1 ENS Live Breaking News

అప్పన్నకు జివిఎంసీ కమిషనర్ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని వలక్షవ్రతం సందర్భంగా శుక్రవారం మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ కమిషనర్ స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కమిషనర్ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-20 11:43:46

బాధితురాలిని ప‌రామ‌ర్శించిన మంత్రులు..

ప్రియుడిచేతిలో దాడికి గురై, జిల్లా కేంద్రాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న, పూసాటిరేగ మండ‌లం చౌడ‌వాడ‌కు చెందిన రాముల‌మ్మ‌ను, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాములు పుష్ప శ్రీ‌వాణి, మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఆసుప‌త్రి వైద్యాధికారుల‌తో మాట్లాడి, వారి ఆరోగ్య ప‌రిస్థితిని వాక‌బు చేశారు.  ప్రాణాపాయం లేద‌ని, ఎటువంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, చికిత్స‌క‌య్యే ఖ‌ర్చునంతా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ఆ కుటుంబానికి  ధైర్యం చెప్పారు.ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి మీడియాతో మాట్లాడుతూ,  ఈ సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌మంటూ, దానిని ఖండించారు. పెళ్లి చేసుకోవాల్సిన వ్య‌క్తే, త‌న‌కు కాబోయే భార్య‌పై అనుమానంతో దాడి చేశాడ‌ని, పెట్రోలు పోసి నిప్పంటించాడ‌ని చెప్పారు. అయితే బాధితులు త‌క్ష‌ణ‌మే స్పందించి, దిశ యాప్‌ను ఉప‌యోగించ‌డంతో, స‌కాలంలో పోలీసులు అక్క‌డికి చేరుకొని, బాధితుల‌ను జిల్లా కేంద్రాసుప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి తీసుకువ‌చ్చిన దిశ యాప్ వారి ప్రాణాల‌ను కాపాడింద‌ని అన్నారు. దిశ‌యాప్‌లో ఎస్ఓఎస్‌ బ‌ట‌న్‌ను బాధితురాలి సోద‌రి ప్రెస్ చేయ‌డంతో, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందింద‌ని తెలిపారు. రాష్ట్రంలోని ఆడ‌బిడ్డ‌లంతా దిశ‌యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని కోరారు. ఆప‌ద స‌మ‌యంలో ఎస్ఓఎస్ బ‌ట‌న్ నొక్కితే, పోలీసులు అక్క‌డికి చేరుకొని రక్ష‌ణ క‌ల్పిస్తార‌ని చెప్పారు.

               మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, చౌడ‌వాడ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఎటువంటి ప్రాణాపాయం లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ మెరుగైన వైద్యం కోసం విశాఖ‌ప‌ట్నం స్టీలుప్లాంటు బ‌ర్న్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపారు. దాడికి పాల్ప‌డిన రాంబాబును, అత‌నిని ప్రోత్స‌హించిన‌వారిని గుర్తించి, వారికి శిక్ష ప‌డేలా చేస్తామ‌ని అన్నారు. బాధిత‌రాలు రాముల‌మ్మ‌కు, నిందితుడు రాంబాబుతో 8 నెల‌ల నుంచీ ప‌రిచ‌యం ఉంద‌ని, ఇద్ద‌రూ ప్రేమించుకుంటూ, అక్టోబ‌రులో పెళ్లి చేసుకోవ‌డానికి పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒప్పందం కుదిరింద‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, రాముల‌మ్మ‌పై అనుమానంతో పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేందుకు రాంబాబు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పారు.  ఆ కుటుంబాన్ని ఆదుకొనేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి అన్నారు.  బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన వారిలో జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి, ఎస్‌పి దీపిక‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్ బాబు, ఎంఎల్ఏలు బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

Vizianagaram

2021-08-20 10:50:50

సెప్టెంబరు 9న జాతీయ లోక్ అదాలత్..

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 9న రాజమండ్రిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఎం.బబిత తెలియజేశారు. వివిధ కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నరు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో వివిధ కేసులను పరిష్కరించుకోవచ్చునన న్యాయమూర్తి కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Rajahmundry

2021-08-20 10:33:23

శబ్ద కాలుష్యం లేని ఆటోలు నడపాలి..

శ్రీకాకుళం నగరంలో శబ్ద కాలుష్యాన్ని వెదజల్లుతూ లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ట్రాఫిక్ డిఎస్పీ సి.హెచ్.జి వి.ప్రసాద్ ఆదేశాలు మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాల్లో లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు చేస్తూ శబ్ద కాలుష్యం కలిగిస్తున్న ఆటో డ్రైవర్లకు,  ఇతర వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగించారు. ట్రాఫిక్ యస్ ఐ లక్షణ రావు మాట్లాడుతూ పర్యావరణ హితాన్ని కోరుతూ శబ్ద కాలుష్యం చేసే ఆటోల పై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు శాఖ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్లు హేమచంద్ర , జనార్దన్, హోమ్ గార్డ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Srikakulam

2021-08-20 09:47:58

తుపానుపై అప్రమత్తంగా ఉండండి..

బంగళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల కాలంలో తుఫానుగా బలపడే అవకాశం వుందని వాతావరణ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో విపత్తు నియంత్రణ, సహయక యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అప్రమత్తం చేశారు.  అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకూ గంటకు 45 నుండి 60 కిమీ వేగంతో తూర్పు తీరంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ కేంద్రం తెలియజేసిందని.. దీని  దృష్ట్యా మత్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.  జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలలో  రక్షణ, సహాయక శాఖల సమన్వయతో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు – కలెక్టరేట్, కాకినాడ –18004253077, సబ్ కలెక్టరు ఆఫీసు, రాజమహేంద్రవరం – 08832442344, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎటపాక – 08748285279, పిఓ, ఐటిడిఏ ఆఫీసు, రంపచోడవరం –18004252123, ఆర్డిఓ ఆఫీసు, అమలాపురం – 08856233100, ఆర్డిఓ ఆఫీసు, కాకినాడ -08842368100,  ఆర్డిఓ ఆఫీసు, రామచంద్రపురం –08857245166.

Kakinada

2021-08-20 09:23:24

శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం  వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో  ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా  ఆరాధించారు. అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని  ఆగమ పండితులు   శ్రీనివాసాచార్యులు  తెలియజేశారు.  తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.  2713 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి వర్చువల్ గా ఈ వ్రతంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి  వేణుగోపాల కృష్ణ,  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు  బాబుస్వామి పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Tirupati

2021-08-20 09:00:45

ఆలయాలు, చర్చిలకు మరింత భద్రత..

తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలు, చర్చిలకు మరింత భద్రత కల్పించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 64 మండాల్లోని అన్ని గ్రామాల్లోని చర్చిలు, ఆలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు, అవిపనిచేస్తున్న విధానాలపై నివేదికలు సమర్పించాలని ఎస్ఐలను శుక్రవారం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల ద్వారా సమాచారం సేకరించడంతోపాటు అక్కడి తాజా పరిస్థితులను అంచనా వేయాలని కూడా ఆదేశించారు. దీనితో స్టేషన్ల పరిధిలోని పోలీసులు, సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు ఈ సమాచారం సేకరించే పనిలో పడ్డారు. జిల్లా మొత్తం సమాచారం వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు జారీ చేయనున్నారు.

Kakinada

2021-08-20 07:26:16

అప్పన్నకు సెంట్రల్ ఫైనాన్స్ జెసి పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని సెంట్రల్ ఫైనాన్స్ జాయింట్ కమిషనర్ ఎంఆర్ హర్షవర్ధన్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించు కున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

సింహాచలం

2021-08-20 07:23:09

సింహాద్రి అప్పన్నకు డిఆర్డీఓ చైర్మన్ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, శాస్త్రవేత్త చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు.  ఆలయంలోని (శివాలయం) కాశీ విశ్వేశర ఆలయంలోనూ పూజలు చేసారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-20 05:04:45

వ్యక్తిగత పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ..

వ్యక్తిగత పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె సి చంద్ర నాయక్ వెల్లడించారు. ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2018 సం.రం నుండి జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇది శుభ పరిణామమని  అన్నారు. డెంగ్యూ 2018లో 87 కేసులు, 2019లో 164 కేసులు, 2020లో 23 కేసులు, 2021లో ఇప్పటివరకు 10 కేసులు నమోదయినట్లు చెప్పారు. మలేరియా 2018లో 264 కేసులు, 2019లో 125 కేసులు, 2020లో 34 కేసులు, 2021లో ఇప్పటివరకూ 28 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని , అందువలన ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు దోమల నుండి సంక్రమిస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి దోమల నివారణకై తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు లభించే దోమ తెరలను వినియోగించుకోవాలని, తద్వారా దోమల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. సరైనా జాగ్రత్తలు పాటించకపోవడం వలన సెరిబ్రల్ మలేరియా వంటి వ్యాధుల బారిన పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. మలేరియా నివారణకై జిల్లాలో 144 హై రిస్క్ గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో మొదటి విడత పిచికారి కార్యక్రమాన్ని  2021 మే 15 నుండి జూన్ 30 వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండవ విడత పిచికారి కార్యక్రమాన్ని జూలై 16 నుండి ప్రారంభించి ఇప్పటి వరకు 124 గ్రామాలలో పిచికారి చేయించినట్లు చెప్పారు.

10ఏపిఐ ఉన్న 26 గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలతో పిచికారి జరిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల గంబూషియా చేపలను హైరిస్క్ ప్రాంతాల్లో పెద్ద నీటి నిల్వలు ఉన్నచోట విడిచిపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామని, ఇంతవరకు లక్ష గంబూషియా చేపలను కుసిమి, దోనుబాయి, అన్నవరం మొదలగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని నీటి నిల్వల్లో విడిచిపెట్టామని తెలిపారు. ఈ సీజనల్ మలేరియాకు సంబంధించిన ఏంటి మలేరియా మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాల్లో నిల్వచేసినట్లు ఆయన వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖల సహకారంతో దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసారు. డెంగ్యూ ఏడిస్ దోమల నుండి సంక్రమిస్తుందని,  ఇవి ఇంటి పరిసరాల్లో ఉండే చిన్ననీటి నిల్వల్లో ఉండి పగటిపూట తిరుగుతూ ఉంటాయని చెప్పారు. కావున పగటి వేళల్లో దోమలు కుట్టకుండా ఉండేందుకు పూర్తిగా వస్త్రధారణ చేసుకోవాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు జిల్లా ఆసుపత్రితో పాటు పాలకొండ, రాజాం, టెక్కలి ఆసుపత్రులలో కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.  మలేరియా , డెంగ్యు వచ్చేక బాధపడటం కంటే రాకుండా ముందస్తు నివారణ చర్యలు పాటించడం మేలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి డా. జి.వీర్రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-08-19 16:54:45

లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలో అవగాహన..

లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలోనే అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో పిసి మరియు పియన్ డిటి చట్టం అమలు పై కమిటీ ఆయన అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులకు ఆవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సమావేశానికి ఐసిడిఎస్ సిడిపిఓ హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు ను ఆదేశించారు. లింగ నిష్పత్తి ఏ ఏ మండలాల్లో తక్కువగా ఉందో వాటిని గుర్తించి ఆ మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడపిల్ల పుట్టడమే అదృష్టంగా భావించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు చట్టం ఉల్లంఘన చేస్తే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ లో ఉన్న ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు సమాచారం తీసుకోవాలని చెప్పారు. కొన్ని కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. గర్భం ధరించడానికి ముందుగాని తర్వాత గానీ లింగ ఎంపిక చేయకూడదన్నారు. లేబరేటరీలు గర్భస్థ పిండాలు తెలిపే లింగాన్ని తెలిపే ఉద్దేశంతో ఎలాంటి పరీక్షలు చేయరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మూడు సంవత్సరాలు జైలు శిక్ష, 10 వేల రూపాయలు జరిమానా విధించబడుతుందన్నారు.  స్వచ్ఛంద సంస్థల నుండి రమణమూర్తి, విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలని, సినిమా హాల్స్, సిటి కేబుల్ లలో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు, ఒన్ టౌన్ సీఐ అంభేథ్కర్, అడ్వకేట్ సరళ కుమారి, స్వీప్  స్వచ్ఛంద సంస్థలు నుండి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-19 16:51:52

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన  శానిటరీ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆమె 2వ జోన్ 6వ వార్డు పరిధిలోని మధురవాడ, బక్కన్నపాలెం బి-2 హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా వర్షాలు విస్తారంగా పడుతుండడంతో సీజనల్ వ్యాధులు లైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు.  వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని,   ఫ్రిడ్జ్  వెనుక భాగం ట్రేలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని,  ఇంటి పరిసర ప్రాంతాలలో  కొబ్బరి బొండాలు,   ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్,  పూల కుండీలులోని నీరు నిల్వ లేకుండా చూడాలని,  ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని,  సచివాలయాల పరిధిలో  మలేరియా పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఫీవర్ సర్వే ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున గెడ్డ లోని పూడికలు  తొలగించి, వర్షపు నీరు  సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని,  పారిశుధ్య కార్మీకులు ప్రతి ఇంటి నుండి  తడి-పొడి చెత్తను సరిగా సేకరించడంలేదన్నారు.

 తడి-పొడి చెత్తను వేరు వేరుగా ఇచ్చేవిధంగా  ప్రజలకు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.  పిన్ పాయింట్ వారిగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే  చేయించాలని, చెత్త తరలించే వాహనాలు రోజుకు 3 ట్రిప్పులు వేయాలని, పుష్ కార్ట్ లోని చెత్త బయట వేయకుండా నేరుగా  చెత్త తరలించే వాహనంలోనే వేయాలని  శానిటరీ అధికారులను ఆదేశించారు. మధురవాడ పరిసర ప్రాంతాలలో పందులు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే నిర్మూలించే చర్యలను చేపట్టాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేసుకొనేలా సచివాలయాల పరిధిలో వాలంటరీలు  ప్రతి ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాల వయసు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్  ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కార్యనిరాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, అసిస్టెంట్ ఇంజినీర్లు శ్రీహరి, శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-19 16:51:02

పేదవిద్యార్ధికి ఇంగ్లీషు మీడియం విద్య..

 పేదవిద్యార్ధికి మన బడి నాడు - నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఇంగ్లీష్ మీడియం విద్యను జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్  తమ్మినేని సీతారాం అన్నారు. గవర్నమెంట్ స్కూల్ ముందు సీటు కోసం క్యూ కడుతున్నారంటే  ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పీకర్ అన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాల, బాలయోగి గురుకుల పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతారాం గురువారం పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. కేజీబీవీ స్కూల్, బాలయోగి గురుకుల పాఠశాలలో నాడు - నేడు పనుల నాణ్యత ముఖ్య మంత్రి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని ఆన్నారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు, మండల అధికారులు, స్థానిక నాయకులు ఖండపు గోవిందరావు,  బెజ్జిపురపు రామారావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

భూర్జ

2021-08-19 16:49:55

భూములు రీసర్వే పనులు వేగం పెంచాలి..

శ్రీకాకుళం జిల్లాలో భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఏడి సర్వేను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చాంబర్ లో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తో గురువారం సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు పనులు చేపడుతున్న మూడు డివిజన్లలో శ్రీకాకుళం డివిజన్ లో పోలాకి మండలం సంతలక్ష్మీపురం గ్రామం, టెక్కలి డివిజన్ లోని కోటబొమ్మాళి మండలం ఆనందపురం గ్రామం, పాలకొండ డివిజన్ లోని పాలకొండ మండలం పరశురాంపురం గ్రామాల్లో చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఒక డ్రోన్ తో సర్వే జరుగుతుందని సర్వే సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు. అదనంగా మరో డ్రోన్ తీసుకొని సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళికా బద్థంగా, సమస్యలు లేకుండా చేయాలన్నారు. శ్రీకాకుళం, గార మండలాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసి ఒకేసారి పనులు జరిగేలా గ్రౌండ్ వర్క్ పనులు చేయాలని, సర్వే కమీషనర్ నుండి అనుమతి వచ్చిన వెంటనే డ్రోన్ ఫ్లైయింగ్ పనులు ప్రారంభించాలని చెప్పారు.  ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి పాల్గొన్నారు.

Srikakulam

2021-08-19 16:22:32

సిబ్బంది అర్జీదారులతో గౌరవంగా మెలగాలి..

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవిన్యూ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు, అర్జీదారులంద‌రికీ స‌మాన‌ గౌర‌వం ఇవ్వాల‌ని, అర్జీదారులంద‌రి స‌మ‌స్య‌ల ప‌ట్ల ఒకే రీతిలో స్పందించి వాటి ప‌రిష్కారానికి చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి జిల్లాలోని త‌హ‌శీల్దార్‌ల‌ను ఆదేశించారు. అర్జీలు ఇవ్వడానికి వ‌చ్చే వ్య‌క్తులంద‌రి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విని వాటిని సాధ్య‌మైనంత మేర‌కు న్యాయ‌బ‌ద్ధంగా ప‌రిష్క‌రించేందుకే ప్ర‌య‌త్నించాల‌న్నారు. అర్జీల‌ను త‌మ స్థాయిలో ప‌రిష్కారం సాధ్య‌మైనప్ప‌టికీ వాటిని తిర‌స్క‌రించే ప‌రిస్థితి రానివ్వొద్ద‌ని స్ప‌ష్టంచేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి గురువారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌తో క‌ల‌సి జిల్లాలోని అన్ని మండ‌లాల‌ త‌హ‌శీల్దార్‌ల‌తో ఆన్ లైన్ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. స్పంద‌న‌లో వ‌చ్చే ప్ర‌జా విన‌తుల  ప‌రిష్కారం, ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై సమ‌గ్రంగా స‌మీక్షించారు.

జిల్లాలోని ఏ మండ‌లంలోనూ ప్ర‌భుత్వానికి చెందిన భూముల ర‌క్ష‌ణ బాధ్య‌త త‌హ‌శీల్దార్ల‌దేని స్ప‌ష్టంచేశారు. ప్ర‌భుత్వ భూముల‌కు త‌హ‌శీల్దార్‌లు ర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. మండ‌లంలోని ఏ ప్రాంతంలోనైనా ప్ర‌భుత్వ‌ భూములు, చెరువులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైతే త‌క్ష‌ణం స్పందించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి, భూముల‌ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల వ‌ల్ల వాటి  నీటి నిల్వ సామ‌ర్ధ్యం కోల్పోయి అనేక న‌ష్టాలు జ‌రిగే అవ‌కాశం వుంటుంద‌ని అందువ‌ల్ల చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. మండ‌లంలోని భూవివ‌రాల‌పై త‌హ‌శీల్దార్‌ల‌కు స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న వుండాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టంచేశారు. ఏయే వ‌ర్గీక‌ర‌ణ‌ల‌కు సంబంధించిన భూమి ఎన్ని ఎక‌రాలు వుందో చెప్పే ప‌రిస్థితి వుండాల‌న్నారు. వ‌చ్చే స‌మావేశం నాటికి ఆయా మండ‌లాల్లో భూముల వివ‌రాల‌కు సంబంధించి పూర్తి స‌మాచారంతో, అవ‌గాహ‌న‌తో సిద్ధం కావాల‌న్నారు. జిల్లాకు రానున్న రోజుల్లో ప‌లు ప‌రిశ్ర‌మ‌లు, జాతీయ ప్రాజెక్టులు రానున్నాయ‌ని, వాటి ఏర్పాటు కోసం భూములు అవ‌స‌రం వుంటుంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు. ఆయా మండ‌లాల్లో ఆక్ర‌మ‌ణ‌లు లేకుండా స్ప‌ష్టంగా అందుబాటులో వుండే ప్ర‌భుత్వ భూముల వివ‌రాలు సిద్ధం చేయాల‌ని చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా మండలాల వారీగా రెవిన్యూ శాఖ‌కు సంబంధించి స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై స‌మీక్షించారు. ఏదైనా మండ‌లంలో పెద్ద ఎత్తున పెండింగ్‌లో వున్న‌ట్ల‌యితే ఏ కార‌ణంగా వున్నాయో తెలుసుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న‌ట్లు తెలియ‌జేస్తే వాటికి సంబంధించి కౌంట‌ర్‌లు సంబంధిత న్యాయ‌స్థానంలో దాఖ‌లు చేసిందీ లేనిదీ స‌మీక్షించారు. ఏయే ర‌క‌మైన విన‌తులు ప‌రిష్కారం కాకుండా మిగిలి వుంటున్నాయో త‌హ‌శీల్దార్‌ల ద్వారా తెలుసుకున్నారు. వై.ఎస్‌.ఆర్‌. జ‌గ‌న‌న్న భూహ‌క్కు భూర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌రుగుతున్న  రెండు గ్రామాల్లో పైల‌ట్ ప్రాజెక్టుగా జరుగుతున్న స‌ర్వేపై స‌మీక్షించారు.

Vizianagaram

2021-08-19 16:09:40