1 ENS Live Breaking News

ఒంటిమిట్ట కోదండ సీతమ్మవారికి హారం..

కడపజిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలోని శ్రీ సీత‌మ్మ‌వారికి క‌ర్నూల్‌కు చెందిన  సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుక‌గా స‌మ‌ర్పించారు. దానికి ఆలయ ఈఓకి అందజేశారు. శ్రీ సీతమ్మవారికి కానుక ఇవ్వాలని ముందుగా అనుకున్నామని దానిని ఇపుడు సమర్పించామని దాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Ontimitta

2021-08-25 14:13:04

ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలి..

ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కోవిడ్-19 వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, వై.ఎస్.ఆర్ (అర్బన్ హెల్త్) క్లినిక్ లు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, అగ్రికల్చర్ ఖరీఫ్ ఈ క్రాప్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు,  భూరక్ష పథకం భూ సర్వే తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పక్కాగా జరగాలని, కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలన్నారు. సరఫరా చేస్తున్న తాగునీరు  పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.   గ్రామ సచివాలయాల భవనాలు, గ్రామంలో ఇంగ్లీషు మీడియం స్కూల్, ఆర్బికె, డిజిటల్ లైబ్రరీ, ఎఎంసి, బిఎంసి, తదితర వాటిద్వారా గ్రామాలు రూపురేఖలు మారాలని చెప్పారు. సచివాలయాల భవనాలు నిర్మాణాలపై దృష్టి సారించాలని, అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల పైన ప్రత్యేక దృష్టి సారించి డిశంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

బల్క్ మిల్క్ మొదటి దశలో భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్మాణాలు పూర్తి చేసి రెవెన్యూ గ్రామాల్లో 31 డిశంబరు నాటికి ఇంటర్ నెట్ పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ లు నిర్మాణాలకు భూ కేటాంపు చేయాలని, ఆగస్టు చివరి నాటికి నిర్మాణాలు ప్రారంభం కావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఐటిడిఎ పిఓ, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి  పనితీరును పరిశీలించాలన్నారు. 
సచివాలయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి చార్ట్ ను డిసిప్లే చేస్తున్నారా లేదా, సిబ్బంది బయోమెట్రిక్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులు నిర్వహణపైన పరిశీలించాలన్నారు. రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు లు అర్హతను చూసి మూడు నెలల్లో మంజూరు చేయాలని చెప్పారు. ఇవి సంవత్సరానికి నాలుగు సార్లు మంజూరు చేయాలని తెలిపారు. గృహ నిర్మాణాలపైన ధరఖాస్తులు వస్తే వాటిపై విచారణ చేసి అర్హులైతేనే మంజూరు చేయాలన్నారు. సంవత్సరానికి రెండు సార్లు మంజూరు చేయాలని చెప్పారు.   ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమచేసేందుకు ముందు రోజు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు ల్లో ప్రజలకు ఖచ్చితంగా అవగాహన పరచాలన్నారు.

వైయస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం పనులు ప్రారంభించి డిశంబరు నాటికి పూర్తి చేయాలని చెప్పారు.  ఇళ్ల స్థల పట్టాలు కోసం వచ్చిన దరఖాస్తులను అర్హత చూసుకుని 90 రోజుల్లో మంజూరు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పట్టాల జాబితాను తెలియజేయాలని పేర్కొన్నారు. 
ఇ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అగ్రికల్చర్ అడ్వయిజర్ కమిటీ సమావేశాలను ప్రతీ నెల ఆర్బికె స్థాయిలో నెలలో మొదటి శుక్రవారం, మండల స్థాయిలో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడవ శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆర్బికెలోఔ విక్రయించే ఎరువులు నాణ్యమైనవిగా ఉండాలని పేర్కొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం లో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలన్నారు. తదితర అంశాలు పై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ శ్రీనివాసులు, శ్రీరాములు నాయుడు, డ్వామా పీడీ కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-25 13:48:41

విజిలెన్స్ అధికారిగా ఎస్.వి.మాధవరెడ్డి..

గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్  అధికారిగా ఎస్ వి మాధవ్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్ధానంలో పి.జాషువా బదిలీకాగా, మాధవ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ కు ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి)గా ఉన్నారు. కడపకు చెందిన మాధవ రెడ్డి 2010 లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రూప్ 1 కు ఎంపికై పోలీసు శాఖలో వివిధ పదవులను సమర్ధ వంతంగా నిర్వహించి వన్నె తెచ్చారు. శిక్షణ అనంతరం తొలుత కర్నూలు జిల్లా ఆత్మకూరు, నిర్మల్ లలో డిఎస్పిగా పనిచేసి 2018లో అదనపు ఎస్పిగా పదోన్నతి పొందారు. తదుపరి కర్నూలు అదనపు ఎస్పి (పరిపాలన)గా పనిచేసి గుర్తింపు పొందారు. విజయవాడ ట్రాఫిక్ డిసిపిగా రహదారి భద్రతకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సర్వీసు కాలంలో నాలుగు సంవత్సరాల పాటు ఫారెస్టు రేంజ్ అధికారిగా పనిచేసి అటవీ చట్టాల పట్ల పూర్తి అవగాహన గడించారు. బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు తావు లేని విధంగా విజిలెన్స్ నిఘాను పటిష్టపరుస్తామన్నారు.

Guntur

2021-08-25 13:42:08

న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ వేయించాలి..

న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు.  బుధవారం స్థానిక బలగ సచివాలయం వద్ద న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేయిస్తే భవిష్యత్ లో శ్వాసకోశ సంబంధ వ్యాదులు, కోవిడ్ నివారణకు ఉపయోగపడుతుందన్నారు.  న్యూమోనియా అనే వ్యాధి స్ట్రెప్టోకోకస్ అనే బాక్టీరియా వలన వస్తుందని, దీని వలన సుమారు 12,700 మంది 5 సంవత్సరములు లోపు గల పిల్లలు మరణించినట్లు చెప్పారు.  మొదటి డోసు 6 వారాలకు, రెండవ డోసు 14 వారములకు మరియు బూస్టర్ డోసు 9 నెలలకు వేయాలని పేర్కొన్నారు.  వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత దేశ ప్రభుత్వం జాతీయ వ్యాది నిరోధక కార్యక్రమములో చేర్చినట్లు చెప్పారు.   వ్యాక్సిన్ వేసిన చిన్న పిల్లల తల్లిదండ్రులు తెలిసిన వారి తల్లులకు వ్యాక్సిన్ పిల్లలకు వేయించాలని చెప్పాలన్నారు.  అన్ని ప్రభుత్వ ఆరోగ్య  కేంద్రాలలో ఉచితంగానే వేస్తారని తెలిపారు.  జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి అప్పారావు, మున్సిపల్ కమీషనర్ ఓబులేసు, వైద్యాధికారి కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-25 13:28:02

ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్..

విజయనగరంజిల్లాలో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఆల‌యాల‌ను క‌లుపుతూ, టూరిజం స‌ర్క్యూట్‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. జిల్లాలోని టెంపుల్ టూరిజంను అభివృద్ది చేసేందుకు క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు ప్రారంభించారు. దీనిలో భాగంగా దేవాదాయ‌, ప‌ర్యాట‌క శాఖాధికారుల‌తో త‌న ఛాంబ‌ర్ లో బుధ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లా కేంద్రంలోని పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం, రాజ‌మ‌న్నార్ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యం, రామ‌నారాయ‌ణం, విజ‌య‌న‌గ‌రం కోట‌, మ‌హారాజా ప్ర‌భుత్వ‌ సంగీత క‌ళాశాల‌, గుర‌జాడ అప్పారావు స్మార‌క గృహం, బౌద్ద ఆరామం గురుభ‌క్తుల కొండ‌, రామ‌తీర్ధం, కుమిలి దేవాల‌యాల స‌ముదాయం త‌దిత‌ర ప్రాంతాల‌ను క‌లుపుతూ ప‌ర్యాట‌కంగా ఒక ప్యాకేజ్‌ను రూపొందించాల‌ని సూచించారు. విశాఖ‌ప‌ట్నం నుంచి టూరిజం బ‌స్సులో ప‌ర్యాట‌కులను తీసుకువ‌చ్చి, ఈ ప్ర‌దేశాల‌ను చూపించాల‌ని చెప్పారు. దీనికోసం వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి, అనుమ‌తి తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌ర్యాట‌క ప‌రంగా అభివృద్ది చేసేందుకు జిల్లాలో ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని, త‌రువాత ద‌శ‌లో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ స‌మావేశంలో  దేవాదాయ‌శాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఇవి పుష్ప‌వ‌ర్థ‌న్‌, జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాన్సాస్ ఇఓ వెంక‌టేశ్వ‌ర్రావు,  పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం స‌హాయ క‌మిష‌న‌ర్ కిషోర్‌, బొబ్బిలి ఇఓ ప్ర‌సాద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-25 13:17:21

సుడా ప్లానింగ్ అధికారిగా శోభన్ బాబు..

శ్రీకాకుళం నగర అభివృద్ధి సంస్థ  (సుడా) ప్రణాళిక అధికారిగా వి.శోభన్ బాబు నియమితులయ్యారు. మంగళవారం సుడా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్,  ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి సుడా చక్కని ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగర అభివృద్ధికి కీలకపాత్ర ప్రణాళికలని, పారదర్శకంగా,  భవిష్యత్తు అవసరాలకు హేతుబద్దంగా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు.

Srikakulam

2021-08-24 14:26:26

మహిళా శిశు ఆరోగ్యానికి దోహదం పడాలి..

మహిళా, శిశు ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు దోహదం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం మంచి పౌష్ఠికాహారం అందిస్తుందని, దానిని సకాలంలో పంపిణీ చేసి ఆరోగ్య జిల్లాగా రూపొందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో 1.90 లక్షల మంది తల్లులు, పిల్లలు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు. వీరందరికీ సక్రమంగా పౌష్ఠికాహాం పంపిణీ చేయడం వలన చిన్నారులు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారని కలెక్టరు పేర్కొన్నారు. తల్లులు, పిల్లలపై దృష్టి సారించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని సూచించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై  నిర్లక్ష్యం వహించామంటే అంతకంటే ఘోరం ఉండదని, వారిని మోసం చేసినట్లు  గుర్తించాలని ఆయన అన్నారు. అక్రమాలు, నిర్లక్ష్యంపై ఆరోపణలు అందితే కటిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గడంలో ఐ.సి.డి.ఎస్ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఆహార పదార్థాల పంపిణీలో ఎక్కడా అక్రమాలు జరగరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ స్పష్టం చేశారు. వీరఘట్టంలో జరిగిన సంఘటన వలన ఐ.సి.డి.ఎస్ పై చర్యలు మొట్ట మొదటిగా  తీసుకున్నామని ఆయన చెప్పారు. సరుకుల రవాణాలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని, వాటిని నివారించాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ (గ్రోత్ మానిటరింగ్) చేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయి తనిఖీలు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలను ఎక్కువగా సందర్శించాలని ఆయన చెప్పారు. పాతపట్నం, మెలీయాపుట్టి, సీతంపేట ప్రాంతంలో మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

వీరఘట్టం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన తెలిపారు. రేషన్ పంపిణీ సమయంలో మహిళా పోలీసు సేవలు వినియోగించు కోవాలని ఆయన చెప్పారు. గర్భిణీ లకు కరోనా వాక్సినేషన్ తక్కువగా ఉందని, వాక్సినేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీలకు వాక్సినేషన్ తక్కువగా ఉందని ఆయన అన్నారు. అవగాహన కలిగించడం ద్వారా ఎక్కువ మందికి పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి. జయ దేవి మాట్లాడుతూ జిల్లాలో 18 ప్రాజెక్టులు, 4192 అంగన్వాడి కేంద్రాలు అందులో 3403 ప్రధాన కేంద్రాలు ఉన్నాయన్నారు. పౌష్ఠిాహారం అందిస్తున్నామని,వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ క్రింద ఇంటికి ఆహార సామగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు అందాలని, అయితే వివిధ కారణాల వలన కొద్ది రోజులు జాప్యం జరుగుతోందని ఆమె వివరించారు. పాలు పరిమాణం తక్కువగా వస్తుందని ఆమె చెప్పారు. సీతంపేట ప్రాంతంలో ఇంటెర్నెట్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదని, ఆఫ్ లైన్ లో అనుమతించాలని ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ ఎస్ఇ జి.బ్రహ్మయ్య, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-24 14:22:24

నాడు నేడు నిర్మాణాలు వేగం పెంచాలి..

విశాఖ జిల్లాలో నాడు నేడు క్రింద నిర్మాణపు పనులను, నిర్వహణ పనులు సత్వరమే పూర్తి గావించాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరు నాడు – నేడు క్రింద వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్ లు, వైద్యకళాశాలలు, ఆసుపత్రులు మొదలగు వాటి  భవనాల మరమ్మత్తులు, నిర్మాణపు పనులు, నిర్వహణ  పనులపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఆయా పనులకు  సంబంధించిన వివరాలు,  సాధించవలసిన లక్ష్యాలు,  ఇప్పటి వరకు పూర్తయినవి,  పెండింగు పనులు,  తదితర వివరాలపై ఇంజనీరింగు మరియు ఎం.పి.డి.ఓ.లతో చర్చించారు. కొన్ని మండలాలలో  వెనుకబడి ఉండటము పై ఆగ్రహం వక్తం చేశారు.  నాడు–నేడు క్రింద పూర్తి చేసిన పాఠశాలలు  హెచ్.ఎంలకు, ఆసుపత్రులను వైద్యాధికారులకు అప్పగించాలన్నారు..  9 పి.హెచ్.సి ల పనులను త్వరగా పూర్తి చేయాలని  ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.  జి.వి.ఎం.సి మరియు మునిసిపాలిటీలలోని  వై.ఎస్.ఆర్  అర్బన్ క్లినిక్ ల పనులను త్వరగా  పూర్తి చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. 

వైద్య కళాశాలలకు సంబంధించిన పనులను మరియు కె.జి.హెచ్, విమ్స్ లకు సంబంధించిన పనులను త్వరగా చేపట్టి పూర్తి గావించాలని  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎ.పి.ఎస్.ఎం.ఐ.డి.సి ను ఆదేశించారు. పాడేరు వైద్య కళాశాల పనులు పురోగతి లో ఉన్నాయని, కె.జి.హెచ్, విమ్స్ లో  ఆయా విబాగాలను మార్చిన తదుపరి పనులు చేపట్టడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తెలిపారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి గావించి ఫొటోలను  అప్ లోడ్ చేయాలన్నారు.  ఎం.పి.డి.వో. లు సచివాలయ భవనాల పనులను పర్యవేక్షించాలని, పి.ఆర్ ఇంజనీర్లు కూడా బాధ్యత వహించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా డిజిటల్ లైబ్రరీలు, బి.ఎం .సి.సి లు, అంగన్ వాడీ భవనాలు నిర్మాణపు పనులను కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలలో కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలని పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే  సి.హెచ్.సి లేదా పి.హెచ్ సి లకు పంపి పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు.   తరువాత ఉపాధి హామీ పనులను సమీక్షించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్.ఈ. సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి. సందీప్ పాల్గొన్నారు.  వీడియో కాన్పరెన్స్ ద్వారా  జి.వి.ఎం .సి కమిషనర్  జి.సృజన, ఎం.పి. డి. ఓ .లు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-23 14:47:57

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఎరువుల షాపుల యాజమాన్యాలను హెచ్చరించారు. ఎరువుల షాపుల యాజమానులతో ఎరువుల ధరలపై  జిల్లా లోని హోల్ సేల్ డీలర్లు, కంపెనీ తయారీ దారులు, రిటైల్ డీలర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు సరసమైన ధరలకే విక్రయించాలని పేర్కొన్నారు. ఎరువులు తప్పని సరిగా ఎంఆర్ పి రేట్లకే అమ్మాలని, ఎరువులను తప్పని సరిగా బయోమెట్రిక్ విధానంలో రైతులకు మాత్రమే అమ్మకాలు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగకూడదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల యజమానుల సమస్యలను జెసి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జెడి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-23 14:40:34

స్పందన అర్జీలపై తక్షణమే స్పందించండి..

విశాఖ జిల్లాలో వివిధ కార్యాలయాలలో పెండింగులో ఉన్న గ్రీవెన్స్ పిటిషన్లను  వెంటనే పరిష్కరించి నివేదికలను పంపాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం  ఉదయం కలెక్టరు  ‘స్పందన’ లో వచ్చిన పిటిషన్లు,  పెండెన్సీ పై  అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  వివిధ శాఖల  జిల్లా అధికారులు, శుక్రవారం  నాడు వారి శాఖలో  పెండింగులో ఉన్న పిటిషన్ల ను  పరిశీలించి వాటిని పరిష్కరించి   నివేదికలను  పంపాలన్నారు. ఎస్.ఎల్.ఎ పరిధి దాటి పెండింగులో ఉండటంపై, సంబందిత శాఖల అధికారులతో  సమీక్షిస్తూ, దానికి  కారణాలు ఏమిటని ప్రశ్నించారు. వెంటనే వాటని పరిష్కరించాలన్నారు.  ఇతర శాఖల  ఫిటిషన్లు వస్తే  వెంటనే  డి.ఐ.ఓ కు  తెలియజేసి, వాటిని పంపివేయాలన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాలలో  వివిధ శాఖలకు  సిబ్బంది  ఉన్నారని,  అక్కడి సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు  తీసుకోవాలన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలక్టరు ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. వాటిని పరిశిలించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.  వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 
సోమవారం నాడు "స్పందన" లో   214  పిటిషన్లు అందాయి. వివిధ మండలాలలో అధికారులు, సిబ్బంది ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి  ఉదయం గం.9-30 కల్లా హాజరు కావాలని  ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మండల  కార్యాలయంలో , స్పందన కార్యక్రమానికి  పలువురు హాజరు  కాక పోవడం పై  కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలలో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే జిల్లా వరకు రారన్నారు.  రెవెన్యూ డివిజనల్ అధికారులు, , డి.ఎల్.డి.ఓ.లు , తాహసీల్దారులు,  ఎం.పి.డి.ఓ. లు, ఈ విషయం పై శ్రద్ద వహించాలన్నారు.  ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్లు, ఎం.వేణుగోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు, ఎ.సి.పి.  శిరీష,  రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-23 13:46:48

ఆ గ్రామస్తులకు ఆధార్ కార్డులు ఇవ్వండి..

విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో  ఉన్న నేరేడుబంద గ్రామస్తులను ఆధార్ కార్డులను ఇప్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాడేరు ఐటీడీఏ పిఓ ను ఆదేశించారు. నేరేడుబంద గ్రామంలో పాతికలోపు కుటుంబాలు ఉండగా మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం, ఆ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, వారు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడంతో  ఆ గ్రామానికి చెందిన వారికి ఆధార్‌ కార్డులు జారీ చేయడ మారిన విషయం విదితమే. గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని, తల్లిదండ్రులకు కూడా ఆధార్‌ కార్డులు లేని కారణంగా విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన చెందుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దృష్టికి రావడంతో ఈ విషయంగా స్పందించారు.ఈ నేపథ్యంలో సోమవారం పాడేరు ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలక్రిష్ణతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ తో లంకె ఉండటంతో ఆధార్ లేని కారణంగా నేరేడుబంద గ్రామానికి ఏ పథకం కూడా వర్తించని పరిస్థితి ఏర్పడటం, ఆ గ్రామంలో ఉన్న 18 మంది పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కావడాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. పాతిక కుటుంబాలు ఉన్న గిరిజన గ్రామం ఏ పంచాయితీ పరిధిలోనూ గుర్తించకపోవడం సబబు కాదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గ్రామం ఏ మండలం పరిధిలోకి వస్తుందనే విషయాన్ని నిర్ధారించడంతో పాటుగా ఆ గ్రామస్తులకు, అక్కడున్న పిల్లలకు తక్షణమే ఆధార్ కార్డులు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంగా రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, నేరేడుబంద గ్రామంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలలో లబ్దిదారులుగా చేర్చాలని పుష్ప శ్రీవాణి ఆదేశించారు.

Paderu

2021-08-23 13:41:11

రహీమున్నీసాకు మరో అరుదైన అవకాశం..

విశాఖకి చెందిన ప్రముఖ సామాజిక వేత్త, న్యాయవాధి రహీమున్నీసాకు మరో అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ విభాగంలో నడుస్తున్న ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సంస్థ ఈ నెల 25న ఇంటర్నిషిప్ డే పేరిట ఒక ఆన్ లైన్ కార్యక్రమం నిర్వస్తోంది..ఈ సందర్భంగా జరగనున్న ప్రత్యేక వెబినార్ లో ఆమె పాల్గొనాలని ఆహ్వానం  పంపింది. సుమారు ఆరు లక్షల మందికి పైగా ఇంటర్న్ షిప్ కలిగి ఉన్న సాంకేతిక విద్యా విభాగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆన్ లైన్ లో చర్చించాలని కోరింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా నియమితులైన బుద్ధ చంద్రశేఖర్ సలహా..సూచనల మేరకు ఆమె కూడా ఆ వెబినార్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ఏఐసీటీఈ  నిర్వహించే ఇంటర్న్ షిప్ డే లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు తాను గర్వపడుతున్నానని రహీమున్నీసా మీడియాకి తెలియజేశారు. అతికొద్ది మందికి వచ్చే ఈ అవకాశం విశాఖజిల్లా న్యాయవాదికి దక్కడం పట్ల సహచర న్యయవాదులు, సామాజిక వేత్త హర్షం వ్యక్తం చేశారు. 

Visakhapatnam

2021-08-23 13:25:56

కొటియాలో అభివ్రుద్ధి కార్యక్రమాలు జరగాలి..

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కొటియా గ్రామం లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి తెలిపారు.  సోమవారం స్పందన అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ  సంయుక్త కలెక్టర్ రెవిన్యూ వారు త్వరలో కొటియా పై పార్వతి పురం  లో డివిజినల్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారని, అన్ని శాఖల అధికారులు హాజరై  కోటియా అభివృద్ధి కి చేయవలసిన పనుల పై సమీక్షించుకోవాలని అన్నారు.   ముఖ్యంగా ఆరోగ్యం పై, సీజనల్ వ్యాధుల పై,  వాక్సినేషన్ ,  తదితర అంశాల పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.   అటవీ శాఖ ఆధ్వర్యం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని చేయాలనీ సూచించారు. 

Vizianagaram

2021-08-23 11:35:39

సాధికారత సాధించే దిశగా శ్రమించాలి..

రాష్ట్రం లో మహిళా సాధికారత సాధించేందుకు అమలు చేస్తున్న విధానాలను మహిళా లోకం అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విశాఖపట్నం రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె ఏ.యూ. ప్లాటినమ్ జూబ్లీ వసతి గృహంలో  విలేకరులతో మాట్లాడారు. “ఆమె” అంటే అర్ధ భాగం, హక్కుల్లో కూడా సగభాగం అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డే నని తెలిపారు. మహిళల్లో చైతన్యం కలిగించి మహిళా సాధికారికతను సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల మహిళా ప్రముఖులతో సదస్సులు చర్చా గోష్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం  లా కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఐఏఎస్, మహిళా అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎం.పిలు, వివిధ రంగాల ప్రముఖులతో  మహిళా సాధికారత పై చర్చా గోష్టి జరుగుతుందని పద్మ తెలిపారు. మహిళల రక్షణ కు ఒక పటిష్ట యంత్రాంగంను ఏర్పాటు చేసి మహిళల చేతుల్లో పెట్టారని అన్నరు."దిశ" యాప్, పోలీస్ స్టేషన్లు, గ్రామ సచివాలయ మహిళా  పోలీసు, వాలంటీర్ల నెట్వర్క్ ను పటిష్టం చేయుటకు మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 నెలల్లో దాదాపు  రూ.లక్ష కోట్లను మహిళలకు వివిధ పధకాల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసారని గుర్తు చేశారు. బాలికల నుండి వృద్దురాలి వరకు స్వీయ రక్షణ, సాధికారత పొందుటకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలిపారు. మహిళలకు అన్నిట్లో సగభాగం హక్కుగా ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారని మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. 
నామినేటెడ్ పదవుల్లో 50 శాతంతో పాటు రాజకీయ రంగం లో మహిళల భాగస్వామ్యం సగానికి పెంచుతున్నారని వెల్లడించారు-దురదృష్టవశాత్తు జరుగుతున్న కొన్ని అఘాయిత్య సంఘటనలను రాజకీయం చేయటం తగదని హితవు పలికారు. గతంలో ఒక ముఖ్యమంత్రి యాసిడ్ బాధితురాలు అనురాధ కు చికిత్స కు నష్ట పరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తే హై కోర్ట్, సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.అలాంటి వారు మహిళల కోసం అంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వాసిరెడ్డి పద్మ తో మహిళా కమిషన్ మెంబెర్ జయలక్ష్మి,  డైరక్టర్ సూయజ్, ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మీ,  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-23 11:34:13

స్పంద‌న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి..

స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించా ల‌ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, ఎ.భార్గవ్ తేజ; డీఆర్వో సీహెచ్ సత్తిబాబు పొల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతుల‌ను స్వీకరించారు. తొలుత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వ‌ద్ద కలెక్టర్ హరికిరణ్, ఐసీడీఎస్ పీడీ జి.సత్యవాణి; ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు జీఎస్ సునీత, ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి; హౌసింగ్ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, ఇతర అధికారులు నివాళులర్పించారు. అనంతరం ఇప్పటి వరకు స్పందన ద్వారా వచ్చిన అర్జీలు, వాటి ప‌రిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందన ద్వారా అందిన ప్రతి అర్జీదారునికి సంతృప్తికరమైన, నాణ్యతతో కూడిన సేవలు అందించాలన్నారు. అదేవిధంగా గత సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీలను ఈ నెల 25 నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. మ‌న‌బ‌డి నాడు-నేడు రెండో ద‌శ పనులకు సంబంధించి భాగస్వాములైన వివిధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలను అనుస‌రించాల‌ని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన, ఫించన్లు, ఉపకార వేతనం, భూ వివాదాలు, వైఎస్సార్ బీమా, ఆరోగ్య శ్రీ, బియ్యం కార్డు మంజూరు తదితరాలకు సంబంధించి దాదాపు 355 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్జీల ప‌రిష్కారం కొత్త ఫార్మాట్‌లో జ‌రిగేలా చూడాల‌ని అధికారుల‌ను క‌లెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-23 11:25:13