1 ENS Live Breaking News

డిసెంబరుకి హెల్త్ క్లినిక్ లు పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణంలో వున్న వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌లు, అర్బ‌న్ క్లినిక్ ల నిర్మాణాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేసి అంద‌జేయాల్సి వుంటుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఎం.డి. డి.ముర‌ళీధ‌ర్ రెడ్డి చెప్పారు. ఈ క్లినిక్‌లలో ప‌నిచేసేందుకు సిబ్బంది నియామ‌క ప్రక్రియ‌ను ఇప్పటికే కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ ప్రారంభించార‌ని, డిసెంబ‌రు నాటికి ఈ సిబ్బంది అంతా ఆయా ఆసుప‌త్రుల్లో చేర‌తార‌ని, అప్పటిక‌ల్లా ఈ భ‌వ‌నాలు పూర్తిచేయాల్సి వుంటుంద‌న్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా ప్రజ‌ల‌కు గ్రామాల్లోనే వైద్య సౌక‌ర్యాలు ఏర్పడ‌తాయ‌ని, గ్రామంలోని క్లినిక్‌లో ఏవిధ‌మైన వైద్య స‌దుపాయాలు అందుబాటులో వున్నాయో అవ‌గాహ‌న క‌ల్పిస్తే వారు వైద్యం కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా త‌మకు స‌మీపంలోని వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల‌లో స‌దుపాయాల‌ను వినియోగించుకుంటార‌ని చెప్పారు. జిల్లా ప‌ర్యట‌నకోసం శుక్రవారం న‌గ‌రానికి వ‌చ్చిన ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. మేనేజింగ్ డైర‌క్టర్ ముర‌ళీధ‌ర్ రెడ్డి క‌లెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఆసుప‌త్రుల నిర్మాణం ప‌నులు, ఆసుప‌త్రుల్లో నాడు - నేడు, ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య ప‌రికరాలు, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ నిర్వహ‌ణ‌కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఇంజ‌నీర్లతో స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల నిర్మాణం పూర్తయిన వెంట‌నే ఆయా భ‌వ‌నాల‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అప్పగించాల‌ని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి., రోడ్లు భ‌వ‌నాలు, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్‌, పి.ఆర్‌.ఇంజ‌నీరింగ్ విభాగాల‌ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణం పూర్తయిన త‌ర్వాత వాటికి అవ‌స‌ర‌మైన చిన్నచిన్న ప‌నుల‌ను స్థానిక సంస్థల నిధుల నుంచే చేప‌ట్టాలని స్పష్టంచేశారు. క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు, పి.హెచ్‌.సి.లు, వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌ల‌కు సంస్థ సూచించిన రంగుల‌నే వేయాల‌ని, ఎక్కడా మార్పులు చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టంచేశారు. ఆయా భ‌వ‌నాలు చూడ‌గానే ఆసుప‌త్రుల‌నే అంశాన్ని ప్రజ‌లు గుర్తించే విధంగా రంగులు వేయాల‌న్నారు. నాడు - నేడులో ఆధునీక‌రిస్తున్న‌ అన్ని ఆసుప‌త్రుల వ‌ద్ద గ‌తంలో ఆ భ‌వ‌నాలు ఎలా వుండేవి, ఇప్పుడెలా వున్నాయ‌నే ఫోటోల‌తో బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంకోసం నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ నుంచి నిధులు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

కోవిడ్ సంద‌ర్భంగా జిల్లాలోని సి.హెచ్‌.సి.లు, ఏరియా ఆసుప‌త్రులు, జిల్లా ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల నిర్వహ‌ణ‌ను ఆయా ఆసుప‌త్రుల అభివృద్ధి నిధుల నుంచే చేప‌ట్టాల్సి వుంటుంద‌న్నారు. 30 ప‌డ‌క‌ల కంటే అధికంగా బెడ్లు వున్న పి.హెచ్‌.సి.లు, సిహెచ్‌సిల‌కు త‌మ సంస్థ ద్వారా డీజిల్ జ‌న‌రేట‌ర్ సెట్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా నియంత్రణ‌కు ట్రాన్స్ ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్యవ‌స్థలు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ స‌ర‌ఫ‌రా కార‌ణంగా ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా పాత విద్యుత్ స‌ర‌ఫ‌రా లైన్లను మార్పు చేయాల‌ని ఎం.డి. సూచించారు. ఆయా ఆక్సిజ‌న్ ప్లాంట్‌లు ఏజెన్సీల ద్వారా ఏర్పాట‌య్యాక అవి ప‌నిచేస్తున్నట్టు సంబంధిత ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్ లేదా మెడిక‌ల్ ఆఫీస‌ర్ లు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు.

జిల్లాలో ఆసుప‌త్రుల్లో నాడు - నేడు కింద ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ ప‌నులు, కొత్త ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణంపై ఆ సంస్థ కార్యనిర్వాహ‌క ఇంజ‌నీర్ స‌త్యప్రభాక‌ర్ ఎం.డి.కి ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా వివ‌రించారు. జిల్లాలో 9 ఆసుప‌త్రుల్లో 81 ఐ.సి.యు., 338 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు రూ.3.18 కోట్ల‌తో ఆక్సిజ‌న్ పైప్‌లైన్ ల ఏర్పాటుకు ప్రతిపాదించామ‌ని, వీటిలో ఇప్పటివ‌ర‌కు 51 ఐ.సి.యు, 213 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు క‌ల‌సి మొత్తం 264 ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఏర్పాటు చేశామ‌న్నారు. 9 ప‌నుల్లో 7  ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రో రెండు ప‌నులు ప్రారంభం కావ‌ల‌సి వుంద‌ని చెప్పారు. మూడు ఆసుప‌త్రుల్లో పి.ఎస్‌.ఏ. ప్లాంట్‌లు, ఒక చోట ఆర్‌.టి.పి.సి.ఆర్‌. ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క‌మ్యూనిటీ ఆసుప‌త్రులు, ఏరియా ఆసుప‌త్రుల్లో న‌బార్డు నిధుల‌తో 8 ప‌నులు రూ.58.10 కోట్ల ఒప్పంద విలువ‌తో న‌బార్డు నిధుల‌తో చేప‌ట్టామ‌ని, ఈ ప‌నుల‌న్నీ కొన‌సాగుతున్నట్టు వివ‌రించారు. ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం ముళ్ల కంప‌లు తొల‌గించే ప‌నులు జ‌రుగుతున్నట్టు పేర్కొన్నారు. పి.హెచ్‌.సి.ల అప్ గ్రెడేష‌న్ కింద 68 ప‌నుల‌ను రూ.48.24 కోట్లతో చేప‌ట్టామ‌ని వివ‌రించారు. కొత్తగా మ‌రో 12 పి.హెచ్‌.సిల ప‌నులు రూ.2.17 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు. ఆసుప‌త్రుల్లో మ‌ర‌మ్మత్తుల‌కు సంబంధించి 56 ప‌నుల‌ను రూ.26.48 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు.

అంత‌కుముందు ఎం.డి. ముర‌ళీధ‌ర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని గాజుల‌రేగ వ‌ద్ద ప్రభుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ ప్రాంతాన్ని జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ తో క‌ల‌సి ప‌రిశీలించారు. ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. అధికారులు ఎస్.ఇ. శివ‌కుమార్‌, ఇ.ఇ. స‌త్యప్రభాక‌ర్ త‌దిత‌రులు నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లను వివ‌రించారు. క‌లెక్టరేట్ స‌మావేశంలో జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.సీతారామ‌రాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి, రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఎస్‌.ఇ. విజ‌య‌శ్రీ‌, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ ఎస్‌.ఇ. శ్రీ‌నివాస‌రావు, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్‌.వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 13:56:55

ఏడువేల డోసుల పీసీవీ వేక్సిన్లు జిల్లాలో సిద్ధం..

న్యుమోనియా నుంచి చిన్న పిల్లలను రక్షించడానికి  న్యుమోకోకల్ కాంజుగేట్ టీకా (PCV) యూనిర్సల్ ఇమ్యునైజెషన్ ప్రోగ్రాం కు సంబందించి  చిన్నారులకు వేసేందుకు 7 వేల డోస్ లు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  వైద్యాధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.  గ్రామీణ, పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత మండలాలలో మలేరియా,  డెంగ్యూ కేసుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి  పెట్టాలన్నారు. 27 మండలాలలో మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.  ఆయా ప్రాంతాలలో  యాంటీ మలేరియా ఆపరేషన్ లను నిర్వహించడం, ఫాగింగ్ చేయడం,  మురికి నీరు, నిల్వనీరు లేకుండా ఆయా పంచాయితీలలో పారిశుధ్యాన్ని  ప్రత్యేకంగా చేయాలన్నారు.  ఆయా ప్రదేశాలలో  ఆయిల్ బాల్స్ వేయడం తో పాటు మాపింగ్ చేయాలన్నారు.  ఇందుకు సంబందించి మలేరియా సిబ్బందితో  పాటు సర్పంచ్ లు  ప్రత్యేక శ్రద్ద కనపర్చాలన్నారు.  డాక్టర్లు సంబందిత సచివాలాయలకు తనిఖీలు చేయాలని ఫీవర్ కేసులు గుర్తిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయడం  టెస్ట్ చేసిన రిపోర్టులను డి. ఎం. హెచ్ .ఓ కార్యాలయానికి పంపించి ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలన్నారు.  ఏ వ్యక్తి కూడా మలేరియా డెంగ్యూ జ్వరాలకు చనిపోకుండా మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంచడం, ప్రసార మాధ్యమాల  ద్వారా విసృత ప్రచారం చేయాలన్నారు. జ్వరాల సీజన్ మొదలవక ముందే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరైయారు.

Visakhapatnam

2021-08-27 13:40:04

ప్రత్యేక కోవిడ్ డ్రైవ్ విజయవంతం కావాలి..

విశాఖ జిల్లా, నగరంలో ఈ నెల 28,31, తేదీలలో  18-44 సంవత్సరాల వయస్సుగల ప్రతి ఒక్కరికి ప్రత్యేక  కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద  జిల్లా వ్యాప్తంగా  అన్ని పి.హెచ్.సి., సి.హెచ్.సిలలో మొదటి  డోస్ ప్రక్రియ శాచ్యురేషన్ మోడ్ లో నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులను ఆదేశించారు.  శుక్రవారం వి.ఎం .ఆర్ .డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో   జిల్లా స్థాయి వైద్యాధికారులు సమావేశాన్ని నిర్వహించారు.  
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్తర్వలను జారీ చేసిందన్నారు. జిల్లాలో 18-44 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ కు  1లక్ష 60వేల వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులో ఉన్నాయన్నారు.  గ్రామీణ మరియు పట్టణ సచివాలయ పరిధిలో సిబ్బంది ప్రత్యక శ్రద్ద వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.  నేడు శుక్రవారం 45 సంవత్సరాలు పై బడిన వారికి  2వ డోస్ వేయాలన్నారు.  3rd వేవ్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక వసతుల కల్పన, బెడ్స్, అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లలను సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటు గత నెలలో 2.4 శాతం నమోధైందన్నారు.  ఒక్క డెత్ కూడా రాకుండా చూడాలన్నారు.  ప్రతి ఒక్కరూ ఎస్.ఎం.ఎస్. ప్రోటోకాల్ నిబంధనలను పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఉల్లంషిుంచిన వారిపై పోలీసు ఫైన్ వేయాలన్నారు.
ఏజెన్సీ మండలాలలో ప్రజలు దోమ తెరలను సక్రమంగా వాడుకొనే విదంగా అవగాహన కల్పించాలన్నారు. పాడేరు, అరుకు ప్రాంతీయ ఆసుపత్రులలో  సర్జరీల నిర్వాహణకు సంబందించి మౌళిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఐ.టి.డి.ఎ., పిఓ రోణంకి గోపాలకృష్ణకు సూచించారు . పి.హెచ్.సి.లలో డెలివరీ కేసులను వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ కింద నమోదు చేయాలన్నారు.  తల్లి సురక్షా పథకం కింద  పేషెంటు డేటాను ఆరోగ్య మిత్రలో  లాగిన్ చేసి కేస్షీట్, డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలన్నారు.  వై.ఎస్.ఆర్.ఆరోగ్య ఆసరా కింద  పోస్టు డిస్చార్జ్ పేషెంటుకు  ఇన్ సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ అప్లోడ్ కు సంబందించి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.  సీజనల్ వ్యాధులకు సంబందించి నెలలో ఒక సారి వైద్యాధికారులకు వెబ్ నార్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఎ.ఎం.సి ప్రిన్సిపాల్  డా. సుధాకర్ కు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  నిర్వహించే స్పందన  వీడియో కాన్పరెన్స్ లో వైద్య, ఆరోగ్యానికి  అధిక ప్రాముఖ్యత కల్పిస్తున్నారని  రానున్న 90 రోజుల్లో  వైద్య శాఖలో  ఉన్న ఖాళీలను  భర్తీ  చేయనున్నారని  ఖాళీల వివరాల డేటా ను  ప్రభుత్వానికి  పంపించాలని  డి .ఎం .హెచ్.ఓ ను ఆదేశించారు.
 
జి.వి.ఎం.సి కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ  జి.వి.ఎం.సి పరిధిలో మలేరియా హట్ స్పాట్ ఏరియాలను గుర్తించి  నిల్వనీరు లేకుండా ఇంటి పరిసరాలలో పారిశుధ్యం నిర్వహించడం తో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించడం జరుగుతుందని  తెలిపారు.  ప్లేట్ లెట్స్ అవసరం అవుతున్నందున బ్లెడ్ డోనేషన్ క్యాంపులను  నిర్వహించడానికి వైద్యాధికారులు   ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ  పి.హెచ్.సిలను తనిఖీలు చేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ రాగానే ఏజెన్సీకి పంపించడం జరుగు తుందన్నారు.  వైద్యాధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. 

ఐ.టి.డి.ఎ. పిఓ రోణంకి  గోపాలకృష్ణ మాట్లాడుతూ  ఏజెన్సీ ఏరియాలో  2లక్షల 10వేల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లను వేయడం జరిగిందన్నారు.  3RD  వేవ్ దృష్టిలో పెట్టుకొని  అన్ని పి.హెచ్.సిలలో  బెడ్స్, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ లను సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు.  ఆసుపత్రులలో సర్జరీల ఏర్పాటు కు సంబందించి పనులను  ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు.  ఏజెన్సీ ఆసుపత్రులలో పని చేయుటకు కాంట్రాక్ట్ బేసిస్ మీద  పి జి. డాక్టర్లు పీడియాట్రీషియన్స్, ఎనస్తిషియన్ ,గైనిక్ డాక్టర్లకు  ప్రత్యే ఎలవెన్స్ తో  భర్తీ చేయడానికి నోటిఫికేషన్  ఇవ్వనున్నామన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరయ్యారు.

విశాఖ సిటీ

2021-08-27 13:38:54

శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ..

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు. ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 7.30 గంట‌ల‌కు మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. ఉద‌యం 8 నుండి 8.20 గంట‌ల మ‌ధ్య క‌న్యాల‌గ్నంలో  శ్రీ వేణుగోపాల‌ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభార్చన, మ‌హా సంప్రోక్ష‌ణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జ‌రిగాయి.  ఉద‌యం 10.30 గంట‌ల నుండి  భక్తులను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.        సాయంత్రం 4.30 నుండి  6 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు క‌ల్యాణోత్స‌వం, రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఊరేగింపు నిర్వ‌హిస్తారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో   పార్వ‌తి, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్య‌, ఏఈవో  దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్  ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  కుమార్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.  

కార్వేటినగరం

2021-08-27 13:32:50

సంప్ర‌దాయ భోజ‌నాన్ని స్వీక‌రించిన ఈవో..

గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో వండిన సంప్ర‌దాయ భోజ‌నాన్ని శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వీక‌రించారు. తిరుమ‌ల అన్న‌మయ్య భ‌వ‌నం క్యాంటీన్‌లో టిటిడి గురువారం నుండి వారం రోజుల పాటు సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాత‌ల స‌హకారంతో తిరుమ‌లలో సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తులతో త‌యారుచేసిన ఆహారాన్ని భుజించ‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, క‌రోనా స‌మ‌యంలో శాస్త్రవేత్త‌లు కూడా ఇలాంటి ఆహారంపై చ‌ర్చిస్తున్నార‌ని తెలిపారు. ప‌ట్ట‌ణ‌వాసుల‌తో పోల్చుకుంటే గ్రామాల్లో స‌హ‌జసిద్ధంగా ల‌భించే ఆహారం తీసుకునే వారికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపడం, గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా గోమాత‌ను ర‌క్షించుకోవ‌డం టిటిడి ముఖ్య ఉద్దేశాల‌ని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వ‌త ప్రాతిప‌దికన దీన్ని అమ‌లుచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. ఈవో వెంట టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈఓ  హరీంద్రనాథ్, బోర్డు మాజీ సభ్యులు  శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-27 13:29:58

నవనీత సేవ ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌..

శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను శుక్ర‌వారం నాడు తిరుమ‌ల‌లోని గోశాల‌లో టిటిడి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం, శంఖునాదంతో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అనంత‌రం శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి పూజ‌లు చేశారు. నాలుగు కుండ‌ల్లో పెరుగు నింపి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌వ్వాల‌తో చిలికారు.  కాగా, ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌, లోక‌నాథం, టిటిడి బోర్డు మాజీ సభ్యులు  శివకుమార్, దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు  విజ‌య‌రామ్, చిరుధాన్యాల ఆహార నిపుణులు  రాంబాబు, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-27 13:28:30

క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేయాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని విభాగాలకు చెందిన స‌మ‌స్త స‌మాచారాన్ని అవ‌గాహ‌న చేసుకోవాల‌ని జెఈవో స‌దా భార్గ‌వి సూచించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచేలా కృషి చేయాల‌న్నారు. కొత్తగా నియ‌మితులైన ఏఈవోల‌కు వారం రోజుల‌పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. సూప‌రింటెండెంట్లుగా ప‌ని చేస్తూ ఏఈవోలుగా ప‌దోన్న‌తి పొందిన 11 మందికి శుక్ర‌వారం సాయంత్రం నియామ‌క ఉత్త‌ర్వులు అందించారు. ఈ సంద‌ర్బంగా ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో జెఈవో వారితో స‌మావేశ‌మ‌య్యారు. జెఈవో మాట్లాడుతూ, విధి నిర్వ‌హ‌ణ‌లో నైపుణ్యం ప్ర‌ద‌ర్శించి, అప్ప‌గించిన ప‌నులు నిర్ణీత‌ వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌న్నారు. ఉద్యోగులు స‌మయానికి కార్యాల‌యాల‌కు వ‌చ్చేలా చూసుకోవాల‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తి రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి కార్యాల‌యాల‌కు రావాల‌న్నారు.  ముఖ్య‌మైన ఫైళ్ళు కంప్యూట‌ర్‌తో పాటు రిజిస్ట‌ర్ రూపంలో కూడా భ‌ద్ర ప‌రుచుకోవాల‌ని అన్నారు.  ఉద్యోగులకు రావ‌ల‌సిన అన్ని ర‌కాల మొత్తాల‌ను రిటైర్‌మెంట్ రోజే చెక్కు ద్వారా అందించే ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద్యోగి రిటైర్డ్ కావ‌డానికి ఆరు నెల‌ల ముందు నుంచే ఏఈవోలు ఈ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని చెప్పారు. కారుణ్య నియ‌మ‌కాల విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకుని మ‌ర‌ణించిన‌ ఉద్యోగి  కుటుంబీకుల నుంచి 11 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు స్వీక‌రించి 30 రోజుల్లోపు ఉద్యోగం వ‌చ్చేలా చూడాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి పాల్గొన్నారు.

Tirupati

2021-08-27 13:25:59

అవ్వా మీకు పథకాలు అందుతున్నాయా..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు.శుక్రవారం కాకినాడ 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారం కృష్ణుడి గుడి వద్ద జేసీ లక్ష్మీశ.. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరు శుక్రవారం, శనివారాలలో "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో గల ప్రతి వార్డు సచివాలయ పరిధిలోగల ప్రతి ఇంటిని సంబంధిత సచివాలయ కార్యదర్శి, వాలంటీర్లు సందర్శించి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు, ప్రభుత్వం అందించే వివిధ సేవలుపై  ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరుతో పాటు ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం ద్వారా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ఒక గ్రూపుగా ఏర్పడి సచివాలయం, వాలంటీర్ల పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అందిస్తున్న సేవల వివరాలు తెలియపరచడం  జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడంతో సంక్షేమ పథకాలు అమలులో ఎదురవుతున్న అవరోధాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని స్థానిక సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గడప వద్దకు వెళ్లి విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ లక్ష్మీశ తెలిపారు.  కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సిటిజన్ ఔట్రీచ్  కార్యక్రమాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత జేసీ, కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2021-22 , వార్డు సచివాలయ సిబ్బంది వివరాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి, గృహాల వద్దకు వెళ్లి ప్రజలతో ప్రభుత్వం అందిస్తున్న సేవల వివరాలను ఈ సందర్భంగా తెలియజేసి, వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాద్, అదనపు కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కార్పొరేటర్లు గోడి సత్యవతి, జేడీ పవన్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-27 13:23:02

జిల్లాలో తాత్కాలికంగా పునరుద్ద‌ర‌ణ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్వ‌తీపురం-శ్రీ‌కాకుళం ప్ర‌ధాన ర‌హ‌దారిపై తోట‌ప‌ల్లి కుడికాల్వ‌పై క‌ల్వ‌ర్టుకు పెద్ద గుంత‌లు ఏర్ప‌డి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డిన నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశాల మేర‌కు జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు బుధ‌వారం యుద్ద‌ప్రాతిప‌దిక‌న మర‌మ్మ‌త్తులు చేప‌ట్టి సాయంత్రానికి తాత్కాలికంగా పున‌రుద్ద‌రించారు. రోడ్లు భ‌వ‌నాల శాఖ ఆధ్వ‌ర్యంలో ఉన్న ఈ రోడ్డుపై ఉల్లిభ‌ద్ర క‌ల్వ‌ర్టుకు పెద్ద గుంత‌లు ఏర్ప‌డ‌టంతో ట్రాఫిక్ నిలిచిపోయిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఆ రోడ్డును త‌క్ష‌ణం పున‌రుద్ద‌రించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన తోట‌ప‌ల్లి ప్రాజెక్టు అధికారులు ఆర్ అండ్ బి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని జెసిబి త‌దిత‌ర యంత్రాల‌ను వినియోగించి రోడ్డుపై ఏర్ప‌డిన గుంత‌ల‌ను తాత్కాలికంగా పూడ్చి రాక‌పోక‌ల‌కు వీలుగా ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారి ఏర్పాటు చేశారు. సాయంత్రం క‌ల్లా ఈ మార్గంలో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి రాక‌పోక‌లను పున‌రుద్ద‌రించ‌డం జ‌రిగింద‌ని తోట‌ప‌ల్లి ఎస్‌.ఇ. సుగుణాక‌ర్ రావు తెలిపారు.

Vizianagaram

2021-08-25 15:52:11

ఒంటిమిట్ట కోదండ సీతమ్మవారికి హారం..

కడపజిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలోని శ్రీ సీత‌మ్మ‌వారికి క‌ర్నూల్‌కు చెందిన  సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుక‌గా స‌మ‌ర్పించారు. దానికి ఆలయ ఈఓకి అందజేశారు. శ్రీ సీతమ్మవారికి కానుక ఇవ్వాలని ముందుగా అనుకున్నామని దానిని ఇపుడు సమర్పించామని దాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Ontimitta

2021-08-25 14:13:04

ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలి..

ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కోవిడ్-19 వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, వై.ఎస్.ఆర్ (అర్బన్ హెల్త్) క్లినిక్ లు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, అగ్రికల్చర్ ఖరీఫ్ ఈ క్రాప్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు,  భూరక్ష పథకం భూ సర్వే తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పక్కాగా జరగాలని, కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలన్నారు. సరఫరా చేస్తున్న తాగునీరు  పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.   గ్రామ సచివాలయాల భవనాలు, గ్రామంలో ఇంగ్లీషు మీడియం స్కూల్, ఆర్బికె, డిజిటల్ లైబ్రరీ, ఎఎంసి, బిఎంసి, తదితర వాటిద్వారా గ్రామాలు రూపురేఖలు మారాలని చెప్పారు. సచివాలయాల భవనాలు నిర్మాణాలపై దృష్టి సారించాలని, అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల పైన ప్రత్యేక దృష్టి సారించి డిశంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

బల్క్ మిల్క్ మొదటి దశలో భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్మాణాలు పూర్తి చేసి రెవెన్యూ గ్రామాల్లో 31 డిశంబరు నాటికి ఇంటర్ నెట్ పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ లు నిర్మాణాలకు భూ కేటాంపు చేయాలని, ఆగస్టు చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభం కావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఐటిడిఎ పిఓ, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి  పనితీరును పరిశీలించాలన్నారు. 
సచివాలయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి చార్ట్ ను డిసిప్లే చేస్తున్నారా లేదా, సిబ్బంది బయోమెట్రిక్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపైన పరిశీలించాలన్నారు. రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు లు అర్హతను చూసి మూడు నెలల్లో మంజూరు చేయాలని చెప్పారు. ఇవి సంవత్సరానికి నాలుగు సార్లు మంజూరు చేయాలని తెలిపారు. గృహ నిర్మాణాలపైన ధరఖాస్తులు వస్తే వాటిపై విచారణ చేసి అర్హులైతేనే మంజూరు చేయాలన్నారు. సంవత్సరానికి రెండు సార్లు మంజూరు చేయాలని చెప్పారు.   ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమచేసేందుకు ముందు రోజు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు ల్లో ప్రజలకు ఖచ్చితంగా అవగాహన పరచాలన్నారు.

వైయస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం పనులు ప్రారంభించి డిశంబరు నాటికి పూర్తి చేయాలని చెప్పారు.  ఇళ్ల స్థల పట్టాలు కోసం వచ్చిన దరఖాస్తులను అర్హత చూసుకుని 90 రోజుల్లో మంజూరు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పట్టాల జాబితాను తెలియజేయాలని పేర్కొన్నారు. 
ఇ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అగ్రికల్చర్ అడ్వయిజర్ కమిటీ సమావేశాలను ప్రతీ నెల ఆర్బికె స్థాయిలో నెలలో మొదటి శుక్రవారం, మండల స్థాయిలో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడవ శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆర్బికెలోఔ విక్రయించే ఎరువులు నాణ్యమైనవిగా ఉండాలని పేర్కొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం లో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలన్నారు. తదితర అంశాలు పై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ శ్రీనివాసులు, శ్రీరాములు నాయుడు, డ్వామా పీడీ కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-25 13:48:41

విజిలెన్స్ అధికారిగా ఎస్.వి.మాధవరెడ్డి..

గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్  అధికారిగా ఎస్ వి మాధవ్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్ధానంలో పి.జాషువా బదిలీకాగా, మాధవ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ కు ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి)గా ఉన్నారు. కడపకు చెందిన మాధవ రెడ్డి 2010 లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రూప్ 1 కు ఎంపికై పోలీసు శాఖలో వివిధ పదవులను సమర్ధ వంతంగా నిర్వహించి వన్నె తెచ్చారు. శిక్షణ అనంతరం తొలుత కర్నూలు జిల్లా ఆత్మకూరు, నిర్మల్ లలో డిఎస్పిగా పనిచేసి 2018లో అదనపు ఎస్పిగా పదోన్నతి పొందారు. తదుపరి కర్నూలు అదనపు ఎస్పి (పరిపాలన)గా పనిచేసి గుర్తింపు పొందారు. విజయవాడ ట్రాఫిక్ డిసిపిగా రహదారి భద్రతకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సర్వీసు కాలంలో నాలుగు సంవత్సరాల పాటు ఫారెస్టు రేంజ్ అధికారిగా పనిచేసి అటవీ చట్టాల పట్ల పూర్తి అవగాహన గడించారు. బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు తావు లేని విధంగా విజిలెన్స్ నిఘాను పటిష్టపరుస్తామన్నారు.

Guntur

2021-08-25 13:42:08

న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ వేయించాలి..

న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు.  బుధవారం స్థానిక బలగ సచివాలయం వద్ద న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేయిస్తే భవిష్యత్ లో శ్వాసకోశ సంబంధ వ్యాదులు, కోవిడ్ నివారణకు ఉపయోగపడుతుందన్నారు.  న్యూమోనియా అనే వ్యాధి స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా వలన వస్తుందని, దీని వలన సుమారు 12,700 మంది 5 సంవత్సరములు లోపు గల పిల్లలు మరణించినట్లు చెప్పారు.  మొదటి డోసు 6 వారాలకు, రెండవ డోసు 14 వారములకు మరియు బూస్టర్ డోసు 9 నెలలకు వేయాలని పేర్కొన్నారు.  వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత దేశ ప్రభుత్వం జాతీయ వ్యాది నిరోధక కార్యక్రమములో చేర్చినట్లు చెప్పారు.   వ్యాక్సిన్ వేసిన చిన్న పిల్లల తల్లిదండ్రులు తెలిసిన వారి తల్లులకు వ్యాక్సిన్ పిల్లలకు వేయించాలని చెప్పాలన్నారు.  అన్ని ప్రభుత్వ ఆరోగ్య  కేంద్రాలలో ఉచితంగానే వేస్తారని తెలిపారు.  జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి అప్పారావు, మున్సిపల్ కమీషనర్ ఓబులేసు, వైద్యాధికారి కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-25 13:28:02

ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్..

విజయనగరంజిల్లాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఆల‌యాల‌ను క‌లుపుతూ, టూరిజం స‌ర్క్యూట్‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. జిల్లాలోని టెంపుల్ టూరిజంను అభివృద్ది చేసేందుకు క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు ప్రారంభించారు. దీనిలో భాగంగా దేవాదాయ‌, ప‌ర్యాట‌క శాఖాధికారుల‌తో త‌న ఛాంబ‌ర్ లో బుధ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లా కేంద్రంలోని పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం, రాజ‌మ‌న్నార్ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యం, రామ‌నారాయ‌ణం, విజ‌య‌న‌గ‌రం కోట‌, మ‌హారాజా ప్ర‌భుత్వ‌ సంగీత క‌ళాశాల‌, గుర‌జాడ అప్పారావు స్మార‌క గృహం, బౌద్ద ఆరామం గురుభ‌క్తుల కొండ‌, రామ‌తీర్ధం, కుమిలి దేవాల‌యాల స‌ముదాయం త‌దిత‌ర ప్రాంతాల‌ను క‌లుపుతూ ప‌ర్యాట‌కంగా ఒక ప్యాకేజ్‌ను రూపొందించాల‌ని సూచించారు. విశాఖ‌ప‌ట్నం నుంచి టూరిజం బ‌స్సులో ప‌ర్యాట‌కులను తీసుకువ‌చ్చి, ఈ ప్ర‌దేశాల‌ను చూపించాల‌ని చెప్పారు. దీనికోసం వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి, అనుమ‌తి తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌ర్యాట‌క ప‌రంగా అభివృద్ది చేసేందుకు జిల్లాలో ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని, త‌రువాత ద‌శ‌లో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ స‌మావేశంలో  దేవాదాయ‌శాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఇవి పుష్ప‌వ‌ర్థ‌న్‌, జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాన్సాస్ ఇఓ వెంక‌టేశ్వ‌ర్రావు,  పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం స‌హాయ క‌మిష‌న‌ర్ కిషోర్‌, బొబ్బిలి ఇఓ ప్ర‌సాద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-25 13:17:21

సుడా ప్లానింగ్ అధికారిగా శోభన్ బాబు..

శ్రీకాకుళం నగర అభివృద్ధి సంస్థ  (సుడా) ప్రణాళిక అధికారిగా వి.శోభన్ బాబు నియమితులయ్యారు. మంగళవారం సుడా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్,  ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి సుడా చక్కని ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగర అభివృద్ధికి కీలకపాత్ర ప్రణాళికలని, పారదర్శకంగా,  భవిష్యత్తు అవసరాలకు హేతుబద్దంగా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు.

Srikakulam

2021-08-24 14:26:26