1 ENS Live Breaking News

విజిలెన్స్ పర్యవేక్షణకు ఆహ్వానించండి..

విశాఖజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారంతో పాటు విజిలెన్స్ పర్యవేక్షణ సమావేశాలకు తమను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ దేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు రంగయ్య, అధ్యక్షులు యజ్జల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఆర్డీఓ సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు తెలియజేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లి ఆహ్వానం వచ్చే ఏర్పాటు చేస్తామమని ఆర్డీఓ చెప్పండం ఆనందంగా వుందని యూనియన్ నేతలు మీడియాకి తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలను ప్రబుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడంలో యూనియన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానవేణి కుంచె, జిల్లా సలహాదారులు శోభ, సందీప్, వాణీమోహన్, సత్యన్నారాయణలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-13 17:50:07

శిక్షణే కాదు.. ఉపాధి కల్పన కూడా కావాలి..

యువతకు అందిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు ఉపాధి కల్పన ధ్యేయంగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు శిక్షణ మాత్రమే కాదని, ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థులు ఏ కోర్సుల్లో చేరుతున్నారు, ఏ సంస్థలో ఉపాధి పొందుతున్నారు తదితర అంశాల వివరాలు ఉండాలని ఆయన అన్నారు. ఉపాధి లభించినప్పటికీ ఆ సంస్థలో ఎంత కాలం పని చేస్తున్నారు లేదా ఇతర సంస్థలకు  మారితే అందుకు స్పష్టమైన వివరాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల శిక్షణ ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పూర్తి సమాచారం ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు  ఇందుకు ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని, ఆ యాప్ ద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందుటకు అవకాశం కల్పించాలని సూచించారు. బ్యాంకుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శత శాతం రుణాలు కల్పించి స్వయం ఉపాధికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. నాణ్యమైన శిక్షణ కల్పించడం వల్ల ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. శిక్షణ పొందడం ఒక ఎత్తు అయితే అనంతర పరిణామాలు మరో ఎత్తని వాటిపై స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.  చేనేత కారులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న ఇ కామర్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ లో శిక్షణ కల్పించాలని సూచించారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు మాట్లాడుతూ జిల్లాలో అకడమిక్, నాన్ అకడమిక్ కేటగిరీలుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అకడమిక్ శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు అందిస్తున్నామని,  నాన్ అకడమిక్ రంగంలో నిరుద్యోగ యువతకు వివిధ కార్యక్రమాల కింద శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న యువతకు ల్యాప్టాప్, టాబ్  తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2021 - 22 సంవత్సరంలో కోవిడ్ నేపథ్యంలో 1551 మంది శిక్షణలో చేరగా 336 మంది ఉపాధి పొందారని తెలిపారు. జిల్లాలో ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం నరసన్నపేట మండలంలో మంజూరైందని అందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల ప్రతినిధులు తమ వివరాలను తెలియజేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి జి. శ్రీనివాసరావు, సెట్ శ్రీ ముఖ్య కార్య నిర్వహణాధికారి కె.సూర్య ప్రభాకర రావు, క్రీడల చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, డిఆర్డిఎ పిడి బి.శాంతి శ్రీ,  ఏపీఈడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కర రావు, నాక్ సహాయ సంచాలకులు చిట్టిబాబు, నెహ్రూ యువ కేంద్ర ఏవో డి.శ్రీనివాస్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-13 17:43:10

గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..

శ్రీకాకుళంజిల్లాలోని ఇచ్ఛాపురం మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో కృష్ణాపురం, మండపల్లి, తేలుకుంచి, రత్తకన్న తదితర సచివాలయాలను జాయింట్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రత్తకన్న, బాలకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గురుమూర్తి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నామని చెప్పారు. కార్యాలయ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం,  కోవిడ్ ఫీవర్ సర్వే చేపట్టకపోవడం తదితర అంశాలను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు.  నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సక్రమంగా పర్యవేక్షణ చేయడం పట్ల ఆయనకు మెమో జారీ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Srikakulam

2021-08-13 17:38:25

అవయవ దానంతో ప్రాణదాతలు కండి..

అవయవ దానం చేసి మరో వ్యక్తికి ప్రాణదానం చేయాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రజలకు పిలుపునిచ్చారు.  శుక్రవారం “ప్రపంచ అవయవదాన దినోత్సవ” సందర్భంగా విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడుడారు. అవయవ దానం మహత్తరమైన దానమని, సందర్భానుసారంగా అన్నదానం, విద్యాదానం చేయడానికి ముందుకి రావాలన్నారు. వీటన్నింటికి మించిన ఫలితాన్ని అవయవదానం పొందవచ్చునన్నారు.  బ్రతికుండగానే పదిమందికి సాయం చేసిన మనిషి, మరణాంతరం కూడా మరొకరికి పునర్జన్మ ఇచ్చే అవకాశం అవయవదానం కల్పిస్తుందన్నారు. ప్రతిఒక్క సామాన్యుడు సైతం మానవత్వంతో ఆలోచిస్తే మరణం చేరువులో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించ వచ్చునని, అలాంటి అద్భుత అవకాశం, మహా  భాగ్యం అవయవదానం సొంతం అని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పలు రకాల అపోహలు అవగాహన లేని కారణంగా ఆశించినంత మేర స్పందన రావడం లేదన్నారు. మరణానంతరం మన అవయవాలను మరొకరికి దానం చేసినందువలన వారికి ప్రాణం పోసిన వారం అవుతామని, వారి కుటుంబంలో వెలుగు నింపిన వారం అవుతామని, అందుకు ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయాలని, ఎటువంటి మూఢ నమ్మకాలకు, అపోహలకు పోకుండా, యువత ముందుకు రావాలని మేయర్ పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డా. రాంబాబు, అవయవ దాన అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-08-13 17:31:53

15న మాంసాహార విక్రయాలు నిషేధం..

భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మాంసాహార విక్రయాలను ఆదివారం నిషేదించినట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా జివిఎంసి పరిధిలోని అన్ని మాంసము, చేపలు, రొయ్యల మార్కెట్లు తదితర మాంసాహారం విక్రయించే దుకాణాలు మూసివేయాలన్నారు. ఈవిషయంలో ప్రజలు, దుకాణదారులు సహకరించాలని కమిషనర్ కోరారు.  ఈ మాంసం విక్రయాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రధాన వైధ్యాధికారిని, జోనల్ కమిషనర్లను, సహాయ వైధ్యాధికారులను కమిషనర్ ఆదేశించారు. తెరిచిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆ ప్రకటనలో కోరారు.

విశాఖపట్నం, Andhra Pradesh, India

2021-08-13 17:28:13

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలకై ఒకరోజు కేటాయించాలి..

విశాఖజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి నెలలో ఒకరోజు సమయం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ దేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు రంగయ్య, అధ్యక్షులు యజ్జల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించడం ఆనందంగా వుందని యూనియన్ నేతలు మీడియాకి తెలియజేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యలను ప్రబుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడంలో యూనియన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానవేణి కుంచె, జిల్లా సలహాదారులు శోభ, సందీప్, వాణీమోహన్, సత్యన్నారాయణలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2021-08-13 17:24:42

ప్రజలకు ఇబ్బందిలేకుండా పూడికలు తీయాలి..

అనంతపురంలో మరువ వంక పూడికతీత పనులను నగర మేయర్ మహమ్మద్ వసీం గురువారం పరిశీలించారు. నగరంలోని మూడవ డివిజన్ పరిధిలోని మరువ వంకలో పూడిక పెరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహం ముందుకు సాగక ఆ ప్రాంతంలో దుర్గంధం నెలకొందని స్థానికులు ఇటీవల మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. దీనితో మరువ వంక పూడికతీత కు టెండర్లు నిర్వహించి రూ.7.80 లక్షల వ్యయంతో పనులు చేపట్టారు.పనులు జరుగుతున్న తీరును మేయర్ వసీం అధికారులను,కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట కార్పొరేటర్ బాలాంజినేయులు, వైకాపా నాయకులు కృష్ణమూర్తి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-08-12 16:06:01

సీఎం పర్యటనకు పక్కాఏర్పాట్లు చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహనరెడ్డి  జిల్లాలో జరుపనున్న పర్యటనకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు సంయుక్తంగా జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పి.గన్నవరంలో జరిపే పర్యటన కొరకు చేపట్టవలసిన ఏర్పాట్లను సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఈ నెల 16వ తేదీ ఉదయం 10-30 గం.లకు హెలికాప్టర్ లో పి.గన్నవరం చేరుకుని అనంతరం 11 గం.ల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకూ జడ్పి హైస్కూల్లో తొలి దశ నాడు-నేడు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ది పనులను ప్రజలకు అంకితం చేస్తారని, అలాగే రెండవ దశ నాడు-నేడు పనులను ప్రారంభించి, జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి వారితో బహిరంగ సభలో ముచ్చటిస్తారని తెలిపారు.  ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పి.గన్నవరంలో వివిధ ప్రదేశాలలో చేపట్టవలసిన ఏర్పాట్లకు జాయింట్ కలెక్టర్లను, ఆర్డిఓలను ఆయన ఇన్చార్జిలుగా నియమించారు. 

 అలాగే పర్యటన కార్యక్రమాలకు హాజరైయ్యే ప్రముఖులు, ముఖ్యమంత్రి సిబ్బంది, విద్యార్థులు, వివిధ జిల్లాలల్లో నాడు-నేడు ఉత్తమ పనులకు అవార్డు గ్రహీతలక, రాష్ట్ర స్థాయి అధికారులకు తగు సదుపాయాలను కల్పించాలని ఆయన ఆదేశించారు.  వాహనాలు, సమూహాల నియంత్రణ, బారికేడింగ్, పబ్లిక్ ఎడ్రస్, లైవ్ కవరేజి, మీడియా సమన్వయం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు సూచనలు జారీ చేశారు.  రానున్న 5 రోజుల్లో వర్ష సూచన ఉన్నందున, వర్షాల కారణంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఏవిధమైన ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఉనికి నేపద్యంలో పటిష్టమైన జాగ్రత్తలను అమలు పరచాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ యం.రవీంద్రనాద్ బాబు మాట్లాడుతూ భద్రతా పరమైన అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేసి, అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మిశ, కీర్తి చేకూరి, బార్గవతేజ్, జి.రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండక్కర్,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-12 15:56:43

భూసమస్యలు సత్వరమే పరిష్కరించాలి..

ఏపీఐఐసి, ఎన్ఎఓబీ, నక్కపల్లి, ఎన్ హెచ్ -16, పాడేరు గ్రీన్ క్యారిడార్ , ఆర్ అండ్ ఆర్, నిర్వాసితులకు గృహ నిర్మాణాలు తదితర అంశాలు,   భూ  సమస్య ల కు సంబంధించిన పనులను వేగ వంతంగా  పూర్తి చేయాల్సింది గా జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, విశాఖపట్నం,అనకాపల్లి,నర్సీపట్నం, ఆర్డీఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,ఏపీఐఐసి అధికారులతో ,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తహశీల్దార్ లతో  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఏ పీ ఐ ఐ సి , ఎన్ ఏ ఓ బీ, ఎన్హెచ్ 16 భూములకు సంబంధించి పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వాటికి సంబంధించి ఏమైనా ప్రతి పాదనలు ఉంటే  వెంటనే పంపించాలన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రభుత్వ, మరియూ జిరాయితీ భూముల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. బీచ్ కారిడార్, రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లోఉన్న పనులను వేగవంతం గా పూర్తి చేయాల్సింది గా ఆదేశించారు.అనకాపల్లి, మునగ పాక, అచ్యుతాపురం రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి అబ్జెక్షన్స్ పై డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. పైన తెల్పిన అంశాల పురోగతి పై ప్రతీ నెల  సమీక్ష నిర్వహిస్తామనీ, సంబంధిత అధికారులు,సిబ్బంది పనుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ ఆర్ గోవింద రావు, ఆర్డీవో లు పెంచల కిషోర్,సీతా రామా రావు,అనిత,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగయ్య, ఏపీఐఐసి జెడ్ ఎమ్ యతిరాజులు, మినిష్టరీ ఆఫ్ రోడ్ సేఫ్టీ పీ డి రవి షేక్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-08-12 15:45:17

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి..

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు విశేషంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సిబ్బందిని ఆదేశించారు. గురువారం నగరంలోని వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సాగర్ నగర్ -1,సాగర్ నగర్ -2 వార్డు సచివాల యాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది  విధులపట్ల అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్ ను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. డేటా ప్రాసెసింగ్, టౌన్ ప్లానింగ్,సంక్షేమం,పరిపాలన,శానిటేషన్, మహిళ పోలీస్ తమ విధులను ఖచ్చితంగా నిర్వహించా లన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదుల పై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తెలియ జేయాలన్నారు.

Visakhapatnam

2021-08-12 15:43:05

విశాఖలో మెగా వేక్సినేషన్ డ్రైవ్..

విశాఖ జిల్లాలో రేపు అన్ని ప్రభుత్వ పి.హెచ్.సి,  సి.హెచ్.సి.లలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున ఒక ప్రకటన లో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోసులు వేయబడతాయి. కోవ్యాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండు అందుబాటులో ఉంటాయన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు, మరియు వయస్సుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలు, 5సంవత్సరాల వయసు లోపు పిల్లలు కలిగిన తల్లులు, విద్యాశాఖలో పని చేయుచున్న ఉపాధ్యాయలు, అంగన్ వాడీ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలియజేశారు. మొదటి డోసు వేయించుకున్న వారందరూ రెండవ డోసు వేయించుకొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పైన సూచించిన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని జిల్లా కలెక్టరు తెలిపారు.

Visakhapatnam

2021-08-12 15:41:37

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..

కె.జి.హెచ్. లో  రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని, పరిసరాలన్నింటిని శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున  వైద్యాధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరు కె.జి.హెచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను అధికం చేయాలని తద్వారా వచ్చే ఆదాయాన్ని కె.జి.హెచ్ అభివ్రద్దికి వినియోగించాలన్నారు. నాడు-నేడు క్రింద షిప్టు చేయాల్సిన శాఖలను రిలోకేట్ చేయడానికి రెండు ప్లాన్ లను సిద్దం గావించాలన్నారు. వైద్య పరికరాల మరమత్తులకు బిల్లులను చెల్లింపు కోసం పెట్టాలన్నారు. కె.జి.హెచ్ కు కొత్త ఎమ్.ఆర్.ఐ. స్కాన్ తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. వేస్ట్ డిస్పాజిల్ పై చర్చించారు. 
తదుపరి కలెక్టరు ఎవర్జెన్సీ వార్డు పరిశీలించి  డాక్టరుకు పలు సూచనలు చేశారు.  వార్డులలో పరిశుబ్రమైన ఆహాదకరమైన వాతావరణం ఉండాలన్నారు.  ఒపి ప్రవేశద్వారం వద్ద వీల్ చెయిర్ లు,  24 గంటలు అందుబాటులో ఉంచి, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వాసుపపల్లి గణేష్ కుమార్, జివిఎమ్ సి కమిషనర్ డాక్టర్ సృజన, కె.జి.హెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ వైధిలి,ఎపిఎమ్ ఎస్ ఐ సి ఇంజనీర్, ఎ.ఎమ్.సి .ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డిఎమ్ అండ్ హెచ్ఒ సూర్యనారాయణ తదితరులు పాల్గ్గొన్నారు. 

Visakhapatnam

2021-08-12 15:37:15

పంద్రాగస్టు వేడుకలకి ఏర్పాట్లు పూర్తి..

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు ప‌క‌డ్భంధీగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు,  ప‌లువురు ఇత‌ర‌ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి, ఆమె గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ను సంద‌ర్శించారు. ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను, మృతి చెందిన కోవిడ్ వారియ‌ర్స్‌కు అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ ఏడాది పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఉత్స‌వాల‌కు, కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను అమ‌తించ‌డం లేద‌ని చెప్పారు. దీనికి బ‌దులుగా ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల డిజిట‌ల్ స్క్రీన్‌ల‌ను ఏర్పాటు చేసి, వేడుక‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. యూట్యూబ్ లైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌రిమితంగా ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఒక్కో అంశాన్ని, ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌లు మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెప్పారు. స్టాల్స్‌ను ఏర్పాటు చేయ‌డం లేద‌ని, వాటి స్థానంలో వివిధ శాఖ‌ల ప్ర‌గ‌తిని వివ‌రిస్తూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వివిధ శాఖ‌ల అధికారుల‌కు, సిబ్బందికి ఇస్తున్న ప్ర‌శంసా ప‌త్రాల‌ను సైతం ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని, మృతి చెందిన కోవిడ్ వారియ‌ర్స్ కుటుంబ స‌భ్యుల‌కు, కోవిడ్ నియంత్ర‌ణ‌కోసం విశేష కృషి చేసిన స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్య‌క్తుల‌కు మాత్ర‌మే మెరిట్ స‌ర్టిఫికేట్ల‌ను అంద‌జేస్తామ‌ని తెలిపారు. క‌లెక్ట‌ర్ వెంట డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, ప‌లువురు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-12 13:57:09

పోషకాహారాన్ని సక్రమంగా అందించాలి..

ప్ర‌భుత్వం అందిస్తున్న పోష‌కాహారాన్ని ల‌బ్దిదారుల‌కు స‌కాలంలో, స‌క్ర‌మంగా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్ బి.చిన్మ‌యాదేవి ఆదేశించారు. ఆమె గురువారం జిల్లాలో పర్య‌టించి, త‌మ శాఖ‌కు సంబంధించిన అధికారులు, సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స్థానిక మ‌హిళా ప్రాంగ‌ణంలో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆర్‌జెడి చిన్మ‌యాదేవి మాట్లాడుతూ, సిడిపిఓలు, అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్లు త‌ర‌చూ క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు జ‌రిగేలా చూడాల‌న్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ సంపూర్ణ పోష‌ణ‌, సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి సారించి, పోషకాహారాన్ని శ‌త‌శాతం, స‌క్ర‌మంగా అంద‌జేయాల‌ని కోరారు. ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించినా, నిర్లిప్త‌త ప్ర‌ద‌ర్శించినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  నిర్మాణంలో ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను ప‌రిశీలించాల‌ని, అవి త్వ‌ర‌గా పూర్తిఅయ్యేలా సంబంధి అధికారుల‌ను కోరాల‌ని సూచించారు. ఇప్ప‌టికీ ప్రారంభించ‌న భ‌వ‌నాల నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే, ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పాల స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేకంగా దృష్టి కేంద్రీక‌రించాల‌ని, మిల్క్‌యాప్‌లో న‌మోదు చేయాల‌ని సూచించారు. గృహ‌హింస‌, దిశ సంబంధిత‌ కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

              ఈ స‌మావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఎం.రాజేశ్వ‌రి, కేర్ ఇండియా ప్ర‌తినిధి సుబ్ర‌మ‌ణ్యం, సిడిపిఓలు, సూప‌ర్ వైజ‌ర్లు, ఒన్ స్టాప్ సెంట‌ర్‌, డివి సెల్ సిబ్బంది. చిల్డ్ర‌న్ హోమ్ ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-12 13:52:55

గ‌రుగుబిల్లి ఎంపిడిఓపై విచార‌ణ‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రుగుబిల్లి మండ‌ల‌ప‌రిష‌త్ అభివృద్ధి అధికారి జి.చంద్ర‌రావు పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి తెలిపారు. కార్యాల‌యంలోనే మ‌ద్యం సేవించిన‌ట్లు ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారి రాజ్‌కుమార్‌ను ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా ఎంపిడిపిపై త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారులు క్ర‌మ‌శిక్ష‌ణ రాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి స్ప‌ష్టంచేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలో మద్యం సేవించడం క్షమించరాని నేరమన్నారు. దేవాలయం లాంటి కార్యాలయంలో మద్యంసేవించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శమన్నారు. అటువంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు.

Garugubilli

2021-08-12 13:40:12