1 ENS Live Breaking News

మసగ్ర భూ సర్వేకి ప్రత్యేక ప్రణాళికలు..

వైఎస్సార్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష కార్య‌క్ర‌మానికి సంబంధించి స‌మ‌గ్ర భూ రీస‌ర్వే కార్య‌క‌లాపాలు ప్ర‌ణాళిక ప్ర‌కారం ద‌శ‌ల వారీగా కొన‌సాగుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. బుధ‌వారం విజ‌య‌వాడ నుంచి కేంద్ర పంచాయ‌తీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ అలోక్ ప్రేమ్‌న‌గ‌ర్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి సీసీఎల్ఏ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌.. భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌, రీస‌ర్వేపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, పంచాయ‌తీరాజ్‌, స‌ర్వే అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వే ఆఫ్ విలేజ‌స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాల‌జీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వా) కార్య‌క్ర‌మానికి స‌మాంత‌రంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మ‌మైన భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌, రీస‌ర్వే ప‌నుల‌ను ప్ర‌త్యేక బృందాలతో నిర్వ‌హిస్తున్న తీరును వివ‌రించారు. డ్రోన్ ఫ్ల‌యింగ్ స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌ను ద‌శ‌ల వారీగా పూర్తిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం డ్రోన్ ఫ్ల‌యింగ్‌, ఓఆర్ఐ మ్యాప్స్‌, గ్రౌండ్ ట్రూతింగ్ త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. జిల్లా పంచాయ‌తీరాజ్‌, స‌ర్వే అధికారుల‌తో స‌మీక్షించారు. స‌మావేశానికి జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

Kakinada

2021-08-18 15:15:55

పొగాకు వాడ‌కాన్ని నియంత్రించాలి..

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ధూమ‌పానంపై, పొగాకు వాడకంపై నియంత్ర‌ణ  ఉండాల‌ని జేసీ మ‌హేష్ కుమార్ అభిప్రాయ‌పడ్డారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ధూమపానం చేయ‌కుండా సంబంధిత అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో జ‌రిగిన నేష‌నల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు. పొగాకు వాడ‌కాన్ని త‌గ్గించేందుకు చ‌ట్టంలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, జ‌రిమానాలు విధించాల‌ని చెప్పారు. ముఖ్యంగా యువ‌త పొగాకు వాడకానికి ద‌గ్గ‌ర కాకుండా చూడాల‌న్నారు. పిల్ల‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించారు. అనంత‌రం పొగాకు వాడ‌కంపై హెచ్చ‌రిక‌లు, సూచ‌న‌ల‌తో కూడిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మాల్లో జేసీ జె. వెంక‌ట‌రావు, టొబాకో స్టేట్ క‌న్స‌ల్టెంట్ శివ‌కుమార్‌, డీఎం &హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, డీఐవో డా. గోపాల కృష్ణ‌, అద‌నపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అద‌నపు డీఎం & హెచ్‌వో రామ్మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు, వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-18 15:13:39

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి..

క‌రోనా మూడో ద‌శ‌ను ఎదుర్కొనేందుకు అన్ని ర‌కాలుగా సిద్ధంగా ఉండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్ కుమార్ అధికారుల‌కు సూచించారు. జిల్లాలో గుర్తించిన 15 ఆసుప‌త్రుల్లో అన్ని ర‌కాల‌ వ‌స‌తులు స‌మ‌కూర్చుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో తీసుకొనే చ‌ర్య‌లు, అనుస‌రించాల్సిన ప‌ద్దతుల‌పై చ‌ర్చించేందుకు జేసీ జిల్లా వైద్యారోగ్య శాఖ‌, ఇత‌ర అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో గుర్తించిన 15 ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో ముంద‌స్తు ఏర్పాట్లు జ‌రిగేలా, అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. మూడో ద‌శ‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముందుగానే అప్ర‌మ‌త్తంగా  ఉండాల‌ని ఆదేశించారు. మొద‌టి రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని జాగురూక‌త వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.  డీఎం &హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, డీఐవో డా. గోపాల కృష్ణ‌, అద‌నపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అద‌నపు డీఎం & హెచ్‌వో రామ్మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు, వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-18 15:12:50

19 సాయంత్రం వరకూ ఆగ్రి గోల్డ్ నమోదు..

అగ్రి గోల్డ్ స్కీం లో డబ్బు చెల్లించిన ఒరిజినల్ రసీదు ఉన్నవారు గడువు లోపు నమోదు చేయించుకొలేని వారు లేదా గ్రామ వలంటీర్లు డేటా ఎంటర్ చేయకుండా ఉన్నవారు సమీప ఎంపీడీఓ కార్యాలయాలలో తమ డాక్యుమెంట్లు ఇవ్వవచ్చని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వటం జరిగిందనీ ఆయన చెప్పారు.  తరువాత ఎట్టి పరిస్థితుల్లోను కొత్త దరఖాస్తులు అంగీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-18 15:02:21

న్యాయ సలహా మేరకే దుకాణాలు అప్పగింత..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం బుధవారం స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది.  143 దుకాణాలను గుత్తేదారులకు ఇచ్చే అంశంపై వాయిదా వేశామని తెలిపారు.  ఈ అంశంపై న్యాయ సలహా కోరామని,  న్యాయ సలహా వచ్చిన తర్వాత ఆయా దుకాణాలను గుత్తేదారులకు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.  143 దుకాణాలు నుండి తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు గుత్తేదారులు నుండి వసూలు చేయాలని స్థాయి సంఘం నిర్ణయించిందని,  నిధులు వసూలు అయిన తర్వాత  న్యాయ సలహా, స్థాయి సంఘం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని అంతవరకూ ఈ అంశము వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు, అదనపు కమిషనర్ అవ్వారి వెంకట రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డి.సి.(రెవెన్యూ) పి. నల్లనయ్య, కార్యదర్శి లావణ్య, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-08-18 14:34:21

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందు ఉండాలి..

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో శ్రీకాకుళం జిల్లా ముందు ఉండాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సంబంధిత అధికారులతో బుధ వారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జిఎస్టి, కర్మాగారాలు, బాయిలర్లు, భూగర్భ జలవనరులు, డ్రగ్స్, మునిసిపాలిటీ, రెవిన్యూ, పరిశ్రమలు, కార్మిక శాఖ, పర్యాటక, పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలు వీటిలో ప్రధానంగా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు. ఈ శాఖల క్రింద 402 విభాగాల వినియోగదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఎంత సులభంగా సేవలు పొందవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఆగస్టు చివరి వారంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్యాలయానికి భౌతికంగా రాకుండానే దరఖాస్తు చేయడం, సంబంధిత పత్రాలు పొందడం జరగాలని ఆ విధానం ఏ మేరకు ఉపయుక్తంగా ఉందో పరిశీలించాలని ఆయన అన్నారు. విధానాల్లో మంచి మార్పులకు సూచనలు స్వీకరించాలని వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతోందని ఆయన వివరించారు. మంచి విధానాల సూచనలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇంకా మెరుగు పడుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.ఉమామహేశ్వర రావు, జిఎస్టి సహాయ కమీషనర్ రాణి మోహన్, జిల్లా అగ్ని మాపక అధికారి సి.హెచ్.కృపావరం, కార్మిక శాఖ ఉప కమీషనర్ ఎస్.డి.వి ప్రసాద రావు, జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ, పర్యావరణ ఇంజినీర్ ఎస్.శంకర నాయక్, కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణ, భూగర్భ జల వనరుల శాఖ ఎడి లక్ష్మణ రావు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-18 14:31:32

హడ్కో కాలనీలో గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్..

పరిశుభ్రమైన శ్రీకాకుళం నగరం ఆవిష్కృతం కావాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు పిలుపునిచ్చారు. 47 వ డివిజన్ హడ్కో కాలనీలో  గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్  ఓబులేసు బుధవారం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తమ వీధివాడలతో  సహా నగరాన్ని పరిశుభ్రముగా ఉంచుటకు సహకరించాలని కోరారు. నగరంలో తడి, పొడి చెత్త, ఇతర వృధా పరికరాలను వేయుటకు మొత్తం మూడు రంగుల బట్టలను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది జ్ఞానేశ్వర్, రామినాయుడు, వాలంటీర్స్ సాహు, చిరంజీవి,ధనలక్ష్మి, దివ్య , మాజీ కౌన్సిలర్ ఏ. రామ్మోహన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-18 14:15:07

జెర్సీ కోడెదూడలను వదిలిపెడితే చర్యలు..

పాలుతాగే జెర్సీ కోడెదూడలను రైతులు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో వాటిని తొలి పావంచ దగ్గర విడిచిపెట్టడం మహాపాపమని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సింహాచలం కొండకింద తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన జెర్సీ, సంకరజాతి కోడెదూడలను మంత్రి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి నుంచి లేలేత దూడలను వేరుచేయడం సరికాదని..  ఇకపై అలాంటివాటిని తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. సింహాచలం చుట్టుపక్కలా చెక్ పోస్టులు పెట్టి వాటిని ఎవరైనా తీసుకొస్తే వెనక్కి పంపాలని సూచించారు. జబ్బుతో ఉన్నవాటిని తీసుకురావడం మహో ఘోరమన్నారు. దేవునికి నైవేధ్యం పెట్టేటప్పుడే ఎంతో జాగ్రత్తగా ఉంటామని అలాంటిది మొక్కుబడులు తీర్చుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు సూచించారు. ఇంట్లో జబ్బుతో ఉన్నమనిషుంటే బయట పారేస్తామా అంటూ ప్రశ్నించారు.  గోవులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి గోవులను  కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. కాశీవెళ్లి గంగలో మునిగినప్పుడు మనకిష్టమైనవి వదిలేస్తామని కష్టమైనవికాదన్నారు. అలాంగే వదింలించుకోవాలనుకున్న సంకరజాతి, జబ్బుతో ఉన్న లేగదూడలను వదిలించుకోవడం సరికాదన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దేశవాళి ఆవులనే శ్రీ సింహాద్రి అప్పన్నస్వామికి మొక్కులుగా సమర్పించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  ముందుగా మనిషినని.. తర్వాత అప్పన్నస్వామి భక్తుడినని.. ఆ పైనే మంత్రినని చెప్పుకొచ్చారు అవంతి. గోవులు, దేవాలయానికి చెందిన ఏ విషయంపైనైనా స్పందిస్తానన్నారు.  గోవుల విషయంలో పోలీసు, దేవస్థానం, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.  జెర్సీ కోడెదూలను విడిచిపెట్టరాదంటూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.

Simhachalam

2021-08-18 14:11:43

అప్పన్నకు రూ.2.276లక్షలు విరాళం..

సింహాచలం శ్రీశ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారికి రాష్ట్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  కె.వెంకటేశ్వరావు రూ.2.276లక్షలు విరాళంగా సమర్పించారు. దాత తల్లిండ్రులు కొల్లా చిన్న, చిన్నమ్మడులు పేరిట అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కును  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో చందన సమర్పణకు కలిపి ఆ మొత్తాన్ని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకొని మొక్కలు తీర్చుకున్నారు. వీరితో పాటు మరికొందరు భక్తులు చందన, అన్నప్రసాదం కు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హేమంత్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అలయ అర్చక స్వాములు పాల్గొని స్వామివారి పూజలు నిర్వహించారు.

Simhachalam

2021-08-17 16:14:13

థర్డ్ వేవ్ కి ముందస్తు చర్యలు చేపట్టండి..

కోవిడ్ మహమ్మారి మూడవ దశ వ్యాప్తికి ఇప్పటినుండే ప్రత్యేక చర్యలు చేపట్టాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరంలో డా. జి. సృజనతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ విస్తృతంగా వ్యాక్సినేషన్ వేయించాలని, కోవిడ్ పరీక్షలు చేసి వ్యాధి సోకిన వారికి ప్రత్యేకమైన వైద్యం అందించాలని, జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని, కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ అయిన రోగిని హాస్పిటల్ కి తరలించుటకు 108, 104 వాహనాలను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, వార్డుల వారీగా కంటైన్మేంట్ జోనులు ఏర్పాటు చేయాలని, బరియల్ గ్రౌండ్లో అందరికీ తెలిసే విధంగా దహనానికి అయ్యే ఖర్చులను నోటీస్ బోర్డ్ లో పెట్టాలన్నారు. జోనల పరిధిలోని హాస్పిటల్స్, వెంటిలేటర్లు, బెడ్డులను గతం కంటే అధికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైపోక్లోరైట్, బ్లీచింగ్, శానిటైజర్లు వంటివి నిల్వ చేసుకోవాలని, సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలని, అందుకు ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫీవర్ సర్వే ఆపకుండా నిరంతరం సర్వే చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఎ.వి.రమణి, డి.ఎం.ఒ.హెచ్. డా. సూర్యనారాయణ, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి .శాస్త్రి, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, కోవిడ్ నోడల్ ఆఫీసరు డా. మురళి మోహన్, సిసిపి. విద్యుల్లత, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు,  పి.డి.(యు.సి.డి.) వై.ఎస్.ఆర్. శ్రీనివాస రావు, చీఫ్ వెటర్నరి డా. కిషోర్, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-17 16:04:01

పెండింగు దరఖాస్తులను పరిష్కరించండి..

పెండింగు లో ఉన్న స్పందన గ్రీవెన్స్ దరఖాస్తుల సర్వీస్ రిక్వెస్ట్ ను వెంటనే పరిష్కరిం చాలని ముఖ్య మంత్రి కార్యదర్శి సోల్మన్ ఆరోగ్య రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి కార్యదర్శి, జాయింట్ కలెక్టర్లు, అందరు మున్సిపల్ కమిషనర్లతో,  “సిస్కో వెబెక్ష్”  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగు లో ఉన్న ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ఏ ఏ స్థాయిలో పెండింగు లో ఉన్నాయో, పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. అన్ని సంక్షేమ పధకాలు అందరికి సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సంక్షేమ పధకాలు ఆన్లైన్లలో పొందు పరిచే సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అని తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలియజేశారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన బదులిస్తూ జివిఎంసి పరిధిలోని పెండింగు లో ఉన్న అన్ని ఆర్జీలను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేశారు.

GVMC office

2021-08-17 15:49:12

అల్పపీడనం పట్ల అప్రమత్తంగా ఉండలి..

అల్పపీడనం ఏర్పడడంతో రానున్న 2, 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జివిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె 3, 4వ జోన్ల పరిధిలోని పాండురంగా పురం, ఆర్. కె. బీచ్, ఫిషింగ్ హార్బర్, పాత పోస్టాఫీసు, ఇందిర ప్రియదర్శిని స్టేడియం రోడ్డు, కాన్వెంట్ జంక్షన్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడా గెడ్డలు, కాలువలు పొంగకుండా వాటిలోని వ్యర్దాలను తొలగించాలని, కాలువలు శుభ్రంచేసిన వెంటనే కాలువలపై కప్పులు మూయాలని ఆదేశించారు. పాండురంగాపురం పరిధిలో కేబుల్ వైర్లు చాల చోట్ల అస్తవ్యస్తంగా కింద పది ఉన్నాయని, వీటిని వెంటనే తొలగించాలని, డిప్లోయ్మెంట్ ప్లాన్ ప్రకారం పారిశుధ్య కార్మీకులకు సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ సూపర్వైజర్ను ఆదేశించారు. చాల చోట్ల, చెట్ల కొమ్మలు పడియున్నాయని,   బహిరంగ ప్రదేశాలలో చెత్త కుప్పలు అధికంగా కనిపిస్తున్నాయని వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, రాత్రిలు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలు కింద చెత్త అధికంగా ఉంటుందని, వాటిని శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివప్రసాద్, కార్య నిర్వాహక ఇంజినీరు  చిరంజీవి, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-17 15:41:57

గాజువాక జర్నలిస్టులకు మద్దతుగా APUWJ

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహారదీక్షకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విశాఖ రూల్ కమిటీ  సంఘీభావం తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులను పరామర్శించింది. వారికి సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొంది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడలు పసుపులేటి రాము, రూరల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ బీఎల్ స్వామిలు పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరికీ పాత నిబంధనల ప్రకారమే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న మధ్య తరగతి పత్రికలకు జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పెద్ద పత్రికలు, మీడియా మాదిరిగా అన్ని రకాల పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ అడిక్రిడేషన్ కమిటీ సభ్యులు చంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు, గాజువాక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-08-17 15:25:42

ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలి..

ఆర్ బి కె ల ద్వారా ఎరువులు, పురుగుమందులను రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో  కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబందించి   ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, పంటల యొక్క స్థితిగతులపై మండల వ్యవసాయ అధికారులు   రోజు వారి జాగ్రత్తలపై రైతులకు  తెలియజేయాలని ఆదేశించారు. రైతుల పంటలకు సంబందించి  ఈ క్రాప్ బుకింగ్ ను  ఖచ్చితంగా నమోదు చేయాలని అదే విధంగా ఈ కె వై సి  కూడా త్వరితగతిన ముగించాలన్నారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.  రైతులకు ఆధునిక వ్యవసాయం పై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖలలో జరుగుతున్న పనుల ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు.  ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె డి లీలావతి, పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖల జాయింట్ డైరక్టర్లు, ఇతర అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-08-17 14:50:33

హౌసింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి పెరగాలి..

గృహనిర్మాణ పనులకు సంబంధించి ప్రతి వారం పురోగతి కనిపించాలని,  ఇంకా గ్రౌండింగ్ కాని గృహనిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ .డా. ఎ.మల్లిఖార్జున  సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా  ఆయన మాట్లాడుతూ  జగనన్న  కాలనీల లే అవుట్లలో మౌళిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. బేస్ మెంట్ లెవెలింగ్, ఇంటర్నల్  రోడ్లు, బోర్ వెల్స్, నీటి సరఫరా, విద్యుత్తు తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. హౌసింగ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పుటి కప్పుడు  క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలన్నారు.  లే అవుట్ లలో గృహాలు నిర్మించుకొనే విధంగా లబ్దిదారులను ప్రోత్సహించి  ప్రోగ్రస్ పెంచాలన్నారు.  లే అవుట్ లకు సంబందించి ఎక్కడైనా  వివాదాలు  ఉంటే  సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రూరల్ హౌసింగ్ కు సంబందించి ప్రతిపాదనలను వారాంతంలో గా పూర్తి చేయాలన్నారు.  ఇసుక, ఇనుము, సిమెంటు అవసరం మేరకు  ముందుగానే ఇండెంట్  పెట్టాలన్నారు.  మెటీరియల్ ను పెట్టడానికి గొడౌన్ లను సిద్దం చేసుకోవాలన్నారు. టిడ్కో గృహాలకు సంబందించి  మంజూరైన యూనిట్ లు అన్నింటికి మౌళిక వసతులను కల్పించాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ .గోవిందరావు,  హౌసింగ్, డ్వామా పిడిలు  ఎం . శ్రీనివాసరావు, సంధీప్, ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ రాజ్, టిడ్కో  ఎస్ ఇ లు రవికుమార్, సుధాకర్ రెడ్డి, కుమార్, జి.వి.ఎం .సి, ఆర్ అండ్ బి,  ఇ పి డి సి ఎల్ శాఖల అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-08-17 14:49:43