1 ENS Live Breaking News

ఇప్పటి వరకూ 30లక్షల మందికి వేక్సిన్..

చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,78,292 కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లు పూర్తి చేసినట్లు, ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరో 2.03 లక్షల డోస్ లు పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. గత  రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా ఈ నెల 11 వ తేది 93,248 రెండవ డోసులు మాత్రమే వేశామని, 12 వ తేది ఆదివారం మొదటి , రెండవ డోస్ లు వేసేందుకు 2.03 లక్షలు డోస్ లు జిల్లాకు అందాయని తెలిపారు. ఈ డోస్ లను 18 సంవత్సరాలు పై బడిన వారందరికి మొదటి, రెండవ డోస్ లు వేస్తున్నామని తెలిపారు. అన్ని మండలాలకు వ్యాక్సినేషన్ మందులు పంపిణీ చేయడమైనదని, ప్రతి మూడు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఒక్కొక్కరు 15 మందిని గుర్తించి వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. ఆదివారం ఉదయం నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నానికల్లా 1,25,921 మొదటి, రెండవ డోసు లు అన్ని పి.హెచ్.సి పరిధిలో వేశారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి మిగిలి ఉన్న 97 వేల డోస్ లు రాత్రి లోపు పూర్తి చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు, తిరుపతి ఆర్.డి.ఓ లు రేణుక, కనకనరసా రెడ్డి లను, మండల స్పెషల్ ఆఫీసర్లు, తాహాసిల్ధార్లు, ఎం.పి.డి.ఓ లు, మునిసిపల్ కమిషనర్ లను ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారo నాడు జిల్లా వ్యాప్తంగా వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో మండల, జిల్లా అధికారులను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ కేర్ వర్కర్ లకు సంబందించి మొదటి డోసు 46,819 మందికి, రెండవ డోస్ 45,356 మందికి. ఫ్రంట్ లైన్ వర్కర్ లకు మొదటి డోస్ 1,07,125 మందికి, రెండవ డోస్ 97,536 మందికి వ్యాక్సినేషన్ ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి అవగాహన కల్పించి వేశామని తెలిపారు. అలాగే 18-45 సంవత్సరాల వయసు వారికి మొదటి డోస్ 7,38,979 మందికి, రెండవ డోస్ 1,31,481 మందికి వెరసి 8,70,460 డోసులు, అలాగే 45 వయసు దాటిన వారికి మొదటి డోస్ గా 11,26,620 మందికి, రెండవ డోస్ 7,29,306 మందికి, వెరసి 18,55,926 ఇన్ని డోస్ లు  పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  

Chittoor

2021-09-12 10:52:27

ఏజెన్సీలో వాల్మీకిల సమస్య పరిష్కరించండి..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి షెడ్యూల్ తెగ ను నవశకం వెబ్ సైట్ లో నమోదు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి తెగ ఎస్టీ జాబితాలో ఉండగా రాష్ట్రంలోని వివిధ కులాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నవశకం లో ఏజెన్సీ లోని ఎస్టీ తెగల జాబితా నుంచి వాల్మీకి తెగను తొలగించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కాంతిలాల్ దండే తో ఫోన్లో మాట్లాడారు.  నవశకం వెబ్ సైట్ లో వాల్మీకి తెగ ను ఎస్టీ కులాల జాబితాలో చేర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన ఈ పొరపాటు కు కారణం ఏమిటో తెలుసుకోవాలని కోరారు. నవశకం వెబ్ సైట్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా చూస్తామని ఈ సందర్భంగా కాంతిలాల్ దండే ఉప ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారు. కాగా ఈ విషయం గా వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. 

Visakhapatnam

2021-09-12 10:45:28

శ్రీవారి తీర్థ కైంకర్యపరుడు శ్రీ తిరుమలనంబి..

పాండిత్యం కన్నా భగవంతుడి సేవనే మిన్నగా భావించి శ్రీవారికి తీర్థ కైక‌ర్యం చేసిన తిరుమ‌ల ప్ర‌థ‌మ పౌరుడు శ్రీ తిరుమలనంబి ప్రముఖ స్థానం పొందారని తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ పేర్కొన్నారు. టిటిడి అఖిల‌ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయ ప్రాంగణంలో 1048వ అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ కీలకోపన్యాసం చేస్తూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువ‌చ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి  తీసుకువస్తున‌ప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. తిరుమలనంబి స్వామివారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేద‌పారాయ‌ణ కైక‌ర్యం,  ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్‌ రామానుజులవారికి మేనమామ అన్నారు. శ్రీమద్‌ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. అనంతరం " తిరుమంగై ఆళ్వారుల పాశురాల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌రుడు " అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 మంది పండితులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, తిరుమలనంబి వంశీకులు  కృష్ణమూర్తి తాతాచార్యులు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ పురుషోత్తం, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 09:48:59

నగరంలో సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్.వి.సన్యాసిరావు  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన 6వ జోన్ 86వార్డు పరిధిలోని  కుమ్మరపాలెంలోని శాతవాహన నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.  వార్డులో ఆర్. పుష్పకు డెంగ్యూ వచ్చినందున ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వర్షపు నీరు, ఇళ్లలో వాడే నీరు ఎక్కువ రోజులు నిలువ ఉండటం వలన, దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వలు లేకుండా చూడాలని వారంలో మంగళవారం, శుక్రవారం “డ్రై డే”పాటించాలని సూచించారు. డెంగ్యూ కేసు నమోదైన ఇంటి పరిసరాలలో 200 మీటర్ల పరిధిలో ఫాగింగ్, స్క్రీనింగ్ చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు కలిసి మలేరియా పై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మలేరియా సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి ఇంటి గోడ పై సంతకం చేయాలని ఆదేశించారు.  విధుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి కాలువలను శుభ్రం చేయించాలని, కాలువలలో అడ్డంకులను తొలగించి వర్షపు నీరు,  మురుగునీరు సాఫీగా పోయే విధంగా చూడాలని ఆదేశించారు.   పిన్ పాయింట్ వారీగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించుకున్న పనిని వారిచే చేయించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకూడదని, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.   ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-11 14:34:30

విద్యా విధానంలో రాష్ట్రం కొత్త పుంతలు..

రాష్ట్రంలోవిద్యా విధానంలో కొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం తొగరం, కలివరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ శని వారం పాల్గొన్నారు. తొగరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.18 లక్షల నిధులతో పనులు పూర్తి చేశారు. కలివరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.16.50 లక్షల నిధులతో పనులు పూర్తి చేసారు. సుమారు రూ. 22 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం ఆయన మాట్లాడుతూ స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటికి 15 సంవత్సరాలు నుంచి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, పల్లెల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసారు. విద్యా విధానం చూస్తే కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ధనికులు చదువుతున్నారని, పేదవాడి చదువు అందని ద్రాక్షలా ఉందని అందుకే పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలని ముఖ్య మంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చదువు పేరు చెప్పి లక్షలు దోపిడీలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిని నిలువరించడానికి ప్రభుత్వ విద్యాలయాలు కార్పోరేట్ కు దీటుగా తయారుచేసి ఇంగ్లీష్ విద్యా విధానం అమలు పరుస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసి అమలుపరుస్తున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి గురించి చర్చకు రావాలని స్పీకర్ తమ్మినేని అన్నారు.  ఈ కార్యక్రమంలో తొగరాం సర్పంచ్ వాణి సీతారం., తమ్మినేని చిరంజీవి నాగ్, స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవిందరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 12:15:10

ప్రతీ మంగళవారం బ్లడ్ డొనేషన్ క్యాంపులు..

బ్లడ్ డొనేషన్ క్యాంపులను వారంలో  ప్రతీ మంగళవారం, శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పుల వలన డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ఇంకా రెండు, మూడు నెలలు పెరిగే అవకాశం ఉన్నందున ఆయా వ్యాధులను నియంత్రించడానికి పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ప్యాండమిక్ సీజన్ వలన జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించలేకపోయినందున బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. బ్లడ్ డొనేషన్ కు సంబంధించి అన్ని విధాల సహకారం అందిస్తామని కలెక్టరు తెలిపారు. కాబట్టి అత్యవసరంగా రక్తదాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనన్నారు.  డెంగ్యూ వ్యాధి నియంత్రణకుసంబంధించి ప్లేట్లెట్స్ అవసరమని, సింగిల్ బ్లడ్ డోనర్స్ ను గుర్తించి ప్లేట్లెట్స్ సేకరణ చేయాలన్నారు. రక్త దాతల లిస్టును దగ్గర పెట్టుకుని రక్తం అవసరమైన పరిస్థితులలో వారికి ఫో్ను చేసి రప్పించే ఏర్పాటు చేయాలన్నారు.  రేర్ బ్లడ్ గ్రూపు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూపు వారిని ప్రోత్సహించి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి రక్తం అవసరం ఏర్పడినప్పుడు దాతలు ముందుకు వచ్చే విధంగా గ్రూపులో మెసేజ్ పెట్టాలన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏరోజు పెడుతున్నది ప్రసార మాధ్యమాల ద్వారా విసృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రవేటు ఆసుపత్రులు, స్వచ్చంధ సంస్థలు సేకరించిన రక్త నిధులలో 30 శాతం కె.జి.హెచ్ కు అందజేయాలన్నారు. సింగిల్ డోనార్స్ ఉంటే కె.జి.హెచ్ కు పంపించాలన్నారు.  పాడేరులో రెడ్ క్రాస్ సొసైటి ఒక బ్లడ్ బ్యాంకును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులు, 5 స్వచ్ఛంధ సంస్థలు, 10 ప్రైవేటు ఆసుపత్రులలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. విక్టోరియా, అనకాపల్లి, పాడేరు ఏరియా ఆసుపత్రులలో కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్లు లేవని, సంబంధిత టెక్నికల్ సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని తెలిపారు. అందుకు కలెక్టరు స్పందిస్తూ తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. బ్లడ్ స్టోరేజి యూనిట్లు నర్సీపట్నం, చింతపల్లి, చోడవరం, అరకు, కోటపాడు, నక్కపల్లి , అగనంపూడి లలో ఉన్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, కె.జి.హెచ్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.శ్యామల, డిఎల్ఒ డా.సత్యవాణి,ఎ.ఎస్.రాజా, ఎన్.టి.ఆర్, రోటరీ, లయన్స్, రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్  బ్యాంకుల ప్రతినిధులు, నగరంలో గల పది ప్రవేటు ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-11 11:59:31

టీటీడీ ఆస్తులను పరిశీలించిన ఈవో ..

రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.  తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని  శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి  దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడి భవనాలను పరిశీలించి, అభివృద్ధి  కార్యక్రమాల గురించి చర్చించారు. బిగ్ గార్డెన్,  చుంగి గార్డెన్ లోని టీటీడీ ఆసులను పరిశీలించి,  వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి మల్లిఖార్జున,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు  ఉన్నారు.  అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందస్వామి వారిని కలిశారు.

Tirumala

2021-09-11 11:58:05

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ మంత్రికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి కుంటుంబం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-09-11 11:03:37

అప్పన్న ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానానికి ISO 9001:2015 (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ మేరకు దేవస్థానానికి వచ్చిన గుర్తింపుని ఈఓ ఎంవీ సూర్యకళ మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వామి వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఆయన మహిమేనన్నారు. "ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళ, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈఓ మాట్లాడుతూ, ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్   సంస్థ ఈ గుర్తింపునిచ్చింది.  ఈ సర్టిఫికెట్ ను... రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈఓ సూర్యకళ అందుకున్నారు. ఈఓ మాట్లాడుతూ, మంత్రి చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణం అన్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ ప్రస్తుతం దేవస్థానంలో జరుగుతోందని.. ఆ రంగంల్లోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చామని, అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించే దేవస్థానంగా ఇపుడు గుర్తింపు పొందామని అన్నారు. కాగా  ప్రసాద్ స్కీం ద్వారా రూ.54 కోట్లు మంజూరయ్యాయని కరోనా సెకెండ్ వేవ్ వల్ల నిధులు రావడం కాస్త ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-09-11 10:52:05

ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్..

శ్రీకాకుళం జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఫ్రీడం రన్ ఘనంగా జరిగింది. శనివారం ఉదయం అరసవిల్లి కూడలి నుండి ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంను పోలీస్ పోలీసు పిర్యాదుల అధారిటీ సభ్యులు పి. రజనీకాంతరావు ప్రారంభించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల జరుపుకుంటున్న సందర్భంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావులు అసువులు బాసి స్వాతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ జీవితాలను ప్రజలు గడుపుటకు కారకులయ్యారని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఆయన చెప్పారు. అభివృద్ధి పై అవగాహన పెంచుకుని మహోన్నత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.  నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయ అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 744 జిల్లాల్లో అమృత మహోత్సవం ర్యాలీలు నిర్వహించుటకు అనుమతించటం జరిగిందని, అందులో శ్రీకాకుళం జిల్లా ఒకటని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.వి.ఎస్.వి జమదగ్ని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రామారావు, నెహ్రూ యువ కేంద్ర పరిపాలన అధికారి డి. శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థలు, యువత పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 10:18:26

జీవితంలో ఎదగాలంటే లక్ష్యం కావాలి..

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకొని,అందుకోసం చిత్త శిద్ధి తో ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. తల్లి దండ్రులతో పాటు గురువులను  గౌరవించాలని,   అప్పుడే మన విజయాలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. శనివారం సెంచురియన్ యూనివర్సిటీని కలెక్టర్ సందర్శించారు.  విద్యార్థులనుద్దేశించి  ముందుగా ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ముగ్ధులైన  విద్యార్థులు   అనేక  ప్రశ్నలను సంధించారు. విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మాట్లాడుతూ కెరీర్ గురించి, జీవితం లో ఎలా ఎదగాలి,  ఎలా మెలగాలనే అంశాలను  సున్నితంగా వివరించారు.   ముఖా ముఖి లో  విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  పలు ప్రశ్నలకు స్పందిస్తూ సివిల్ సర్వీస్ ఉద్యోగం లో  అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, వాటిని అధిగమించి కష్టపడితే అంతకు మించిన గుర్తింపు, గౌరవం తో పాటు  వృత్తి పరమైన సంతృప్తి  ఉంటుందని వివరించారు.  వత్తిడిని ఎదుర్కోవడానికి పిల్లలు తల్లి దండ్రులతో దృఢమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలని, ఎంత  బాధ నైనా వారితో పంచుకుంటే తగ్గిపోతుందని హితవు పలికారు.  సోషల్ మీడియా లో అనవసర విషయాల పై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోకూడదని అన్నారు. ముఖ్యంగా  శారీరకంగా, మానసికంగా  దృడంగా ఉండాలని, ప్రతి అంశాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలని అన్నారు. దివ్యాంగుల  కోసం ఒక వృత్తి  కోర్స్ ను  నిర్వహించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని కలెక్టర్ కోరారు. కోవిడ్ వాక్సినేషన్ అందరికి వేయించాలి, ప్రత్యేకంగా కోవిడ్ నిబంధనల పై అవగాహన కలిగించాలని అన్నారు.    యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జి.ఎస్.ఎన్. రాజు  యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న కోర్స్ ల పై, ప్లేస్మెంట్స్, ఇతర పరిశ్రమలు, సంస్థల తో  అనుసంధానం తదితర  వివరాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఆచార్యులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్   డా.శాంతమ్మ  గారి చేతుల మీదుగా కలెక్టర్ ను సన్మానించి  జ్ఞాపిక ను అందజేశారు.  ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ గోపినాధ్, డీన్లు  డా. రమణా రావు, డా.ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-11 10:17:28

రణమా.. రాజీనా మీరే నిర్ణయించు కోండి!

శ్రీకాకుళం జిల్లాలో చాలాకాలం నుండి పెండింగు లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు చక్క ని వేదిక లోక్ అదాలత్ అని, కావున కక్షిదారులు లోక్ అదా లత్ ను సద్వినియోగం చేసుకో వాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సమయం లేదు మిత్రమా! రణమా ... శరణమా.. అని ఓ కవి చెప్పారని, అదేవిధంగా ఇక్కడ కూడ సమయం లేదు మిత్రమా.. రణమా లేదా రాజీ నా అని కక్షిదారులు నిర్ణయిం చుకోవలసిన సమయం ఆసన్న మైందని ప్రధాన న్యాయమూర్తి పోల్చిచెప్పారు. తమ కేసుల విషయమై గొడవలు పడి,ధనాన్ని, సమయాన్ని వృదాచేసుకునే బదులుగా కక్షిదారులు రాజీతో తక్షణమే కేసులను పరిష్కరించు కోవచ్చని చెప్పారు. తమ కేసుల కొరకు ఇతర కోర్టులను ఆశ్రయించడం వలన ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని అన్నారు. కాని లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్నందున ఇరువైపులా విజేతలు అవుతారని వివరించారు. ఇతర కోర్టులలో గెలుపొందిన కేసుల్లో కక్షిదారులు ఇతర కోర్టు లను ఆశ్రయించవచ్చని,కాని లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పే తుది తీర్పు అయినందున, ఇతర కోర్టులను ఆశ్రయించా ల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 23 వేల వరకు కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అన్నారు. రాష్ట్ర ఉన్నత  న్యాయస్థానం పిలుపు మేరకు ప్రతీ రెండు మాసాలకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని, కక్షిదారు లకు ఇదొక మంచి అవకాశం అని వివరించారు. గత లోక్ అదాలత్ ద్వారా జిల్లావ్యా ప్తంగా 2 వేల కేసుల వరకు పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం ఈ అదాలత్ ద్వారా సుమారు 14 వందల వరకు కక్షిదారులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ కేసులన్ని పరిష్కరించనున్నట్లు తెలి పారు. లోక్ అదాలత్ ను ఆశ్రయించే కక్షిదారులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదని, దీనివలన ధనము,సమయం ఆదా అవుతుందని చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో 4 బెంచు లతో పాటు జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు పరిష్కారం కాని కేసుల విషయమై కక్షిదారులు పునరాలోచించి లోక్ అదాలత్ ను ఆశ్రయించి తమ కేసులను సత్వరమే పరిష్కరించు కోవా లని ఆయన కోరారు.  

అనంతరం ఆమదాలవలసకు చెందిన 4గురు కక్షిదారులకు 3 లక్షల 60 వేల రూపాయల అవార్డును  ప్రకటించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలి కోర్టు 3వ అదనపు జిల్లా న్యాయ మూర్తి పి.అన్నపూర్ణ, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి. వెంకటేశ్వర్లు, శాస్వత లోక్ అదాలత్ ( పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ ) చైర్మన్ ఏ.గాయత్రి దేవి, సీనియర్ సివిల్ జడ్జి మరి యు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.అనురాధ, టౌన్ డి.ఎస్.పి ఎం.మహీంద్ర, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, ప్రత్యేక సంచార కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.సౌమ్య జోసఫిన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్ఠు రమేష్, కార్యదర్శి కృష్ణప్రసాద్, న్యాయవాదులు పి.మల్లిబాబు, డా.జి.ఇందిరాప్రసాద్, శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు పి.చం ద్రపతిరావు, ఇతర న్యాయ మూర్తులు,న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-11 10:16:29

అనుబంధాలతో ఆత్మహత్యల నియంత్రణ..

కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు పెంచుకోవడం, ఒకరికొకరు ఆత్మీయతను పంచుకోవడం ద్వారా, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సూచించారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జూమ్ వెబ్‌నార్లో, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కుటుంబ వ్యవస్థలో, తల్లితండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లలు, యువత తాము ఒంటరి తనానినికి లోనై, ఒత్తిడికి గురి అయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పిల్లల్లో, యువతీయువకుల్లో ఒంటరితనాన్ని పారద్రోలే చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లల మనసును చదువుతో పాటు, ఆటలు, వ్యాయామం, కళలు తదితర అంశాలపై  మల్లింపజేయాలని సూచించారు. అహ్లాదకరమైన కుటుంబ వాతావరణన్ని కల్పించాలని  కోరారు. నేటి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా మారాలని, మానసికంగా ప్రశాంతంగా,  అలజడి లేకుండా ఉన్నపుడు మాత్రమే ఒత్తిడిని అధిగమించవచ్చును కలెక్టర్ స్పష్టం చేశారు. అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్(ఆసరా) జె. వెంకటరావు మాట్లాడుతూ,  ఉద్యోగ రీత్యా అందరికి పని ఒత్తిడి ఉన్నపటీకి, దానికీ కుటుంబానికి సమన్యాయం చేసుకోవాలని సూచించారు.  ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవడం తోబాటు,  మనం చేసే పనిని ఇష్టంగా చేయడం వలన పని ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.  జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, జిల్లా యువజన సమన్వయాధికారి  జి.విక్రమాదిత్య మాట్లాడారు.  ఆత్మహత్యల నివారణ మరియు యువ సంకల్ప బలం గురించి వివరించారు. వెబ్ నార్లో భాగంగా, ఆత్మహత్య నివారణ మరియు మానసిక సంసిద్దత అనే అంశాల పై, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ జాగరపు ప్రసంగించారు. ఆయుష్ వైద్యులు డాక్టర్ స్వప్న చైతన్య మాట్లాడుతూ,  యోగ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించే విధానాలను వివరించారు. 

Vizianagaram

2021-09-10 11:51:08

గణపతిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్..

శ్రీ శ్రీ శ్రీ సిద్ధిబుద్ధి సహిత వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ శుక్రవారం దర్శించుకున్నారు. గణపతి నవరాత్రి లో భాగంగా స్థానిక పురుషోత్తంనగర్ లో గల  పంచాయతన దేవాలయంలో ఏర్పాటుచేసిన గణపతిని  కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పి జగన్మోహన్ రావు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ వనమోలి వెంకటరమణ శర్మ, రంపా వెంకటరమణ, రామ కృష్ణ, లక్ష్మీనారాయణ శర్మ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొలుత ఆలయ విశిష్టతను ధర్మకర్త కలెక్టర్ కు  వివరించారు. వినాయక చవితి పర్వదినాన గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.జగన్మోహన్ రావు,సి.వి.ఎన్. మూర్తి, పి.వి.ఆర్.ఎం.పట్నాయక్, పి.వైకుంఠరావు,పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-10 10:27:36

ఏకాంతంగా బాలాల‌య కార్యక్రమాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాలు రెండో రోజైన శుక్రవారం ఏకాంతంగా జరిగాయి. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం, సాయంత్రం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో  ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్  ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

Tirupati

2021-09-10 10:26:21