1 ENS Live Breaking News

సోమవారం శ్రీకాకుళం వస్త్రాలు ధరించాలి..

ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లాలో ఉత్పత్తి అయిన వస్త్రాలు ధరించేందకు చర్యలు తీసుకుంటామని జిల్లా  శ్రీకేష్ లాఠకర్ కలెక్టర్ తెలిపారు. చేనేత సంఘాల ప్రతినిధులు కె.రవి, మావూరి గణపతి రావు, వట్టం శ్రీనివాసరావు, గుత్తి అప్పారావు , ఎం. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కొద్ది నైపుణ్యం, నైపుణ్యం లేని చేనేతకారులు ఎక్కువగా ఉన్నారన్నారు. సొసైటీ ఎన్నికలు జరగక పోవడం కూడా సంఘాలకు సహాయ సహకారాలు అందడంలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. చేనేత కార్మికులకు నూలు అందించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. చేనేత వస్త్రాలకు వినియోగదారులు వస్తున్నారని కానీ పవర్ లూమ్ లో తయారు వస్త్రాల వలన ధరలలో వ్యత్యాసాలు వలన నష్టం జరుగుతోందని వివరించారు. వస్త్రాలకు ప్రభుత్వ రిబెట్ లేకపోవడం, 3 సంవత్సరాలుగా త్రిఫ్ట్ ఫండ్ లేకపోవడం సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఎం.ఎల్.ఏ ధోతిలు శ్రీకాకుళంలో తయారు అవుతున్నాయని వివరించారు. వస్త్రాలకు సరైన ప్యాకింగ్ ఉండాలని, అప్కో వెంటనే చెల్లింపులు చేయాలని, ప్రతి సంఘానికి ఒక మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:33:16

హరిత శ్రీకాకుళం మనందరి బాధ్యత..

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత శ్రీకాకుళాన్ని తీర్చి దిద్దే బాధ్యత  అందరిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తపోథన్ దెహారి అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  మెగా ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి జి ఎం ఆదేశాల మేరకు జిల్లాలోని 66 శాఖలు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  ప్రతి బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటుతున్నామని వివరించారు. రాష్ట్రము మొత్తం స్టేట్ బ్యాంకు అద్వర్యం లో మెగా ట్రీ ప్లేటేషన్ చేపట్టడం జరుగుతోందని ఆయన వివరించారు. ఎస్బిఐ ప్రతి ఏడాది మొక్కలు నాటడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. కరోనా విపత్కర వేళ ఆక్సిజన్ అందక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఆక్సిజన్  ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న వారికి ఎస్బిఐ ఇతోధికంగా ఋణాలు అందించేందుకు సిద్దంగా ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ ఆవశ్యకతను గుర్తించి ఎస్బిఐ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోందని చెప్పారు. త్వరలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని ఎస్బిఐ శాఖల్లో శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎస్బిఐ శాఖల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత విధానం చేపట్టనున్నట్లు తపొదన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హాజరైన  శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ   సహాయ సంచాలకులు లోచర్ల  రమేష్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్న స్టేట్ బ్యాంక్ ను అభినందించారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకువచ్చి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషదాయకం అన్నారు. జిల్లాలో 11 శాతం మాత్రమే అటవీ  ప్రాంతం కలిగి ఉండడం వల్ల జిల్లాలో కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయన్నారు. శ్రీకాకుళంని సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు, గ్రీన్ సిటీ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 అనంతరం టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ క్రీడా విభాగంలో  బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు బ్యాంకర్లు,వాకర్స్ సంయుక్తంగా విక్టరీ చూపిస్తూ జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.100 ఏళ్ల చరిత్రలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన హర్యానా బిడ్డ ,ఇండియన్ ఆర్మీ ఉద్యోగి నీరజ్ చోప్రాకు అభినందించారు.  ఈ కార్యక్రమంలో ఎస్బిఐ స్టాఫ్ యూనియన్, జోనల్ సెక్రటరీలు వెంకటరమణ, ఆఫిసర్స్ సెక్రటరీ వి.ఎస్.ఎన్ సాహు, జర్నలిస్టుల ఐక్యవేదిక ప్రతినిధులు శాసపు జోగి నాయుడు, కొంఖ్యాన వేణుగోపాల్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కె.వి.ఆర్.మూర్తి, పి.జి.గుప్తా, ఎం.మల్లిబాబు, ఆర్ట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అడపా మోహన్ రాజ్ , పలువురు బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:29:54

స్థానిక వస్త్రాలు బ్రాండింగ్ చేసి ఖ్యాతి గడిద్దాం..

శ్రీకాకుళంజిల్లాలో తయారు అవుతున్న వస్త్రాలకు బ్రాండింగ్ చేద్దామని,  తద్వారా ఖ్యాతి గడిద్దామని జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉన్న చేనేత సహకార సంఘాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆది వారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన డిజైన్లు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపు నిచ్చారు. మార్కెటింగ్ పై అధిక దృష్టి సారించాలని, బ్రాండింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బ్రాండ్ కచ్చితంగా ఉండాలని తద్వారా వస్త్ర వ్యాపారం వికసిస్తుందని తెలిపారు. బ్రాండ్ ఉన్న వస్తువుల పట్ల ప్రజలు మొగ్గు చూపడం జరుగుతుందని గ్రహించాలని సూచించారు. బ్రాండ్ పై పేటెంట్ తీసుకుందామని చెప్పారు. మార్కెటింగ్ కు పక్కాగా బిజినెస్ ప్లాన్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక వెబ్ పోర్టల్ లో పెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని ఆయన అన్నారు. జిల్లాలోనే ముందుగా గిరాకీ ప్రారంభించాలని ఆయన సూచించారు. జిల్లాలో  రెడీ మేడ్ దుస్తుల తయారు  చేయటం జరగాలని ఆయన అన్నారు. చేనేటకారులు స్వయం సమృద్ది సాధించే దిశగా అడుగులు పడాలని ఆయన పేర్కొన్నారు. అందుకు గల ప్రతి అవకాశాన్ని సద్వనియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సూచించిన విధంగా చేనేతకారుల సంఖ్య కనీసం 50 శాతం పెరగాలని అందుకు అవసరమగు శిక్షణా కార్యక్రమాలు, ముడిసరుకు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:29:03

నేతకారుల జీవితాలలో వెలుగులు రావాలి..

చేనేతకారుల జీవితాలలో వెలుగులు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హోటల్ గ్రాండ్ లో మూడు రోజుల చేనేత ప్రదర్శనను నాబార్డు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కారుల నెలసరి ఆదాయం పెరగాలని అన్నారు. జిల్లాలో చేనేత కారులు, చేనేత పరిశ్రమ వివరాలు పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్రాండింగ్, మార్కెటింగుకు  చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ రంగంలో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు సంభందించి ఎక్కువ ప్రదర్శనలు జరగాలని తద్వారా ఎక్కువ అవకాశాలు రావడానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేత కారులు స్వయం సమృద్ది సాధించాలని ఆయన అన్నారు. అందుకు అందరూ సమష్టిగా పనిచేద్దామని కోరారు. 
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రంగంలో చేనేత పెద్ద రంగంగా ఉందన్నారు. చేనేత కుటీర పరిశ్రమగా అదనపు ప్రక్రియగా ఎక్కువగా చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగానికి 1982  నుండి నాబార్డు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. చేనేత ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. చేనేత రంగానికి అవసరమైన నైపుణ్యం అభివృద్ధికి సంఘాలు చాలా చేస్తున్నాయని ఆయన తెలియజేస్తూ బ్రాండింగ్ కు సహాయం చేస్తామని పేర్కొన్నారు. వెబ్ సైట్ తయారు చేస్తామని దానిని ఒక విక్రయ సదుపాయంగా వినియోగించు కావాలని సూచించారు. చేనేత రంగానికి లాభదాయకతకు నాబార్డు ప్రయత్నం చేస్తోందని, పొందూరుకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో వినియోగం ఉందని, జాతీయ అంత్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనాలని ఆయన సూచించారు.

అప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా అవసరమగు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ చౌసాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అందరికీ తెలియాలని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఉండేదని ఈ ఏడాది నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకు సిజిఎం నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో పొందూరులో 11 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జన్మ దినోత్సవంలో భాగంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ,  నాబార్డు డిజిఎం ప్రసాద్, డిసిసిబి ముఖ్య కార్యనర్వహణాధికారి డి. సత్యనారాయణ, రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు, ఆర్ట్స్, బెజ్జిపురం యూత్ క్లబ్, సిఎవిఎస్ స్వచ్చంధ సంస్థల డైరెక్టర్ లు నూక సన్యాసి రావు, ఎం.ప్రసాద రావు, పడాల భూదేవి., సురంగి మోహన రావు,  గీతా శ్రీకాంత్, దుప్పల వెంకట రావు, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన చెనేతకారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:27:58

అల్లూరి.. అన్యధా భావించకండి..

అవును.. కేంద్రమంత్రి అయితే మాత్రం ఏమున్నది గర్వకారణం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్పా.. భరత భూమిలో తెలుగుజాతీ జీవితాంతం గుర్తుంచుకునే వీరుడికోసం ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి ఒక్కప్రకటన కూడా చేయని పర్యటన.. సభ్యసమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లో తెలియని దుస్థితి.. అల్లూరి అన్యధా భావించకండి.. నాటి నుంచి నేటి వరకూ మీ విషయంలో ఇదే నిర్లక్ష్యం మరోసారి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ విషయంలోనూ రుజువైంది. బహుసా మీ విగ్రహం పార్లమెంటులో పెట్టమని అడుతారనో.. లేదంటే మీకు భారత రత్న అడుగుతారనో.. అదీకాదనుకుంటే కేంద్రం తరపునైనా ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయమంటారని, నాటి మీవీరోచిత చరిత్ర బాహ్య ప్రపంచానికి వాస్తవాలతో తెలియజమని ఇబ్బంది పెడతారనో తెలీదు కానీ.. అందరిలానే మిమ్మల్ని చూడటానికి వచ్చిన మంత్రి వర్యులు దండేసి దండంపెట్టి ఇంతకంటే ఏం చేయగలమని మౌనంగానే వెళ్లిపోయారు. 75ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో తప్పుని తప్పుగా ఎవరూ వేలెత్తి చూపకూడదు. అలా చూపించడమూ భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీ తప్పు.. నేతల ప్రసంగాలకు మీ వీరోచిత చరిత్రకావాలి.. వారి గెలుపునకు మీరు త్యధించిన త్యాగం కావాలి.. వారి ప్రసంగాలకు మీరే ఒక వేదిక కావాలి కానీ.. మీకోసం మాత్రం ఏ ఒక్క నేత ముందుకి వచ్చి.. ఇదిగో భరతమాత ముద్దుబిడ్డకోసం, స్వాతంత్ర్య సమరయోధుడి కోసం మా ప్రభుత్వం లో ఈ పనిచేశామని చెప్పే దైర్యమున్న నేతలు లేకపోయారంటే పరిస్థితి ఎలా వుందో మీరే అర్ధం చేసుకోండి. ప్రపంచ దేశాలకు అల్లూరి వీరోచిత పోరాటం ఒక ఆదర్శం, ఆయన చరిత్ర ఒక సందేశం, కానీ భారతదేశంలో మాత్రం అది చదువుకోవడానికే మిగిలి వున్నట్టుగానే మారిపోయింది. మీరు పుట్టి.. మాకోసం ఈ పుణ్యభూమిలో ప్రాణాలను వదిలిన మీ త్యాగాన్ని పట్టించుకోని మమ్మల్ని.. ఎప్పటి లాగానే మీరు మీ సమాధి నుంచే చూస్తూ ఉండిపోండి.. మీపేరుతో చట్టసభల్లో ప్రసంగాలు ఇచ్చేసమయంలో మీ కోసం తలచుకున్నపుడు నా భారతీయులు నన్ను తలచుకుంటున్నారని కాస్త మాత్రమే సంబరపడండి.. అంతకు మించి ఏమీ ఊహించుకోకండి.. అసలేమీ ఉండదని మంచి మనసుతో అర్ధం చేసుకోండి. మన్యంలో మహోదయం స్రుష్టించిన మన్యవీరా, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజా మా చేతకాని తనాన్ని చూసి అన్యదా భావించవద్దు..బాధపడవద్దు.. జోహార్ అల్లూరి, జోహార్..!

Krishnadevipeta

2021-08-08 09:55:22

లక్ష్యానికి మించి కోవిడ్ వేక్సినేషన్..

దేశంలో జూలై నాటికి లక్ష్యానికి మించి కోవిడ్ వాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఉదయం  చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం లో జరుగుచున్న వాక్సినేషన్ పక్రియను ఆమె పరిశీలించారు.  జిల్లా కలక్టరు ఎ.మల్లిఖార్టున జిల్లాలో వాక్సినేషన్ ప్రకియ, వివరాలను మంత్రికి  తెలియజేసారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగిందని, వారిలో 1కోటి 74లక్షల మందికి మొదటిడోసు మిగిలినవారికి రెండు డోసులు వేయడమైనదని, జిల్లాలో 22 లక్షల మందికి వాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటి డోసు, 5 లక్షల మందికి రెండు డోసులు వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు.  ఈ సంధర్బంగా కేంద్ర ఆర్దికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమం  ప్రణాళిక ప్రకారం జరుగుతుందన్నారు. దీనివలన క్రమపద్దతి ఏర్పడుతుందని, ప్రజలలో నమ్మకం కలుగుతుందన్నారు.తద్వారా ఆర్థికాభివృద్దికి తోడ్పడుతుందన్నారు . వాక్సినేషన్ కు అయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నదని తెలిపారు. రానున్న రెండు నెలలలో వాక్సిన్ల సరఫరా పెరుగుతుందని, దానికొరకు దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు,  విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.  మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీసులకు, పారామిలటరీ, సైన్యానికి అందించామని, తరువాత 65 సంవత్సరములు, దీర్ఝకాల వ్యాదిగ్రస్తులకు, తదుపరి 45 సంవత్సరాలు దాటిన వారికి అందజేసారని ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి శతశాతంతోపాటు 18 సంవత్సరాలు నిండిన గర్బిణీలకు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఉపాద్యాయలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వాక్సిన్ అందిస్తామన్నారు.  వాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేయుటంద్వారా  పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, రాజ్యసభసభ్యులు జి.వి.ఎల్. నరశింగరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ అధికారులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-08-08 07:26:50

హోం మంత్రికి మేకతోటిని కలిసిన కలెక్టర్..

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలిశారు. కలెక్టర్ తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ  మార్గాని భరత్ రామ్ ,జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  సబ్ కలెక్టర్ ఇలాక్కియా, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రుడా) చైర్మన్ ఎం.షర్మిలా రెడ్డి తదితరులు ఉన్నారు.

Rajahmundry

2021-08-08 07:21:05

అప్పన్నకు కేజి చందనం సమర్ఫణ..

విశాఖలోని శివాజీ పాలెంకు చెందిన కె. ఉమామహేశ్వరరావు కుటుంబం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారికి  కేజీ చందనం సమర్పించింది. ఈమేరకు ఆదివారం తనపేరుతో అరకేజీ చందనం (రూ.10,116)  తన కుమార్తె కె. వైజయంతి పేరుమీద అరకేజీ చందనం (రూ.10,116)  సమర్పించారు. వారికి స్వామివారి ప్రసాదంగా రెండు చందనపు చెక్కలను ఏఈఏ రాఘవకుమార్  అందించారు. అనంతరం దాతలకు దేవలాయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా లేదా డైరెక్టుగా వచ్చి స్వామివారికి  అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించవచ్చని ఏఈఓ తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా సమర్పించే భక్తులకు, పోస్టల్ లో ప్రసాదం పంపిస్తున్నామన్నారు. ఈ అవవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-08-08 04:24:14

త్వరతగతిన నిర్మాణాలు జరగాలి..

జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు, దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు స్త్రీ నిధి, డీఆర్డీఏ, మెప్మా ద్వారా  అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించి వారు త్వరగా గృహాలు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డీఆర్డీఏ, మెప్మా, స్త్రీ నిధి ద్వారా ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులకు కొంత మేర ఆర్ధిక సహాయాన్ని అందించగల్గితే వారు తమ ఇళ్ళను వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులు ఎంత మంది స్వయం సహాయక సభ్యులుగా ఉన్నారో ముందుగా గుర్తించాలన్నారు. ఒక వేళ స్వయంసహాయక సభ్యులు కానీ పక్షంలో వారిని గ్రూపులో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, ఎల్డీఎం రాంబాబు, ఎస్టీ కార్పోరేషన్ ఈడీ దుర్గాబాయి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-07 15:49:53

పేదల కష్టాలను సీఎం మనసుతో చూస్తున్నారు..

పేద‌ల క‌ష్టాల‌ను క‌ళ్ల‌తోనే కాకుండా మ‌న‌సుతో చూసి బ‌ల‌హీన వ‌ర్గాల అభున్న‌తికి కృషిచేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే నేత‌న్న‌ల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ అన్నారు. శ‌నివారం ఉద‌యం కాకినాడ‌లోని గాంధీన‌గ‌ర్ మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. తొలుత మ‌హాత్ముని చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించిన అనంత‌రం మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. చేనేత వారోత్స‌వాల (ఆగ‌స్టు 7-14)తో పాటు ఆప్కో చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న (ఆగ‌స్టు 7-18)ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ముర‌మండ, పులుగుర్త‌, ప‌స‌ల‌పూడి, గొల్ల‌ప్రోలు, పెద్దాపురం త‌దిత‌ర చేనేత స‌హ‌కార సంఘాలు ప్ర‌ద‌ర్శించిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించి, వాటి విశిష్ట‌త వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ విశిష్ట క‌ళా నైపుణ్యం, మాన‌వ‌జాతి సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప‌జేసే చేనేత రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తోంద‌ని, వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తోందంటే నేత‌న్న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధిని అర్థంచేసుకోవ‌చ్చన్నారు. యాంత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఉపాధి దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో నేత‌న్న‌ల సుస్థిర జీవ‌నోపాధికి ఈ ప‌థ‌కం ఓ దివిటీలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి నిజ‌మైన నేత‌న్న నేస్త‌మ‌ని, జిల్లా చేనేత రంగ కార్మికులు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలవాలని.. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ నేతృత్వంలో కీల‌క ప్రాజెక్టుల‌తో చేనేత రంగ అభివృద్ధి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలోనూ నేత‌న్న‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఉప్పాడ‌, మోరి, అంగ‌ర త‌దిత‌ర ప్రాంతాల చేనేత క‌ళ‌కు ఎంతో గుర్తింపు ల‌భించింద‌న్నారు. మ‌నం ఎద‌గాలంటే ప్ర‌పంచాన్ని ఎర‌గాల‌ని.. ప్ర‌పంచాన్ని ఎర‌గాలంటే విద్య కావాల‌ని.. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యారంగ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, మ‌న‌బ‌డి నాడు-నేడు వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు మంత్రి వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. 

చేనేత రంగ అభివృద్ధికి కృషి: క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌:
భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  స్వ‌దేశీ ఉద్య‌మం 1905, ఆగ‌స్టు 7న ప్రారంభ‌మైన చారిత్ర‌క ఘ‌ట్టానికి గుర్తుగా ఏటా ఆగ‌స్టు 7న మ‌నం జాతీయ చేనేత దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా పథకాలు  అమ‌లుచేస్తోంద‌ని.. వైఎస్సార్ నేత‌న్న నేస్తం ద్వారా జిల్లాలో 2019-20లో 6,964 మందికి రూ.16,71,36,000; 2020-21లో 7,817 మందికి రూ.18,76,08,000 మేర ల‌బ్ధిచేకూరిన‌ట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలకే వెళ్తోంద‌న్నారు. అదే విధంగా ఈ నెల 10వ తేదీన మూడో విడ‌త‌గా ప‌థ‌కం ద్వారా 6,919 మందికి రూ.16,60,56,000 మేర ల‌బ్ధి చేకూర‌నున్న‌ట్లు వివ‌రించారు. బ‌య‌ట అధిక వ‌డ్డీల భారం నుంచి త‌ప్పించేందుకు వీలుగా పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కాన్ని కూడా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. వైఎస్సార్ నేతన్న‌నేస్తం ప‌థ‌కం చేనేత కుటుంబాల అభివృద్ధికి, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల‌ను ప్రోత్స‌హించేందుకు, స‌హ‌కార సంఘాల‌కు మార్కెటింగ్ ప్ర‌యోజ‌నాల‌ను అందుబాటులో ఉంచేందుకు, ఈ రంగం ఆవ‌శ్య‌క‌త‌, విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌త్యేక వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రామ‌చంద్రాపురం, రాయ‌వ‌రం మండ‌లాల‌కు చెందిన వీర‌సూర్యం, వీర‌భ‌ద్ర‌రావు నేత‌న్న‌ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ త‌దిత‌రులు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ రెండో డిప్యూటీ మేయ‌ర్ చోడిప‌ల్లి వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, స్థానిక కార్పొరేట‌ర్ గోడి స‌త్య‌వ‌తి; జిల్లా చేనేత‌, జౌళి శాఖ స‌హాయ సంచాల‌కులు ఎన్‌.ఎస్‌.కృపావ‌రం, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-07 15:43:31

పారిశుధ్య సిబ్బందికి డ్రైరేషన్ కిట్లు..

కోవిడ్ క‌ష్ట‌కాలంలో కాకినాడ జీజీహెచ్‌లో సేవ‌లందిస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌, పారిశుద్ధ్య సిబ్బందికి అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఏర్పాటు చేసిన నిత్యావ‌స‌ర స‌రుకుల (డ్రై రేష‌న్‌) కిట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పంపిణీ చేశారు.. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స‌భ్యులు వైకుంఠేశ్వ‌ర దాస స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. ప‌ది మంది జీజీహెచ్ సిబ్బందికి స‌రుకుల‌ కిట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో జీజీహెచ్ పారిశుద్ధ్య‌, భ‌ద్ర‌త త‌దిత‌ర విభాగాల‌కు చెందిన సిబ్బందికి బియ్యం, గోధుమ‌పిండి, కందిప‌ప్పు, వంట‌నూనె, శ‌న‌గ‌లు, పంచ‌దార వంటి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కిట్ల‌ను అందిస్తున్న అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు త‌మ‌వంతు స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం 500 మంది జీజీహెచ్ సిబ్బందికి ఈ వ‌స్తువుల కిట్ల‌ను అంద‌జేసిన‌ట్లు అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స‌భ్యులు వైకుంఠేశ్వ‌ర దాస తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించిన దాతలకు అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ప్రెసిడెంట్ డా. నిష్క్రించిన భక్తదాస ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల‌కు మూడువేల డ్రై రేష‌న్ కిట్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఫౌండేష‌న్ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు స‌హ‌క‌రించాల‌నుకునే దాత‌లు 8096211108 నంబ‌రులో సంప్ర‌దించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి; ఆర్ఎంవోలు డా. ఇ.గిరిధ‌ర్‌, డా. అనిత‌; అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ కాకినాడ మేనేజ‌ర్ టి.మ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-07 15:41:55

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి..

75వ స్వాతంత్య్ర దినోత్సవ   వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను కోరారు. శనివారం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 15వ తేదీన స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహించేందుకు చేపట్ట వలసిన ఏర్పాట్లపై సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకోనున్న 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తోందని, జిల్లా స్థాయి ఉత్సవాలలో కూడా  ఈ మహోత్సవ్ సందర్భంగా జారీ చేసిన లోగోను అన్ని శాఖల స్టాళ్లు, శకటాలు, ఫలకాల పై విస్తృతంగా ప్రదర్శించాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం డిజిగ్నేట్ చేసిన మంత్రివర్యులు ముఖ్య అతిధిగా ఈ వేడుకలు జరుగుతాయని,  వేడులను కోవిడ్-19 పరమైన అన్ని ప్రామాణిక జాగ్రత్తలతో నిర్వహించాలని ఆదేశించారు. స్వాతంత్య్య దినోత్సవ వేడుకల కొరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను సిద్దం చేసి, పతాక వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ కవాతు, బాండ్  తదితర సాంప్రదాయ అంశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన  పోలీస్ శాఖను కోరారు.  అలాగే వేడుకలు జరిగే వేదిక ప్రాంగణంలోను, బయట  ట్రాఫిక్ నియంత్రించి అవరోధాలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్య అతిధి ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగ సందేశాన్ని జిల్లాలో అమలౌతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో సిద్దం చేయాలని సమాచారశాఖ డిప్యూటీ డైరక్టర్ ను ఆదేశించారు.    వేడుకల సమయంలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సమాచారశాఖ డిఈఈని  ఆదేశించారు. వేడుకలకు హాజరైయ్యే స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులకు  ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్య మర్యాదలు పాటించాలని, కోవిడ్ దృష్ట్యా సురక్షితమైన ప్యాక్డ్ ఫుడ్ ను మాత్రమే అందించాలని కాకినాడ ఆర్డిఓ కు సూచించారు.  వర్షాకాలం దృష్ట్యా రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  వేడుకల ప్రాంగణంలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని సిద్దంగా ఉంచాలని జిల్లా అగ్నిమాపక అధికారిని, ఫస్ట్ ఎయిడ్ పోస్ట్, ఆంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని  ఆదేశించారు.   వేడులక ప్రాంగణంలో పారిశుభ్రత, ప్రజలకు త్రాగునీటి సరఫరా అంశాల ఏర్పాట్లను కాకినాడ మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.  వివిధ అభివృద్ది, సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లు వాటి పథకాల సమాచారంతో ఆకర్షనీయమైన శకటాలను ప్రదర్శించాలని, అలాగే ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  స్వాతంత్య్రదినోత్సవ  వేడుకల సందర్భంగా పాఠశాలు, కళాశాలల విద్యార్థులతో దేశ భక్తి పూరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని డిఈఓ, ఉన్నత విద్య అధికారులను ఆదేశించారు.  వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని వేడుకలలో  సత్కరించేందుకు ఆయా శాఖాధిపతులు ఈ నెల 10వ తేదీ లోపున ప్రతిపాదనలు అందజేయాలని కోరారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన బ్యాంకర్లు, సచివాలయాల  ఫంక్షనరీలని కూడా ప్రశంసా పురస్కారల కొరకు ప్రతిపాదించాలన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో 75వ స్వాతంత్య్రదినోత్సవ  వేడుకలను దేశ భక్తి, జాతీయతా భావనలు వెల్లివిరిసేలా శోభాయమానంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులందరినీ కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి, ఎపిఎస్పి 3వ బెటాలియన్ కమాండెంట్ సుమీత్ గరుడ్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఎన్.సి.సి. గ్రూప్ కమాండెంట్ కల్నల్ ఏకె రుషి, కాకినాడ ఆర్డిఓ ఎజి చిన్నికృష్ణ, సమాచార శాఖ డిడి బి.పూర్ణచంద్రరావు, డిఈఓ ఎస్.అబ్రహాం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-07 15:37:34

శ్రీకూర్మంను సందర్శించిన కేంద్ర మంత్రి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని  సందర్శించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ శనివారం సాయంత్రం సందర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి తో పాటు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ , పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు మాధవ్,  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పి అమిత్ బర్థార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంషు కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Srikurmam

2021-08-07 15:34:05

వ్యర్ధాలను వెంటవెంటనే తొలగించండి..

విశాఖ మహానగరంలో రోడ్లు, కాలువలు శుభ్రం చేసిన వ్యర్ధాలను వెంటవెంటనే డంపింగ్ యార్డు కు తరలించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె నాలుగవ జోన్ 36 వ వార్డు రంగిరీజు వీధి, జాలారి పేట, ఎవిఎన్ కాలేజి తదితర ప్రాంతాలలో పర్యటించారు. జాలరిపేట నుండి ఎవిఎన్ కాలేజి రోడ్డులో స్వీపింగ్ సరిగా చేయలేదని, కాలువలు శుభ్రపరచి వ్యర్ధాలను పోగులుగా ఉండడం గమనించి శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పోగులను వెంటవెంటనే తొలగించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ, మలేరియా పై సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతుందా అని ఆరాతీయగా, ప్రతీ రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్త తీసుకుంటున్నారని, మలేరియా విభాగం వారు వారంలో 2 రోజులు మలేరియాపై అవగాహన కల్పిస్తున్నారని స్థానికులు కమిషనర్ కు వివరించారు. వార్డులో మలేరియా, డెంగ్యూ కేసులు ఎన్ని ఉన్నాయని, కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను, మలేరియా సిబ్బందిని ఆదేశించారు. ఇపిడిసిఎల్ వారు విధ్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లు కొమ్మలను తొలగించి వ్యర్ధాలను అక్కడే వదిలేస్తున్నారని, వ్యర్ధాలను వెంటనే తొలగించనందుకు ఇపిడిసిఎల్ వారి నుండి అపరాధ రుసుం వసూలు చేసి, వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పుడే తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త గురుంచి వారికి అవగాహన కల్పించి, చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని తెలియజేయాలన్నారు.  బీచ్ రోడ్డులో వాకర్స్ చేతిలొని పెంపుడు కుక్కలను రోడ్లపై మలమూత్రం చేయంచడం గమనించి వారిని మందలించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వీరయ్య, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-07 15:32:23

20% కిట్లు మాత్రమే రావాల్సివుంది..

శ్రీకాకుళం జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు జిల్లాకు 20 శాతం మాతమే రావాల్సి ఉన్నదని ఎస్ఎస్ఎ పిఓ డా. తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పిల్లలను బడిలో చేర్చే సమయంలో పేద కుటుంబాలు పడుతున్న కష్టాలు నుండి విముక్తి కలిగించడంతో పాటు పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లను గణనీయంగా తగ్గిస్తూ బాలల బంగారు భవిష్యత్ కు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు వివరించారు.   జగనన్న విద్యా కానుక పథకం ప్రతి విద్యార్థికి అందజేయబడిన కిట్లులో 8 వస్తువులు అందించబడుతున్నవని, మూడు జతల ఏక రూప దస్తులు (యూనిఫారంలు) ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, ఒక సెట్ పాఠ్యపుస్తకములు, నోట్ పుస్తకములు, ఒక పాఠశాల బ్యాగ్ మరియు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు కూడా అందజేయబడినవని ఆయన పేర్కొన్నారు.  ఈ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా లో 1 నుండి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2 లక్షల 71 వేల 559 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతున్నదని, వారిలో ఒక లక్ష 34 వేల 533 మంది బాలురు, ఒక లక్ష 37 వేల 026 మంది బాలికలకు లబ్ది చేకూరుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.  ఇంకా రావలసిన వస్తువులు ఈ నెల 12వ తేదీ నాటికి వస్తాయని ఆ ప్రకటనలో తెలియజేశారు.

Srikakulam

2021-08-07 15:27:41