1 ENS Live Breaking News

ఆదర్శమూర్తి ఆంధ్రకేసరి టంగుటూరి..

బారిస్టర్ చదువును అభ్యసించిన  అత్యంత మేధావి ఆంధ్ర కేసరి  టంగుటూరి  ప్రకాశం పంతులని,  నైతిక విలువలను ప్రాణంగా భావించే ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని విజయనగరం జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు.  ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు  జయంతి సందర్భంగా సోమవారం కలక్టరేట్  ఆడిటోరియం లో ఆయన చిత్ర పటానికి పూల మాలలను  వేసి ఘనంగా నివాళు లర్పించారు.  అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ  ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య  మంత్రిగా టంగుటూరి చరిత్ర లో నిలిచారని,  టంగుటూరి అత్మాభిమానం కలవారని, అవిశ్వాస తీర్మాణానికి నైతిక బాధ్యత వచించి పదవీ  త్యాగం చేసిన  గొప్ప వ్యక్తని పేర్కొన్నారు. నమ్మిన దానిని ఆచరించడం లో, నైతికంగా వ్యవహరించడం లో ఆయనకు  ఆయనే చాటియని అన్నారు. వారి   బాటలో  అందరం నడవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో  సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-23 11:09:38

ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలి..

పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.  ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డ్వామా, డిఆర్డిఎ పిడి లు హెచ్. కూర్మారావు, శాంతి శ్రీ అర్జీలను స్వీకరించారు.పోలాకి మండలానికి చెందిన సుశీల భూ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు తన అర్జీ  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులకు వచ్చే అర్జీలు మీ మీ స్థాయిలో పరిష్కారం అయ్యే అర్జీలను పరిష్కరించాలని, పరిధి లో లేనివి సంబంధిత మండలాలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.  శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీల సంఖ్య ను తెలియజేయాలన్నారు. ఏ వారం వచ్చిన అర్జీలను ఆ వారమే పరిష్కారానికి అవకాశం ఉన్న మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 266 అర్జీలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-08-23 09:20:40

టంగుటూరి భారత దేశానికే ఆదర్శం..

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి తరానికి స్పూర్తిదాయకని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కొనియాడారు. సోమవారం ఉదయం  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర వేడుకగా స్థానిక జడ్పి ఆఫీసు కూడలి వద్ద నున్న అమరజవాన్ ట్రయాంగిల్ లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిలా కలెక్టరు సి.హరికిరణ్, నగర మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ముఖ్య అతిధులుగాను, జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్ తేజ, జి.రాజకుమారి విశిష్ట అతిధులుగాను హాజరై ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు అలంకరించి, నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు, దేశ భక్తులు తమ నిస్వార్థ త్యాగాలతో  స్వేఛ్చా, స్వాతంత్య్రాలను మనకు అందించారని, వారి జీవితాలు, ఆశయాలు తరతరాలకు స్పూర్తి నిస్తాయని, అందుకే వారి జయంతి, వర్థంతులను ప్రభుత్వ కార్యక్రమాలుగా కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోందన్నారు.  టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయక చూపిన తెగువ, ప్రజా సేవలో తన సర్వస్వం అర్పించిన త్యాగనిరతి సమున్నత ఆదర్శాలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆయన జీవిత విశేషాలను నేటి తరం తప్పక తెలుసుకోవాలని కొరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ, సోషల్ వెల్పేర్ జెడి జె.రంగలక్ష్మీ దేవి, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి,  కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, స్థానిక కార్పొరేటర్ ఎస్.లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-23 07:41:40

ఆంధ్రకేసరి అందరికీ ఆదర్శ ప్రాయులు..

సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మద్రాసులో సైమన్ కమిషన్  వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఆగష్టు 23న కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురష్కరించుకొని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జరిగాయి.   ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  హాజరై  ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని గుర్తుచేసారు. 1940 – 50 దశకంలో ఆంధ్ర రాజకీయాల్లో క్రియశీలక పాత్రను పోషించడమే కాకుండా ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని అన్నారు. నిరుపేద కుటుంబంలో  పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప చారిత్రాత్మకమని కొనియాడారు. సైమన్ కమీషను వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికారన్నారు. 1928 మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదని,  ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో జరిగిన పోలీసులు కాల్పుల్లో కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా ముందుకు వెళ్లాడన్నారు. ఆయన ధైర్ఘ్య సాహసాలకు గుర్తుగా ఆంధ్రకేసరిగా పేరు పొందారని అన్నారు.  అలాగే  1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్లి విడుదలైన తదుపరి ప్రజలకు మరింత చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని తెలిపారు. ఆయన ఇచ్చిన స్పూర్తి , ఆశయసాధన అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-23 07:10:00

అప్పన్నకు అదనపు డీజీపీ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని అడిషనల్ డీజీపీ అశోక్ కుమార్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం  అడిషనల్ డీజీపీ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-23 06:29:43

గోశాలను సందర్శించిన డిఆర్ డిఓ చైర్మన్..

తిరుమలలోని టీటీడీ గోశాలను డిఆర్ డిఓ చైర్మన్  సతీష్ రెడ్డి ఆదివారం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలిసి సందర్శించారు.  గోశాలకు ఇటీవల దానంగా వచ్చిన గిర్ ఆవులు, దూడలను ఆయన చూశారు. వాటి పోషణ, పాల దిగుబడి వివరాలను టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు  శివకుమార్ వివరించారు. ఈవో మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నవనీత సేవ ప్రవేశపెడుతున్నామని వివరించారు. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైం కర్యాలకు ఉపయోగిస్తామన్నారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకుని వెళ్ళి అర్చకులకు అందిస్తారని ఈవో తెలిపారు. తిరుమలకు వచ్చే యాత్రికులు గోసేవ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారు. గోశాలలో నూతనంగా నిర్మిస్తున్న పొయ్యిలు, పాలు కాచి పెరుగు, దాని నుంచి వెన్న తీసే విధానాన్ని ఆయన తెలియజేశారు.  శ్రీవారి కైంకర్యాలకు అవసరమయ్యే నూనె కూడా తయారు చేసేందుకు గానుగ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, గోసంరక్షణ శాల అధికారి డాక్టర్ నాగరాజు, డిప్యూటి ఈవో  లోకనాథం, విజివో  బాలిరెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2021-08-22 15:56:05

చింతపల్లి బీచ్ రిసార్ట్స్ అభివృద్ధికి చర్యలు..

విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలం చింతపల్లి లో బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి కి  ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   పర్యాటక శాఖ అధికారులని ఆదేశించారు. ఆదివారం  కలెక్టర్ తీర ప్రాంతాలైన  కోనాడ, తిప్పలవలస, బిజిపేట, చింతలవలస లో పర్యటించి  రిసార్ట్స్ ను సందర్శించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ చింతపల్లి రిసార్ట్స్  ఆధునీకరణకు త్వరగా ఒక  కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసి పంపాలన్నారు.  బిజిపేట, తిప్పలవలస  మత్స్యకార నాయకులు కలెక్టర్ ను కలసి  ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ స్థానిక శాసన సభ్యులు తో మాట్లాడి తగు నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని అన్నారు.  ఈ పర్యటనలో  తహసీల్దార్  కృష్ణ మూర్తి,  ఏ.పి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్  ప్రతినిధులు శుభ్రమణ్యం,  మత్స్యకార నాయకులు  చిన్నప్పన్న , స్థానిక  మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-22 15:32:50

రేపు ఆంధ్రకేసరి టంగుటూరి జయంతి..

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆగష్టు 23 సోమవారం నాడు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్  ఏ. సూర్యకుమారి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి కార్యాలయాల్లో సోమవారం టంగుటూరి జయంతి వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు జరుపుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10-30 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని అధికారులు, వారి సిబ్బంది హాజరు కావాలని పేర్కొన్నారు.

Vizianagaram

2021-08-22 15:27:48

రోడ్డు పనులను సత్వరమే పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఛాంబరులో జిల్లాలోని రోడ్డు పనులపై శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో RWS శాఖ ప్రతిపాదించిన 19 రోడ్లలో 13 రోడ్లకు ఆమోదించడం జరిగిందన్నారు. ఆ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన 6 రోడ్లకు సర్వే చేసి అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న 3 రోడ్లలో 1 రోడ్డు ఆమోదించడం జరిగిందని, మిగిలిన 2 రోడ్లకు కూడా సర్వే చేసి అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్,  జిల్లా అటవీశాఖాధికారి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:11:32

గ్రామ పరిపాలన కోసమే సచివాలయాలు..

ప్రజలకు పారదర్శకంగా పాలన అందాలంటే గ్రామ పరిపాలనా విభాగం అభివృద్ధి చెందాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి డా. సీదిరి అప్పలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సత్వరమే అందుకోవడంతో పాటు ప్రజా పరిపాలనా విభాగం మెరుగుపరిచేందుకు సచివాలయాలు ఉపయోగపడతాయని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో గ్రామ పరిపాలన జరిగితే గ్రామ స్వరాజ్యం ఏర్పాటుచేసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని గుర్తుచేసారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసారని తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా  ప్రజా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని తెలిపారు. వ్యవస్థల్లో ఉన్న లోపాలతో ప్రజలపై భారం పడకూడదని, ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి తక్షణమే లబ్ధిదారునికి అందేలా చూసే బాధ్యత సచివాలయ వ్యవస్థ చూసుకుంటుందని అన్నారు. సచివాలయాలు అన్ని గ్రామ అభివృద్దికి దేవాలయాలు అని అన్నారు. ప్రజా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా నారాయణపురంలో సచివాలయంకు నూతన భవనం ప్రారంభించుకుంటున్నమని అన్నారు.

 వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరుగాలం కష్టపడే రైతుకు  భరోసాగా ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు.  రైతుకు నిత్యం తోడుగా ఉండాలని రైతు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి భాటలు వేస్తున్న రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ది జరగాలని కోరుకుంటున్నామని, ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రతి సచివాలయం వద్ద ప్రజా ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేసారు. అందులో భాగంగా ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వైద్యం అందని గ్రామాలకు నేడు సచివాలయాల చెంతనే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మందస మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:10:37

ఏకలవ్య పాఠశాలలు త్వరగా పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న ఏకలవ్య పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ­పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం సీతంపేట ఐ.టి.డి.ఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకలవ్య టీచర్ల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడ్జెట్ నిధులు విడుదల కోసం డైరెక్టర్ కు లెటర్ రాయాలని కలెక్టర్ సూచించారు. తొలుత ఏకలవ్య పాఠశాలల తరగతులు జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న ఆయన ఉపాధ్యాయులకు అవసరమయ్యే శిక్షణను ఇప్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రతినిధులు వారి పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మిపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్, ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సర్వ శిక్షా అభియాన్ ప్రోజెక్ట్ అధికారి యస్.తిరుమల చైతన్య, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆచార్య బిడ్డిక అడ్డయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, ఐ.టి.డి.ఎ ఓ.ఎస్.డి యుగంధర్, ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాసులు, వి.సుబ్రమణ్యం, గురుకులం సెల్ ఇన్ ఛార్జ్ వెంకటేశ్వర్లు, కమిటీ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:04:06

సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి..

శ్రీకాకుళం ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలు ధరించడం సాంప్రదాయంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ పొందూరు ఖాదీ జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిందని అయినప్పటికీ ఖాదీ, చేనేతకారుల ఆర్థిక స్థితి గతులు అనుకున్న స్థాయిలో ఉండడం లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ, చేనేత కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించి వారి జీవన పరిస్థితులు మెరుగుకావడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న కార్మికులకు ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల క్రింద చేయూతను ఇస్తున్నాయని ఆయన తెలియజేస్తూ జిల్లాలో చేనేత కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలను ధరించి ఖాదీ, చేనేత కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Srikakulam

2021-08-21 16:16:29

అర్హులందరికీ పథకాలు అమలు చేయాలి..

అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అంద‌జేయడం ద్వారా, వాటి ల‌క్ష్య సాధ‌న‌కు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు.  జిల్లా అవ‌స‌రాలు, స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా యూనిట్ల‌ను రూపొందించి, వాటిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  వైఎస్ఆర్ క్రాంతిప‌థం, డిఆర్‌డిఏ, మెప్మా కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల ప‌రంగా అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను,  జిల్లాలో వాటి ప్ర‌గ‌తిని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు వివ‌రించారు. వైకెపి, డిఆర్‌డిఏ ద్వారా వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ బీమా, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ ఆస‌రా, సున్నా వ‌డ్డీ, వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక‌, నైపుణ్య శిక్ష‌ణ‌, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్న‌తి త‌దిత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. మెప్మా ద్వారా అమ‌లు జ‌రుగుతున్న‌ వైఎస్ఆర్ బీమా, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ ఆస‌రా, స్వానిధి, ఉపాధి క‌ల్ప‌నా ప‌థ‌కాలు, టిట్కో హౌసింగ్‌, క్లాప్ త‌దిత‌ర ప‌థ‌కాల‌ను ప్ర‌గ‌తిని వివ‌రించారు. కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డంతోపాటుగా, డిజిట‌ల్ ఎక‌నాల‌డ్జ‌మెంట్ త‌ప్ప‌నిస‌రి చేశామ‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, జిల్లాలోని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని సూచించారు. ఆయా ప్రాంతాల సామాజిక అవ‌స‌రాలు, భౌగోలిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. పేద‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించి, వాటిని అట్ట‌డుగు స్థాయికి అందేలా చూడాల‌న్నారు. పథ‌కాల‌కు ఎంపిక చేసిన ల‌బ్దిదారుల జాబితాల‌ను ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. 

వివిధ ప‌థ‌కాల ద్వారా రుణాల‌ను అందించ‌డంతోపాటుగా, వాటి రిక‌వ‌రీపైనా దృష్టి పెట్టాల‌ని సూచించారు. రిక‌వ‌రీ విష‌యంలో భోగాపురం, చీపురుప‌ల్లి, గుర్ల మండ‌లాలు వెనుక‌బ‌డి ఉండ‌టంపై ఆరా తీశారు.  సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించి, ప‌థ‌కాల అమ‌లును ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. బీమా ప‌థ‌కాన్ని పేద‌లంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం ద్వారా, వారి జీవితాల‌కు భ‌రోసా ల‌భిస్తుంద‌న్నారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ప్ర‌గ‌తి త‌క్కువ‌గా ఉంద‌ని, వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. ఈ నెలాఖ‌రునాటికి ఈకెవైసి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని, నైపుణ్య శిక్ష‌ణ జ‌ర‌గాల‌న్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతంలో గృహ నిర్మాణ కార్య‌క్ర‌మం భారీ స్థాయిలో జ‌రుగుతోంద‌ని, అందువ‌ల్ల హౌసింగ్ లోన్స్‌పై దృష్టి పెట్టాల‌ని, ముఖ్యంగా గుంకలాం లేఅవుట్ ల‌బ్దిదారుల‌కు రుణాల‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఈ స‌మీక్షా స‌మావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్టు డైరెక్ట‌ర్ అశోక్‌కుమార్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్ సుధాక‌ర రావు, డిఆర్‌డిఏ ఏపిడి సావిత్రి, డిపిఎంలు, టిపిఎంలు, ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, ఏపిఎంలు, సిసిలు, సిఎంఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-21 15:36:18

18ఏళ్లు దాటినవారందరికీ కోవిడ్ టీకా..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 18 ఏళ్లు దాటిన‌వారంద‌కీ కోవిడ్ వేక్సిన్ వేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకొని, వేక్సిన్ వేయించుకోవాల‌ని కోరారు. జిల్లాలో జ‌రుగుతున్న కోవిడ్ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై త‌న ఛాంబ‌ర్‌లో శ‌నివారం స‌మీక్షించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ కోవిడ్ వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన‌ట్లు క‌లెక్ట‌ర్ చెప్పారు. సోమ‌వారం నుంచి ఈ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేస్తున్నామ‌ని, ప్ర‌తీఒక్క‌రూ దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇప్పటికే జిల్లాలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 వేక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వీటిలోని 26 కేంద్రాల్లో ప్ర‌త్యేకంగా కో-వేగ్జిన్ వేస్తార‌ని, మొత్తం 80 కేంద్రాల్లోనూ కోవిషీల్డ్ వేక్సిన్ వేస్తార‌ని  చెప్పారు. అన్ని పిహెచ్‌సిలు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌లో వేక్సినేష‌న్ జ‌రుగుతుంద‌న్నారు. వివిధ రంగాల వారీగా కూడా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈనెల 24న, 18 ఏళ్లు దాటిన‌ బిసి  కాలేజ్ హాస్ట‌ల్ విద్యార్థుల‌కు, హాస్ట‌ల్‌ సిబ్బందికి వేక్సినేష‌న్ ఏర్పాటు చేశామ‌న్నారు. అలాగే హొట‌ల్స్ అసోసియేష‌న్ ద్వారా, హొట‌ల్ సిబ్బందికి, సివిల్ స‌ప్లయిస్ కార్పొరేష‌న్ ద్వారా ఆ సంస్థ‌ సిబ్బందికి, వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా వేక్సినేష‌న్ నిర్వ‌హిస్తామ‌న్నారు.
     
           జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు సుమారుగా 9,74,091 మందికి మొద‌టి డోసును, 2,32,226 మందికి రెండో డోసును వేక్సిన్ వేశామ‌ని చెప్పారు. హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు శ‌త‌శాతం వేక్సినేష‌న్ జ‌రిగింద‌న్నారు. పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లుల‌కు శ‌త‌శాతం, గ‌ర్భిణిల‌కు సుమారు 75శాతం వేక్సినేష‌న్ పూర్తిచేసిన‌ట్లు చెప్పారు. వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములై, జిల్లాలో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ స‌మావేశంలో డిఐఓ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, డిబిసిడ‌బ్ల్యూఓ కీర్తి, ఎన్ఐసి అధికారి న‌రేంద్ర‌,  ప‌లువురు డాక్ట‌ర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-21 15:32:30

ఆ ప్రాంతంలో అంత వర్షపాతమా..వామ్మో

తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడులో 106.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. అతితక్కువగా కూనవరంలో 0.2 మిల్లీమీటర్లు నమోదు కాగా రాజమండ్రి డివిజన్ లో అత్యధికంగా గోకవరం 78.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏడు డివిజన్లలో రమారమి 0.05 మిల్లీ మీటర్లు నుంచి 56 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 21.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టుగా కలెక్టర్ కార్యాయం పేర్కొంది..

Kakinada

2021-08-20 12:12:28