1 ENS Live Breaking News

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలకై ఒకరోజు కేటాయించాలి..

విశాఖజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి నెలలో ఒకరోజు సమయం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ దేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు రంగయ్య, అధ్యక్షులు యజ్జల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించడం ఆనందంగా వుందని యూనియన్ నేతలు మీడియాకి తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలను ప్రబుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడంలో యూనియన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానవేణి కుంచె, జిల్లా సలహాదారులు శోభ, సందీప్, వాణీమోహన్, సత్యన్నారాయణలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-08-13 17:24:42

ప్రజలకు ఇబ్బందిలేకుండా పూడికలు తీయాలి..

అనంతపురంలో మరువ వంక పూడికతీత పనులను నగర మేయర్ మహమ్మద్ వసీం గురువారం పరిశీలించారు. నగరంలోని మూడవ డివిజన్ పరిధిలోని మరువ వంకలో పూడిక పెరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహం ముందుకు సాగక ఆ ప్రాంతంలో దుర్గంధం నెలకొందని స్థానికులు ఇటీవల మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. దీనితో మరువ వంక పూడికతీత కు టెండర్లు నిర్వహించి రూ.7.80 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు.పనులు జరుగుతున్న తీరును మేయర్ వసీం అధికారులను,కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట కార్పొరేటర్ బాలాంజినేయులు, వైకాపా నాయకులు కృష్ణమూర్తి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-08-12 16:06:01

సీఎం పర్యటనకు పక్కాఏర్పాట్లు చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహనరెడ్డి  జిల్లాలో జరుపనున్న పర్యటనకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు సంయుక్తంగా జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పి.గన్నవరంలో జరిపే పర్యటన కొరకు చేపట్టవలసిన ఏర్పాట్లను సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఈ నెల 16వ తేదీ ఉదయం 10-30 గం.లకు హెలికాప్టర్ లో పి.గన్నవరం చేరుకుని అనంతరం 11 గం.ల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకూ జడ్పి హైస్కూల్లో తొలి దశ నాడు-నేడు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ది పనులను ప్రజలకు అంకితం చేస్తారని, అలాగే రెండవ దశ నాడు-నేడు పనులను ప్రారంభించి, జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి వారితో బహిరంగ సభలో ముచ్చటిస్తారని తెలిపారు.  ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పి.గన్నవరంలో వివిధ ప్రదేశాలలో చేపట్టవలసిన ఏర్పాట్లకు జాయింట్ కలెక్టర్లను, ఆర్డిఓలను ఆయన ఇన్చార్జిలుగా నియమించారు. 

 అలాగే పర్యటన కార్యక్రమాలకు హాజరైయ్యే ప్రముఖులు, ముఖ్యమంత్రి సిబ్బంది, విద్యార్థులు, వివిధ జిల్లాలల్లో నాడు-నేడు ఉత్తమ పనులకు అవార్డు గ్రహీతలక, రాష్ట్ర స్థాయి అధికారులకు తగు సదుపాయాలను కల్పించాలని ఆయన ఆదేశించారు.  వాహనాలు, సమూహాల నియంత్రణ, బారికేడింగ్, పబ్లిక్ ఎడ్రస్, లైవ్ కవరేజి, మీడియా సమన్వయం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు సూచనలు జారీ చేశారు.  రానున్న 5 రోజుల్లో వర్ష సూచన ఉన్నందున, వర్షాల కారణంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఏవిధమైన ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఉనికి నేపద్యంలో పటిష్టమైన జాగ్రత్తలను అమలు పరచాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ భద్రతా పరమైన అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేసి, అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మిశ, కీర్తి చేకూరి, బార్గవతేజ్, జి.రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండక్కర్,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-12 15:56:43

భూసమస్యలు సత్వరమే పరిష్కరించాలి..

ఏపీఐఐసి, ఎన్ఎఓబీ, నక్కపల్లి, ఎన్ హెచ్ -16, పాడేరు గ్రీన్ క్యారిడార్ , ఆర్ అండ్ ఆర్, నిర్వాసితులకు గృహ నిర్మాణాలు తదితర అంశాలు,   భూ  సమస్య ల కు సంబంధించిన పనులను వేగ వంతంగా  పూర్తి చేయాల్సింది గా జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, విశాఖపట్నం,అనకాపల్లి,నర్సీపట్నం, ఆర్డీఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,ఏపీఐఐసి అధికారులతో ,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తహశీల్దార్ లతో  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఏ పీ ఐ ఐ సి , ఎన్ ఏ ఓ బీ, ఎన్హెచ్ 16 భూములకు సంబంధించి పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వాటికి సంబంధించి ఏమైనా ప్రతి పాదనలు ఉంటే  వెంటనే పంపించాలన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రభుత్వ, మరియూ జిరాయితీ భూముల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. బీచ్ కారిడార్, రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లోఉన్న పనులను వేగవంతం గా పూర్తి చేయాల్సింది గా ఆదేశించారు.అనకాపల్లి, మునగ పాక, అచ్యుతాపురం రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి అబ్జెక్షన్స్ పై డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. పైన తెల్పిన అంశాల పురోగతి పై ప్రతీ నెల  సమీక్ష నిర్వహిస్తామనీ, సంబంధిత అధికారులు,సిబ్బంది పనుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ ఆర్ గోవింద రావు, ఆర్డీవో లు పెంచల కిషోర్,సీతా రామా రావు,అనిత,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగయ్య, ఏపీఐఐసి జెడ్ ఎమ్ యతిరాజులు, మినిష్టరీ ఆఫ్ రోడ్ సేఫ్టీ పీ డి రవి షేక్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-08-12 15:45:17

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి..

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు విశేషంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సిబ్బందిని ఆదేశించారు. గురువారం నగరంలోని వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సాగర్ నగర్ -1,సాగర్ నగర్ -2 వార్డు సచివాల యాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది  విధులపట్ల అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్ ను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. డేటా ప్రాసెసింగ్, టౌన్ ప్లానింగ్,సంక్షేమం,పరిపాలన,శానిటేషన్, మహిళ పోలీస్ తమ విధులను ఖచ్చితంగా నిర్వహించా లన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదుల పై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తెలియ జేయాలన్నారు.

Visakhapatnam

2021-08-12 15:43:05

విశాఖలో మెగా వేక్సినేషన్ డ్రైవ్..

విశాఖ జిల్లాలో రేపు అన్ని ప్రభుత్వ పి.హెచ్.సి,  సి.హెచ్.సి.లలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున ఒక ప్రకటన లో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోసులు వేయబడతాయి. కోవ్యాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండు అందుబాటులో ఉంటాయన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు, మరియు వయస్సుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలు, 5సంవత్సరాల వయసు లోపు పిల్లలు కలిగిన తల్లులు, విద్యాశాఖలో పని చేయుచున్న ఉపాధ్యాయలు, అంగన్ వాడీ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలియజేశారు. మొదటి డోసు వేయించుకున్న వారందరూ రెండవ డోసు వేయించుకొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పైన సూచించిన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టరు తెలిపారు.

Visakhapatnam

2021-08-12 15:41:37

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..

కె.జి.హెచ్. లో  రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని, పరిసరాలన్నింటిని శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరు కె.జి.హెచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను అధికం చేయాలని తద్వారా వచ్చే ఆదాయాన్ని కె.జి.హెచ్ అభివ్రద్దికి వినియోగించాలన్నారు. నాడు-నేడు క్రింద షిప్టు చేయాల్సిన శాఖలను రిలోకేట్ చేయడానికి రెండు ప్లాన్ లను సిద్దం గావించాలన్నారు. వైద్య పరికరాల మరమత్తులకు బిల్లులను చెల్లింపు కోసం పెట్టాలన్నారు. కె.జి.హెచ్ కు కొత్త ఎమ్.ఆర్.ఐ. స్కాన్ తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. వేస్ట్ డిస్పాజిల్ పై చర్చించారు. 
తదుపరి కలెక్టరు ఎవర్జెన్సీ వార్డు పరిశీలించి  డాక్టరుకు పలు సూచనలు చేశారు.  వార్డులలో పరిశుబ్రమైన ఆహాదకరమైన వాతావరణం ఉండాలన్నారు.  ఒపి ప్రవేశద్వారం వద్ద వీల్ చెయిర్ లు,  24 గంటలు అందుబాటులో ఉంచి, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వాసుపపల్లి గణేష్ కుమార్, జివిఎమ్ సి కమిషనర్ డాక్టర్ సృజన, కె.జి.హెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ వైధిలి,ఎపిఎమ్ ఎస్ ఐ సి ఇంజనీర్, ఎ.ఎమ్.సి .ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డిఎమ్ అండ్ హెచ్ఒ సూర్యనారాయణ తదితరులు పాల్గ్గొన్నారు. 

Visakhapatnam

2021-08-12 15:37:15

పంద్రాగస్టు వేడుకలకి ఏర్పాట్లు పూర్తి..

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు ప‌క‌డ్భంధీగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు,  ప‌లువురు ఇత‌ర‌ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి, ఆమె గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ను సంద‌ర్శించారు. ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను, మృతి చెందిన కోవిడ్ వారియ‌ర్స్‌కు అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ ఏడాది పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఉత్స‌వాల‌కు, కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను అమ‌తించ‌డం లేద‌ని చెప్పారు. దీనికి బ‌దులుగా ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల డిజిట‌ల్ స్క్రీన్‌ల‌ను ఏర్పాటు చేసి, వేడుక‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. యూట్యూబ్ లైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌రిమితంగా ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఒక్కో అంశాన్ని, ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌లు మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెప్పారు. స్టాల్స్‌ను ఏర్పాటు చేయ‌డం లేద‌ని, వాటి స్థానంలో వివిధ శాఖ‌ల ప్ర‌గ‌తిని వివ‌రిస్తూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వివిధ శాఖ‌ల అధికారుల‌కు, సిబ్బందికి ఇస్తున్న ప్ర‌శంసా ప‌త్రాల‌ను సైతం ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని, మృతి చెందిన కోవిడ్ వారియ‌ర్స్ కుటుంబ స‌భ్యుల‌కు, కోవిడ్ నియంత్ర‌ణ‌కోసం విశేష కృషి చేసిన స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్య‌క్తుల‌కు మాత్ర‌మే మెరిట్ స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేస్తామ‌ని తెలిపారు. క‌లెక్ట‌ర్ వెంట డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, ప‌లువురు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-12 13:57:09

పోషకాహారాన్ని సక్రమంగా అందించాలి..

ప్ర‌భుత్వం అందిస్తున్న పోష‌కాహారాన్ని ల‌బ్దిదారుల‌కు స‌కాలంలో, స‌క్ర‌మంగా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్ బి.చిన్మ‌యాదేవి ఆదేశించారు. ఆమె గురువారం జిల్లాలో పర్య‌టించి, త‌మ శాఖ‌కు సంబంధించిన అధికారులు, సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స్థానిక మ‌హిళా ప్రాంగ‌ణంలో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆర్‌జెడి చిన్మ‌యాదేవి మాట్లాడుతూ, సిడిపిఓలు, అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్లు త‌ర‌చూ క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు జ‌రిగేలా చూడాల‌న్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ సంపూర్ణ పోష‌ణ‌, సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి సారించి, పోషకాహారాన్ని శ‌త‌శాతం, స‌క్ర‌మంగా అంద‌జేయాల‌ని కోరారు. ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించినా, నిర్లిప్త‌త ప్ర‌ద‌ర్శించినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  నిర్మాణంలో ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను ప‌రిశీలించాల‌ని, అవి త్వ‌ర‌గా పూర్తిఅయ్యేలా సంబంధి అధికారుల‌ను కోరాల‌ని సూచించారు. ఇప్ప‌టికీ ప్రారంభించ‌న భ‌వ‌నాల నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే, ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పాల స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేకంగా దృష్టి కేంద్రీక‌రించాల‌ని, మిల్క్‌యాప్‌లో న‌మోదు చేయాల‌ని సూచించారు. గృహ‌హింస‌, దిశ సంబంధిత‌ కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

              ఈ స‌మావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఎం.రాజేశ్వ‌రి, కేర్ ఇండియా ప్ర‌తినిధి సుబ్ర‌మ‌ణ్యం, సిడిపిఓలు, సూప‌ర్ వైజ‌ర్లు, ఒన్ స్టాప్ సెంట‌ర్‌, డివి సెల్ సిబ్బంది. చిల్డ్ర‌న్ హోమ్ ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-12 13:52:55

గ‌రుగుబిల్లి ఎంపిడిఓపై విచార‌ణ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రుగుబిల్లి మండ‌ల‌ప‌రిష‌త్ అభివృద్ధి అధికారి జి.చంద్ర‌రావు పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి తెలిపారు. కార్యాల‌యంలోనే మ‌ద్యం సేవించిన‌ట్లు ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారి రాజ్‌కుమార్‌ను ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా ఎంపిడిపిపై త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారులు క్ర‌మ‌శిక్ష‌ణ రాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి స్ప‌ష్టంచేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలో మద్యం సేవించడం క్షమించరాని నేరమన్నారు. దేవాలయం లాంటి కార్యాలయంలో మద్యంసేవించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శమన్నారు. అటువంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు.

Garugubilli

2021-08-12 13:40:12

పంద్రాగస్టును విజయవంతం చేయాలి..

గుంటూరు జిల్లాలో ఆగస్టు 15 వ తేదిన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సంయుక్త కలెక్టర్(ఆసరా-సంక్షేమం) కె.శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని డి.ఆర్.సి సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్( ఆసరా-సంక్ష్మేమం) కె.శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షజరిగింది. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పెరేడ్ గ్రౌండ్ మైదానాన్ని అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలను విజయవతంగా నిర్వహించేందుకు విధులు కేటాయింపు చేసిన అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అతిధులు, అధికారులు, ప్రజలు వేడుకలను వీక్షించేందుకు   చక్కగా ఏర్పాట్లు చేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శించే శకటాలను ఆకర్షణీయంగా సిద్ధం చేయాలని, అలాగే స్టాళ్ళనూ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఒ కొండయ్య,గుంటూరు రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి,  జిల్లా పరిషత్తు సీఇఒ చైతన్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వినాయకం, గుంటూరు తూర్పు మండల తహాశీల్ధార్ శ్రీకాంత్, పశ్చిమ మండల తహాశీల్ధార్ మోహనరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-12 13:29:10

డెల్టా ప్రాంతాలకు పూర్తిగా నీరందించాలి..

గుంటూరు జిల్లాలోని తెనాలి సబ్ డివిజన్ డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ కెనాల్స్  చివర పంట పొలాలకు సైతం  సాగునీరు సక్రమంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళగిరి, దుగ్గిరాల, వేమురు మండలాల పరిధిలోని కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్ ద్వారా సాగునీరు ప్రవహిస్తున్న బ్రాంచి కెనాల్స్, చానల్స్ను పరిశీలించారు. మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి వద్ద హైలెవల్ బ్రాంచీ కెనాల్ను, దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు వద్ద బ్రాంచీ కెనాల్ను, దుగ్గిరాల వద్ద లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల వివరాలు, కెనాల్స్ ద్వారా సాగునీరు అందించే గ్రామాల వివరాలను ఇరిగేషన్ అధికారులు  జిల్లా కలెక్టరుకు వివరించారు. అనంతరం వేమురు మండలం వరహాపురం గ్రామంలో ఇరిగేషన్ చానల్ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి పరిశీలించి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. వరహాపురం గ్రామంకు వచ్చే సాగునీటి చానల్కు పై ఎత్తున కాకర్లమూడి గ్రామం వద్ద ఛానల్కు అడ్డుకట్ట వేయటంతో వరహాపురం గ్రామానికి సక్రమంగా సాగునీరు రావటం లేదని స్థానిక రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చానల్కు వేసిన అడ్డంకులు వెంటనే తొలగించటంతో పాటు, మరల అడ్డంకులు వేయకుండా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో 24 గంటలు పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని రైతులకు జిల్లా కలెక్టర్  హామీ ఇచ్చారు. వరహాపురం గ్రామంలోని పొలాలకు పూర్తిగా మొదటి విడత సాగు నీరు అందేవరకు   నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.
  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ డెల్టా సబ్ డివిజన్లోని పంట పొలాలకు జూలై ఆరవ తేదీ నుంచి ఇరిగేషన్ కెనల్స్  ద్వారా ప్రతి రోజు 7000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ కెనాల్స్కు సరఫరా అవుతున్న నీటి సరఫరాను వివిధ ప్రాంతాల వద్ద పరిశీలించటం జరిగిందన్నారు.  గత రెండు రోజులుగా కెనాల్స్ చివరి భూములకు కొద్దిగా సాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వేమూరు మండలంలోని వరహాపురం గ్రామంకు వచ్చి రైతులతో మాట్లాడటం జరిగిందన్నారు. వరహాపురం గ్రామానికి వచ్చే సాగునీటి చానల్కు పైన ఉన్న రైతులు  వేసిన అడ్డంకులను తొలగించి, బ్రీచ్లు గుర్తించిన ప్రాంతాలలో మరమ్మత్తులు చేసి 24 గంటల్లో చివరి భూములు వరకు సాగునీరు అందెలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసి నిరంతరం  అవసరమైన ప్రాంతాలలో పోలీస్ శాఖతో బందోబస్తు ఏర్పాటు చేసి అనధికారికంగా నీటిని వాడకుండా, అడ్డంకులు వేయకుండా పర్యవేక్షిస్తూ కెనాల్స్ చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందెలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాద్, దుగ్గిరాల తహశీల్దారు మల్లేశ్వరి, వేమురు తహశీల్దారు శీరిషా, తెనాలి డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరత్నం, ఇరిగేషన్  డిప్యూటీ ఈఈలు, ఏఈలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mangalagiri

2021-08-12 13:27:48

వార్డుల్లో మౌళిక వసతులు కల్పిస్తాం..

జీవిఎంసీ అన్నివార్డుల పరిధిలో మౌళిక వసతులు కల్పిస్తామని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. గురువారం ఆమె 5వ జోన్ 40వ వార్డు పరిధిలోని మల్కాపురం, ఎకెసి కోలనీ 1 & 2 పరిసర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ & మౌళిక వసతుల శాఖ (ఎపిఇడబ్ల్యూ & ఐడి కార్పోరేషణ్) చైర్మన్ మళ్ళ విజయప్రసాద్, వార్డు కార్పొరేటర్ జి. నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ కాలనీలో అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కాలనీలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, సచివాలయ వాలంటీర్లు ప్రభుత్వ సేవలు అందించడం వాటిపై స్థానిక ప్రజలును అడగగా, త్రాగు నీరు సమృద్ధిగా వస్తుందని, పారిశుధ్య సిబ్బంది ప్రతీరోజు చెత్త సేకరిస్తున్నారని, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు వివరిస్తున్నారని తెలిపారు. ఎకెసి కోలనీలోని గెడ్డకిరువైపులా రీటైనింగ్ వాల్ నిర్మించాలని, ఎ.కె., ఎ.ఎస్.సి కొలనీలో సుమారు 436 రేకుల ఇళ్లలో ప్రజలు నివసిస్తున్నారని వారికి, వారికి ప్రభుత్వ స్కీము ఇళ్ళలో సదుపాయాలు కల్పించి ఆ ప్రదేశాలలో జి+3 ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నారు. ఎకెసి కోలనీ-1లో మెయిన్ రోడ్ నుండి ఇ.ఎస్.ఐ. హాస్పిటల్,  అమ్మవారి గుడి వరకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ వారి భూమి ఖాళీగా ఉన్నందున వారితో మాట్లాడి ఆ స్థలాన్ని ఇప్పించిన యడల, అక్కడ ఉన్న ప్రజలకు మౌళిక సదుపాయాలు, ప్రధాన రహదారికి చేరుకోవాడానికి 2వ  రహదారి నిర్మించవచ్చునని, గొల్లపాలెం వాణిజ్య సముదాయంలో బినామీలు ఉన్నారని, వైఎస్అర్ సిపి సమన్వయ కర్త, ఎపిఇడబ్ల్యూ & ఐడి కార్పోరేషణ్  చైర్మన్, కార్పొరేటర్ తెలపగా మేయర్, కమిషనర్ స్పందిస్తూ పైన తెలిపినవి పరిగణలోకి తీసుకుని వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రీటైనింగ్ వాల్  నిర్మాణమునకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గొల్లపాలెంలో వాణిజ్య సముదాయాలలో బినామీలను కార్పొరేటర్ గుర్తించి వారి లేకుండా చూడాలని ఆదేశించారు. హాకర్స్  జోన్ క్రమబద్ధీకరణ చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎకెసి కోలనీ-1లో శిధిలమైన భవనాలను గుర్తించి వాటిని మరమ్మతులు చేపట్టడానికి అంచనాలు తయారుచేసి, స్టాండింగ్ కమిటీలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొలనీలో ఉన్న బ్లాక్ లో అన్ని తనిఖీ చేసి వాటికి సెప్టిక్ ట్యాంక్ లు లేని యెడల వాటిని నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని సామాజిక బవనంపై సచివాలయ కార్యాలయం నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వహాక ఇంజినీర్లు చిరంజీవి, వెంకటరావు, రత్నాలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, ఎఎంఒహెచ్. డా. రాజేష్, శానిటరీ సూపర్వైజర్,  శానిటరీ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-08-12 13:20:01

ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు..

 ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.  నిజామాబాద్ గ్రామంలో రూ. 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, బురవల్లి రూ.40 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయం గురువారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరులకు అవసరమైన సమాచారం లభించే విధంగా పరిపాలనలో మార్పులు చేయడం జరిగిందన్నారు. అందరికి ఉపయోగపడే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని పాలన అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సంక్షేమ పథకాలను మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లొనే పథకాలకు స0భంధించిన సొమ్ములను  ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా  ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

          కార్యక్రమంలో సర్పంచ్ గంగు పద్మావతీ, సర్పంచ్ కాసులమ్మ,  స్పెషల్ ఆఫీసర్ గుత్తి రాజారావు, తాహసీల్ధార్ రామారావు, ఎంపిడివో రామ్ మోహన్, ఏవో ఉష కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ మూర్తి, మాజీ ఉప జెడ్పి చైర్మన్ మార్పు ధర్మ రావు, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

2021-08-12 13:15:07

విద్యార్ధులూ.. పీజీ హాస్టళ్లు తెరిచే ఉన్నాయి..

విజ‌య‌గ‌రం జిల్లాలో 2021-22 విద్యా సంవ‌త్స‌రం సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో జిల్లాలోని డిగ్రీ, పీజీ క‌ళాశాల‌ల అనుబంధ బీసీ హాస్ట‌ళ్ల‌ను తెరిచి ఉంచినట్లు క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కోవిడ్ కార‌ణంగా మూత‌ప‌డిన వ‌స‌తి గృహాల‌ను ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో విద్యార్థుల సౌక‌ర్యార్థం జిల్లా వ్యాప్తంగా తెరిచి ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. ఈ అవ‌కాశాన్ని డిగ్రీ, పీజీ క‌ళాశాల‌ల‌ విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. వివ‌రాల‌కు విజ‌య‌న‌గ‌రం అర్బ‌న్‌, రూర‌ల్‌, బొబ్బిలి, పార్వ‌తీపురం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారుల‌ను లేదా క‌ళాశాల‌ల బీసీ వ‌స‌తి గృహ సంక్షేమ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని క‌లెక్ట‌ర్ స్‌ ష్టం చేశారు.

Vizianagaram

2021-08-12 13:08:10