1 ENS Live Breaking News

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..

వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అందరూ కలిసి పని చేసినపుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చని  జిల్లా కలెక్టరు డా. ఎ.మల్లిఖార్జున  సూచించారు. మంగళవారం కలెక్టరు వ్యవసాయ, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులతో వారి సమస్యలు  చర్చించి పరిష్కరించాలన్నారు.  మీ పరిజ్ఞానాన్ని రైతులకు అందించి నాణ్యమైన  అధిక ఫల సాయం పొందేందుకు ఉపయోగ పడాలన్నారు.  మండలాలలో పర్యటించినపుడు అక్కడి ప్రత్యేక సమస్యలను బోర్డు సమావేశాలలో ప్రస్తావించాలన్నారు.  బోర్డు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్నారు.  పాడేరు, నర్సీపట్నం ప్రాంతాలలో రైతులతో చర్చించాలన్నారు.  గ్రామ సచివాలయాలలో ఈ శాఖల సిబ్బంది  అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలను అందించాలన్నారు.  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నాణ్యత ప్రమాణాల పరీక్షలు  నిర్వహించి తద్వారా  రైతు భరోసా కేంద్రాలలో రైతులకు  అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  నాణ్యమైన  విత్తనాలను రైతులకు అందించుటలో  రైతు భరోసా కేంద్రాల పాత్ర ప్రధానమైనదన్నారు.   రైతు భరోసా కేంద్రాలలో పని చేసే సిబ్బందిని విత్తన విక్రయించే డీలర్లను  అనుసంధానం చేసి తప్పని సరిగా   వీరు విక్రయించే అన్ని రకాల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లోని  సీడ్ టెస్టింగ్ కిట్ ద్వారా మొలక శాతం పరీక్షించి విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో వారపు సంతల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మకుండా చర్యలు తీసుకోసుకొనే విధంగా  రైతులలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలపై యాజమాన్య పద్దతులను గురించి  రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖలను కూడా సంక్షేమ పధకాలు రైతుల శ్రేయస్సు కోసం విరివిగా అందించవలెనని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను నిర్దేశిత కాలపరిమతిలోగా పరిష్కరించాలన్నారు. అంతకు ముందు  ఆయా శాఖల అధికారులు ఆ శాఖలో అమలు చేస్తున్న వివిధ పధకాలు ప్రాజెక్టులు మొదలగు విషయాలను లక్ష్యాలు, సాధించినవి కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో  వ్యవసాయ శాఖ  జెడి  లీలావతి,  పశుసంవర్ధక శాఖ,  ఫిషరీస్,  సెరికల్చర్  శాఖల జె డి లు,  హార్టికల్చర్ డి.డి  తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-10 15:39:38

ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోండి..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నులు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇసుక కొర‌త రానీయొద్ద‌ని, వీటికి ప్రాధాన్య‌మిచ్చి ఇసుక స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య నిర్మాణ ప‌నుల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్‌.. డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారులు, జేపీ వెంచ‌ర్స్ సిబ్బందితో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో చేర‌వేసేందుకు వేదిక‌లుగా ఉన్న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్‌బీకే), బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు తదిత‌రాల‌కు శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక పూర్తిచేయాల్సి ఉన్నందున జాప్యం లేకుండా ఇసుక స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. అదే విధంగా లేఅవుట్ల‌లో జ‌రుగుతున్న పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణ ప‌నులు వేగ‌వంతమ‌య్యేలా ఇసుక‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు. ఇసుక రీచ్‌/స్టాక్‌యార్డు వ‌ద్ద‌కు కూప‌న్ల‌తో వ‌చ్చిన లారీలకు అర‌గంట‌లో లోడింగ్ జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. రీచ్‌లు, స్టాక్ యార్డుల నుంచి ఇసుక స‌క్ర‌మంగా స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూసేందుకు వీఆర్‌వో/వీఆర్ఏల‌ను నోడ‌ల్ సిబ్బందిగా నియ‌మించాల‌ని, ఇందుకు త‌హ‌సీల్దార్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఏ రీచ్ నుంచి ఎంత ఇసుక ప్ర‌భుత్వ ప్రాధాన్య ప‌నుల‌కు వెళ్తుంద‌నే విష‌యంపై రోజువారీ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. 

Kakinada

2021-08-10 15:28:38

ఈ-కేవైసీ చేస్తేనే నిత్యావ‌స‌ర స‌రుకులు..

బియ్యం కార్డులోని ప్ర‌తి వ్య‌క్తి ఆధార్ ఈ-కేవైసీ చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ ప్రక్రియ పూర్త‌యితేనే ఆ వ్య‌క్తికి చౌక ధ‌ర‌ల నిత్యావ‌స‌రాలు అందుతాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కార్డులో ఉన్న పేర్ల‌లో ఈ-కేవైసీ పూర్తికాని వారికి త‌హ‌సీల్దార్ లేదా వీఆర్‌వో నుంచి నోటీసులు అందుతాయ‌ని, వీటిని అందుకున్న వారు వాలంటీర్ ద్వారా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ఏఈపీడీఎస్ మొబైల్ యాప్‌లో ఆధార్ ఈ-కేవైసీ న‌మోదు ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 31వ తేదీలోపు చేయించుకోవాల‌ని సూచించారు. అదే విధంగా చౌక ధ‌ర‌ల దుకాణంలోని ఈ-పోస్ మెషీన్‌లోని ఈ-కేవైసీ ఆప్షన్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్నారు. ఈ-కేవైసీ పూర్తికాని స‌భ్యుల‌ను బోగ‌స్ స‌భ్యులుగా గుర్తించి సెప్టెంబ‌ర్ నుంచి నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రాను నిలిపేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అదే విధంగా వారి పేర్ల‌ను కార్డు నుంచి తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

Kakinada

2021-08-10 15:27:18

అప్నన్నకు డిసిసిబీ చైర్మన్ పూజలు..

విశాఖ డీసీసీబీ ఛైర్ పర్సన్ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు దంపతులు మంగళవారం సింహాచలం  శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో అధికారులు చైర్మన్ కు దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం చైర్మన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కప్పస్ధంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసిసిబీ చైర్మన్ హోదాలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలతో డిసిసిబీ ద్వారా సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. తమకు ఈ పదవి రావడానికి కారణమైన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఇతన పార్టీ పెద్దలకు ధన్యవాదములు తెలియజేశారు. పూజలు అనంతరం వేద పండితులు ఆశ్వీరదాలు అందించగా, అధికారులు చైర్మన్ దంపతులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. 

Visakhapatnam

2021-08-10 14:51:59

లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు ..

సింహాచలం  శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి ఆలయంలో శ్రావణశుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ నెల (శ్రావణమాసం 13న శుక్రవారం)  మొదటి శుక్రవారం లక్ష కుంకుమార్చన జరపడం ఆనవాయితీగా వస్తోంది.  20, 27, సెప్టెంబర్ 03న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లతాయారు సన్నిదిలో ఈ లక్షకుంకుమార్చన జరుపుతున్నట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనే అవకాశం ఉందన్న ఈఓ ఇందుకోసం రూ.2,500 సాయంత్రం 5:30 గంటల నుంచి రూ.500 (ఐదువందలు) చెల్లించి సహస్రనామార్చనలో పాల్గొనే అవకాశం వుంటుందని తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా పాల్గొనదలచిన వారు దేవస్థానం అకౌంట్ కు అమౌంట్ , అడ్రస్, గోత్రనామాలు పంపించాలని సూచించారు. అంతేకాదు ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటలవరకు అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆమె తెలియజేశారు. శ్రావణమాసం సందర్భంగా సింహవల్లి  తాయార్ , ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసినట్టు ఈఓ వివరించారు. ఆన్ లైన్ పూజలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 6303800736 నంబర్ కు వాట్సప్ లేదా ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.

Simhachalam

2021-08-10 14:37:09

విజయసాయిరెడ్డి ఎంపికపై వంశీ హర్షం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మహావిశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మంగళవారం వంశీ విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆనందం వ్యక్తం చేశారు.

Visakhapatnam

2021-08-10 13:53:09

బీఎల్ఓలు కీలకంగా వ్యవహరించాలి..

ఓటరు జాబితా తయారు చేయడంలో బి.ఎల్. ఓ లు కీలకం పాత్ర పోస్తూ.. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం మండల బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ లతో  ఐ.టి.డి.ఎ  గిరిమిత్ర సమావేశ  ప్రాజెక్ట్ అధికారి స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR-2022) నిర్వహణ నిమిత్తం సమావేశం నిర్వహించారు. ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ నవంబర్1, 2021 డ్రాఫ్ట్ పబ్లికేషన్, జనవరి 5, 2022 ఫైనల్ పబ్లికేషన్ అన్నారు. నవంబర్1,2021 నుండి నవంబర్30, 2021 క్లైములు , అభ్యంతరాలు స్వీకరణ కార్యక్రమం అన్నారు. అందరూ బి.ఎల్.ఓ లు కీలక పాత్ర పోషించాలనీ, ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చూసుకోవాలని సూచించారు. విధులు నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్న అడిగి తెలుసుకోవాలన్నారు.  ఈ సమావేశానికి పార్వతీపురం తహశీల్దార్ ఎన్.వి.రమణ, ఎన్నికల ఉప తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, బి. ఎల్.ఓలు, సూపర్వేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-08-10 13:35:10

వైఎస్సార్ హౌసింగ్ వేగవంతం చేయాలి..

నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు, జగనన్న గృహనిర్మాణాల గ్రౌండింగ్ పనులను ఈ నెల 15 లోగా  వేగవంతం  చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.   మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  గృహ నిర్మాణ  పనులపై వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  గృహ నిర్మాణ పథకానికి సంబందించి పనులను అలసత్వం లేకుండా సంబందిత మండల అధికారులు అంకిత భావంతో  పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వై ఎస్ ఆర్ అర్భన్ ఫేజ్ - 1 గృహ నిర్మాణాలకు  సంబందించి లే అవుట్ లు, గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మంగళవారం  హౌసింగ్ పనులకు సంబందించిన పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని  ఎప్పటి కప్పుడు  జరుగుతున్న అభివృద్ది తనకు వివరించాలన్నారు. లే అవుట్ లలో బేస్ మెంట్ లెవెలింగ్, అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్లు,  విద్యుత్తు, బోర్ వెల్స్, నీటి సరఫరా పనులను వేగవంతం  చేయాలన్నారు.  సిమెంట్, స్టీల్, ఇసుక మెటీరియల్ ను  అందుబాటులో ఉంచాలన్నారు. హౌసింగ్ పిడి  ఎం .శ్రీనివాస్  మాట్లాడుతూ  నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు మొదటి దశలో భాగంగా  జిల్లాలో 36.932 గృహాలు లక్ష్యం కాగా, 33.202 గృహాలు గ్రౌండింగ్ అయి 90 శాతం తో రాష్ట్రంలో విశాఖ జిల్లా  మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి,  పంచాయితీ రాజ్, ఆర్ డబ్య్లు ఎస్, ఆర్ అండ్ బి , ట్రాన్స్ కో , డ్వామా, జి.వి.ఎం.సి, హౌసింగ్ శాఖల అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-08-10 13:32:36

పీఏసీకి విజయసాయిరెడ్డి ఎంపికపై హర్షం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీ  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల జిసిసి చైర్మన్ డా.శోభాస్వాతీ రాణి హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ సభ్యులుగా ఎంపిక కావడం పట్ల ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు, పథకాల్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎంపిక పార్టీలోని అన్ని విభాగాలకు ఆనందం కలిగించే విషయమన్నారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్న ఉన్నత పదవులు అదిరోహించాలని ఆకాంక్షించారు.

Visakhapatnam

2021-08-10 13:21:06

Simhachalam

2021-08-10 06:45:05

జివిఎంసీ స్పందన 41 ఫిర్యాదులు..

జివిఎంసీలో సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో ప్రజల నుండి  41 అర్జీలు వచ్చినట్టు మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. వాటినినేరుగా వివిధశాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపినట్టు ఆమె వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని అన్ని సచివాలయాల్లోనూ స్పందన జరిగేలా చూడాలని, ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జివిఎంసీ ప్రధాన కార్యాలయం వరకూ రాకుండా చేయాలని కమిషనర్ డా.జి.స్రిజనకు సూచించారు. అనంతరం వార్డుల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను వివరించారు. ఒకటవ జోనుకు 01, రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 12, నాలుగవ జోనుకు 04, అయిదవ జోనుకు 03, ఆరవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, మెయిన్ ఆఫీసు నకు 12, మొత్తము 41    ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-09 15:47:46

అర్జీలపై అలసత్వం ప్రదర్శించవద్దు..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలు డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి నివేదించిన అర్జీలపై అలసత్వం ప్రదర్శిచవద్దని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధికారులకు సూచించారు. సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో 26 మంది నుంచి ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఆమె జివిఎంసి సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు “స్పందన” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి నిర్వహించారు. డయల్ యువర్ మేయర్  కార్యక్రమంలో రెండవ జోనుకు 02, మూడవ జోనుకు 02, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 04, ఆరవ జోనుకు 09, ఏడవ జోనుకు 04, ఎనిమిదవ జోనుకు 03, ఇతరులు 01,  మొత్తము 26 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసిదేవ రెడ్డి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, సిటీ ప్లానర్ ప్రభాకర్, డి.సి.పి. నరేంద్ర, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, రాజా రావు, వేణు గోపాల్, శివ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-09 15:46:22

అనధికార పార్కింగ్ పై ఫైన్లు వేయండి..

అనధికారంగా రోడ్డులపై నిలిపిన వాహనాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 25వ వార్డు పరిధిలోని సీతమ్మపేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. అనుమతి లేకుండా రోజుల తరబడి వాహనాలను రోడ్ల మీద పార్కింగు చేస్తున్నారని వాటిని వెంటనే తొలగించాలని లేదా వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్.ఎస్. ఏజెన్సీ వద్ద చెత్త పేరుకు పోయి ఉన్నందున ఆ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నెల జీతం ఆపాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. క్లాప్ పధకంలో భాగంగా శానిటేషన్ చేయు పద్దతులలో మార్పులు తీసుకురావాలని  ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. దుర్గా నగర్ వెనుక ఉన్న రోడ్డు  సరిగా ఊడ్చడం లేదని, దుకాణాల వద్ద మూడు రంగుల చెత్త డాబాలు పె  ట్ట లేదని, దుకాణాల యజమానులు చెత్తను కాలువలో వేస్తున్నందు వలన కాలువలు పేరుకు పోతున్నందున దుకాణాల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై అవగాహన కార్యక్రామాలు సరిగా జరగడం లేదని, ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని మలేరియా సిబ్బందికి సూచనలు చేశారు. మలేరియా పై అవగాహన కల్పించడం, త్రాగు నీరు, విధ్యుత్ దీపాలు, రోడ్లు శుభ్రం చేయడం, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, కార్యనిర్వహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జగన్నాధం, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-08-09 15:39:55

సచివాలయాల ద్వారానే సేవలందాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి వార్డు కోర్పరేటర్ ఉరుకూటి నారాయణరావుతో కలసి 3వ జోన్ 29వ వార్డులోని 1086117, 178, 179 సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయాలలో ప్రభుత్వ సేవలు వివరాల పట్టిక, సూచిక బోర్డులను, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల వివరాలను, కోవిడ్ నియంత్రణ నియమావళి పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పౌరులకు అందాలనే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దానిని నిర్వీర్యం చేయరాదని, కార్యదర్శులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్థానికంగా నివాసం ఉండి ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. కార్యదర్శులు సెలవు పెట్టదలచినచో, ఏమైనా మీటింగులకు వెళ్ళవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలని, కార్యదర్శులు విధులపై బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్లో పనియొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను సకాలంలో నమోదు చేసి పై అధికారులకు పరిష్కారం కొరకు పంపాలని, సంక్షేమ పథకాల కొరకు వచ్చిన అర్హులైన లబ్ధిదారులు నిరాశతో వెనక్కి వెళ్ళకూడదని మేయర్ సూచించారు.

Visakhapatnam

2021-08-09 15:36:48

జగనన్న కాలనీలు వేగవంతం కావాలి..

జగనన్న కాలనీలు నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం డివిజన్ పరిధిలో అన్ని మండలాల మండల, డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీల పై ఆయనతో పాటు శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంశు కౌశిక్ లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో చేపడుతున్న హౌసింగ్ చాలా పెద్ద కార్యక్రమమని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.  నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు దిశగా కృషి చేయాలన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి లబ్ధిదారులకు మేలుచేకూర్చాలన్నారు. ఎలక్ట్రికల్ లైనులు కూడా వేయాలి. నీరు ఉంటేనే పనులు త్వరితగతిన చేపట్టడానికి బోర్లు కూడా వేయాలని సూచించారు. ఇసుక, తదితర అంశాలపై వివరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార నది ప్రవహిస్తున్పప్పటికీ జగనన్న కాలనీల నిర్మాణంలో ఇసుక కొరత తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాంప్ కేటాయించ వలసినదిగా సూచించారు. జమ్మూ లే ఔట్ లో 600 ఇళ్లు నిర్మాణం జరుగుతోందని, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిల్లాం లే ఔట్ గుండా 33కెవి విద్యుత్ లైను ఉందని, దానిని మార్చుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందరూ బాధ్యతగా పని చేస్తేనే విజయవంతం అవుతుందని, దీని కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరింత బాధ్యత గా పనిచేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గంలో పెద్ద లే ఔట్లు ఉన్నాయని, వాటికి సరిపడ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటుందని ఎస్ఇ ఇపిడిసిఎల్ ను ఆదేశించారు. ఇళ్లు లేని వారు ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరు చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అవసరమైతే భూసేకరణ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. మండలాల్లో లబ్ధిదారుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ లే ఔట్ ల్లో చేయాల్సిన పనులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇసుక సమస్యలు రాకుండా చూడాలని మండలాల వారీగా సమీక్షించారు. అధికారులు మండలాల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు. 700 లే ఔట్లు ఉన్నాయని, వీటిలో ఎక్కడెక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయో గుర్తించి ఫోల్స్ ఎక్కడైనా అవసరమైతే డిఇల నుండి జాబితా తీసుకొంటే ఆ జాబితాను ఇపిడిసిఎల్ సిఎండి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఇపిడిసిఎల్ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు ఋణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఎంత మందికి కావాలో లబ్ధిదారులుతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సరఫరా కు సంబంధించి లేఔట్లు డిపిఆర్ అందజేయాలని ఎస్ఇ ని ఆదేశించారు. మండలాల వారీగా బోర్లు పై సమీక్షించారు. గృహాలు నిర్మాణాలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు సిమెంట్ సరఫరా పై ఎఇలు చర్యలు చేపట్టాలని, గొడౌన్లు లేకపోతే ప్రభుత్వ భవనాలు ఉంటే వాటిలో నిల్వ ఉంచాలన్నారు.

మండలాల వారీగా ఎన్ని పట్టాలు కోసం దరఖాస్తులు వచ్చాయో తెలియజేసి వారికి పంపిణీ కి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు చెప్పారు.  లే ఔట్ ల్లో సమస్యలు ఉంటే తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) హిమాంశు కౌశిక్ చెప్పారు.  మెగా హౌసింగ్ మేళాలో ప్రారంభించిన గృహాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. హౌసింగ్ పీడీ జి. కూర్మినాయుడు, శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని హౌసింగ్ డిఇ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, ఎపిఇపిడిసిఎల్ ఇంజనీర్లు, ఎపిఎంలు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-09 14:10:18