1 ENS Live Breaking News

శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం  వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో  ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా  ఆరాధించారు. అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని  ఆగమ పండితులు   శ్రీనివాసాచార్యులు  తెలియజేశారు.  తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.  2713 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి వర్చువల్ గా ఈ వ్రతంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి  వేణుగోపాల కృష్ణ,  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు  బాబుస్వామి పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Tirupati

2021-08-20 09:00:45

ఆలయాలు, చర్చిలకు మరింత భద్రత..

తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలు, చర్చిలకు మరింత భద్రత కల్పించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 64 మండాల్లోని అన్ని గ్రామాల్లోని చర్చిలు, ఆలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు, అవిపనిచేస్తున్న విధానాలపై నివేదికలు సమర్పించాలని ఎస్ఐలను శుక్రవారం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల ద్వారా సమాచారం సేకరించడంతోపాటు అక్కడి తాజా పరిస్థితులను అంచనా వేయాలని కూడా ఆదేశించారు. దీనితో స్టేషన్ల పరిధిలోని పోలీసులు, సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు ఈ సమాచారం సేకరించే పనిలో పడ్డారు. జిల్లా మొత్తం సమాచారం వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు జారీ చేయనున్నారు.

Kakinada

2021-08-20 07:26:16

అప్పన్నకు సెంట్రల్ ఫైనాన్స్ జెసి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని సెంట్రల్ ఫైనాన్స్ జాయింట్ కమిషనర్ ఎంఆర్ హర్షవర్ధన్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించు కున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

సింహాచలం

2021-08-20 07:23:09

సింహాద్రి అప్పన్నకు డిఆర్డీఓ చైర్మన్ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, శాస్త్రవేత్త చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు.  ఆలయంలోని (శివాలయం) కాశీ విశ్వేశర ఆలయంలోనూ పూజలు చేసారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-20 05:04:45

వ్యక్తిగత పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ..

వ్యక్తిగత పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె సి చంద్ర నాయక్ వెల్లడించారు. ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2018 సం.రం నుండి జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇది శుభ పరిణామమని  అన్నారు. డెంగ్యూ 2018లో 87 కేసులు, 2019లో 164 కేసులు, 2020లో 23 కేసులు, 2021లో ఇప్పటివరకు 10 కేసులు నమోదయినట్లు చెప్పారు. మలేరియా 2018లో 264 కేసులు, 2019లో 125 కేసులు, 2020లో 34 కేసులు, 2021లో ఇప్పటివరకూ 28 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని , అందువలన ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు దోమల నుండి సంక్రమిస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి దోమల నివారణకై తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు లభించే దోమ తెరలను వినియోగించుకోవాలని, తద్వారా దోమల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. సరైనా జాగ్రత్తలు పాటించకపోవడం వలన సెరిబ్రల్ మలేరియా వంటి వ్యాధుల బారిన పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. మలేరియా నివారణకై జిల్లాలో 144 హై రిస్క్ గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో మొదటి విడత పిచికారి కార్యక్రమాన్ని  2021 మే 15 నుండి జూన్ 30 వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండవ విడత పిచికారి కార్యక్రమాన్ని జూలై 16 నుండి ప్రారంభించి ఇప్పటి వరకు 124 గ్రామాలలో పిచికారి చేయించినట్లు చెప్పారు.

10ఏపిఐ ఉన్న 26 గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలతో పిచికారి జరిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల గంబూషియా చేపలను హైరిస్క్ ప్రాంతాల్లో పెద్ద నీటి నిల్వలు ఉన్నచోట విడిచిపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామని, ఇంతవరకు లక్ష గంబూషియా చేపలను కుసిమి, దోనుబాయి, అన్నవరం మొదలగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని నీటి నిల్వల్లో విడిచిపెట్టామని తెలిపారు. ఈ సీజనల్ మలేరియాకు సంబంధించిన ఏంటి మలేరియా మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాల్లో నిల్వచేసినట్లు ఆయన వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖల సహకారంతో దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసారు. డెంగ్యూ ఏడిస్ దోమల నుండి సంక్రమిస్తుందని,  ఇవి ఇంటి పరిసరాల్లో ఉండే చిన్ననీటి నిల్వల్లో ఉండి పగటిపూట తిరుగుతూ ఉంటాయని చెప్పారు. కావున పగటి వేళల్లో దోమలు కుట్టకుండా ఉండేందుకు పూర్తిగా వస్త్రధారణ చేసుకోవాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు జిల్లా ఆసుపత్రితో పాటు పాలకొండ, రాజాం, టెక్కలి ఆసుపత్రులలో కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.  మలేరియా , డెంగ్యు వచ్చేక బాధపడటం కంటే రాకుండా ముందస్తు నివారణ చర్యలు పాటించడం మేలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి డా. జి.వీర్రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-08-19 16:54:45

లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలో అవగాహన..

లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలోనే అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో పిసి మరియు పియన్ డిటి చట్టం అమలు పై కమిటీ ఆయన అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులకు ఆవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సమావేశానికి ఐసిడిఎస్ సిడిపిఓ హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు ను ఆదేశించారు. లింగ నిష్పత్తి ఏ ఏ మండలాల్లో తక్కువగా ఉందో వాటిని గుర్తించి ఆ మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడపిల్ల పుట్టడమే అదృష్టంగా భావించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు చట్టం ఉల్లంఘన చేస్తే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ లో ఉన్న ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు సమాచారం తీసుకోవాలని చెప్పారు. కొన్ని కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. గర్భం ధరించడానికి ముందుగాని తర్వాత గానీ లింగ ఎంపిక చేయకూడదన్నారు. లేబరేటరీలు గర్భస్థ పిండాలు తెలిపే లింగాన్ని తెలిపే ఉద్దేశంతో ఎలాంటి పరీక్షలు చేయరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మూడు సంవత్సరాలు జైలు శిక్ష, 10 వేల రూపాయలు జరిమానా విధించబడుతుందన్నారు.  స్వచ్ఛంద సంస్థల నుండి రమణమూర్తి, విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలని, సినిమా హాల్స్, సిటి కేబుల్ లలో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు, ఒన్ టౌన్ సీఐ అంభేథ్కర్, అడ్వకేట్ సరళ కుమారి, స్వీప్  స్వచ్ఛంద సంస్థలు నుండి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-19 16:51:52

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన  శానిటరీ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆమె 2వ జోన్ 6వ వార్డు పరిధిలోని మధురవాడ, బక్కన్నపాలెం బి-2 హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా వర్షాలు విస్తారంగా పడుతుండడంతో సీజనల్ వ్యాధులు లైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు.  వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని,   ఫ్రిడ్జ్  వెనుక భాగం ట్రేలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని,  ఇంటి పరిసర ప్రాంతాలలో  కొబ్బరి బొండాలు,   ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్,  పూల కుండీలులోని నీరు నిల్వ లేకుండా చూడాలని,  ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని,  సచివాలయాల పరిధిలో  మలేరియా పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఫీవర్ సర్వే ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున గెడ్డ లోని పూడికలు  తొలగించి, వర్షపు నీరు  సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని,  పారిశుధ్య కార్మీకులు ప్రతి ఇంటి నుండి  తడి-పొడి చెత్తను సరిగా సేకరించడంలేదన్నారు.

 తడి-పొడి చెత్తను వేరు వేరుగా ఇచ్చేవిధంగా  ప్రజలకు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.  పిన్ పాయింట్ వారిగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే  చేయించాలని, చెత్త తరలించే వాహనాలు రోజుకు 3 ట్రిప్పులు వేయాలని, పుష్ కార్ట్ లోని చెత్త బయట వేయకుండా నేరుగా  చెత్త తరలించే వాహనంలోనే వేయాలని  శానిటరీ అధికారులను ఆదేశించారు. మధురవాడ పరిసర ప్రాంతాలలో పందులు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే నిర్మూలించే చర్యలను చేపట్టాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేసుకొనేలా సచివాలయాల పరిధిలో వాలంటరీలు  ప్రతి ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాల వయసు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్  ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కార్యనిరాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, అసిస్టెంట్ ఇంజినీర్లు శ్రీహరి, శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-19 16:51:02

పేదవిద్యార్ధికి ఇంగ్లీషు మీడియం విద్య..

 పేదవిద్యార్ధికి మన బడి నాడు - నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఇంగ్లీష్ మీడియం విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్  తమ్మినేని సీతారాం అన్నారు. గవర్నమెంట్ స్కూల్ ముందు సీటు కోసం క్యూ కడుతున్నారంటే  ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పీకర్ అన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాల, బాలయోగి గురుకుల పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతారాం గురువారం పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. కేజీబీవీ స్కూల్, బాలయోగి గురుకుల పాఠశాలలో నాడు - నేడు పనుల నాణ్యత ముఖ్య మంత్రి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని ఆన్నారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు, మండల అధికారులు, స్థానిక నాయకులు ఖండపు గోవిందరావు,  బెజ్జిపురపు రామారావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

భూర్జ

2021-08-19 16:49:55

భూములు రీసర్వే పనులు వేగం పెంచాలి..

శ్రీకాకుళం జిల్లాలో భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఏడి సర్వేను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చాంబర్ లో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తో గురువారం సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు పనులు చేపడుతున్న మూడు డివిజన్లలో శ్రీకాకుళం డివిజన్ లో పోలాకి మండలం సంతలక్ష్మీపురం గ్రామం, టెక్కలి డివిజన్ లోని కోటబొమ్మాళి మండలం ఆనందపురం గ్రామం, పాలకొండ డివిజన్ లోని పాలకొండ మండలం పరశురాంపురం గ్రామాల్లో చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఒక డ్రోన్ తో సర్వే జరుగుతుందని సర్వే సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు. అదనంగా మరో డ్రోన్ తీసుకొని సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళికా బద్థంగా, సమస్యలు లేకుండా చేయాలన్నారు. శ్రీకాకుళం, గార మండలాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసి ఒకేసారి పనులు జరిగేలా గ్రౌండ్ వర్క్ పనులు చేయాలని, సర్వే కమీషనర్ నుండి అనుమతి వచ్చిన వెంటనే డ్రోన్ ఫ్లైయింగ్ పనులు ప్రారంభించాలని చెప్పారు.  ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి పాల్గొన్నారు.

Srikakulam

2021-08-19 16:22:32

సిబ్బంది అర్జీదారులతో గౌరవంగా మెలగాలి..

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవిన్యూ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు, అర్జీదారులంద‌రికీ స‌మాన‌ గౌర‌వం ఇవ్వాల‌ని, అర్జీదారులంద‌రి స‌మ‌స్య‌ల ప‌ట్ల ఒకే రీతిలో స్పందించి వాటి ప‌రిష్కారానికి చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి జిల్లాలోని త‌హ‌శీల్దార్‌ల‌ను ఆదేశించారు. అర్జీలు ఇవ్వడానికి వ‌చ్చే వ్య‌క్తులంద‌రి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విని వాటిని సాధ్య‌మైనంత మేర‌కు న్యాయ‌బ‌ద్ధంగా ప‌రిష్క‌రించేందుకే ప్ర‌య‌త్నించాల‌న్నారు. అర్జీల‌ను త‌మ స్థాయిలో ప‌రిష్కారం సాధ్య‌మైనప్ప‌టికీ వాటిని తిర‌స్క‌రించే ప‌రిస్థితి రానివ్వొద్ద‌ని స్ప‌ష్టంచేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి గురువారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌తో క‌ల‌సి జిల్లాలోని అన్ని మండ‌లాల‌ త‌హ‌శీల్దార్‌ల‌తో ఆన్ లైన్ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. స్పంద‌న‌లో వ‌చ్చే ప్ర‌జా విన‌తుల  ప‌రిష్కారం, ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై సమ‌గ్రంగా స‌మీక్షించారు.

జిల్లాలోని ఏ మండ‌లంలోనూ ప్ర‌భుత్వానికి చెందిన భూముల ర‌క్ష‌ణ బాధ్య‌త త‌హ‌శీల్దార్ల‌దేని స్ప‌ష్టంచేశారు. ప్ర‌భుత్వ భూముల‌కు త‌హ‌శీల్దార్‌లు ర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. మండ‌లంలోని ఏ ప్రాంతంలోనైనా ప్ర‌భుత్వ‌ భూములు, చెరువులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైతే త‌క్ష‌ణం స్పందించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి, భూముల‌ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల వ‌ల్ల వాటి  నీటి నిల్వ సామ‌ర్ధ్యం కోల్పోయి అనేక న‌ష్టాలు జ‌రిగే అవ‌కాశం వుంటుంద‌ని అందువ‌ల్ల చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. మండ‌లంలోని భూవివ‌రాల‌పై త‌హ‌శీల్దార్‌ల‌కు స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న వుండాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టంచేశారు. ఏయే వ‌ర్గీక‌ర‌ణ‌ల‌కు సంబంధించిన భూమి ఎన్ని ఎక‌రాలు వుందో చెప్పే ప‌రిస్థితి వుండాల‌న్నారు. వ‌చ్చే స‌మావేశం నాటికి ఆయా మండ‌లాల్లో భూముల వివ‌రాల‌కు సంబంధించి పూర్తి స‌మాచారంతో, అవ‌గాహ‌న‌తో సిద్ధం కావాల‌న్నారు. జిల్లాకు రానున్న రోజుల్లో ప‌లు ప‌రిశ్ర‌మ‌లు, జాతీయ ప్రాజెక్టులు రానున్నాయ‌ని, వాటి ఏర్పాటు కోసం భూములు అవ‌స‌రం వుంటుంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు. ఆయా మండ‌లాల్లో ఆక్ర‌మ‌ణ‌లు లేకుండా స్ప‌ష్టంగా అందుబాటులో వుండే ప్ర‌భుత్వ భూముల వివ‌రాలు సిద్ధం చేయాల‌ని చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా మండలాల వారీగా రెవిన్యూ శాఖ‌కు సంబంధించి స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై స‌మీక్షించారు. ఏదైనా మండ‌లంలో పెద్ద ఎత్తున పెండింగ్‌లో వున్న‌ట్ల‌యితే ఏ కార‌ణంగా వున్నాయో తెలుసుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న‌ట్లు తెలియ‌జేస్తే వాటికి సంబంధించి కౌంట‌ర్‌లు సంబంధిత న్యాయ‌స్థానంలో దాఖ‌లు చేసిందీ లేనిదీ స‌మీక్షించారు. ఏయే ర‌క‌మైన విన‌తులు ప‌రిష్కారం కాకుండా మిగిలి వుంటున్నాయో త‌హ‌శీల్దార్‌ల ద్వారా తెలుసుకున్నారు. వై.ఎస్‌.ఆర్‌. జ‌గ‌న‌న్న భూహ‌క్కు భూర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌రుగుతున్న  రెండు గ్రామాల్లో పైల‌ట్ ప్రాజెక్టుగా జరుగుతున్న స‌ర్వేపై స‌మీక్షించారు.

Vizianagaram

2021-08-19 16:09:40

20, 21తేదీల్లో మంత్రి బొత్స పర్యటన..

రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌, శ‌నివారాల్లో జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. పుర‌పాల‌క మంత్రి గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు విశాఖ చేరుకొంటారు. శుక్రవారం రోజంతా జామి, గంట్యాడ‌, గుర్ల‌, చీపురుప‌ల్లి మండ‌లాల్లో ప‌ర్య‌టించి గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాలు, రైతుభ‌రోసా కేంద్ర భ‌వ‌నాలు, నాడు - నేడు కింద ఆధునీక‌రించిన పాఠ‌శాల‌ల‌ను, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించ‌నున్నారు. 20వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జామి మండ‌లం విజినిగిరిలో గ్రామ స‌చివాల‌యం నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 11-30 గంట‌ల‌కు గంట్యాడ మండ‌లం కొర్లాంలో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని, రైతుభ‌రోసా కేంద్ర భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు.
మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు గుర్ల మండ‌లం ఎస్‌.ఎస్‌.ఆర్‌.పేట‌లో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంట‌లకు చీపురుప‌ల్లి మండ‌లం వంగ‌ప‌ల్లిపేట‌లో వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 4.00 గంట‌ల‌కు చీపురుప‌ల్లి మండ‌లం పేరిపిలో నాడు - నేడు కింద ఆధునీక‌రించిన పాఠ‌శాల‌ను ప్రారంభిస్తారు.  21వ తేదీ శ‌నివారం నాడు స్థానికంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మాల్లో పాల్గొని విశాఖ వెళ‌తారు. సాయంత్రానికి విజ‌య‌వాడ చేరుకుంటారు.

Vizianagaram

2021-08-19 16:07:39

కోవిడ్ నిబంధనలతోనే పండుగలు జరుపుకోవాలి..

విజయనగరం జిల్లాలో రాబోయే పండగలన్నిటిని కోవిడ్ తగ్గే వరకు కోవిడ్ నిబంధనల ననుసరించి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో  మైనారిటీ సంక్షేమ శాఖ వారు ముద్రించిన నో మాస్క్ – నో  ఎంట్రీ నినాదం తో ఉన్న పోస్టర్లను ఆవిష్కరించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ  ముస్లిం సోదరులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేసారు.  శుక్రవారం  ముస్లిం సోదరులు  జరుపుకునే మొహరం పండగను  భక్తి శ్రద్ధలతో కోవిడ్ నడుమ జరుపుకోవాలని అన్నారు.  వ్యక్తుల మధ్య కనీసం  6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని,  అలింగానాలు వద్దని అన్నారు.  ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించాలని, శానిటైజర్  వాడాలని సూచించారు.   రోజు రోజుకు కోవిడ్ కేసు లు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు.  పాఠశాలలు తెరుచుకున్నాయని, పిల్లలకు  కోవిడ్ సోక కుండా జాగ్రత్తలు  తీసుకోవాలని అన్నారు.  కోవిడ్ నియంత్రణ కు  ప్రజలంతా సహకరించాలని  విజ్ఞప్తి చేసారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి.కిషోర్ కుమార్, జే. వెంకట  రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  మైనారిటీ సంక్షేమ అధికారి అరుణ కుమారి , ముస్లిం సోదరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-19 16:03:45

వికలాంగులకు కృత్రిమ అవ‌య‌వాలు..

విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కృత్రిమ అవ‌య‌వాల‌ను పంపిణీ చేసేందుకు, ఈ నెల 23 నుంచి నియోజ‌వ‌ర్గాల వారీగా శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు మ‌రియు వ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ అధికారులు, కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల సహకారంతో కృత్రిమ అవయవాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలతో గురువారం వెబ్క్స్ మీటింగ్  నిర్వహించారు.   ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వారు అందించే కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ, పంపిణీ గురించి వివ‌రించారు. కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిప‌ర్ల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కృత్రిమ అవ‌య‌వాల‌ను త‌యారు చేసి, ఉచితంగా అంద‌జేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23, 25, 27 తేదీల్లో నియోజకవర్గాల వారీగా శిబిరాల‌ను ఏర్పాటు చేసి, కృత్రిమ అవ‌యవాల‌ను పంపిణీ చేసేందుకు, కొలతలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాల్లో దివ్యాంగులు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. 

కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం (ఏఎల్ఎంయు),  గురుదేవ ఛారిట‌బుల్ ట్ర‌స్టు, అసోసియేష‌న్ సాయి కొరియ‌న్ త‌దిత‌ర సంస్థలు కృత్రిమ అవయవాలను, కాలిపర్స్ పంపిణీ చేస్తాయని చెప్పారు. శారీరకంగా వికలాంగత్వం ఉన్నవారికి ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ శిబిరాల ఏర్పాటు గురించి గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి, ఎక్కువమంది వినియోగించుకొనేవిధంగా చూడాలని కోరారు.
      ఈ సమావేశంలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు నీలకంఠ ప్రధానో, వివిధ మండలాల ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-19 16:02:05

పరిసరాల పరిశుభ్రతతో దోమలు దూరం..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల నివారణ చేయాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎల్.రాం మోహన్ పిలుపు నిచ్చారు.  ఆగస్ట్ 20 న శాస్త్ర వేత్త, బ్రిటిష్  వైద్యాధికారి   సర్ రోనాల్డ్  రాష్ జన్మ దినం సందర్బంగా  అంతర్జాతీయ దోమల దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు.  గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా మలేరియా అధికారి డా.తులసి తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. అంతర్జాతీయ దోమల దినోత్సవం సందర్బంగా  ప్రతి పి.హెచ్.సి పరిధి లో ర్యాలీ లను నిర్వహించి గ్రామాల్లో దోమల నివారణ పై అవగాహన కల్పించడం జరుగుందన్నారు. దోమల వలన  కలిగే వ్యాధులు, వ్యాధి లక్షణకు, తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి వద్ద, పరిసరాల్లో, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని,  దోమలు లేకుండా చేయడమే కాక,  వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే తగు పరీక్షలు  చేయించుకోవాలని అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని,  దోమల పై అశ్రద్ధ పనికిరాదని అన్నారు.

Vizianagaram

2021-08-19 15:32:15

గ్రామసచివాలయ సేవలు వేగం పెరగాలి..

గ్రామ/వార్డు సచివాలయాల పనితీరు, అందుతున్న సేవలు మరింత పెరగాలని  రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయల ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కలెక్టర్లకు సూచించారు. గురువారం ఈ మేరకు సచివాలయల ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏ జిల్లాల్లో ఏ విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.  కాకినాడ కలెక్టర్  క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ/ వార్డు సచివాలయల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను  వివరించారు. సచివాలయం ద్వారా బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్ కార్డుల నిమిత్తం అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సి.హరికిరణ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కు వివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-19 15:21:53