్రభలకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన మలేరియా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె 4వ జోన్ 33 వార్డు పరిధిలో బంగారుమెట్ట పరిసర ప్రాంతాలలో పర్యటించి, డోర్ నెం. 31-34-99 ఇంటిలో 11 సంవత్సరాల భరత్ అనే బాలునకు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయినందున ఆ ఇంటికి వెళ్లి బాలుని యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చుట్టు ప్రక్కల 200 మీటర్ల వరకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయించాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలపాలని, వర్షాలు పడుతున్నందున ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డులలో మలేరియాపై అవగాహన కల్పించే తనిఖీ స్టిక్కర్లు ను సరిగా పంపిణీ చేయని కారణంగా, బయాలజిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా స్టిక్కర్లును ప్రతి ఇంటికి అతికించాలని, ప్రతివారం ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని సందర్శించినట్లు గోడపై స్టిక్కర్లు అంటించి, ఇంటి వారి వద్ద నుండి   సంతకం పెట్టించుకోవలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా సహించేదిలేదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం “డ్రై డే” గా పాటించాలని ప్రజలకు తెలుపమని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాల్గవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజనీరు చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస రాజ్, మలేరియా ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 15:45:07

అప్పన్నకు రూ.10 లక్షలు విరాళం ప్రకటన..

కోరమండల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్  తన కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి బుధవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఈఓ సూర్యకళ, ఏఈఓ ఆనంద్ కుమార్, అధికారులు స్వాగతం పలి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విజిటర్స్ బుక్ లో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాశారు. అంతేకాకుండా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,00,000 (పది లక్షల రూపాయలు)  ఇస్తానని ఈఓకు అలగప్పన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అరుణ్ అలగప్పన్ కు ఈఓ వివరించారు. దేవస్థానం పరిసరాలను, పరిశుభ్రతను చూసి ఎంతోఆనందం వ్యక్తం చేశారు.  స్థల పురాణానాన్ని వివరించడంతోపాటు ఆలయం, కళ్యాణ మండపాన్ని కోరమండల్ టీంకు దగ్గరుండి చూపించారు. అనంతరం ఆలయంలో ఇటీవలే జరిగిన అభివృద్ధిని చూసి తెలుసుకొని మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈఓను కోరారు.  వారం రోజుల్లో ప్రకటించిన చెక్ ఇస్తానని చెప్పారు. అంతేకాదు భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతామని కూడా ఆయన చెప్పారు.  అరుణ్ అలగప్పన్ తోపాటు కోరమండల్ కంపెనీ ఎండీ సమీర్ గోయల్,  దినేష్ (జీఎం- ఆపరేషన్స్ ), శంకర్ సుబ్రమమ్యం, బిజినెస్ హెడ్, రంగ కుమార్ (సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్), జయశ్రీ శటగోపన్, సీఎఫ్ ఓ, కాలిదాస్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్కటింగ్ , రంగకుమార్ సీనియర్ జనరల్ మేనేజర్, సింహాద్రినాథుణ్ణి దర్శించుకున్నారు. అంతకు ముందు అర్చక స్వాములు ఆశీర్వాదం అందించగా, ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాని కంపెనీ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-08 15:39:43

17.3 ఎకరాల్లో జీవ వైద్యపార్కు నిర్మాణం..

జీవ వైవిధ్యాన్ని (బ‌యో డైవ‌ర్సిటీ) ప‌రిర‌క్షించ‌డంలో భాగంగా జిల్లాలో ఆదిక‌వి న‌న్న‌య విశ్వ‌విద్యాల‌యంలో బ‌యోడైవ‌ర్సిటీ పార్కు ఏర్పాటుకు ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ చేవూరి హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ‌లో క‌లెక్ట‌రేట్‌లో ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు స‌భ్య కార్య‌ద‌ర్శి డా. న‌ళినీ మోహ‌న్‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్.. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, డీఎఫ్‌వో (టెరిటోరియ‌ల్‌) ఐకేవీ రాజు, డీఎఫ్‌వో (సోష‌ల్ ఫారెస్ట్రీ) ఆర్‌.శ్రీనివాస్ త‌దిత‌రుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 7.13 ఎక‌రాల్లో ఏర్పాటుచేయ‌నున్న బ‌యోడైవ‌ర్సిటీ పార్కుకు సంబంధించి భూమి, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి, నిర్మాణాలు, ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం, టెండ‌ర్ ప్ర‌క్రియ‌, బ‌య‌ట నుంచి ర‌హ‌దారులు, అంత‌ర్గ‌త జీవ వ‌న‌రుల పార్కులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బ‌యోడైవ‌ర్సిటీ పార్కులో సీతాకోక చిలుక, ఔష‌ధ‌, ఆక్వాటిక్‌, ఫైక‌స్, ఆరోమాటిక్‌, గృహ వైద్య త‌దిత‌ర గార్డెన్ల‌తో పాటు ఫుడ్‌కోర్టు, ఇంట‌ర్‌ప్రెటేష‌న్, యోగా/మెడిటేష‌న్ సెంట‌ర్‌, కిడ్స్ జోన్ వంటివి కూడా ఏర్పాటు కానున్నందున అట‌వీ, రెవెన్యూ, వ‌ర్సిటీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ప్రాజెక్టు విజ‌య‌వంతంగా ప్రారంభమ‌య్యేందుకు కృషిచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు అధికారుల మార్గ‌నిర్దేశం, స‌హ‌కారంతో ద‌శ‌ల వారీగా ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ఇప్ప‌టికే జిల్లాస్థాయి ప్ర‌త్యేక బృందం భూ త‌నిఖీలు నిర్వ‌హించినందున తర్వాత చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై దృష్టిసారించాల‌ని సూచించారు. అదే విధంగా జిల్లాలో జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ‌కు జీవ వైవిధ్య నిర్వ‌హ‌ణ క‌మిటీ (బీఎంసీ)ల ద్వారా స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించి, అమ‌లుచేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జంతువులు, ప‌క్షులు, ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం త‌దిత‌రాల‌కు సంబంధించిన నిపుణుల‌ను కూడా క‌మిటీల్లో చేర్చుతున్న‌ట్లు తెలిపారు. 

ఏపీ స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు స‌భ్య కార్య‌ద‌ర్శి డా. న‌ళినీ మోహ‌న్ మాట్లాడుతూ ప్రజలు జీవ వైవిధ్యం ఆవ‌శ్య‌క‌త‌పై అవగాహన పెంపొందించుకోవ‌డం ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేయడం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని పేర్కొన్నారు. వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం; జీవ వైవిధ్య కార్యాచ‌ర‌ణ అమ‌లుకు గ్రామ‌, మండ‌ల స్థాయి క‌మిటీల స‌హ‌కారం, ప్ర‌జా భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. జిల్లాలోని ఆదిక‌వి న‌న్న‌య విశ్వ‌విద్యాల‌యంలో బ‌యోడైవ‌ర్సిటీ పార్కు.. ప్ర‌జ‌ల్లో జీవ‌వైవిధ్యంపై అవ‌గాహ‌న  పెంపొందించేందుకు, విద్యార్థులు ప‌రిశోధ‌న‌లు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వివ‌రించారు. జీవ‌వైవిధ్య చ‌ట్టం-2002 అమ‌లుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ బ‌యోడైవ‌ర్సిటీ బోర్డు కొత్త న‌మూనాలో ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఈ క్ర‌మంలోనే బ‌యోడైవ‌ర్సిటీ ప్రాజెక్టుల‌ను చేప‌డుతున్న‌ట్లు న‌ళినీ మోహ‌న్ తెలిపారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, ఆదిక‌వి న‌న్న‌య యూనివ‌ర్సిటీ డీన్ (సీడీసీ) ప్రొఫెస‌ర్ ఎన్‌.క‌మ‌ల‌కుమారి; కాకినాడ రూర‌ల్ ఎంపీడీవో, త‌హ‌సీల్దార్ పి.నారాయ‌ణ‌మూర్తి, వి.ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-08 12:50:07

వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలి..

వ‌ర్షాలు ప‌డుతున్న దృష్ట్యా గ్రామాల్లో కాలానుగుణ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా సిబ్బంది, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. జ్వ‌రాల‌కు సంబంధించి స‌మాచారం అందితే వెంట‌నే ఆయా గ్రామాల్లో ఆరోగ్య త‌నిఖీలు చేప‌ట్టి వ్యాప్తి చెంద‌కుండా నిరోధించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. చీపురుప‌ల్లి మండ‌లంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు బుధ‌వారం అల‌జంగి, రామ‌లింగాపురం గ్రామ స‌చివాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, జ్వ‌రాల ప‌రిస్థితి, వ్యాధుల ప‌రిస్థితిపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌తో మాట్లాడి ప‌రిస్థితులు తెలుసుకున్నారు. అల‌జంగిలో వివిధ సంక్షేమ ప‌థ‌కాల నోటిఫికేష‌న్లు, ఆయా ప‌థ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం, వాటిని పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు సంబంధిత స‌మాచారం స‌చివాల‌య నోటీసు బోర్డులో ప్ర‌ద‌ర్శించిందీ లేనిదీ జె.సి. త‌నిఖీ చేశారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల ప‌రిష్కారం ఏవిధంగా చేస్తున్న‌దీ ఆరా తీశారు. రేష‌న్ కార్డులు, ఇళ్ల ప‌ట్టాలు మంజురు వంటివి నిర్ణీత గ‌డువులోగా మంజూరు చేస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు.

Vizianagaram

2021-09-08 11:19:41

దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలి..

దివ్యాంగులు తమ అవసరాలు, పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలుగా సంబంధిత ప్రాంతాలలో రాంప్, టాయ్లెట్ లు, వాహనాల పార్కింగ్ తదితర పనులను చేపట్టే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "సుగమ్య భారత్ అభియాన్ ఆక్సెస్ ఇండియా కాంపైన్ ప్రోగ్రామ్" ను జిల్లాలో వేగవంతం చేయాలని జిల్లా కలక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్కీం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజభిలిటీస్ ఆక్ట్-2016"(SIPDA)కార్యక్రమానికి సంబంధించి జీ వీ ఎం సి,   ఏ పీ ఈ డబ్ల్యూ ఐ డి సి, ఏ పీ ఎస్ ఆర్ టీ సి, ఆర్ & బి, ఏ పీ ఎం ఎస్ ఐ డీ సి మొదలైన ఐదు శాఖలు 38 రకాల పనులను నిర్వర్తిస్తున్నాయని,వాటికి సంబంధించి రూ 1436.33 లక్షలు మంజూరు అయ్యాయన్నారు.   జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నరాజు మాట్లాడుతూ తమ పరిధిలో 7 పనులు మంజూరు కాగా వాటిలో 6 పనులు పూర్తి చేయడం జరిగిందని,మిగిలిన ఒకటి 80% అయ్యిందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీఈ డబ్ల్యు ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం జగ్గారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులలో ఒకటి మాత్రమే పూర్తయిందని ,మిగిలిన కొన్నిి  టెండర్ ప్రక్రియ లోనూ వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసి డెప్యూటీ ఇంజనీర్ పీవీ నరసింహారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన ఆరు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.  ఆర్ & బీ  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ సుధాకర్ మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులు టెండర్ ప్రక్రియలోను ,వివిధ దశలలోను ఉన్నాయన్నారు. ఏ పీ ఎం ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఎ నాయుడు మాట్లాడితూ అయిదు పనులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ మొత్తం 38 పనులకు గాను 7 పనులను మాత్రమే పూర్తిచేయడం చాలా అలసత్వం గా ఉందన్నారు.  వెంటనే టెండర్ ప్రక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని, నాణ్యమైన మెటీరియల్ నుఉపయోగించి  పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పనుల పురోగతి పై  మరలా సమీక్షిస్తానని అప్పటికి ప్రోగ్రెస్ కనబడాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ జి వి ఆర్ శర్మ పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-08 10:50:35

త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలి..

అనంతపురం నగరంలో పెండింగులో ఉన్న  రోడ్లు పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని  మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న  బీటీ రోడ్ పనులను  మేయర్ బుధవారం పరిశీలించారు. పనులలో జాప్యం వల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు గతుకులమయంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు మేయర్ దృష్టికి  తీసుకువచ్చారు. దీనితో ఈ ఈ రామ్మోహన్ రెడ్డితో కలసి మేయర్ వసీం పనులను పరిశీలించారు.టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు గుంతలు ఎక్కువగా ఉన్నందున పటిష్టంగా రోడ్ పనులు చేపట్టాలని,అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయాలని అధికారులకు మేయర్ సూచించారు. అంతేకాకుండా వర్షాల వల్ల నగరంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శేఖర్ బాబు, శ్రీనివాసులు  , అనిల్ కుమార్ రెడ్డి,  నాయకులు రామచంద్ర , డి ఈ నరసింహులు, కాంట్రాక్టర్ రఘునాథ్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-08 10:39:37

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి..

ప్ర‌భుత్వం వివిధ వ‌ర్గాల వారికోసం ఉద్దేశించి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయా వ‌ర్గాలకు చెందిన అర్హులైన వారికి స‌క్ర‌మంగా, స‌త్వ‌రం అందించేందుకు స‌చివాల‌య ఉద్యోగులు కృషిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ అన్నారు. స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ‌ ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందించి ఉద్యోగులు వారి అభిమానం పొందాల‌న్నారు. డెంకాడ‌, భోగాపురం మండ‌లాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.మ‌హేష్ కుమార్ బుధ‌వారం ప‌ర్య‌టించి ప‌లు గ్రామ స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. డెంకాడ మండ‌లం శింగ‌వ‌రం, డెంకాడ మండ‌ల కేంద్రం, భోగాపురంలో గ్రామ స‌చివాల‌యాల‌ను జె.సి త‌నిఖీ చేశారు. స‌చివాల‌యంలో రికార్డులు, రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యానికి వ‌చ్చే విన‌తుల ప‌రిష్కారం ఏవిధంగా చేస్తున్న‌దీ ఆరా తీశారు. ప్ర‌జ‌ల నుంచి వివిధ సేవ‌ల నిమిత్తం వ‌చ్చే విన‌తుల‌ను జాప్యం లేకుండా త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. ఆధార్ న‌మోదుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ల‌బ్దిదారుల‌కు స‌క్ర‌మంగా అందిస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. అర్హులైన వారికే ప‌థ‌కాలు అందించాల‌ని స్ప‌ష్టంచేశారు. స‌చివాల‌య సిబ్బంది ప‌నివేళ‌ల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటూ గ్రామ‌స్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. గ్రామ స్థాయిలో ప‌రిష్కారం సాధ్యం కాన‌ట్ల‌యితే వారు ఏ కార్యాల‌యానికి వెళ్తే ప‌రిష్కారం జ‌రుగుతుందో ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాల‌న్నారు.

Denkada

2021-09-08 09:27:29

మట్టి వినాయక విగ్రహాలనే వినియోగిద్దాం..

మట్టి వినాయక విగ్రహాలతోనే వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్  రమేష్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో జై భారత్ ముద్రించిన పండగ పూట పాపం చేయడం ఎందుకు? గోడ పత్రికను ఆయన  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికర విష రసాయనాల రంగులు వినియోగించిన విగ్రహాలను వాడి పర్యావరణాన్ని పాడుచేయవద్దని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపునిచ్చిన సంగతి విదితమేనని అన్నారు. దైవం మెచ్చే రీతిలో, పుడమితల్లికి నచ్చే రీతిలో భక్తి పారవశ్యంతో గణేశుని అర్చిద్దామని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రజలతోనే పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో చెరువులు, నదులు కాలుష్యం నుండి రక్షింపబడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ సభ్యులు జి.వి నాగభూషణరావు ,కళ్యాణ చక్రవర్తి,రామారావు,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-08 09:23:19