1 ENS Live Breaking News

కోవిడ్ నిబంధనలు అమలుచేయాలి..

ప్ర‌తీ పాఠ‌శాలలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని, దీనికి ప్ర‌ధానో పాద్యాయులు బాధ్య‌త తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. సోమ‌వారం నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభం కానున్న నేప‌థ్యంలో, విద్య‌, వైద్యారోగ్య‌శాఖాధికారుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో ఆదివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పాఠ‌శాలల్లో తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు, చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. జిల్లాలో 3,347 పాఠ‌శాల‌ల‌ను ఈనెల 16 నుంచి పునఃప్రారంభిస్తున్నామ‌ని,  త‌ర‌గ‌తి గ‌దికి 20 మంది విద్యార్థుల‌ను మాత్ర‌మే అనుమ‌తించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ విద్యార్థుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటే, రోజువిడిచి రోజు బ్యాచ్‌ల వారీగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని సూచించారు. పిల్ల‌ల్లో జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు లాంటి కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వారిని స్కూలుకు అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. ఏదైనా త‌ర‌గ‌తిలో కోవిడ్ పాజిటివ్ న‌మోదైన ప‌క్షంలో, ఆ త‌ర‌గ‌తిలోని పిల్ల‌లంద‌రికీ టెస్టుల‌ను నిర్వ‌హించాల‌ని అన్నారు. విద్యార్థుల‌కు మాస్కుల‌ను, శానిటైజ‌ర్‌ను ఇవ్వాల‌ని, చేతుల‌ను త‌ర‌చూ క‌డుగుకొనే ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి కూడా బ్యాచ్‌ల వారీగా, 10 నిమిషాల విరామంతో పంపించాల‌న్నారు.

           ప్ర‌తీరోజూ ఏఎన్ఎంలు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఒక్కో ఏఎన్ఎం కు సుమారు 3 పాఠ‌శాల‌ల‌ను అప్ప‌గించాల‌న్నారు. పాఠ‌శాల‌ల‌ను రోజుకు మూడు సార్లు శాటినేష‌న్ చేయాల‌న్నారు. పిల్ల‌ల త‌ల్లితండ్రులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ వేక్సిన్ వేయించుకొనే విధంగా చైత‌న్య ప‌ర‌చాల‌ని సూచించారు. ప‌దిశాతం పాజిటివిటీ కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. మ‌న‌బ‌డి నాడూ-నేడు రెండో ద‌శ ప‌నులు సోమ‌వారం నుంచి లాంఛ‌నంగా ప్రారంభం కానున్నాయ‌ని, దీనికోసం ప్రాధ‌మికంగా జిల్లాలో 884 పాఠ‌శాల‌ల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్ వి ర‌మ‌ణ‌కుమారి, డిఇఓ జి.నాగ‌మ‌ణి, ఏపిసి డి.కీర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-15 14:58:35

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ మైదానం ఏర్పాటు చేసిన సాంస్క్కుతిక కార్యక్రమాలు ఎంతగానో ఆహుతులను ఆకట్టుకున్నాయి. సెయింట్ ఆన్స్ జగన్ నాయక్ పూర్ సెంయిటాన్స్ ఎయిడెడ్ హైస్కూల్, ఎ.ఎస్.డి. డిగ్రీ కళాశాల,  మున్సిపల్ హైస్కూల్, చర్చిస్క్వేర్  విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలలో ఉత్తమ ప్రదర్శన గాను సెయింట్ ఆన్స్ జగన్నాయక్ పూర్, ఎ.ఎస్.డి. డిగ్రీ కళాశాల, మున్సిపల్ హైస్కూల్, చర్చిస్వ్కేర్  విద్యార్థుల ప్రదర్శనలు వరుసగా ప్రధమ ,ద్వితీయ ,తృతీయ బహుమతులు అందుకున్నాయి. ఈ వేడుకలలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్, కలెక్టర్ సి.హరికిరణ్ ,యాస్పీ యం. రవీంద్రనాథ్ బాబు, ఎపిఎస్పి 3వ బెటాలియన్ కమాండెంట్ సుమీత్ గరుడ్,  రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులురి దొరబాబు, రాష్ట్ర దృశ్య కళల ఛైర్మన్ కుటికలపూడి శైలజ, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, కుడా  చైర్మెన్ చంద్రకళ దీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి బులిరాజు, జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మీశ, జి.రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అడిషనల్ ఎస్పి కరణం కుమార్, ట్రైనీ కలెక్టర్  గీతాంజలి శర్మ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ ఆర్డిఓ ఎజి చిన్ని కృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  ఈ కార్యాక్రమానికి వ్యాఖ్యాతలుగా ఎం.కృష్ణమూర్తి, పి.సుదేష్ణ వ్యవహరించారు.  

Kakinada

2021-08-15 12:57:55

అభివ్రుద్ధే లక్ష్యంగా కలిసి పనిచేద్దాం..

జాతి సమగ్రత, అభివృద్ది కొరకు కుల,మత, బాష, ప్రాంతాల కతీతంగా  సమిష్టిగా  కలిసి కృషిచేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.  ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతి గౌరవం ఉట్టిపడేలా ఘనంగా జరిగాయి.  ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా హాజరై  జాతీయ పతాకావిష్కరణ చేసి,  సాయుధ దళాలు నిర్వహించిన సాంప్రదాయ సమ్మాన్ గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ వందనాలను స్వీకరించారు.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో అమలౌతున్న  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రసంగించారు.  ఈ సందర్భంగా తమ నిస్వార్థ, నిరుపమాన త్యాగాలతో నేటి తరానికి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన మహనీయులకు వినమ్ర అంజలి ఘటించి కృతజ్ఞతలు తెలియజేశారు.  స్వాతంత్ర్య సమరంలో ప్రజలంతా ఏక త్రాటిపై నిలిచి పోరాటం జరిగిపిన రీతిలోనే, నేడు మానవాళికి పెనుముప్పుగా సవాలు చేస్తున్న కరోనా మహమ్మారిపై మరోమారు సమిష్టిగా ఉద్యమిద్దామని ప్రజలకు మంత్రి పిలుపు నిచ్చారు.  ప్రజా సంక్షేమం, సత్వరాభివృద్ది లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్న కార్యక్రమాలు జిలాల్లో విజయవంతంగా అమలు చేస్తూ, వాటి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామన్నారు.  రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో 39,671 మంది రైతులకు వై.ఎస్.ఆర్ సున్నావడ్డీ పధకం క్రింద 6 కోట్ల 30 లక్షల వడ్డీ రాయితీని, వై.ఎస్.ఆర్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ పధకం ద్వారా 4.54 లక్షల మంది రైతుల ఖాతాలకు తొలివిడతగా 341 కోట్లు సహాయాన్ని జమచేశామని తెలిపారు.  

అలాగే వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా పధకం క్రింద 1,47,726 మంది రైతులకు 219.26 కోట్ల రూపాయల భీమా పరిహారం ఖరీఫ్ ప్రారంభానికి ముందే సరైన సమయంలో అందించామని,  రబీ సీజనులో 375 పిపిసి కేంద్రాలు ద్వారా 91,433 మంది రైతులకు చెందిన 11.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసామన్నారు.  మత్స్యకార భరోసా పధకం ద్వారా వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన 30,213 మత్స్యకార కుటుంబాలకు 30.21 కోట్ల రూపాయల సహాయాన్ని అందిచామన్నారు.  వివిధ వర్గాల ఆర్థికాభివృద్ది కొసం వైఎస్ఆర్ చేయూత పధకం క్రింద 423.35 కోట్లు, కాపు నేస్తం పధకం క్రింద 279.81 కోట్లు, వై.ఎస్.ఆసరా పధకం క్రింద 2810 కోట్లు, వై.ఎస్.ఆర్ పింఛను కానుకగా ప్రతి నెలా 157.41 కోట్లు, వై.ఎస్.ఆర్ వాహన మిత్రం పధకం ద్వారా 36.38 కోట్లు, జనన్న తోడు పధకం ద్వారా 62.70 కోట్లు వడ్డీ, పూచికత్తు లేని రుణాలు, నేతన్న నేస్తం పధకం ద్వారా 17.02 కోట్లు ఆర్థిక సహాయలను లక్ష్యిత ప్రజలకు పంపిణీ చేశామని తెలియజేశారు. .  నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పధకం తొలిదశ క్రింద జిల్లాలోని 758 లే అవుట్లలో మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించి 73,610 గృహాల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. నాడు-నేడు తొలి దశగా జిల్లాలోని 1371 పాఠశాలలను 373.70 కోట్ల నిధులతో అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దామని, అమ్మ ఒడి పధకం ద్వారా 4.84 లక్షల మంది విద్యార్థులకు 726 కోట్లు, జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా 1,11,098 మంది విద్యార్థులకు 69.10 కోట్లు, జగనన్న వసతి దీవెన పధకం ద్వారా 1,06,331 మంది విద్యార్థులకు 101.47 కోట్లు వారి తల్లుల ఖాతాలకు జమ చేసామని మంత్రి తెలిపారు.

  కోవిడ్-19 మహమ్మారి నియంత్రణకు ముమ్మర వ్యాక్సినేషన్, ఆసుపత్రులలో చికిత్సా వసతుల అభివృద్ది చేపట్టామని, వ్యాధి నివారణలో ప్రభుత్వ కృషికి, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉపాధి హామీ పధకం క్రింద జిల్లాలో 3.91 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, 80 కోట్లతో 1248 గ్రామసచివాలయ భవనాలు, 43 కోట్ల నిధులతో 1209 రైతు భరోసా కేంద్రాలు, 32 కోట్ల నిధులతో 1100 హెల్త్ క్లినిక్ భవనాలు, 2.33 కోట్ల నిధులతో బల్క్ కూలింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు.  పోలవలం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 7 పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి కాగా మరో 19 కాలనీల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.  వైఎస్ఆర్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పధకం  ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాన్నా.  పారిశ్రామిక రంగంలో ఈ ఏడాది జిల్లాలో 60 కోట్ల పెట్టుబడితో 302 పరిశ్రమలు ఏర్పాటయి 2215 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నారు. సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు జారీ చేస్తూ, సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలకు 72.36 కోట్లు వివిధ ప్రోత్సాహకాలుగా అందించామన్నారు. జిల్లాలను అన్ని రంగాలలో ముందు నిలిపేందుకు చిత్త శుద్దితో కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లు, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా ప్రతినిధులు ప్రతిఒక్కరికీ మంత్రి కృష్ణదాస్ ధన్యవాదాలు తెలియజేసి, అందరి సమిష్టి కృషితో జిల్లా అభివృద్ది పధంలో మరింత ముందుకు సాగాలని కాంక్షించారు. అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో 20 ప్రభుత్వ శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శనను, హైస్కూల్, కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన దేశ భక్తి పూరిత సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.  ఉత్తమ శకట, సాంస్కృతిక ప్రదర్శనలకు, ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి కృష్ణదాస్ ప్రసంశాపత్రాలను అందజేశారు.  అలాగే వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ పధకాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను ఆయన తిలకించారు.

Kakinada

2021-08-15 12:53:35

స్వేచ్ఛా స్వరాలులో ప్రతిభచాటుకుంది..

75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని అమరావతి బాలోత్సవం, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన "స్వేచ్ఛా స్వరాలు" పోటీలలో విజయవాడకి చెందిన  కుమారి పుల్లట యుక్త శ్రీ (8) టాప్ ఫైవ్ లో నిలిచింది. వేమన పద్యాలు, దేశ భక్తి గీతాల విభాగాలలో రెండు మెమెంటోలు గెలుచుకుంది.  అమరావతి బాలోత్సవం గౌరవ అధ్యక్షులు సిహెచ్. మల్లికార్జునరావు చేతులమీదుగా యుక్త శ్రీ మెమెంటోలు, ఇంకా ప్రశంసా పత్రాలను అందుకుంది. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహించిన స్వేచ్ఛా స్వరాలు ఆన్ లైన్ పోటీలకు ముఖ్య అతిధిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.  అరసం నగర కన్వీనర్ పి. అజయ్ కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

Vijayawada

2021-08-14 15:18:56

అప్పన్నకు మంత్రి సీదిరి కుటుంభం పూజలు..

సింహాచలం  శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో మెట్ల మార్గంలో కొండపైకి మెట్లకు చందనం, పసుపు, కుంకుమ పూసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతోపాటు రంజిత్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్  అధినేత అన్నెపు రంజిత్ కుమార్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ర్యదర్శి నంబాల రాజేష్ కుమార్, పలాస వైకాపా సీనియర్ నాయకులు గౌరీ త్యాడి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, దేవాలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2021-08-14 13:34:05

అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానానికి ఆర్ధిక ఇబ్బందులు తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుంటామన్నారు. ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు కావడం ఆనందంగా వుందన్నారు. కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-14 13:17:02

కాకినాడలో పంద్రాగస్టుకి ఏర్పాట్లు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలో 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం ఉదయం కాకినాడ ఆర్డీవో  ఏజీ. చిన్ని కృష్ణ ,డీఎస్పీ భీమారావుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చిన్నికృష్ణ మాట్లాడుతూ  ఆగస్టు 15న జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి ,జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించన శకటాల ఏర్పాట్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆర్డీవో , డీఎస్పీ  పర్యవేక్షించారు.

Kakinada

2021-08-14 13:09:07

అప్పన్నకు విశాఖవాసి రూ.60001 విరాళం..

విశాఖ చటర్జీవారి వీధికి చెందిన మునుబర్తి చైతన్య  శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ (సింహాద్రి అప్పన్న)స్వామివారికి 60,001 (అరవై వేల ఒక్క రూపాయి) విరాళం సమర్పించారు. శనివారం ఈ మేరకు చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, అక్షయతృతీయనాడు స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు.  అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి దేవస్థానం అధికారులుప్రసాదం అందజేశారు.

Simhachalam

2021-08-14 13:04:39

అప్పన్నకు ఎయిమ్స్ ఆచార్యులు పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్న ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్  ప్రొఫెసర్ రణదీప్ గులేరియా దర్శించుకున్నారు. శనివారం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం ఈఓ సూర్యకళ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా.. అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదలకు మంచి వైద్యం అందించాలని, కొత్త పరిశోధనలు చేసి కొత్త కొత్తగా కరోనాకి విరుగుడు మందులు కనిపెట్టాలని ఆయన అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. 

Simhachalam

2021-08-14 13:00:26

తుపానుపై అప్రమత్తంగా ఉండండి..

బంగళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల కాలంలో తుఫానుగా బలపడే అవకాశం వుందని వాతావరణ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో విపత్తు నియంత్రణ, సహయక యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అప్రమత్తం చేశారు.  అల్పపీడన ప్రభావంతో ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకూ గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో తూర్పు తీరంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ కేంద్రం తెలియజేసిందని.. దీని  దృష్ట్యా మత్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.  జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలలో  రక్షణ, సహాయక శాఖల సమన్వయతో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు – కలెక్టరేట్, కాకినాడ –18004253077,సబ్ కలెక్టరు ఆఫీసు, రాజమహేంద్రవరం – 08832442344, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎటపాక – 08748285279, పిఓ, ఐటిడిఏ ఆఫీసు, రంపచోడవరం –18004252123, ఆర్డిఓ ఆఫీసు, అమలాపురం – 08856233100, ఆర్డిఓ ఆఫీసు, కాకినాడ -08842368100,  ఆర్డిఓ ఆఫీసు, రామచంద్రపురం –08857245166.

కాకినాడ

2021-08-13 18:06:18

విజిలెన్స్ పర్యవేక్షణకు ఆహ్వానించండి..

విశాఖజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారంతో పాటు విజిలెన్స్ పర్యవేక్షణ సమావేశాలకు తమను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ దేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు రంగయ్య, అధ్యక్షులు యజ్జల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఆర్డీఓ సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు తెలియజేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లి ఆహ్వానం వచ్చే ఏర్పాటు చేస్తామమని ఆర్డీఓ చెప్పండం ఆనందంగా వుందని యూనియన్ నేతలు మీడియాకి తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలను ప్రబుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడంలో యూనియన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానవేణి కుంచె, జిల్లా సలహాదారులు శోభ, సందీప్, వాణీమోహన్, సత్యన్నారాయణలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-13 17:50:07

శిక్షణే కాదు.. ఉపాధి కల్పన కూడా కావాలి..

యువతకు అందిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు ఉపాధి కల్పన ధ్యేయంగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు శిక్షణ మాత్రమే కాదని, ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థులు ఏ కోర్సుల్లో చేరుతున్నారు, ఏ సంస్థలో ఉపాధి పొందుతున్నారు తదితర అంశాల వివరాలు ఉండాలని ఆయన అన్నారు. ఉపాధి లభించినప్పటికీ ఆ సంస్థలో ఎంత కాలం పని చేస్తున్నారు లేదా ఇతర సంస్థలకు  మారితే అందుకు స్పష్టమైన వివరాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల శిక్షణ ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పూర్తి సమాచారం ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు  ఇందుకు ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని, ఆ యాప్ ద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందుటకు అవకాశం కల్పించాలని సూచించారు. బ్యాంకుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శత శాతం రుణాలు కల్పించి స్వయం ఉపాధికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. నాణ్యమైన శిక్షణ కల్పించడం వల్ల ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. శిక్షణ పొందడం ఒక ఎత్తు అయితే అనంతర పరిణామాలు మరో ఎత్తని వాటిపై స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.  చేనేత కారులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న ఇ కామర్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ లో శిక్షణ కల్పించాలని సూచించారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు మాట్లాడుతూ జిల్లాలో అకడమిక్, నాన్ అకడమిక్ కేటగిరీలుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అకడమిక్ శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు అందిస్తున్నామని,  నాన్ అకడమిక్ రంగంలో నిరుద్యోగ యువతకు వివిధ కార్యక్రమాల కింద శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న యువతకు ల్యాప్టాప్, టాబ్  తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2021 - 22 సంవత్సరంలో కోవిడ్ నేపథ్యంలో 1551 మంది శిక్షణలో చేరగా 336 మంది ఉపాధి పొందారని తెలిపారు. జిల్లాలో ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం నరసన్నపేట మండలంలో మంజూరైందని అందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల ప్రతినిధులు తమ వివరాలను తెలియజేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి జి. శ్రీనివాసరావు, సెట్ శ్రీ ముఖ్య కార్య నిర్వహణాధికారి కె.సూర్య ప్రభాకర రావు, క్రీడల చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, డిఆర్డిఎ పిడి బి.శాంతి శ్రీ,  ఏపీఈడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కర రావు, నాక్ సహాయ సంచాలకులు చిట్టిబాబు, నెహ్రూ యువ కేంద్ర ఏవో డి.శ్రీనివాస్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-13 17:43:10

గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..

శ్రీకాకుళంజిల్లాలోని ఇచ్ఛాపురం మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో కృష్ణాపురం, మండపల్లి, తేలుకుంచి, రత్తకన్న తదితర సచివాలయాలను జాయింట్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రత్తకన్న, బాలకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గురుమూర్తి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నామని చెప్పారు. కార్యాలయ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం,  కోవిడ్ ఫీవర్ సర్వే చేపట్టకపోవడం తదితర అంశాలను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు.  నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సక్రమంగా పర్యవేక్షణ చేయడం పట్ల ఆయనకు మెమో జారీ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Srikakulam

2021-08-13 17:38:25

అవయవ దానంతో ప్రాణదాతలు కండి..

అవయవ దానం చేసి మరో వ్యక్తికి ప్రాణదానం చేయాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రజలకు పిలుపునిచ్చారు.  శుక్రవారం “ప్రపంచ అవయవదాన దినోత్సవ” సందర్భంగా విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడుడారు. అవయవ దానం మహత్తరమైన దానమని, సందర్భానుసారంగా అన్నదానం, విద్యాదానం చేయడానికి ముందుకి రావాలన్నారు. వీటన్నింటికి మించిన ఫలితాన్ని అవయవదానం పొందవచ్చునన్నారు.  బ్రతికుండగానే పదిమందికి సాయం చేసిన మనిషి, మరణాంతరం కూడా మరొకరికి పునర్జన్మ ఇచ్చే అవకాశం అవయవదానం కల్పిస్తుందన్నారు. ప్రతిఒక్క సామాన్యుడు సైతం మానవత్వంతో ఆలోచిస్తే మరణం చేరువులో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించ వచ్చునని, అలాంటి అద్భుత అవకాశం, మహా  భాగ్యం అవయవదానం సొంతం అని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పలు రకాల అపోహలు అవగాహన లేని కారణంగా ఆశించినంత మేర స్పందన రావడం లేదన్నారు. మరణానంతరం మన అవయవాలను మరొకరికి దానం చేసినందువలన వారికి ప్రాణం పోసిన వారం అవుతామని, వారి కుటుంబంలో వెలుగు నింపిన వారం అవుతామని, అందుకు ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని, ఎటువంటి మూఢ నమ్మకాలకు, అపోహలకు పోకుండా, యువత ముందుకు రావాలని మేయర్ పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డా. రాంబాబు, అవయవ దాన అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-08-13 17:31:53

15న మాంసాహార విక్రయాలు నిషేధం..

భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మాంసాహార విక్రయాలను ఆదివారం నిషేదించినట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా జివిఎంసి పరిధిలోని అన్ని మాంసము, చేపలు, రొయ్యల మార్కెట్లు తదితర మాంసాహారం విక్రయించే దుకాణాలు మూసివేయాలన్నారు. ఈవిషయంలో ప్రజలు, దుకాణదారులు సహకరించాలని కమిషనర్ కోరారు.  ఈ మాంసం విక్రయాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రధాన వైధ్యాధికారిని, జోనల్ కమిషనర్లను, సహాయ వైధ్యాధికారులను కమిషనర్ ఆదేశించారు. తెరిచిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆ ప్రకటనలో కోరారు.

విశాఖపట్నం, Andhra Pradesh, India

2021-08-13 17:28:13