1 ENS Live Breaking News

ఉపాద్యాయులందరికీ కోవిడ్ వేక్సిన్ తప్పనిసరి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉపాధ్యాయ‌లంద‌రికీ కోవిడ్ వేక్సిన్ త‌ప్ప‌నిస‌రి అని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో పాఠ‌శాలలు పునఃప్రారంభం కానున్న నేప‌థ్యంలో, వ‌య‌స్సుతో సంబంధం లేకుండా, ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌తోపాటు, ప్రయివేటు ఉపాధ్యాయులంతా వేక్సిన్ వేయించుకోవాల‌ని కోరారు. ఉపాధ్యాయుల‌కు శ‌త‌శాతం వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని, మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన స‌మావేశంలో వైద్యారోగ్య‌శాఖ‌, విద్యాశాఖాధికారుల‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. వేక్సిన్ కావాల్సిన‌వారు జిల్లాలోని ఏ పిహెచ్‌సికి వెళ్ల‌యినా, వేక్సిన్ వేయించుకోవ‌చ్చ‌ని సూచించారు. కోవిడ్‌ను క‌ట్ట‌డి చేయ‌డం మ‌న చేతుల్లోనే ఉంద‌ని, మ‌నం త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ, వేక్సిన్ వేయించుకుంటే,  క‌రోనాకు భ‌య‌ప‌డ‌న‌క్క‌ర‌లేద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో యువ‌త భాగ‌స్వాములు కావాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. త‌మ ఇళ్ల‌లోని పెద్ద‌వాళ్ల‌కు న‌చ్చ‌జెప్పి, వారికి అవ‌గాహ‌న క‌ల్పించి, వేక్సిన్ వేయించాని సూచించారు. వేక్సిన్ వేయించుకున్న అతికొద్ది మందిలో మాత్ర‌మే జ్వ‌రం, ఒళ్లు నొప్పులు వ‌స్తాయ‌ని, ఒక‌టిరెండు రోజుల్లోనే అవి త‌గ్గిపోతాయి కాబ‌ట్టి, ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ న‌క్క‌ర‌లేద‌ని అన్నారు. త్వ‌ర‌లో పెళ్లిళ్ల సీజ‌న్ మొద‌లు కాబోతోంద‌ని, సాధ్య‌మైనంత త‌క్కువ మందితో వివాహాన్ని జ‌రిపించుకోవాల‌ని కోరారు. త‌క్కువ‌మందికి ప‌రిమితం చేయ‌డం వ‌ల్ల‌, మ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు, మ‌న బంధువుల‌కు కూడా శ్రేయ‌స్క‌ర‌మ‌ని, అందువ్ల వివాహాల‌కు 20 మందికి మించ‌కుండా చూడాల‌ని కోరారు. విదేశాల‌కు వెళ్లే యువ‌త‌ వేక్సిన్ కోసం ఏదైనా పిహెచ్‌సికి వెళ్లి, త‌మ పాస్‌పోర్టును చూపించి, వ‌య‌సుతో సంబంధం లేకుండా వేక్సిన్ వేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. వేక్సినేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌కోసం కంట్రోల్ రూము నెంబ‌ర్లు 08922275279, 08922227950కు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి, డిఇఓ జి.నాగ‌మ‌ణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-11 11:15:27

రేషన్ కార్డుదాలకు ఈకేవైసీ తప్పనిసరి..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రేషన్ కార్డు దారులు ఆధార్ e–KYC నమోదు ప్రక్రియ తప్పని సరిగా  ఈ నెల 31 వ తేది లోపు పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 11,67,624 కార్డులకు గాను 5,04,000 కార్డులకు e–KYC నమోదు కావలసి ఉందన్నారు. రైస్ కార్డు దారులు సంబందిత వాలంటీర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ వారి AEPDS మొబైల్ యాప్ నందు ఆధార్ e–KYC నమోదు చేసుకోవాలన్నారు. సమీప చౌకదరల  దుకానం  నందు గల e–PoS మిషన్ నందు గల e–KYC నమోదు ఆప్షన్ వినియోగించి కూడా ఆధార్  e–KYC పూర్తి చేసుకోవచ్చునని  తెలిపారు. ఎవరైనా వృద్దులు లేదా రోజు వారి కూలీ పనులు చేసుకునే వారి వేలి  ముద్రలు సరిగా నమోదు కాని ఎడల E-POS మిషన్ నందు గల ఫ్యూజన ఫింగర్ ఆప్షన్ వినియోగించి నమోదు  చేసుకోవచ్చునన్నారు. ఒక వేల ఎవరికైనా ఫ్యూజన్  ఫింగర్ ఆప్షన్ నందు కూడా వేలి ముద్రలు సరిగా నమోదు  కాని  యెడల వారు సమీప ఆధార్  నమోదు కేంద్రం నందు వేలి ముద్రలు మరలా నమోదు చేసుకొని e – KYC నమోదు ప్రక్రియను  ఆగస్టు 31 లోపు పూర్తి చేసుకోవాలన్నారు. చిన్న పిల్లల ఆధార్ నమోదు చేసుకొను సమయం నందు వారి వేలి ముద్రలకు బదులుగా తల్లితండ్రుల వేలి  ముద్రలతో వారికి ఆధార్ కార్డులు జారీ చేయడం జరిగి ఉంటే అట్టి వారి వేలి ముద్రలను  ఆధార్ e–KYC నమోదు చేసుకొనుటకు ముందుగా ఆధార్ కేంద్రముల యందు నవీకరణ చేసుకున్న తరువాత ఆధార్ e–KYC నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

 ఇటు వంటి వారికి మాత్రం సెప్టంబర్ మాసం చివరి వరకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా వ్యక్తుల లేదా సభ్యుల ఆధార్ సంఖ్య తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకొనుటకు గ్రామ/ వార్డు సచివాలయం నందు వేసులు బాటు కల్పించడం జరిగిందని దానిని వినియోగించు కోవాల్సిందిగా సూచించారు.  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణి  వ్యవస్థలో ఆధార్ e–KYC నమోదు కాబడని సభ్యుల/ వ్యక్తుల  e–KYC నమోదు ప్రక్రియను ఈ నెల 31  వ తేది లోపు సంబందిత వాలంటీర్ల  ద్వారా పూర్తి చేయని ఎడల  ఆ కార్డు దారులను బోగస్ సభ్యులుగా గుర్తించి వారికి సెప్టెంబర్ 2021 నెల నుండి నిత్యవసర సరుకులను నిలిపి వేయడం జరుగుతుందని, వారి పేర్లను రైస్ కార్డు నుండి తొలగించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ స్పష్టం చేశారు.

Tirupati

2021-08-10 16:50:22

మిరల్ ఫండ్స్ పనులు వేగం పెంచాలి..

శ్రీకాకుళం జిల్లా మినరల్  పండ్స్ పనులు  వచ్చే శుక్రవారం  నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్  లాఠకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్  సమావేశ మందిరంలో   జిల్లా మినరల్ ఫండ్ తో చేపడుతున్న  పనులకు సమీక్షించారు. వారం రోజులలో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 487 పనులకు గాను 210 పనులు ఇంకా ప్రాంభంకాలేదని త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ చేపడుతున్న  291 పనులలో  76 పనులు మాత్రమే పూర్తి అయిట్లు , మిగిలిన పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలు  వచ్చే సమావేశంలో పూర్తి వివరాలతో తెలపాలని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపొవడానికి గల కారణాలు  తెలపాలని అన్నారు.  పనులలో రద్దు చేసిన పనులు , ప్రారంభించిన పనుల వివరాలు తెలపాలని అన్నారు. టెక్కలి డివిజనల్ లో  నాలుగు పనులు పూర్తి అయ్యాయని  మిగిలిన పనులు త్వరలో పూర్తి చేయాలని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్  లో భాగంగా 18 పనులు ఉండగా 12 పనులు జరుగుతున్నాయని మిగిలిన పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని తెలిపాలని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఐసిడిఎస్ కి  కేటాయించిన పనులు పూర్తి చేసుకున్నందుకు అభినందించారు. నీటిపారుదల శాఖ కేటాయించిన మొత్తం పనులలో రూ 7 కోట్లు  పనులు పెండింగ్ లో ఉన్నవని , వాటిని పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్ బిల్స్ ఉన్నట్లైతే సి.ఎఫ్.యం.ఎస్ లో పొందుపర్చాలని తెలిపారు. ఖర్చు పెట్టె ప్రతీ ఒక్కరూపాయికి  బిల్స్ ఆన్ లైన్ లో పొందుపర్చాలని  ఆయన తెలిపారు.  కేటాయించిన పనులలో  ఏవైనా రద్దు చేసి ఉంటే , ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తి వివరాలు తెలిపాలని అన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పి.ఓ పి.శ్రీధర్, మైనింగ్ అధికారులు, సర్వ శిక్షా అభియాన్ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-10 16:49:38

నాడు-నేడు పనులు పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో నాడు - నేడు లో భాగంగా జిల్లాలో జరుగుచున్న  ప్రభుత్వ పాఠశాలలో పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి కావలసిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. మంగళవారం  సాయంత్రం   జిల్లా కలెక్టర్  సమావేశ మందిరంలో  నాడు – నేడు పనులపై  జిల్లా అధికారులు, మండల విద్యాశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1220 పాఠశాలల్లో నాడు –నేడు పనలు ఉండగా  1138 పాఠశాలల్లో పనులు పూర్తయిందని, మిగిలిన పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి కావలసిందేనని అన్నారు. రాష్ట్రంలో నాడు నేడు పనులలో ప్రధమ స్థానంలో నిలవాలని అన్నారు. చిన్న పనులు పెండింగ్ వలన రాష్ట్రంలో 10వ స్థానంలో ఉన్నామని, యం బుక్,  బిల్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం వలన రాష్ట్రంలో ప్రధమ స్థానంలో వెళతామని త్వరలో చిన్న పనులు పూర్తి చేసి  ఆన్ లై న్ లో అప్ లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు. జిల్లాలో నాడు- నేడు పనులలో  మిళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, పాలకొండ, సీతంపేట వెనకబడి ఉన్నాయని, మండల విదాశాఖాధికారి ఇతర సిబ్బందితో కలసి సమన్వయంతో  పనిచేసి త్వరలో  పని పూర్తి చేయాలని అన్నారు. పెయింటర్స్ సంఖ్యను పెంచి పని గంటలు పెంచుకోవడం ద్వారా  ఒక ప్రణాళిక బద్దంగా పని చేస్తే ఆగస్టు 15 నాటికి  100 శాతం పెయింటింగు పనులు పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. స్కూల్ తెరిచేనాటికి  నాడు-నేడు పనులతో  ఎంతో ఆహ్లదంగా  చక్కగా తిర్చిదిద్దాలని, ఈ పనులను చూసి పిల్లలు వాలు తల్లి దండ్రులు  సంతోషించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, మండల విద్యాశాఖాధికారులు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-10 16:48:48

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్ప్రేయింగ్, ఫాగింగు చేయించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన 6వ జోన్ 75వ వార్డు దొగ్గవాని పాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్  మాట్లాడుతూ వార్డులో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని,  మలేరియా సిబ్బంది వార్డులో ప్రతీ  ఇంటిని సర్వే చేసి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ కేసు నమోదైన ఇంటిలోను    పరిసరాలను స్ప్రేయింగ్, ఫాగింగు దగ్గరుండి చేయించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలు డ్రైగా ఉండే  ఉండే విధంగా చూడాలని, కాలువలోని చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో బయాలజిస్ట్ దొర, మలేరియా ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-10 16:32:44

చెత్తను నేరుగా వాహనంలోనే వేయండి..

పుష్ కార్టులలోని చెత్తను కింద వేయకుండా నేరుగా చెత్త తరలించే వాహనంలోనికి ఎత్తించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జివిఎంసి పాత సమావేశ మందిరంలో  ప్రజా ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదని, బహిరంగ ప్రదేశాలలో చెత్త కుప్పలు అధికంగా కనిపిస్తున్నాయని, శానిటరీ ఇన్స్పెక్టర్లు రెండు పూటలు  వార్డులో తిరిగి పారిశుద్ధ్య కార్మికులచే పనిచేయించాలని, అనధికారికంగా పార్కింగ్ చేసి వదిలేసిన వాహనాలను పోలీసుల వారి సహాయంతో తొలగించాలని ఆదేశించారు. చెత్త నిర్వహణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, రోడ్లు, కాలువలలో చెత్త కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెత్త వాహనాలపై కవర్లు తప్పనిసరిగా ఉండాలని, డ్రై వేస్ట్ రోడ్లపై పడకుండా చూడాలని, వాహనాలు రాలేదని చెత్త సేకరణ ఆపవద్దని, వాహనం వచ్చే వరకు పుష్ కార్టులు ద్వారా చెత్త సేకరించాలని, కొన్నిచోట్ల చెత్త సేకరణ సంతృప్తిని ఇచ్చినా, మరికొన్నిచోట్ల సరిగా జరగడం లేదని తెలిపారు. రోడ్లు స్వీపింగు చేసే యంత్రాలు వాటి నిర్దేశించిన సమయాలలో  పని చేసే విధంగా వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్ కార్టులు రిపేర్ వస్తే వాటిని వెంటనే రిపేరు చేయించాలని కార్య నిర్వాహక ఇంజినీరు(మెకానికల్) వారిని ఆదేశించారు. ప్రతి చిన్న, పెద్ద దుకాణాల ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండాలని, దుకాణాదారులు ముందు ఉన్న వ్యర్థాలను వారి సిబ్బందిచే ఎత్తించాలని సూచించారు. చెత్త నిర్వహణ వారు చేయని యెడల, వారి ట్రేడ్ లైసెన్స్ లు రద్దు చేయాలని తెలిపారు. ఇపిడిసిఎల్ వారు తొలగించిన చెట్ల కొమ్మలను ఎత్తడం లేదని అందుకు ఇపీడీసీఎల్ వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. రాత్రి పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేసిన చెత్తను వెంటనే ఎత్తించాలని ఆదేశించారు.హోం కంపోస్ట్ తయారు చేయు వారికి సహాయ సహకారాలు అందించాలని, 10 ఇల్లు ఉన్నచోట ఆర్.పి.లు, సి.వో.లు, ఆర్.డబ్ల్యూ.ఎ.ఎస్.ల ద్వారా హోం కంపోస్ట్ పై అవగాహన కల్పించాలని సూచించారు.

రానున్న మూడు నెలలు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, అందుకు ఏ.ఎల్.ఒ. కార్యక్రమాలు జరిపి ప్రజలకు అవగాహన కల్పించాలని, మలేరియా సిబ్బంది వారంలో ఒకరోజు ప్రతి ఇంటితో పాటు, వారి ఏరియాలో ఉన్న కార్యాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రిలు మొదలైనవి సర్వే చేసి డెంగ్యూ, మలేరియా అధికం అవకుండా స్ప్రేయింగ్, ఫోగింగ్ చేయించాలని ఆదేశించారు. యూజర్ చార్జీలు అన్ని వార్డుల్లో వసూలు చేయాలని,  ప్రత్యేకంగా మోడల్ వార్డులో వంద శాతం యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. యూజర్  ఛార్జీలు ప్రతి 3 నెలల ఒకసారి వసూలు చేయాలని, ఎవరు ఏవిధంగా కడితే ఆ విధంగా వసూలు చేయాలని ఆదేశించారు.జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ స్పందనలో, గ్రీవెన్స్ లో, ఆన్లైన్లో, డయల్  యువర్ మేయర్, డయల్  యువర్ కమిషనర్ కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పూర్తి చేయాలని, పెండింగు లో  ఉంచరాదని ఆదేశించారు.  ఒ.డబ్ల్యూ.ఎం.ఎస్. స్కానర్సు రిపేర్లు ఉంటే, వెంటనే రిపేర్లు చేసి, ప్రతి ఇల్లు స్కాన్ చేయాలని 100 శాతం చెత్త నిర్వహణ జరగాలని, పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్లు, గ్లౌజులు, చీపుర్లు  మొదలైనవి అందించాలని, వారు హాజరు పక్కాగా ఉండాలని, చెత్త తరలించే వాహనాలకు మైక్ సిస్టం ఉండాలని, వార్డు ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి, మలేరియా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక (మేకికల్) ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ లు, వార్డు ప్రత్యేక అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజా ఆరోగ్య సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు. 


GVMC office

2021-08-10 16:32:05

శిధిలమైన డ్రైనేజిలను పునర్నిర్మించాలి..

విశాఖ మహా నగరంలో శిధిలమైన డ్రైనేజిలను పునర్నించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జివిఎంసి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నాలుగవ జోన్ 37వ వార్డు పరిధిలో గొల్లవీధి, ఆశిపాప వీధి, కొత్త రెల్లి వీధి, జబ్బర్ తోట తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరామ్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ శిధిలమైన డ్రైనేజిలను, పాడైపోయిన సి.సి. రోడ్లను నూతనంగా నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పోలమాంబ గుడి వద్ద కమ్యునిటీ హాలులోని రెండవ ఫ్లోర్ నిర్మాణం నకు సాధ్యాసాద్యాలను పరిశీలించి, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  కాలువలలో చెత్త అధికంగా కనిపిస్తుందని, కాలువలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ రోజూ డోర్ టు డోర్ చెత్తను తప్పనిసరిగా  సేకరించాలని తడి-పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై మహిళా సంఘాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబల కుండా ఫాగింగు చేయాలని మలేరియా సిబ్బందికి సూచించారు.  బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆదేశించారు. వార్డు కార్పొరేటర్, ప్రజలు స్థానిక సమస్యలపై మేయర్ కమిషనర్ కు వివరించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, ఎఎంఒహెచ్ డా. కిషోర్, కార్య నిరవాహక ఇంజినీర్లు చిరంజీవి, గణేష్ బాబు, ఇతర అధికారులు, వై.ఎస్.ఆర్. సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.      

విశాఖ సిటీ

2021-08-10 16:29:09

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోపూజ‌..

తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న గోకులాష్టమి సందర్భంగా ఉదయం 10.30 గంటలకు 'గోపూజ మహోత్సవం' జరుగనుంది. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. కోవిడ్ -19  వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

Tirumala

2021-08-10 16:23:28

ప్రతి అడుగూ మీ మంచికే వేస్తున్నా..

ప్రతి అడుగు మీకు మంచి చేయుటకు వేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇ-మార్కెటింగ్ సౌకర్యం కల్పించుటకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అప్కో ఇందులో చేరాలని ఆయన సూచించారు. వైయస్సార్ ఆర్ నేత నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వరుసగా మూడవ ఏడాది నేతన్న లకు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 80 వేల 32 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ఈ ఏడాది అందిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 576.07 కోట్ల ను నేతన్నలకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు  దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చే అభివృద్ధి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐదేళ్లలో స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని ఆయన పేర్కొంటూ ప్రతి లబ్దిదారునికి రూ.1.20  లక్షల ఆర్థిక సహాయాన్ని అందించుటకు నిర్ణయించామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఈ జాబితాలో లేకపోతే సచివాలయంలో దరఖాస్తు సమర్పించ వచ్చని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో 2021 - 22 సంవత్సరంలో 1601 మందికి రూ.3.84 కోట్లను నేతన్న నేస్తంగా అందించడం జరుగుతుందని తెలిపారు. 2020 - 2021లో 1775 మందికి  రూ. 4.26 కోట్లు,  2019 - 20 సంవత్సరంలో 1457 మందికి రూ.3.50 కోట్లు అందించామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు లాంఛనంగా చెక్కులను పంపిణీ చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, శాసనసభ్యులు కంబాల జోగులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరి బాబు, మామిడి శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, చేనేత సహకార సంఘం ప్రతనిధులు చంద్రయ్య, కె. రవి, ప్రకాష్,  చేనేత శాఖ ఎడి ఎస్ కె అబ్దుల్ రషీద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-10 16:19:52

జగనన్నఇళ్ల నిర్మాణాలు యజ్ఞంలా సాగాలి..

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న జగనన్న కాలనీల ఇళ్ళ నిర్మాణం యజ్ఞంలా సాగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను సూచించారు. మంగళవారం పలాసలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి హౌసింగ్ హిమాన్షు కౌశిక్ ల సమక్షంలో డివిజన్ స్థాయి హౌసింగ్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పధకం జగనన్న కాలనీలు ఇళ్ళ నిర్మాణం అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల పేరున ఇళ్ళ పట్టాలు అందించి వారికి హక్కును కల్పించడం  దేశంలో ఎక్కడా లేని విదంగా జరుగుతుందని అన్నారు. లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణాలవైపు మొగ్గు చూపించాలని అన్నారు. ఇళ్లు లేని కుటుంబం ఉండ కూడదు అనే లక్ష్యంగా మొదటి దశలో మొత్తం 34 లక్షల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అందరికి పట్టాలు పంపిణీ చేశామని లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఉన్న లోటుపాట్లను సమీక్షలో తెలుసుకున్నారు. ఇసుక, ఇటుక, సిమెంట్, ఐరన్ అందించడం తోపాటు నిర్మాణానికి యజమాని నుంచి    ఉపాది హామీ ద్వారా పని దినాలు కల్పించి కూలీలకు డబ్బులు ఏర్పాట్ల విషయాన్ని సమీక్షించారు. 

పేదవారు నిర్మాణం విషయంలో ఖర్చు చేయలేనటువంటి వారిని గుర్తించాలని కోరారు.  వారికి ప్రభుత్వం ఇళ్ళు నిర్మాణం చేపట్టి అందిస్తుందని అన్నారు. పేదల ఇళ్ళ నిర్మాణంలో లబ్ధిదారులకు బిల్లులు మంజూరు విషయంలో జాప్యం జరగకుండా సకాలంలో వారికి డబ్బులు అందించ గలిగితే వారు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తారని అన్నారు. అంతే కాకుండా జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజిలు, ఎలక్ట్రికల్, మంచినీటి సౌకర్యాలకు సంబందించిన పనులపై సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీలలో ప్రతి పని వేగవంతం కావాలని సూచించారు. టెక్కలి డివిజన్ లోని అన్ని మండలాల అధికారులతో పరిస్థితులపై చర్చించారు. పేదల ఇళ్ళ నిర్మాణం అనేది యుద్ద ప్రాతిపదికన కొనసాగాలని ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు వారికి ఉన్న సమస్యలు గుర్తించి వేగవంతం చేయాలని కోరారు. మండలాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కూర్మి నాయుడు, డ్వామా పిడి హెచ్.కూర్మారావు, ఇచ్చాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్.డబ్ల్యూ.యస్ , ఎలక్ట్రికల్ , హౌసింగ్,  డ్వామా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్, తదితరులు పాల్గొన్నారు.

Palasa

2021-08-10 16:18:42

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..

వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అందరూ కలిసి పని చేసినపుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చని  జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున  సూచించారు. మంగళవారం కలెక్టరు వ్యవసాయ, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులతో వారి సమస్యలు  చర్చించి పరిష్కరించాలన్నారు.  మీ పరిజ్ఞానాన్ని రైతులకు అందించి నాణ్యమైన  అధిక ఫల సాయం పొందేందుకు ఉపయోగ పడాలన్నారు.  మండలాలలో పర్యటించినపుడు అక్కడి ప్రత్యేక సమస్యలను బోర్డు సమావేశాలలో ప్రస్తావించాలన్నారు.  బోర్డు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్నారు.  పాడేరు, నర్సీపట్నం ప్రాంతాలలో రైతులతో చర్చించాలన్నారు.  గ్రామ సచివాలయాలలో ఈ శాఖల సిబ్బంది  అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలను అందించాలన్నారు.  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నాణ్యత ప్రమాణాల పరీక్షలు  నిర్వహించి తద్వారా  రైతు భరోసా కేంద్రాలలో రైతులకు  అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  నాణ్యమైన  విత్తనాలను రైతులకు అందించుటలో  రైతు భరోసా కేంద్రాల పాత్ర ప్రధానమైనదన్నారు.   రైతు భరోసా కేంద్రాలలో పని చేసే సిబ్బందిని విత్తన విక్రయించే డీలర్లను  అనుసంధానం చేసి తప్పని సరిగా   వీరు విక్రయించే అన్ని రకాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లోని  సీడ్ టెస్టింగ్ కిట్ ద్వారా మొలక శాతం పరీక్షించి విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో వారపు సంతల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మకుండా చర్యలు తీసుకోసుకొనే విధంగా  రైతులలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలపై యాజమాన్య పద్దతులను గురించి  రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖలను కూడా సంక్షేమ పధకాలు రైతుల శ్రేయస్సు కోసం విరివిగా అందించవలెనని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను నిర్దేశిత కాలపరిమతిలోగా పరిష్కరించాలన్నారు. అంతకు ముందు  ఆయా శాఖల అధికారులు ఆ శాఖలో అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెక్టులు మొదలగు విషయాలను లక్ష్యాలు, సాధించినవి కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో  వ్యవసాయ శాఖ  జెడి  లీలావతి,  పశుసంవర్ధక శాఖ,  ఫిషరీస్,  సెరికల్చర్  శాఖల జె డి లు,  హార్టికల్చర్ డి.డి  తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-10 15:39:38

ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోండి..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నులు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇసుక కొర‌త రానీయొద్ద‌ని, వీటికి ప్రాధాన్య‌మిచ్చి ఇసుక స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య నిర్మాణ ప‌నుల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్‌.. డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారులు, జేపీ వెంచ‌ర్స్ సిబ్బందితో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో చేర‌వేసేందుకు వేదిక‌లుగా ఉన్న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకే), బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు తదిత‌రాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక పూర్తిచేయాల్సి ఉన్నందున జాప్యం లేకుండా ఇసుక స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. అదే విధంగా లేఅవుట్ల‌లో జ‌రుగుతున్న పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణ ప‌నులు వేగ‌వంతమ‌య్యేలా ఇసుక‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు. ఇసుక రీచ్‌/స్టాక్‌యార్డు వ‌ద్ద‌కు కూప‌న్ల‌తో వ‌చ్చిన లారీలకు అర‌గంట‌లో లోడింగ్ జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. రీచ్‌లు, స్టాక్ యార్డుల నుంచి ఇసుక స‌క్ర‌మంగా స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూసేందుకు వీఆర్‌వో/వీఆర్ఏల‌ను నోడ‌ల్ సిబ్బందిగా నియ‌మించాల‌ని, ఇందుకు త‌హ‌సీల్దార్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఏ రీచ్ నుంచి ఎంత ఇసుక ప్ర‌భుత్వ ప్రాధాన్య ప‌నుల‌కు వెళ్తుంద‌నే విష‌యంపై రోజువారీ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. 

Kakinada

2021-08-10 15:28:38

ఈ-కేవైసీ చేస్తేనే నిత్యావ‌స‌ర స‌రుకులు..

బియ్యం కార్డులోని ప్ర‌తి వ్య‌క్తి ఆధార్ ఈ-కేవైసీ చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ ప్రక్రియ పూర్త‌యితేనే ఆ వ్య‌క్తికి చౌక ధ‌ర‌ల నిత్యావ‌స‌రాలు అందుతాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కార్డులో ఉన్న పేర్ల‌లో ఈ-కేవైసీ పూర్తికాని వారికి త‌హ‌సీల్దార్ లేదా వీఆర్‌వో నుంచి నోటీసులు అందుతాయ‌ని, వీటిని అందుకున్న వారు వాలంటీర్ ద్వారా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ఏఈపీడీఎస్ మొబైల్ యాప్‌లో ఆధార్ ఈ-కేవైసీ న‌మోదు ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 31వ తేదీలోపు చేయించుకోవాల‌ని సూచించారు. అదే విధంగా చౌక ధ‌ర‌ల దుకాణంలోని ఈ-పోస్ మెషీన్‌లోని ఈ-కేవైసీ ఆప్షన్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్నారు. ఈ-కేవైసీ పూర్తికాని స‌భ్యుల‌ను బోగ‌స్ స‌భ్యులుగా గుర్తించి సెప్టెంబ‌ర్ నుంచి నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రాను నిలిపేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అదే విధంగా వారి పేర్ల‌ను కార్డు నుంచి తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

Kakinada

2021-08-10 15:27:18

అప్నన్నకు డిసిసిబీ చైర్మన్ పూజలు..

విశాఖ డీసీసీబీ ఛైర్ పర్సన్ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు దంపతులు మంగళవారం సింహాచలం  శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో అధికారులు చైర్మన్ కు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం చైర్మన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కప్పస్ధంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసిసిబీ చైర్మన్ హోదాలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలతో డిసిసిబీ ద్వారా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. తమకు ఈ పదవి రావడానికి కారణమైన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఇతన పార్టీ పెద్దలకు ధన్యవాదములు తెలియజేశారు. పూజలు అనంతరం వేద పండితులు ఆశ్వీరదాలు అందించగా, అధికారులు చైర్మన్ దంపతులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. 

Visakhapatnam

2021-08-10 14:51:59

లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు ..

సింహాచలం  శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయంలో శ్రావణశుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ నెల (శ్రావణమాసం 13న శుక్రవారం)  మొదటి శుక్రవారం లక్ష కుంకుమార్చన జరపడం ఆనవాయితీగా వస్తోంది.  20, 27, సెప్టెంబర్ 03న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లతాయారు సన్నిదిలో ఈ లక్షకుంకుమార్చన జరుపుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనే అవకాశం ఉందన్న ఈఓ ఇందుకోసం రూ.2,500 సాయంత్రం 5:30 గంటల నుంచి రూ.500 (ఐదువందలు) చెల్లించి సహస్రనామార్చనలో పాల్గొనే అవకాశం వుంటుందని తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా పాల్గొనదలచిన వారు దేవస్థానం అకౌంట్ కు అమౌంట్ , అడ్రస్, గోత్రనామాలు పంపించాలని సూచించారు. అంతేకాదు ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటలవరకు అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆమె తెలియజేశారు. శ్రావణమాసం సందర్భంగా సింహవల్లి  తాయార్ , ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసినట్టు ఈఓ వివరించారు. ఆన్ లైన్ పూజలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 6303800736 నంబర్ కు వాట్సప్ లేదా ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.

Simhachalam

2021-08-10 14:37:09