1 ENS Live Breaking News

నాడు-నేడు పనులు సకాలంలో పూర్తికావాలి..

శ్రీకాకుళం జిల్లాలో  ఆస్పత్రులలో జరుగుతున్న నాడు నేడు పనులు సకాలంలో పూర్తిచే యాలని రాష్ట్ర ఆసుపత్రుల మౌళిక వసతుల కల్పన సంస్థ మేనేజింగ్ డైరక్టర్  కె.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాడు నేడు పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో జరుగుతున్న నాడు నేడు పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన 2022 జనవరి నాటికిపనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. ఇప్పటికే 70 శాతానికి పైగా పనులు పూర్తిచేసుకున్న ఆసుపత్రిల్లో మిగిలిన పనులను త్వరిగతిన పూర్తిచేయాలని అన్నారు. పూర్తయిన ఆసుపత్రులకు  తగిన రంగులు, మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా ఆసుపత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు తీర్చిదిద్దాలని కోరారు. నిధుల కొరతతో పనులు అసంపూర్తిగా వదలివేయ రాదని చేసిన ప్రతి పనికి కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి తమకు పంపాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు రానున్న నవంబర్ నాటికి పూర్తికావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇదే స్ఫూర్తితో మిగిలిన చోట్ల పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.ఆసుపత్రుల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక , ఐరన్ కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. పూర్తయిన ఆసుపత్రుల వద్ద ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు ఆసుపత్రిలో లభించే సదుపాయాల బోర్డులను ఏర్పాటుచేయాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

కొన్ని ఆసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నప్పటికి కనెక్షన్లు ఇవ్వలేదని, కనెక్షన్లతో పాటు ఒకసారి పరీక్షించి సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే వర్కింగ్ ఇన్ గుడ్ కండిషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని, జిల్లా కలెక్టర్ కోరిన వాటిని తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చిన్న చిన్న పనులు చేసుకునేందుకు హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ లేదా ఆరోగ్యశ్రీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రంలో డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కోరారని వాటిని మంజూరుచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.  కార్పొరేట్ సామాజిక భాద్యత (సీ.ఎస్.ఆర్) క్రింద జిల్లాలో పనులు బాగానే జరుగుతున్నాయని, ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజినీర్ కాంతిమతి, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజినీర్ కె.సుగుణాకరరావు, ఇతర జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:20:23

చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం..

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు.  శుక్రవారం వైశ్యరాజు కళ్యాణ మండపంలో 27 నుండి  29వ తేదీ వరకు ఏర్పాటు చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు.  చేనేత కార్మికులకు సహాయ పడాలని చెప్పారు.  ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.  తెలంగాణాలోని సిరిసల్ల వెళ్లి చేనేత కార్మికుల సమస్యలు ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు.  ప్రతి సోమవారంలో ఒక సోమవారం చేనేత వస్ర్తాలు ధరించడానికి జిల్లా కలెక్టర్ చెప్పినట్లు తాను కూడ ధరిస్తానని, తన మిత్రులు చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.  నెలలో మొదటి సోమవారం జిల్లా అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలని ఉత్తర్వవులు జారీ చేసినట్లు వెల్లడించారు.  చేనేత కార్మికులు అందరూ సమన్వయంతో, ఒకరితో ఒకరి సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు.  జిల్లాలో తయారు చేస్తున్న వస్త్రాలకు మార్కెటింగ్ చేస్తే మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పారు. మార్కెటింగ్ పై దృష్టి సారించాలని చెప్పారు.

          కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులను గుర్తించి ప్రభుత్వం అవార్డులతో పాటు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు.  చేనేత కార్మికులు మాట్లాడుతూ నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, ఇంత వరకు 72 వేల రూపాయలు వచ్చినట్లు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను పరిశీలించారు. బిసి సంక్షేమం కార్యనిర్వాహక అధికారి రాజారావు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:14:59

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు..

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.  శుక్రవారం కంపోస్టు కాలనీ వద్ద సిటిజన్ అవుట్ రిచ్ కాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. శ్రీనివాసులు, కళింగ వైశ్య, కాపు కార్పొరేషన్ల అధ్యక్షులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో నెలలో 4వ శుక్ర, శనివారాలలో సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలకు ఇంటింటికి వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది వెళ్లి ప్రభుత్వ పథకాలు గూర్చి తెలియ జేస్తారని చెప్పారు.  గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా పరిపాలన నడుస్తోందన్నారు. గతంలో ఏనాడు జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని చెప్పారు.  సచివాలయాల పరిధిలోని సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ, ఇతర కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ లలో పేద వారు చదవలేరని, వారికి కోసం ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.  కరోనాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, దిశ చట్టం ప్రవేశ పెట్టి మహిళలకు రక్షణ కల్పించినట్లు చెప్పారు.  అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.  అధికారం చేపట్టిన వెంటనే ఏ విధమైన సిఫార్సులు లేకుండా పారదర్శంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమైనదని తెలిపారు. 

          జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ సర్వీసులను అందిస్తున్నట్లు చెప్పారు.  గతంలో ఒక పథకం కోసం కలెక్టర్ కు, మున్సిపాలిటీలకు ధరఖాస్తు పెట్టుకొని, అది ఏమైందో తెలుసుకొనేవారన్నారు.  ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఉందుబాటులో ఉందని, ఆ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  గ్రామ/వార్డు సచివాలయాల్లో అన్ని శాఖలకు సంబంధించిన వారు ఒకరు ఉంటారని చెప్పారు.  ఆ శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాల సమాచారంను తెలియజేస్తారని, అర్హులైన లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో బయటే డిసిప్లే చేస్తారని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుంటే వారు దరఖాస్తు చేసుకుంటే పథకం వస్తుందని తెలిపారు.  ప్రజలంతా ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలన్నారు. సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ నగరాలు / పట్టణాలలో సచివాలయాల ద్వారా అందిస్తున్న సర్వీసులు సిబ్బంది తెలియజేస్తారన్నారు.  ప్రతి నెల 4వ శుక్ర, శనివారాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గూర్చి సచివాలయాల సిబ్బంది తెలియజేస్తారని చెప్పారు.  అనంతరం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ పథకం వస్తుందో తెలియజేసే కేలండర్ ను ఆవిష్కరించారు.  అంతకు ముందు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఎం.వి. పద్మావతి, కమీషనర్ ఓబులేసు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-27 14:11:49

అమ్మా మీకు పథకాలు అందుతున్నాయా లేదా..

సాక్షాత్తూ జిల్లా క‌లెక్ట‌ర్ నేరుగా వార్డులోని ఇళ్ల‌కు వెళ్లి కుటుంబ స‌భ్యుల‌తో సంభాషించి వారి బాగోగుల‌ను, ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం వారికి అందుతున్న‌దీ లేనిదీ, ఆయా ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు వారికి అందుతోందీ లేనిదీ తెలుసుకునేందుకు వేసిన ప్ర‌శ్న‌లివి.  రాష్ట్రంలోని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌ కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ద్వారా ప‌థ‌కాలు అందుతున్న తీరు, వలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం ఏవిధంగా అందుతున్న‌దీ ప‌రిశీలించి, వారిలో  ఆయా ప‌థ‌కాల‌పై ఏమేర‌కు అవ‌గాహ‌న ఉన్న‌దీ తెలుసుకునేందుకు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అన్ని కుటుంబాల్లో అవ‌గాహ‌న క‌ల్పించి అర్హులంతా ఆయా ప‌థ‌కాలు పొందేందుకు తోడ్పాటు అందించే కార్య‌క్ర‌మ‌మే సిటిజెన్స్ ఔట్ రీచ్‌. రాష్ట్రంలోని అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో శుక్ర‌వారం నుంచి ఈ కార్య‌క్ర‌మం ద్వారా స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు బృందాలుగా ఏర్ప‌డి ఆయా స‌చివాల‌య ప‌రిధిలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి, ప్ర‌తి కుటుంబాన్నీ క‌ల‌సి వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, అర్హులైన వారు ఎవ‌రైనా  ఆయా ప‌థ‌కాలు పొంద‌లేక‌పోతే వారితో ద‌ర‌ఖాస్తు చేయించ‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఆయా కుటుంబాల‌కు ఏ మేర‌కు అందాయో తెలుసుకోవ‌డం ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యం. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి శుక్ర‌వారం న‌గ‌రంలోని 14వ వార్డు ప‌రిధిలోని కొత్త‌పేట కుమ్మ‌రివీధి, 5వ వార్డు ప‌రిధిలోని బాబామెట్ట ప్రాంతాల్లో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ఎస్‌.వ‌ర్మ‌తో క‌ల‌సి ప‌ర్య‌టించారు. ఆయా వార్డుల్లోని ప‌లు ఇళ్ల‌కు వెళ్లి వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఏవిధంగా అందుతున్న‌దీ, వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఏ మేర‌కు అవ‌గాహ‌న ఉన్న‌దీ తెలుసుకున్నారు. వార్డు వలంటీర్లు ఆయా ఇళ్ల‌ను త‌ర‌చుగా సంద‌ర్శించి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల స‌మాచారాన్ని తెలియ‌జేస్తున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. ఆయా కుటుంబాల‌కు చెందిన వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. కొత్త‌పేట కుమ్మ‌రివీధికి చెందిన వృద్దుడు సూర స‌న్యాసిరావు ఇంటికి వెళ్లి ఆయ‌న బాగోగుల‌ను అడిగి తెలుసుకున్న క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి, ఆయ‌న‌కు ప్ర‌తినెలా ఫించ‌ను వ‌స్తున్న‌దీ లేనిదీ అడిగారు. ప్ర‌తినెలా రూ.2250 ఫించ‌ను మొత్తం అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కొంత పొలం వుంద‌ని, అందుకు రైతుభ‌రోసా స‌హాయం కూడా అందుతోంద‌ని వివ‌రించారు. తాను త‌న కుటుంబ స‌భ్యులూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు క‌లెక్ట‌ర్‌కు తెలిపారు.

అనంత‌రం అదే వార్డులోని నంద ర‌మాదేవి ఇంటికి వెళ్లిన క‌లెక్ట‌ర్ వారి కుటుంబం గురించి ఆరా  తీశారు. త‌మ పిల్ల‌ల‌కు అమ్మ ఒడి కింద స‌హాయం అందింద‌ని, త‌న భ‌ర్త టైల‌ర్ కావ‌డంతో ప్ర‌భుత్వం నుంచి రూ.10 వేలు స‌హాయం అందింద‌ని, త‌మ‌కు పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో కొండ‌క‌ర‌కాంలో ఇళ్లు కూడా మంజూర‌య్యింద‌ని ర‌మాదేవి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన‌దీ లేనిదీ క‌లెక్ట‌ర్ అడిగారు.  ఇళ్ల నిర్మాణం త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. 5వ వార్డు బాబామెట్ట ప్రాంతంలోనూ క‌లెక్ట‌ర్ ప‌ర్య‌టించారు. ఆ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ప‌లువురు వ్య‌క్తుల‌తో మాట్లాడి వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఒక డోస్ వేయించుకున్న త‌ర్వాత వ్యాధికి గురి కావ‌డంతో రెండో డోసు వేయించుకోలేద‌ని ఒక వ్య‌క్తి తెలిపారు. ఏంటిబాడీస్ వున్నందున కొద్దిరోజుల త‌ర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటామ‌ని చెప్పారు. ఇదే కాల‌నీలో రిటైర్డ్ రెవిన్యూ అధికారి చంద్రుడు ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలోని హేమ‌ల‌త అనే మ‌హిళ‌తో మాట్లాడారు. వలంటీర్ త‌మ ఇంటికి త‌ర‌చూ వ‌చ్చి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై స‌మాచారం ఇస్తార‌ని హేమ‌ల‌త వివ‌రించారు. త‌మ కుటుంబంలోని వారంతా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ న‌గ‌ర ప‌రిధిలో శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌ను ఆదేశించారు. న‌గ‌రంలో ఎంత‌మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, మ‌రెంద‌రికి వ్యాక్సిన్ వేయాల్సి వుంద‌నే స‌మాచారం త‌న‌కు అంద‌జేసి వారికి వ్యాక్సిన్ ఏవిధంగా వేయ‌నున్న‌దీ ప్ర‌ణాళిక త‌న‌కు వివ‌రించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సిటిజెన్స్ అవుట్ రీచ్ కార్య‌క్ర‌మం అన్ని గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో జ‌రుగుతోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌చివాల‌య సిబ్బంది, వలంటీర్లు బృందాలుగా ఇళ్లను సంద‌ర్శించి ఆయా కుటుంబాల‌ను క‌లుస్తున్నార‌ని, వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించ‌డంతోపాటు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వార్డు కార్పొరేట‌ర్ ఎస్‌.వి.వి.రాజేశ్వ‌ర‌రావు, న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 14:06:12

నేడు జిల్లాలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారంద‌రికీ కోవిడ్ టీకా వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ‌నివారం మెగా డ్రైవ్ నిర్వ‌హించ‌టం ద్వారా ప‌ట్ణ‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు ల‌క్ష మందికి వ్యాక్సిన్ వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా శుక్ర‌వారం జేసీ మ‌హేష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో వైద్యాధికారుల‌తో స‌మావేశం జ‌రిగింది. కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ టీకా వేసుకోవాల‌ని, ఇదొక్క‌టే మ‌హమ్మారిని ఎదుర్కొనేందుకు మంచి మార్గ‌మ‌ని ఈ సంద‌ర్భంగా జేసీ పేర్కొన్నారు. మెగా డ్రైవ్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై, ప‌ద్ధ‌తుల‌పై వైద్యాధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ప‌లు సూచ‌న‌లు జారీ చేశారు. పట్ట‌ణ ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌టం ద్వారా అత్య‌ధిక మందికి వ్యాక్సిన్ వేయాల‌ని సూచించారు. ప్ర‌తి స‌చివాల‌యంలో, ఆరోగ్య కేంద్రాల్లో కేంద్రాల‌ను ఏర్పాటు చేసి కోవిడ్ టీకా వేయాల‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్కరూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి మెగా డ్రైవ్‌ను విజ‌య‌వంతం చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నామ‌ని, దీనికి వైద్యాధికారులు, సిబ్బంది స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని జేసీ సూచించారు. ఈ సమావేశంలో డీఐవో డా. గోపాల కృష్ణ‌, ప‌లువురు వైద్యాధికారులు, వైద్య‌ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 14:02:09

అభివృద్దిలో య‌వ‌త భాగ‌స్వామిని చేయాలి..

యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా స‌మాజాభివృద్దిలో యువ‌త‌ను భాగ‌స్వా ముల‌ను చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోని యువ‌త‌ను ఏకం చేసి, వారి ఆస‌క్తి, అర్హ‌త‌లు, స‌మాజ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏకీకృత నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించాల‌ని ఆదేశించారు.  జిల్లా స్థాయి యువ‌జ‌న కార్య‌క్ర‌మాల‌పై శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స్థాయిల్లో యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేయడానికి త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని సూచించారు. దీనికోసం స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేయాల‌న్నారు. వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాలు, నైపుణ్యం ఆధారంగా, ఎటువంటి నైపుణ్యం లేని సాధార‌ణ వ్య‌క్తుల‌ను వేర్వురు విభాగాలుగా గుర్తించి, వారిచేత సంఘాల‌ను ఏర్పాటు చేయించాల‌న్నారు. స్థానిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా, అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో వారికి అవ‌స‌ర‌మైన నైపుణ్య‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని సూచించారు. దీనికి ముందుగా ప్ర‌తీ గ్రామం నుంచి, ప‌ట్ట‌ణాల్లోని వార్డు నుంచి అర్హ‌త గ‌ల యువ‌త వివ‌రాల‌ను సేక‌రించాల‌ని ఆదేశించారు. ఈ యువ‌జ‌న సంఘాల‌ను ఏర్పాటు చేసి, ఎవెన్యూ ప్లాంటేష‌న్‌, వ‌న సంర‌క్ష‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌తోర‌ణం లాంటి ప్రభుత్వ ప్రాధాన్య‌తా కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. 

అలాగే జిల్లాలోని ప్ర‌సిద్ది పొందిన బొబ్బిలి వీణ‌లు త‌దిత‌ర వాటిని ఈ సంఘాల ద్వారా త‌యారు చేయించి, దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయించవ‌చ్చ‌ని అన్నారు. యువ‌త‌కు ఉద్యోగ క‌ల్ప‌న కంటే, స్వ‌యం ఉపాధి క‌ల్పించ‌డంవ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని చెప్పారు. జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, యువ‌త‌లోని ఆస‌క్తి, నైపుణ్యంతో బాటుగా, స్థానిక అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా వారికి నైపుణ్య శిక్ష‌ణ ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం భారీ ఎత్తున జ‌రుగుతున్న గృహ నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని దృష్టిలో పెట్టుకొని, తాపీమేస్త్రి, రాడ్ బెండింగ్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ప్లంబింగ్ త‌దిత‌ర కోర్సుల్లో శిక్ష‌ణ ఇవ్వ‌డం వ‌ల్ల వారికి ఉపాధి దొర‌క‌డంతోపాటుగా, స‌మాజ అవ‌స‌రాలు కూడా తీర్చ‌వ‌చ్చున‌ని సూచించారు.

          జిల్లా యువ‌జ‌న స‌మ‌న్వ‌యాధికారి విక్ర‌మాధిత్య మాట్లాడుతూ, జిల్లాలో యువ‌జ‌న సంఘాల పాత్ర‌, వాటి కార్య‌క్రమాల‌ను వివ‌రించారు. యువ‌జ‌న సంఘాల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న స‌హ‌కారం, అమ‌లు చేస్తున్న కౌస‌ల్ వికాశ్ యోజ‌న‌, సంక‌ల్ప్ త‌దిత‌ర‌ ప‌థ‌కాలు గురించి తెలిపారు. జ‌న‌శిక్ష‌ణ సంస్థాన్ ద్వారా ఇస్తున్న నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.  క్షేత్ర‌స్థాయిలో యువ‌త‌లోని ప్ర‌తిభ‌ను గుర్తించి, దానిని వెలికి తీసేందుకు యువ‌జ‌న సంఘాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిపిఓ సుభాషిణి, జిఎం డిఐసి ప్ర‌సాద‌రావు, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, సెట్విజ్ సిఇఓ విజ‌య‌కుమార్‌, నాబార్డ్ ఏజిఎం హ‌రీష్‌, డిఎల్‌డిఓ రామ‌చంద్ర‌రావు, వివిధ శాఖ‌లు, యువ‌జ‌న సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఆదర్శ పారిశ్రామిక‌వేత్త ధ‌ర‌ణి, త‌మ సంస్థ ద్వారా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

Vizianagaram

2021-08-27 13:59:55

డిసెంబరుకి హెల్త్ క్లినిక్ లు పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్మాణంలో వున్న వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌లు, అర్బ‌న్ క్లినిక్ ల నిర్మాణాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేసి అంద‌జేయాల్సి వుంటుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఎం.డి. డి.ముర‌ళీధ‌ర్ రెడ్డి చెప్పారు. ఈ క్లినిక్‌లలో ప‌నిచేసేందుకు సిబ్బంది నియామ‌క ప్రక్రియ‌ను ఇప్పటికే కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ ప్రారంభించార‌ని, డిసెంబ‌రు నాటికి ఈ సిబ్బంది అంతా ఆయా ఆసుప‌త్రుల్లో చేర‌తార‌ని, అప్పటిక‌ల్లా ఈ భ‌వ‌నాలు పూర్తిచేయాల్సి వుంటుంద‌న్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా ప్రజ‌ల‌కు గ్రామాల్లోనే వైద్య సౌక‌ర్యాలు ఏర్పడ‌తాయ‌ని, గ్రామంలోని క్లినిక్‌లో ఏవిధ‌మైన వైద్య స‌దుపాయాలు అందుబాటులో వున్నాయో అవ‌గాహ‌న క‌ల్పిస్తే వారు వైద్యం కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా త‌మకు స‌మీపంలోని వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల‌లో స‌దుపాయాల‌ను వినియోగించుకుంటార‌ని చెప్పారు. జిల్లా ప‌ర్యట‌నకోసం శుక్రవారం న‌గ‌రానికి వ‌చ్చిన ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. మేనేజింగ్ డైర‌క్టర్ ముర‌ళీధ‌ర్ రెడ్డి క‌లెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఆసుప‌త్రుల నిర్మాణం ప‌నులు, ఆసుప‌త్రుల్లో నాడు - నేడు, ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య ప‌రికరాలు, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ నిర్వహ‌ణ‌కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఇంజ‌నీర్లతో స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, వై.ఎస్‌.ఆర్‌.క్లినిక్‌ల నిర్మాణం పూర్తయిన వెంట‌నే ఆయా భ‌వ‌నాల‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అప్పగించాల‌ని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి., రోడ్లు భ‌వ‌నాలు, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్‌, పి.ఆర్‌.ఇంజ‌నీరింగ్ విభాగాల‌ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణం పూర్తయిన త‌ర్వాత వాటికి అవ‌స‌ర‌మైన చిన్నచిన్న ప‌నుల‌ను స్థానిక సంస్థల నిధుల నుంచే చేప‌ట్టాలని స్పష్టంచేశారు. క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్లు, పి.హెచ్‌.సి.లు, వై.ఎస్‌.ఆర్‌.హెల్త్ క్లినిక్‌ల‌కు సంస్థ సూచించిన రంగుల‌నే వేయాల‌ని, ఎక్కడా మార్పులు చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టంచేశారు. ఆయా భ‌వ‌నాలు చూడ‌గానే ఆసుప‌త్రుల‌నే అంశాన్ని ప్రజ‌లు గుర్తించే విధంగా రంగులు వేయాల‌న్నారు. నాడు - నేడులో ఆధునీక‌రిస్తున్న‌ అన్ని ఆసుప‌త్రుల వ‌ద్ద గ‌తంలో ఆ భ‌వ‌నాలు ఎలా వుండేవి, ఇప్పుడెలా వున్నాయ‌నే ఫోటోల‌తో బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంకోసం నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ నుంచి నిధులు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

కోవిడ్ సంద‌ర్భంగా జిల్లాలోని సి.హెచ్‌.సి.లు, ఏరియా ఆసుప‌త్రులు, జిల్లా ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల నిర్వహ‌ణ‌ను ఆయా ఆసుప‌త్రుల అభివృద్ధి నిధుల నుంచే చేప‌ట్టాల్సి వుంటుంద‌న్నారు. 30 ప‌డ‌క‌ల కంటే అధికంగా బెడ్లు వున్న పి.హెచ్‌.సి.లు, సిహెచ్‌సిల‌కు త‌మ సంస్థ ద్వారా డీజిల్ జ‌న‌రేట‌ర్ సెట్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా నియంత్రణ‌కు ట్రాన్స్ ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్యవ‌స్థలు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ స‌ర‌ఫ‌రా కార‌ణంగా ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా పాత విద్యుత్ స‌ర‌ఫ‌రా లైన్లను మార్పు చేయాల‌ని ఎం.డి. సూచించారు. ఆయా ఆక్సిజ‌న్ ప్లాంట్‌లు ఏజెన్సీల ద్వారా ఏర్పాట‌య్యాక అవి ప‌నిచేస్తున్నట్టు సంబంధిత ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్ లేదా మెడిక‌ల్ ఆఫీస‌ర్ లు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు.

జిల్లాలో ఆసుప‌త్రుల్లో నాడు - నేడు కింద ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ ప‌నులు, కొత్త ఆసుప‌త్రి భ‌వ‌నాల నిర్మాణంపై ఆ సంస్థ కార్యనిర్వాహ‌క ఇంజ‌నీర్ స‌త్యప్రభాక‌ర్ ఎం.డి.కి ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా వివ‌రించారు. జిల్లాలో 9 ఆసుప‌త్రుల్లో 81 ఐ.సి.యు., 338 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు రూ.3.18 కోట్ల‌తో ఆక్సిజ‌న్ పైప్‌లైన్ ల ఏర్పాటుకు ప్రతిపాదించామ‌ని, వీటిలో ఇప్పటివ‌ర‌కు 51 ఐ.సి.యు, 213 నాన్ ఐ.సి.యు. ప‌డ‌క‌ల‌కు క‌ల‌సి మొత్తం 264 ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఏర్పాటు చేశామ‌న్నారు. 9 ప‌నుల్లో 7  ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌రో రెండు ప‌నులు ప్రారంభం కావ‌ల‌సి వుంద‌ని చెప్పారు. మూడు ఆసుప‌త్రుల్లో పి.ఎస్‌.ఏ. ప్లాంట్‌లు, ఒక చోట ఆర్‌.టి.పి.సి.ఆర్‌. ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క‌మ్యూనిటీ ఆసుప‌త్రులు, ఏరియా ఆసుప‌త్రుల్లో న‌బార్డు నిధుల‌తో 8 ప‌నులు రూ.58.10 కోట్ల ఒప్పంద విలువ‌తో న‌బార్డు నిధుల‌తో చేప‌ట్టామ‌ని, ఈ ప‌నుల‌న్నీ కొన‌సాగుతున్నట్టు వివ‌రించారు. ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం ముళ్ల కంప‌లు తొల‌గించే ప‌నులు జ‌రుగుతున్నట్టు పేర్కొన్నారు. పి.హెచ్‌.సి.ల అప్ గ్రెడేష‌న్ కింద 68 ప‌నుల‌ను రూ.48.24 కోట్లతో చేప‌ట్టామ‌ని వివ‌రించారు. కొత్తగా మ‌రో 12 పి.హెచ్‌.సిల ప‌నులు రూ.2.17 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు. ఆసుప‌త్రుల్లో మ‌ర‌మ్మత్తుల‌కు సంబంధించి 56 ప‌నుల‌ను రూ.26.48 కోట్లతో చేప‌ట్టామ‌న్నారు.

అంత‌కుముందు ఎం.డి. ముర‌ళీధ‌ర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని గాజుల‌రేగ వ‌ద్ద ప్రభుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ ప్రాంతాన్ని జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ తో క‌ల‌సి ప‌రిశీలించారు. ఏ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. అధికారులు ఎస్.ఇ. శివ‌కుమార్‌, ఇ.ఇ. స‌త్యప్రభాక‌ర్ త‌దిత‌రులు నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లను వివ‌రించారు. క‌లెక్టరేట్ స‌మావేశంలో జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.సీతారామ‌రాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి, రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఎస్‌.ఇ. విజ‌య‌శ్రీ‌, ప్రజారోగ్య ఇంజ‌నీరింగ్ ఎస్‌.ఇ. శ్రీ‌నివాస‌రావు, పంచాయ‌తీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్‌.వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-27 13:56:55

ఏడువేల డోసుల పీసీవీ వేక్సిన్లు జిల్లాలో సిద్ధం..

న్యుమోనియా నుంచి చిన్న పిల్లలను రక్షించడానికి  న్యుమోకోకల్ కాంజుగేట్ టీకా (PCV) యూనిర్సల్ ఇమ్యునైజెషన్ ప్రోగ్రాం కు సంబందించి  చిన్నారులకు వేసేందుకు 7 వేల డోస్ లు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  వైద్యాధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.  గ్రామీణ, పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత మండలాలలో మలేరియా,  డెంగ్యూ కేసుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి  పెట్టాలన్నారు. 27 మండలాలలో మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.  ఆయా ప్రాంతాలలో  యాంటీ మలేరియా ఆపరేషన్ లను నిర్వహించడం, ఫాగింగ్ చేయడం,  మురికి నీరు, నిల్వనీరు లేకుండా ఆయా పంచాయితీలలో పారిశుధ్యాన్ని  ప్రత్యేకంగా చేయాలన్నారు.  ఆయా ప్రదేశాలలో  ఆయిల్ బాల్స్ వేయడం తో పాటు మాపింగ్ చేయాలన్నారు.  ఇందుకు సంబందించి మలేరియా సిబ్బందితో  పాటు సర్పంచ్ లు  ప్రత్యేక శ్రద్ద కనపర్చాలన్నారు.  డాక్టర్లు సంబందిత సచివాలాయలకు తనిఖీలు చేయాలని ఫీవర్ కేసులు గుర్తిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయడం  టెస్ట్ చేసిన రిపోర్టులను డి. ఎం. హెచ్ .ఓ కార్యాలయానికి పంపించి ట్రీట్ మెంట్ మొదలు పెట్టాలన్నారు.  ఏ వ్యక్తి కూడా మలేరియా డెంగ్యూ జ్వరాలకు చనిపోకుండా మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంచడం, ప్రసార మాధ్యమాల  ద్వారా విసృత ప్రచారం చేయాలన్నారు. జ్వరాల సీజన్ మొదలవక ముందే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరైయారు.

Visakhapatnam

2021-08-27 13:40:04

ప్రత్యేక కోవిడ్ డ్రైవ్ విజయవంతం కావాలి..

విశాఖ జిల్లా, నగరంలో ఈ నెల 28,31, తేదీలలో  18-44 సంవత్సరాల వయస్సుగల ప్రతి ఒక్కరికి ప్రత్యేక  కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద  జిల్లా వ్యాప్తంగా  అన్ని పి.హెచ్.సి., సి.హెచ్.సిలలో మొదటి  డోస్ ప్రక్రియ శాచ్యురేషన్ మోడ్ లో నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులను ఆదేశించారు.  శుక్రవారం వి.ఎం .ఆర్ .డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో   జిల్లా స్థాయి వైద్యాధికారులు సమావేశాన్ని నిర్వహించారు.  
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్తర్వలను జారీ చేసిందన్నారు. జిల్లాలో 18-44 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ కు  1లక్ష 60వేల వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులో ఉన్నాయన్నారు.  గ్రామీణ మరియు పట్టణ సచివాలయ పరిధిలో సిబ్బంది ప్రత్యక శ్రద్ద వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.  నేడు శుక్రవారం 45 సంవత్సరాలు పై బడిన వారికి  2వ డోస్ వేయాలన్నారు.  3rd వేవ్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక వసతుల కల్పన, బెడ్స్, అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లలను సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటు గత నెలలో 2.4 శాతం నమోధైందన్నారు.  ఒక్క డెత్ కూడా రాకుండా చూడాలన్నారు.  ప్రతి ఒక్కరూ ఎస్.ఎం.ఎస్. ప్రోటోకాల్ నిబంధనలను పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఉల్లంషిుంచిన వారిపై పోలీసు ఫైన్ వేయాలన్నారు.
ఏజెన్సీ మండలాలలో ప్రజలు దోమ తెరలను సక్రమంగా వాడుకొనే విదంగా అవగాహన కల్పించాలన్నారు. పాడేరు, అరుకు ప్రాంతీయ ఆసుపత్రులలో  సర్జరీల నిర్వాహణకు సంబందించి మౌళిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఐ.టి.డి.ఎ., పిఓ రోణంకి గోపాలకృష్ణకు సూచించారు . పి.హెచ్.సి.లలో డెలివరీ కేసులను వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ కింద నమోదు చేయాలన్నారు.  తల్లి సురక్షా పథకం కింద  పేషెంటు డేటాను ఆరోగ్య మిత్రలో  లాగిన్ చేసి కేస్షీట్, డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలన్నారు.  వై.ఎస్.ఆర్.ఆరోగ్య ఆసరా కింద  పోస్టు డిస్చార్జ్ పేషెంటుకు  ఇన్ సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ అప్లోడ్ కు సంబందించి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు.  సీజనల్ వ్యాధులకు సంబందించి నెలలో ఒక సారి వైద్యాధికారులకు వెబ్ నార్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఎ.ఎం.సి ప్రిన్సిపాల్  డా. సుధాకర్ కు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  నిర్వహించే స్పందన  వీడియో కాన్పరెన్స్ లో వైద్య, ఆరోగ్యానికి  అధిక ప్రాముఖ్యత కల్పిస్తున్నారని  రానున్న 90 రోజుల్లో  వైద్య శాఖలో  ఉన్న ఖాళీలను  భర్తీ  చేయనున్నారని  ఖాళీల వివరాల డేటా ను  ప్రభుత్వానికి  పంపించాలని  డి .ఎం .హెచ్.ఓ ను ఆదేశించారు.
 
జి.వి.ఎం.సి కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ  జి.వి.ఎం.సి పరిధిలో మలేరియా హట్ స్పాట్ ఏరియాలను గుర్తించి  నిల్వనీరు లేకుండా ఇంటి పరిసరాలలో పారిశుధ్యం నిర్వహించడం తో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించడం జరుగుతుందని  తెలిపారు.  ప్లేట్ లెట్స్ అవసరం అవుతున్నందున బ్లెడ్ డోనేషన్ క్యాంపులను  నిర్వహించడానికి వైద్యాధికారులు   ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ  పి.హెచ్.సిలను తనిఖీలు చేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ రాగానే ఏజెన్సీకి పంపించడం జరుగు తుందన్నారు.  వైద్యాధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. 

ఐ.టి.డి.ఎ. పిఓ రోణంకి  గోపాలకృష్ణ మాట్లాడుతూ  ఏజెన్సీ ఏరియాలో  2లక్షల 10వేల కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లను వేయడం జరిగిందన్నారు.  3RD  వేవ్ దృష్టిలో పెట్టుకొని  అన్ని పి.హెచ్.సిలలో  బెడ్స్, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ లను సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు.  ఆసుపత్రులలో సర్జరీల ఏర్పాటు కు సంబందించి పనులను  ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు.  ఏజెన్సీ ఆసుపత్రులలో పని చేయుటకు కాంట్రాక్ట్ బేసిస్ మీద  పి జి. డాక్టర్లు పీడియాట్రీషియన్స్, ఎనస్తిషియన్ ,గైనిక్ డాక్టర్లకు  ప్రత్యే ఎలవెన్స్ తో  భర్తీ చేయడానికి నోటిఫికేషన్  ఇవ్వనున్నామన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా వైద్యాధికారి డా.సూర్యనారాయణ,  ఎ .ఎం .సి ప్రిన్సపాల్ డా.సుధాకర్, డి.సి.హెచ్.ఎస్. డా. ప్రకాషరావు, వైద్యాధికారులు హాజరయ్యారు.

విశాఖ సిటీ

2021-08-27 13:38:54

శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ..

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు. ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 7.30 గంట‌ల‌కు మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. ఉద‌యం 8 నుండి 8.20 గంట‌ల మ‌ధ్య క‌న్యాల‌గ్నంలో  శ్రీ వేణుగోపాల‌ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభార్చన, మ‌హా సంప్రోక్ష‌ణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జ‌రిగాయి.  ఉద‌యం 10.30 గంట‌ల నుండి  భక్తులను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.        సాయంత్రం 4.30 నుండి  6 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు క‌ల్యాణోత్స‌వం, రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఊరేగింపు నిర్వ‌హిస్తారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో   పార్వ‌తి, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్య‌, ఏఈవో  దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్  ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  కుమార్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.  

కార్వేటినగరం

2021-08-27 13:32:50

సంప్ర‌దాయ భోజ‌నాన్ని స్వీక‌రించిన ఈవో..

గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో వండిన సంప్ర‌దాయ భోజ‌నాన్ని శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వీక‌రించారు. తిరుమ‌ల అన్న‌మయ్య భ‌వ‌నం క్యాంటీన్‌లో టిటిడి గురువారం నుండి వారం రోజుల పాటు సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాత‌ల స‌హకారంతో తిరుమ‌లలో సంప్ర‌దాయ భోజ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తులతో త‌యారుచేసిన ఆహారాన్ని భుజించ‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, క‌రోనా స‌మ‌యంలో శాస్త్రవేత్త‌లు కూడా ఇలాంటి ఆహారంపై చ‌ర్చిస్తున్నార‌ని తెలిపారు. ప‌ట్ట‌ణ‌వాసుల‌తో పోల్చుకుంటే గ్రామాల్లో స‌హ‌జసిద్ధంగా ల‌భించే ఆహారం తీసుకునే వారికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపడం, గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా గోమాత‌ను ర‌క్షించుకోవ‌డం టిటిడి ముఖ్య ఉద్దేశాల‌ని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సంప్ర‌దాయ భోజ‌నాన్ని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ముడిప‌దార్థాల‌న్నీ సిద్ధం చేసుకుని శాశ్వ‌త ప్రాతిప‌దికన దీన్ని అమ‌లుచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. ఈవో వెంట టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈఓ  హరీంద్రనాథ్, బోర్డు మాజీ సభ్యులు  శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-27 13:29:58

నవనీత సేవ ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌..

శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను శుక్ర‌వారం నాడు తిరుమ‌ల‌లోని గోశాల‌లో టిటిడి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం, శంఖునాదంతో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అనంత‌రం శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి పూజ‌లు చేశారు. నాలుగు కుండ‌ల్లో పెరుగు నింపి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌వ్వాల‌తో చిలికారు.  కాగా, ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం కానుంది. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌, లోక‌నాథం, టిటిడి బోర్డు మాజీ సభ్యులు  శివకుమార్, దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు  విజ‌య‌రామ్, చిరుధాన్యాల ఆహార నిపుణులు  రాంబాబు, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-27 13:28:30

క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేయాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని విభాగాలకు చెందిన స‌మ‌స్త స‌మాచారాన్ని అవ‌గాహ‌న చేసుకోవాల‌ని జెఈవో స‌దా భార్గ‌వి సూచించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావంతో ప‌నిచేసి సంస్థ ప్ర‌తిష్ట‌ను పెంచేలా కృషి చేయాల‌న్నారు. కొత్తగా నియ‌మితులైన ఏఈవోల‌కు వారం రోజుల‌పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. సూప‌రింటెండెంట్లుగా ప‌ని చేస్తూ ఏఈవోలుగా ప‌దోన్న‌తి పొందిన 11 మందికి శుక్ర‌వారం సాయంత్రం నియామ‌క ఉత్త‌ర్వులు అందించారు. ఈ సంద‌ర్బంగా ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో జెఈవో వారితో స‌మావేశ‌మ‌య్యారు. జెఈవో మాట్లాడుతూ, విధి నిర్వ‌హ‌ణ‌లో నైపుణ్యం ప్ర‌ద‌ర్శించి, అప్ప‌గించిన ప‌నులు నిర్ణీత‌ వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌న్నారు. ఉద్యోగులు స‌మయానికి కార్యాల‌యాల‌కు వ‌చ్చేలా చూసుకోవాల‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తి రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి కార్యాల‌యాల‌కు రావాల‌న్నారు.  ముఖ్య‌మైన ఫైళ్ళు కంప్యూట‌ర్‌తో పాటు రిజిస్ట‌ర్ రూపంలో కూడా భ‌ద్ర ప‌రుచుకోవాల‌ని అన్నారు.  ఉద్యోగులకు రావ‌ల‌సిన అన్ని ర‌కాల మొత్తాల‌ను రిటైర్‌మెంట్ రోజే చెక్కు ద్వారా అందించే ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద్యోగి రిటైర్డ్ కావ‌డానికి ఆరు నెల‌ల ముందు నుంచే ఏఈవోలు ఈ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని చెప్పారు. కారుణ్య నియ‌మ‌కాల విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకుని మ‌ర‌ణించిన‌ ఉద్యోగి  కుటుంబీకుల నుంచి 11 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు స్వీక‌రించి 30 రోజుల్లోపు ఉద్యోగం వ‌చ్చేలా చూడాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి పాల్గొన్నారు.

Tirupati

2021-08-27 13:25:59

అవ్వా మీకు పథకాలు అందుతున్నాయా..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు.శుక్రవారం కాకినాడ 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారం కృష్ణుడి గుడి వద్ద జేసీ లక్ష్మీశ.. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరు శుక్రవారం, శనివారాలలో "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో గల ప్రతి వార్డు సచివాలయ పరిధిలోగల ప్రతి ఇంటిని సంబంధిత సచివాలయ కార్యదర్శి, వాలంటీర్లు సందర్శించి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు, ప్రభుత్వం అందించే వివిధ సేవలుపై  ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరుతో పాటు ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం ద్వారా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ఒక గ్రూపుగా ఏర్పడి సచివాలయం, వాలంటీర్ల పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అందిస్తున్న సేవల వివరాలు తెలియపరచడం  జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడంతో సంక్షేమ పథకాలు అమలులో ఎదురవుతున్న అవరోధాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని స్థానిక సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గడప వద్దకు వెళ్లి విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ లక్ష్మీశ తెలిపారు.  కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సిటిజన్ ఔట్రీచ్  కార్యక్రమాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత జేసీ, కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2021-22 , వార్డు సచివాలయ సిబ్బంది వివరాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి, గృహాల వద్దకు వెళ్లి ప్రజలతో ప్రభుత్వం అందిస్తున్న సేవల వివరాలను ఈ సందర్భంగా తెలియజేసి, వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాద్, అదనపు కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కార్పొరేటర్లు గోడి సత్యవతి, జేడీ పవన్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-27 13:23:02

జిల్లాలో తాత్కాలికంగా పునరుద్ద‌ర‌ణ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్వ‌తీపురం-శ్రీ‌కాకుళం ప్ర‌ధాన ర‌హ‌దారిపై తోట‌ప‌ల్లి కుడికాల్వ‌పై క‌ల్వ‌ర్టుకు పెద్ద గుంత‌లు ఏర్ప‌డి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డిన నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశాల మేర‌కు జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు బుధ‌వారం యుద్ద‌ప్రాతిప‌దిక‌న మర‌మ్మ‌త్తులు చేప‌ట్టి సాయంత్రానికి తాత్కాలికంగా పున‌రుద్ద‌రించారు. రోడ్లు భ‌వ‌నాల శాఖ ఆధ్వ‌ర్యంలో ఉన్న ఈ రోడ్డుపై ఉల్లిభ‌ద్ర క‌ల్వ‌ర్టుకు పెద్ద గుంత‌లు ఏర్ప‌డ‌టంతో ట్రాఫిక్ నిలిచిపోయిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఆ రోడ్డును త‌క్ష‌ణం పున‌రుద్ద‌రించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన తోట‌ప‌ల్లి ప్రాజెక్టు అధికారులు ఆర్ అండ్ బి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని జెసిబి త‌దిత‌ర యంత్రాల‌ను వినియోగించి రోడ్డుపై ఏర్ప‌డిన గుంత‌ల‌ను తాత్కాలికంగా పూడ్చి రాక‌పోక‌ల‌కు వీలుగా ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారి ఏర్పాటు చేశారు. సాయంత్రం క‌ల్లా ఈ మార్గంలో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి రాక‌పోక‌లను పున‌రుద్ద‌రించ‌డం జ‌రిగింద‌ని తోట‌ప‌ల్లి ఎస్‌.ఇ. సుగుణాక‌ర్ రావు తెలిపారు.

Vizianagaram

2021-08-25 15:52:11