1 ENS Live Breaking News

విజయసాయిరెడ్డి ఎంపికపై వంశీ హర్షం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మహావిశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మంగళవారం వంశీ విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆనందం వ్యక్తం చేశారు.

Visakhapatnam

2021-08-10 13:53:09

బీఎల్ఓలు కీలకంగా వ్యవహరించాలి..

ఓటరు జాబితా తయారు చేయడంలో బి.ఎల్. ఓ లు కీలకం పాత్ర పోస్తూ.. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం మండల బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ లతో  ఐ.టి.డి.ఎ  గిరిమిత్ర సమావేశ  ప్రాజెక్ట్ అధికారి స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR-2022) నిర్వహణ నిమిత్తం సమావేశం నిర్వహించారు. ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ నవంబర్1, 2021 డ్రాఫ్ట్ పబ్లికేషన్, జనవరి 5, 2022 ఫైనల్ పబ్లికేషన్ అన్నారు. నవంబర్1,2021 నుండి నవంబర్30, 2021 క్లైములు , అభ్యంతరాలు స్వీకరణ కార్యక్రమం అన్నారు. అందరూ బి.ఎల్.ఓ లు కీలక పాత్ర పోషించాలనీ, ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చూసుకోవాలని సూచించారు. విధులు నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్న అడిగి తెలుసుకోవాలన్నారు.  ఈ సమావేశానికి పార్వతీపురం తహశీల్దార్ ఎన్.వి.రమణ, ఎన్నికల ఉప తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, బి. ఎల్.ఓలు, సూపర్వేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-10 13:35:10

వైఎస్సార్ హౌసింగ్ వేగవంతం చేయాలి..

నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు, జగనన్న గృహనిర్మాణాల గ్రౌండింగ్ పనులను ఈ నెల 15 లోగా  వేగవంతం  చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.   మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  గృహ నిర్మాణ  పనులపై వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  గృహ నిర్మాణ పథకానికి సంబందించి పనులను అలసత్వం లేకుండా సంబందిత మండల అధికారులు అంకిత భావంతో  పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వై ఎస్ ఆర్ అర్భన్ ఫేజ్ - 1 గృహ నిర్మాణాలకు  సంబందించి లే అవుట్ లు, గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మంగళవారం  హౌసింగ్ పనులకు సంబందించిన పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని  ఎప్పటి కప్పుడు  జరుగుతున్న అభివృద్ది తనకు వివరించాలన్నారు. లే అవుట్ లలో బేస్ మెంట్ లెవెలింగ్, అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్లు,  విద్యుత్తు, బోర్ వెల్స్, నీటి సరఫరా పనులను వేగవంతం  చేయాలన్నారు.  సిమెంట్, స్టీల్, ఇసుక మెటీరియల్ ను  అందుబాటులో ఉంచాలన్నారు. హౌసింగ్ పిడి  ఎం .శ్రీనివాస్  మాట్లాడుతూ  నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు మొదటి దశలో భాగంగా  జిల్లాలో 36.932 గృహాలు లక్ష్యం కాగా, 33.202 గృహాలు గ్రౌండింగ్ అయి 90 శాతం తో రాష్ట్రంలో విశాఖ జిల్లా  మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి,  పంచాయితీ రాజ్, ఆర్ డబ్య్లు ఎస్, ఆర్ అండ్ బి , ట్రాన్స్ కో , డ్వామా, జి.వి.ఎం.సి, హౌసింగ్ శాఖల అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-08-10 13:32:36

పీఏసీకి విజయసాయిరెడ్డి ఎంపికపై హర్షం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల జిసిసి చైర్మన్ డా.శోభాస్వాతీ రాణి హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆకాంక్షించారు.

Visakhapatnam

2021-08-10 13:21:06

Simhachalam

2021-08-10 06:45:05

జివిఎంసీ స్పందన 41 ఫిర్యాదులు..

జివిఎంసీలో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో ప్రజల నుండి  41 అర్జీలు వచ్చినట్టు మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. వాటినినేరుగా వివిధశాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపినట్టు ఆమె వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లోనూ స్పందన జరిగేలా చూడాలని, ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జివిఎంసీ ప్రధాన కార్యాలయం వరకూ రాకుండా చేయాలని కమిషనర్ డా.జి.స్రిజనకు సూచించారు. అనంతరం వార్డుల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను వివరించారు. ఒకటవ జోనుకు 01, రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 12, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 03, ఆరవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, మెయిన్ ఆఫీసు నకు 12, మొత్తము 41    ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-09 15:47:46

అర్జీలపై అలసత్వం ప్రదర్శించవద్దు..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలు డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి నివేదించిన అర్జీలపై అలసత్వం ప్రదర్శిచవద్దని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధికారులకు సూచించారు. సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో 26 మంది నుంచి ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఆమె జివిఎంసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు “స్పందన” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి నిర్వహించారు. డయల్ యువర్ మేయర్  కార్యక్రమంలో రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 02, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 09, ఏడవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, ఇతరులు 01,  మొత్తము 26 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-09 15:46:22

అనధికార పార్కింగ్ పై ఫైన్లు వేయండి..

అనధికారంగా రోడ్డులపై నిలిపిన వాహనాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 25వ వార్డు పరిధిలోని సీతమ్మపేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. అనుమతి లేకుండా రోజుల తరబడి వాహనాలను రోడ్ల మీద పార్కింగు చేస్తున్నారని వాటిని వెంటనే తొలగించాలని లేదా వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్.ఎస్. ఏజెన్సీ వద్ద చెత్త పేరుకు పోయి ఉన్నందున ఆ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నెల జీతం ఆపాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. క్లాప్ పధకంలో భాగంగా శానిటేషన్ చేయు పద్దతులలో మార్పులు తీసుకురావాలని  ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. దుర్గా నగర్ వెనుక ఉన్న రోడ్డు  సరిగా ఊడ్చడం లేదని, దుకాణాల వద్ద మూడు రంగుల చెత్త డాబాలు పె  ట్ట లేదని, దుకాణాల యజమానులు చెత్తను కాలువలో వేస్తున్నందు వలన కాలువలు పేరుకు పోతున్నందున దుకాణాల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై అవగాహన కార్యక్రామాలు సరిగా జరగడం లేదని, ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని మలేరియా సిబ్బందికి సూచనలు చేశారు. మలేరియా పై అవగాహన కల్పించడం, త్రాగు నీరు, విధ్యుత్ దీపాలు, రోడ్లు శుభ్రం చేయడం, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, కార్యనిర్వహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జగన్నాధం, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-08-09 15:39:55

సచివాలయాల ద్వారానే సేవలందాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి వార్డు కోర్పరేటర్ ఉరుకూటి నారాయణరావుతో కలసి 3వ జోన్ 29వ వార్డులోని 1086117, 178, 179 సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండి ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్లో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని మేయర్ సూచించారు.

Visakhapatnam

2021-08-09 15:36:48

జగనన్న కాలనీలు వేగవంతం కావాలి..

జగనన్న కాలనీలు నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం డివిజన్ పరిధిలో అన్ని మండలాల మండల, డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీల పై ఆయనతో పాటు శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంశు కౌశిక్ లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో చేపడుతున్న హౌసింగ్ చాలా పెద్ద కార్యక్రమమని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.  నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు దిశగా కృషి చేయాలన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి లబ్ధిదారులకు మేలుచేకూర్చాలన్నారు. ఎలక్ట్రికల్ లైనులు కూడా వేయాలి. నీరు ఉంటేనే పనులు త్వరితగతిన చేపట్టడానికి బోర్లు కూడా వేయాలని సూచించారు. ఇసుక, తదితర అంశాలపై వివరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార నది ప్రవహిస్తున్పప్పటికీ జగనన్న కాలనీల నిర్మాణంలో ఇసుక కొరత తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాంప్ కేటాయించ వలసినదిగా సూచించారు. జమ్మూ లే ఔట్ లో 600 ఇళ్లు నిర్మాణం జరుగుతోందని, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిల్లాం లే ఔట్ గుండా 33కెవి విద్యుత్ లైను ఉందని, దానిని మార్చుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందరూ బాధ్యతగా పని చేస్తేనే విజయవంతం అవుతుందని, దీని కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరింత బాధ్యత గా పనిచేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గంలో పెద్ద లే ఔట్లు ఉన్నాయని, వాటికి సరిపడ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటుందని ఎస్ఇ ఇపిడిసిఎల్ ను ఆదేశించారు. ఇళ్లు లేని వారు ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరు చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అవసరమైతే భూసేకరణ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. మండలాల్లో లబ్ధిదారుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ లే ఔట్ ల్లో చేయాల్సిన పనులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇసుక సమస్యలు రాకుండా చూడాలని మండలాల వారీగా సమీక్షించారు. అధికారులు మండలాల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు. 700 లే ఔట్లు ఉన్నాయని, వీటిలో ఎక్కడెక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయో గుర్తించి ఫోల్స్ ఎక్కడైనా అవసరమైతే డిఇల నుండి జాబితా తీసుకొంటే ఆ జాబితాను ఇపిడిసిఎల్ సిఎండి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఇపిడిసిఎల్ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు ఋణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఎంత మందికి కావాలో లబ్ధిదారులుతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సరఫరా కు సంబంధించి లేఔట్లు డిపిఆర్ అందజేయాలని ఎస్ఇ ని ఆదేశించారు. మండలాల వారీగా బోర్లు పై సమీక్షించారు. గృహాలు నిర్మాణాలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు సిమెంట్ సరఫరా పై ఎఇలు చర్యలు చేపట్టాలని, గొడౌన్లు లేకపోతే ప్రభుత్వ భవనాలు ఉంటే వాటిలో నిల్వ ఉంచాలన్నారు.

మండలాల వారీగా ఎన్ని పట్టాలు కోసం దరఖాస్తులు వచ్చాయో తెలియజేసి వారికి పంపిణీ కి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు చెప్పారు.  లే ఔట్ ల్లో సమస్యలు ఉంటే తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) హిమాంశు కౌశిక్ చెప్పారు.  మెగా హౌసింగ్ మేళాలో ప్రారంభించిన గృహాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. హౌసింగ్ పీడీ జి. కూర్మినాయుడు, శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని హౌసింగ్ డిఇ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, ఎపిఇపిడిసిఎల్ ఇంజనీర్లు, ఎపిఎంలు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-09 14:10:18

గాంధీజీ పోరాటం ప్రపంచానికే ఆదర్శం..

మహాత్మాగాంధీ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని వక్తలు అభిప్రాయవడ్డారు. శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో “క్విట్‌ ఇండియా ఉద్యమం- ఎనిమిది దశాబ్ధాల చరితం' పేరిట స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో క్రీడాకారులు, వాకర్స్‌, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.జనార్థన నాయుడు మాట్లాడుతూ క్రిప్స్‌ రాయభారం విఫలం కావడంతో గాంధీ తీసుకున్న నిర్ణయమే క్విట్‌ ఇండియా ఉద్యమమన్నారు. సమాచారశాఖ ఏడీ ఎల్‌.రమేష్‌ మాట్లాడుతూ స్వతంత్ర్య పోరాటంలో అనేక ఘట్టాలు నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ ప్రయత్నం చేస్తున్న శక్తి, కొంక్యాన ట్రస్టు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. డిఎస్‌డిఒ బి. శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్ర నేటి తరానికి తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్‌ మాట్లాడుతూ శాంతియుత పంథాలో మహాత్మాగాంధీ చేసిన పోరాటం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎన్నో త్యాగాలు చేసిన సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలను ఆదుకొనేందుకు పాలకులు ముందుకు రావాలని శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ) అధ్యక్షురాలు పైడి రజని అన్నారు. చట్టసభ సభ్యుల కుటుంబ సభ్యులుగా కంటే సమరయోథుల వారసులుగానే తన తండ్రి, భర్త, తాను గౌరవంగా భావిస్తామన్నారు. స్వతంత్ర్య సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలు, ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ప్రభుత్వపరంగా రావాల్సిన భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అటువంటి వారికి వేగవంతంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వాతంత్ర్య సమరయోథులు దివంగత గుడ్డ రమణమూర్తి కుమార్తె, రిటైర్డ్‌ ట్రెజరీ డి.డి తారాదేవి స్వాతంత్రోద్యమ ఘట్టాలను వివరించారు. తన తండ్రి ద్వారా సమరయోథులు దేశం కోసం పోషించిన పాత్ర గురించి తెలుసుకోగలిగానన్నారు. తొలుత ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి స్వాతంత్ర్య సమరయోథులు పైడి నరసింహ అప్పారావు, గుడ్ల రమణమూర్తి, బెవర అప్పలస్వామిదేవ్‌ కుటుంబ సభ్యులు పైడి రజని, పైడి గోపాలరావు, తారాదేవి, ఉమాశంకర్‌దేవ్‌ పూలమాలలు వేశారు. అనంతరం సమరయోథుల కుటుంబాలకు కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ టస్బు చైర్మన్‌ కొంక్యాన మురళీధర్‌, వాకర్స్‌ కబ్‌ గవర్నర్‌ గుప్త పూర్య గవర్నర్లు ఇందిరాప్రసాద్‌, కూన రమణమూర్తి, డిఎస్‌డిఒ శ్రీనివాస్‌కుమార్‌, ఆర్ట్స్‌ కళాశాల పి.డి. మోహన్‌రాజు, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఎస్‌.జోగినాయుడు, వి.వివేకానంద, భీమరాజు, వైకాపా నాయకుడు రొక్కం సూర్యప్రకాష్‌, ఎన్‌సిసి అధికారి పోలినాయుడు, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు నటుకుల మోహన్‌, బాడాన దేవభూషణ్‌, మహాత్మాగాంధీ మందిర రూపశిల్పి ఎం.వి.ఎస్‌.ఎస్‌.శాస్త్రి, వివిధ క్రీడా విభాగాల కోచ్‌లు సత్కరించారు. వాకర్స్‌ క్లబ్‌ సభ్యుడు మల్లిబాబుకు జన్మదిన వేడుకలు తెలిపారు.

 

Srikakulam

2021-08-09 13:45:54

సామాన్యులకు అండగా విఎంఆర్‌డిఎ..

సామాన్య,మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరే విధంగా విఎంఆర్‌డిఎ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో తాను భీమిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా, కౌన్సిలర్‌గా, నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశానన్నారు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గతంలో కంటే ఓట్ల శాతం పెంచగలిగానన్నారు.  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఇతర పెద్దలు పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి బీసీ మహిళగా తనకు కీలకమైన విఎంఆర్‌డిఎ చైర్మన్‌ పదవిని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుకూలంగా తన శక్తిని మించి పనిచేస్తానన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలోని జిల్లాల  ప్రజలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికే సుమూరు రూ.186కోట్ల ప్రాజెక్టులు పూర్తి కావచ్చి, ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న చైర్మన్ భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారన్నారు. ఎన్‌ఎడి ప్లైఓవర్‌, మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌,ప్లానిటోరియంతో పాటు, అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.  ప్రస్తుతం విఎంఆర్‌డిఎ రూపకల్పన చేసిన మాస్టర్‌ప్లాన్‌ భవిష్యత్‌ 20 సంవత్సరాలకు సరిపోయే విధంగా తయారు చేస్తున్నామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించే అవకాశాలను పరిశీలన చేయాలని కోరారు.  గతంలో కూడా అప్పటి చైర్మన్లు సీనియర్‌  జర్నలిస్టులకు స్థలాలు నామమత్ర ధరకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో విఎజె సంఘం ప్రభుత్వానికి రూ.5.46 కోట్లు చెల్లించనప్పటికీ వేరువేరు కారణాలతో నేటికి 182 మంది జర్నలిస్టులు ఆయా స్థలాలను పొందలేకపోయారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి జర్నలిస్టులు ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారని, కాబట్టి విఎంఆర్‌డిఎ పరిధి మేరకు తమ వంతు సాయం అందించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు.  గత చైర్మన్ల తరహాలోనే తాను కూడా తన వంతు జర్నలిస్టులకు పూర్తిస్దాయిలో సహకారం అందిస్తామన్నారు. విజెఎప్‌ కార్యదర్శి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ, అందరి సహాకారంతోనే  కార్యక్రమాలు విజయవంతం చేయగలగుతున్నామన్నారు. భవిష్యత్‌లో కూడా జర్పలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,కోశాధికారి పిఎన్‌ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, దొండా గిరిబాబు, వరలక్ష్మీ, , డేవిడ్‌ రాజు, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను విజెఎఫ్‌ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. 

Visakhapatnam

2021-08-09 13:26:03

నాడు-నేడుతో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి-నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యావ్యవస్థలో సత్ ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు.  ఆదివారం పీ.గన్నవరం నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, అంబాజీపేట, పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ సి.హరికిరణ్ స్థానిక శాసనసభ్యులు కొండేటి. చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ తో కలిసి  పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 1,100 పాఠశాలలో  మొదటి దశ మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు సంతృప్తికర స్థాయిలో జరిగాయన్నారు. వీటిని శని,ఆదివారలలో రంపచోడవరం , రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్ లో పర్యటించి పరిశీలించడం జరిగిందన్నారు. నాడు నేడు పనుల వలన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా ప్రభుత్వ పనులు తీరుకు అద్దంపడుతుందన్నారు. ఇదే తరహాలో రెండో విడత నాడు-నేడు పనుల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వ వనరులతో పాటు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం శుభసూచకమన్నారు.ఈ విధంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిదిలో ఉన్న  పాఠశాలలో  సమారుగా రూ.60 నుంచి 70 లక్షలు వెచ్చించి పాఠశాలలను అభివృద్ధి పరచుకోవడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అదే తరహాలో పాఠశాల ఆట స్థలాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో వాస్తు ప్రకారం అన్ని పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రాధాన్యత అంశాలైన వైద్య ఆరోగ్యంతోపాటు విద్య పట్ల కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వడం నాడు నేడు పనులే నిదర్శనమని కలెక్టర్ అన్నారు.ఆగస్టు16న మనబడి నాడు నేడు రెండవ దశ పనులు ప్రారంభోత్సవంతో పాటు జగనన్న విద్యా కానుక 2020-21 ప్రారంభోత్సవ పనులకు సన్నద్ధమవుతున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ మీడియాకు వివరించారు.మనబడి -నాడు నేడు  కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన పీ. గన్నవరం , పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, ఫర్నేచర్, వంటశాల, త్రాగు నీరు, టాయిలెట్స్ , వాల్ పెయింటింగ్స్ , డిజిటల్ క్లాస్ రూమ్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో కలిసి  పరిశీలించారు.   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.అబ్రహం, ఎస్ఎస్ఎ పీవో బి.విజయబాస్కర్,అమలాపురం ఆర్డీవో ఎస్ఎస్. వసంతరాయుడు,డీడీవో శాంతామణి ,ఎంపీడీవో ఐఇ. కుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Pulletikurru

2021-08-08 16:07:45

దిశ యాప్ మహిళలకు ఒక రక్షణ వలయం..

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మహిళ భద్రతకు ప్రవేశపెట్టిన దిశా యాప్ మహిళలకు గొప్ప వరం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ఆదివారం జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన దిశా యాప్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని  మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి, నేరస్తులను త్వరితగతిన శిక్షించడానికి ముఖ్యమంత్రి  మహిళకు భద్రత కల్పించాలనే సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని రూపొందించారని చెప్పారు . ప్రస్తుత కాలంలో దేశంలో మహిళలపై  అత్యాచారాలు పెరగడంతో దేశంలో  నిర్భయ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో మహిళల రక్షణకు   ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.  అత్యాచారం జరిగిన ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ చేపట్టి 21వ రోజున శిక్షపడేలా  దిశా యాప్ పని చేస్తుందని అన్నారు. మహిళలపై సామాజిక మాధ్యమం లలో అసభ్యకరమైన పోస్టులు పెడితే రెండు సంవత్సరాల శిక్ష  విధిస్తారని, తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తప్పు మరోసారి చేస్తే నాలుగు సంవత్సరాల శిక్ష విధించడంతో పాటు మరొకసారి తప్పుకు  10 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల చిత్తూర్ లో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం అలాగే విజయవాడలో చిన్నారి బాలిక పై అత్యాచారం చేసిన ఘటనలో  దోషులకు ఉరి శిక్ష విధించడం జరిగిందని మంత్రి  తెలిపారు. రాష్ట్రంలో 10 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ,వీటికి 40 మంది సిబ్బంది ని ఇచ్చినట్లు తెలిపారు.  గతంలో కేసులు చాలా సంవత్సరాల వరకు విచారణ లో ఉండేవని ప్రస్తుతం దిశ ద్వారా 7 రోజుల్లో నేరస్తులను పట్టుకుని 14 రోజుల్లో విచారణ చేపట్టి, 21 రోజుల్లో శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దిశా యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మన రక్షణ మన బాధ్యత ను మహిళలందరూ గుర్తించి దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. మహిళ లే కాకుండా పురుషులు కూడా దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అందరికీ అన్ని రకాలభద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు. జగ్గంపేట నియోజకవర్గంలో దిశ యాప్ అవగాహన సదస్సు ఏర్పాటుకు సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి ను మంత్రి  అభినందించారు
 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా)రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టడానికి దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఐ జి మోహన్ రావు మాట్లాడుతూ లో దిశా యాప్  మహిళలకు భద్రతతో పాటు ధైర్యం కూడా కల్పిస్తుందని అన్నారు.
జిల్లా ఎస్పి ఎం రవీంద్ర బాబు మాట్లాడుతూ గతంలో అత్యాచారాలు జరిగినప్పుడు దోషులని పట్టుకోవడంలో జాప్యం జరిగేదని,  ఈ యాప్ ద్వారా తక్కువ సమయంలో నేరస్తులను పట్టుకుని శిక్షపడేలా గా యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలందరూ తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో దిశ యాప్ డౌన్లోడ్ లో తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల సహకారంతో , ప్రజాప్రతినిధులతో లక్ష మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు ధనలక్ష్మి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హిమ శైలు జక్కంపూడి విజయలక్ష్మి , డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి, తదితరులు దిశ యాప్  అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముందు గండేపల్లి మండలం మురారి గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి హోంమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మల్లేపల్లి లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా  సీడ్ బాల్స్, మొక్కలు హోంమంత్రి స్థానిక శాసనసభ్యులు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో మల్లి బాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు జిల్లా పోలీసు అధికారులు మాజీ శాసనసభ్యులు పంతం గాంధీ మోహన్ సర్పంచి కందుల చిట్టిబాబు నియోజకవర్గంలోని మహిళలు పోలీస్ సిబ్బంది ఈ శాఖల సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముందుగా అవగాహన సదస్సును  మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం

 అనంతరం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం లో రాజుపాలెం గ్రామం నుండి  రామవరం గ్రామం వరకు 11కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సు చరిత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు తో కలిసి  శంకుస్థాపన చేశారు.

Jaggampeta

2021-08-08 14:35:43

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకీ తీసుకెళ్లాలి..

రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుకునేలా చైతన్య పరిచే బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆదివారం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎన్నెస్పీ అతిథిగృహంలో ఆయన బస చేశారు. జర్నలిస్టుల సంఘాల నాయకులు చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  జర్నలిస్టులలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి విశ్వవిద్యాలయం నిబంధనలు అనుసరించి సొంతంగా సర్టిఫికెట్ కోర్స్ లు ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్  వెల్లడించారు. అకాడమీ  ఏర్పాటు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 80 తరగతులు  రాష్ట్రం, జిల్లాల వారీగా  ఆన్ లైన్ లో నిర్వహించడానికి విశ్వవిద్యాలయం అనుసంధానంతో  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. ఏంతో విలువైన ఈ కోర్సుల్లో చేరడం ద్వారా జర్నలిస్టులకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. సీనియర్ అధ్యాపకులుగా నైపుణ్యం కలిగిన వారితోనే తరగతులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

వృత్తిలో నైపుణ్యం, మెలకువలు వంటి పలు అంశాలపై కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. విశ్వ విద్యాలయంతో కలిసి తొలిసారిగా చేపట్టిన సర్టిఫికెట్ కోర్స్ ను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జర్నలిజం విద్యనభ్యసిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు సమర్థంగా వాటిని అధిగమించేలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. జర్నలిజంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామన్నారు.  జర్నలిస్టులుగా పని చేస్తున్న వారందరికీ  అక్రిడిటేషన్ కార్డులు అందేలా ఏపీ ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు. అక్రిడిటేషన్లు ఫిల్టర్ చేసే ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న వారికి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ బారినపడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అధిక ప్రయోజనం కల్పించడం, వారంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

             జర్నలిస్టులు విషయ పరిజ్ఞానం మరింతగా పెంచుకోడానికి ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతనంగా రూపొందించిన వెబ్ సైట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఈ వెబ్సైట్ జర్నలిస్టులకు సమాచార వనరులు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ప్రతిరోజు జర్నలిస్టులు వెబ్ సైట్ ను వినియోగించుకొని మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు తన్నీరు మోహన్ రాజు, జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ వి సుబ్బారావు, ఎస్ వి బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, దాసరి కనకయ్య, మీసాల శ్రీనివాసరావు, శ్రీనివాస్ నాయక్, ఇఫ్తేకర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-08-08 11:32:03