1 ENS Live Breaking News

గాంధీజీ పోరాటం ప్రపంచానికే ఆదర్శం..

మహాత్మాగాంధీ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని వక్తలు అభిప్రాయవడ్డారు. శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో “క్విట్‌ ఇండియా ఉద్యమం- ఎనిమిది దశాబ్ధాల చరితం' పేరిట స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో క్రీడాకారులు, వాకర్స్‌, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.జనార్థన నాయుడు మాట్లాడుతూ క్రిప్స్‌ రాయభారం విఫలం కావడంతో గాంధీ తీసుకున్న నిర్ణయమే క్విట్‌ ఇండియా ఉద్యమమన్నారు. సమాచారశాఖ ఏడీ ఎల్‌.రమేష్‌ మాట్లాడుతూ స్వతంత్ర్య పోరాటంలో అనేక ఘట్టాలు నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ ప్రయత్నం చేస్తున్న శక్తి, కొంక్యాన ట్రస్టు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. డిఎస్‌డిఒ బి. శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్ర నేటి తరానికి తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాత్రికేయులు కొంక్యాన వేణుగోపాల్‌ మాట్లాడుతూ శాంతియుత పంథాలో మహాత్మాగాంధీ చేసిన పోరాటం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎన్నో త్యాగాలు చేసిన సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలను ఆదుకొనేందుకు పాలకులు ముందుకు రావాలని శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ) అధ్యక్షురాలు పైడి రజని అన్నారు. చట్టసభ సభ్యుల కుటుంబ సభ్యులుగా కంటే సమరయోథుల వారసులుగానే తన తండ్రి, భర్త, తాను గౌరవంగా భావిస్తామన్నారు. స్వతంత్ర్య సమరయోథుల కుటుంబాల్లో నిరుపేదలు, ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ప్రభుత్వపరంగా రావాల్సిన భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అటువంటి వారికి వేగవంతంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వాతంత్ర్య సమరయోథులు దివంగత గుడ్డ రమణమూర్తి కుమార్తె, రిటైర్డ్‌ ట్రెజరీ డి.డి తారాదేవి స్వాతంత్రోద్యమ ఘట్టాలను వివరించారు. తన తండ్రి ద్వారా సమరయోథులు దేశం కోసం పోషించిన పాత్ర గురించి తెలుసుకోగలిగానన్నారు. తొలుత ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి స్వాతంత్ర్య సమరయోథులు పైడి నరసింహ అప్పారావు, గుడ్ల రమణమూర్తి, బెవర అప్పలస్వామిదేవ్‌ కుటుంబ సభ్యులు పైడి రజని, పైడి గోపాలరావు, తారాదేవి, ఉమాశంకర్‌దేవ్‌ పూలమాలలు వేశారు. అనంతరం సమరయోథుల కుటుంబాలకు కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ టస్బు చైర్మన్‌ కొంక్యాన మురళీధర్‌, వాకర్స్‌ కబ్‌ గవర్నర్‌ గుప్త పూర్య గవర్నర్లు ఇందిరాప్రసాద్‌, కూన రమణమూర్తి, డిఎస్‌డిఒ శ్రీనివాస్‌కుమార్‌, ఆర్ట్స్‌ కళాశాల పి.డి. మోహన్‌రాజు, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఎస్‌.జోగినాయుడు, వి.వివేకానంద, భీమరాజు, వైకాపా నాయకుడు రొక్కం సూర్యప్రకాష్‌, ఎన్‌సిసి అధికారి పోలినాయుడు, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు నటుకుల మోహన్‌, బాడాన దేవభూషణ్‌, మహాత్మాగాంధీ మందిర రూపశిల్పి ఎం.వి.ఎస్‌.ఎస్‌.శాస్త్రి, వివిధ క్రీడా విభాగాల కోచ్‌లు సత్కరించారు. వాకర్స్‌ క్లబ్‌ సభ్యుడు మల్లిబాబుకు జన్మదిన వేడుకలు తెలిపారు.

 

Srikakulam

2021-08-09 13:45:54

సామాన్యులకు అండగా విఎంఆర్‌డిఎ..

సామాన్య,మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరే విధంగా విఎంఆర్‌డిఎ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో తాను భీమిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా, కౌన్సిలర్‌గా, నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశానన్నారు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గతంలో కంటే ఓట్ల శాతం పెంచగలిగానన్నారు.  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఇతర పెద్దలు పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి బీసీ మహిళగా తనకు కీలకమైన విఎంఆర్‌డిఎ చైర్మన్‌ పదవిని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుకూలంగా తన శక్తిని మించి పనిచేస్తానన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలోని జిల్లాల  ప్రజలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికే సుమూరు రూ.186కోట్ల ప్రాజెక్టులు పూర్తి కావచ్చి, ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న చైర్మన్ భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారన్నారు. ఎన్‌ఎడి ప్లైఓవర్‌, మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌,ప్లానిటోరియంతో పాటు, అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.  ప్రస్తుతం విఎంఆర్‌డిఎ రూపకల్పన చేసిన మాస్టర్‌ప్లాన్‌ భవిష్యత్‌ 20 సంవత్సరాలకు సరిపోయే విధంగా తయారు చేస్తున్నామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించే అవకాశాలను పరిశీలన చేయాలని కోరారు.  గతంలో కూడా అప్పటి చైర్మన్లు సీనియర్‌  జర్నలిస్టులకు స్థలాలు నామమత్ర ధరకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో విఎజె సంఘం ప్రభుత్వానికి రూ.5.46 కోట్లు చెల్లించనప్పటికీ వేరువేరు కారణాలతో నేటికి 182 మంది జర్నలిస్టులు ఆయా స్థలాలను పొందలేకపోయారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి జర్నలిస్టులు ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారని, కాబట్టి విఎంఆర్‌డిఎ పరిధి మేరకు తమ వంతు సాయం అందించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు.  గత చైర్మన్ల తరహాలోనే తాను కూడా తన వంతు జర్నలిస్టులకు పూర్తిస్దాయిలో సహకారం అందిస్తామన్నారు. విజెఎప్‌ కార్యదర్శి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ, అందరి సహాకారంతోనే  కార్యక్రమాలు విజయవంతం చేయగలగుతున్నామన్నారు. భవిష్యత్‌లో కూడా జర్పలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,కోశాధికారి పిఎన్‌ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, దొండా గిరిబాబు, వరలక్ష్మీ, , డేవిడ్‌ రాజు, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను విజెఎఫ్‌ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. 

Visakhapatnam

2021-08-09 13:26:03

నాడు-నేడుతో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి-నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యావ్యవస్థలో సత్ ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు.  ఆదివారం పీ.గన్నవరం నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, అంబాజీపేట, పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ సి.హరికిరణ్ స్థానిక శాసనసభ్యులు కొండేటి. చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ తో కలిసి  పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 1,100 పాఠశాలలో  మొదటి దశ మనబడి-నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు సంతృప్తికర స్థాయిలో జరిగాయన్నారు. వీటిని శని,ఆదివారలలో రంపచోడవరం , రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్ లో పర్యటించి పరిశీలించడం జరిగిందన్నారు. నాడు నేడు పనుల వలన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం ద్వారా ప్రభుత్వ పనులు తీరుకు అద్దంపడుతుందన్నారు. ఇదే తరహాలో రెండో విడత నాడు-నేడు పనుల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వ వనరులతో పాటు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం శుభసూచకమన్నారు.ఈ విధంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిదిలో ఉన్న  పాఠశాలలో  సమారుగా రూ.60 నుంచి 70 లక్షలు వెచ్చించి పాఠశాలలను అభివృద్ధి పరచుకోవడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అదే తరహాలో పాఠశాల ఆట స్థలాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో వాస్తు ప్రకారం అన్ని పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రాధాన్యత అంశాలైన వైద్య ఆరోగ్యంతోపాటు విద్య పట్ల కూడా అధిక ప్రాముఖ్యత ఇవ్వడం నాడు నేడు పనులే నిదర్శనమని కలెక్టర్ అన్నారు.ఆగస్టు16న మనబడి నాడు నేడు రెండవ దశ పనులు ప్రారంభోత్సవంతో పాటు జగనన్న విద్యా కానుక 2020-21 ప్రారంభోత్సవ పనులకు సన్నద్ధమవుతున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ మీడియాకు వివరించారు.మనబడి -నాడు నేడు  కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన పీ. గన్నవరం , పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, ఫర్నేచర్, వంటశాల, త్రాగు నీరు, టాయిలెట్స్ , వాల్ పెయింటింగ్స్ , డిజిటల్ క్లాస్ రూమ్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో కలిసి  పరిశీలించారు.   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.అబ్రహం, ఎస్ఎస్ఎ పీవో బి.విజయబాస్కర్,అమలాపురం ఆర్డీవో ఎస్ఎస్. వసంతరాయుడు,డీడీవో శాంతామణి ,ఎంపీడీవో ఐఇ. కుమార్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Pulletikurru

2021-08-08 16:07:45

దిశ యాప్ మహిళలకు ఒక రక్షణ వలయం..

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మహిళ భద్రతకు ప్రవేశపెట్టిన దిశా యాప్ మహిళలకు గొప్ప వరం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ఆదివారం జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన దిశా యాప్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని  మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి, నేరస్తులను త్వరితగతిన శిక్షించడానికి ముఖ్యమంత్రి  మహిళకు భద్రత కల్పించాలనే సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని రూపొందించారని చెప్పారు . ప్రస్తుత కాలంలో దేశంలో మహిళలపై  అత్యాచారాలు పెరగడంతో దేశంలో  నిర్భయ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో మహిళల రక్షణకు   ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.  అత్యాచారం జరిగిన ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ చేపట్టి 21వ రోజున శిక్షపడేలా  దిశా యాప్ పని చేస్తుందని అన్నారు. మహిళలపై సామాజిక మాధ్యమం లలో అసభ్యకరమైన పోస్టులు పెడితే రెండు సంవత్సరాల శిక్ష  విధిస్తారని, తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తప్పు మరోసారి చేస్తే నాలుగు సంవత్సరాల శిక్ష విధించడంతో పాటు మరొకసారి తప్పుకు  10 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల చిత్తూర్ లో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం అలాగే విజయవాడలో చిన్నారి బాలిక పై అత్యాచారం చేసిన ఘటనలో  దోషులకు ఉరి శిక్ష విధించడం జరిగిందని మంత్రి  తెలిపారు. రాష్ట్రంలో 10 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ,వీటికి 40 మంది సిబ్బంది ని ఇచ్చినట్లు తెలిపారు.  గతంలో కేసులు చాలా సంవత్సరాల వరకు విచారణ లో ఉండేవని ప్రస్తుతం దిశ ద్వారా 7 రోజుల్లో నేరస్తులను పట్టుకుని 14 రోజుల్లో విచారణ చేపట్టి, 21 రోజుల్లో శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దిశా యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మన రక్షణ మన బాధ్యత ను మహిళలందరూ గుర్తించి దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. మహిళ లే కాకుండా పురుషులు కూడా దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అందరికీ అన్ని రకాలభద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు. జగ్గంపేట నియోజకవర్గంలో దిశ యాప్ అవగాహన సదస్సు ఏర్పాటుకు సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి ను మంత్రి  అభినందించారు
 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా)రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టడానికి దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఐ జి మోహన్ రావు మాట్లాడుతూ లో దిశా యాప్  మహిళలకు భద్రతతో పాటు ధైర్యం కూడా కల్పిస్తుందని అన్నారు.
జిల్లా ఎస్పి ఎం రవీంద్ర బాబు మాట్లాడుతూ గతంలో అత్యాచారాలు జరిగినప్పుడు దోషులని పట్టుకోవడంలో జాప్యం జరిగేదని,  ఈ యాప్ ద్వారా తక్కువ సమయంలో నేరస్తులను పట్టుకుని శిక్షపడేలా గా యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలందరూ తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో దిశ యాప్ డౌన్లోడ్ లో తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల సహకారంతో , ప్రజాప్రతినిధులతో లక్ష మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు ధనలక్ష్మి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హిమ శైలు జక్కంపూడి విజయలక్ష్మి , డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి, తదితరులు దిశ యాప్  అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముందు గండేపల్లి మండలం మురారి గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి హోంమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మల్లేపల్లి లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా  సీడ్ బాల్స్, మొక్కలు హోంమంత్రి స్థానిక శాసనసభ్యులు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో మల్లి బాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు జిల్లా పోలీసు అధికారులు మాజీ శాసనసభ్యులు పంతం గాంధీ మోహన్ సర్పంచి కందుల చిట్టిబాబు నియోజకవర్గంలోని మహిళలు పోలీస్ సిబ్బంది ఈ శాఖల సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముందుగా అవగాహన సదస్సును  మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం

 అనంతరం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం లో రాజుపాలెం గ్రామం నుండి  రామవరం గ్రామం వరకు 11కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సు చరిత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు తో కలిసి  శంకుస్థాపన చేశారు.

Jaggampeta

2021-08-08 14:35:43

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకీ తీసుకెళ్లాలి..

రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుకునేలా చైతన్య పరిచే బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆదివారం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎన్నెస్పీ అతిథిగృహంలో ఆయన బస చేశారు. జర్నలిస్టుల సంఘాల నాయకులు చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  జర్నలిస్టులలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి విశ్వవిద్యాలయం నిబంధనలు అనుసరించి సొంతంగా సర్టిఫికెట్ కోర్స్ లు ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్  వెల్లడించారు. అకాడమీ  ఏర్పాటు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 80 తరగతులు  రాష్ట్రం, జిల్లాల వారీగా  ఆన్ లైన్ లో నిర్వహించడానికి విశ్వవిద్యాలయం అనుసంధానంతో  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. ఏంతో విలువైన ఈ కోర్సుల్లో చేరడం ద్వారా జర్నలిస్టులకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. సీనియర్ అధ్యాపకులుగా నైపుణ్యం కలిగిన వారితోనే తరగతులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

వృత్తిలో నైపుణ్యం, మెలకువలు వంటి పలు అంశాలపై కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. విశ్వ విద్యాలయంతో కలిసి తొలిసారిగా చేపట్టిన సర్టిఫికెట్ కోర్స్ ను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జర్నలిజం విద్యనభ్యసిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు సమర్థంగా వాటిని అధిగమించేలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. జర్నలిజంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామన్నారు.  జర్నలిస్టులుగా పని చేస్తున్న వారందరికీ  అక్రిడిటేషన్ కార్డులు అందేలా ఏపీ ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు. అక్రిడిటేషన్లు ఫిల్టర్ చేసే ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న వారికి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ బారినపడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అధిక ప్రయోజనం కల్పించడం, వారంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

             జర్నలిస్టులు విషయ పరిజ్ఞానం మరింతగా పెంచుకోడానికి ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతనంగా రూపొందించిన వెబ్ సైట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఈ వెబ్సైట్ జర్నలిస్టులకు సమాచార వనరులు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ప్రతిరోజు జర్నలిస్టులు వెబ్ సైట్ ను వినియోగించుకొని మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు తన్నీరు మోహన్ రాజు, జర్నలిస్టుల సంఘాల నాయకులు ఐ వి సుబ్బారావు, ఎస్ వి బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, దాసరి కనకయ్య, మీసాల శ్రీనివాసరావు, శ్రీనివాస్ నాయక్, ఇఫ్తేకర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-08-08 11:32:03

సోమవారం శ్రీకాకుళం వస్త్రాలు ధరించాలి..

ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లాలో ఉత్పత్తి అయిన వస్త్రాలు ధరించేందకు చర్యలు తీసుకుంటామని జిల్లా  శ్రీకేష్ లాఠకర్ కలెక్టర్ తెలిపారు. చేనేత సంఘాల ప్రతినిధులు కె.రవి, మావూరి గణపతి రావు, వట్టం శ్రీనివాసరావు, గుత్తి అప్పారావు , ఎం. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కొద్ది నైపుణ్యం, నైపుణ్యం లేని చేనేతకారులు ఎక్కువగా ఉన్నారన్నారు. సొసైటీ ఎన్నికలు జరగక పోవడం కూడా సంఘాలకు సహాయ సహకారాలు అందడంలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. చేనేత కార్మికులకు నూలు అందించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. చేనేత వస్త్రాలకు వినియోగదారులు వస్తున్నారని కానీ పవర్ లూమ్ లో తయారు వస్త్రాల వలన ధరలలో వ్యత్యాసాలు వలన నష్టం జరుగుతోందని వివరించారు. వస్త్రాలకు ప్రభుత్వ రిబెట్ లేకపోవడం, 3 సంవత్సరాలుగా త్రిఫ్ట్ ఫండ్ లేకపోవడం సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఎం.ఎల్.ఏ ధోతిలు శ్రీకాకుళంలో తయారు అవుతున్నాయని వివరించారు. వస్త్రాలకు సరైన ప్యాకింగ్ ఉండాలని, అప్కో వెంటనే చెల్లింపులు చేయాలని, ప్రతి సంఘానికి ఒక మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:33:16

హరిత శ్రీకాకుళం మనందరి బాధ్యత..

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత శ్రీకాకుళాన్ని తీర్చి దిద్దే బాధ్యత  అందరిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తపోథన్ దెహారి అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  మెగా ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి జి ఎం ఆదేశాల మేరకు జిల్లాలోని 66 శాఖలు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  ప్రతి బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో 50 మొక్కలు నాటుతున్నామని వివరించారు. రాష్ట్రము మొత్తం స్టేట్ బ్యాంకు అద్వర్యం లో మెగా ట్రీ ప్లేటేషన్ చేపట్టడం జరుగుతోందని ఆయన వివరించారు. ఎస్బిఐ ప్రతి ఏడాది మొక్కలు నాటడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. కరోనా విపత్కర వేళ ఆక్సిజన్ అందక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఆక్సిజన్  ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న వారికి ఎస్బిఐ ఇతోధికంగా ఋణాలు అందించేందుకు సిద్దంగా ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ ఆవశ్యకతను గుర్తించి ఎస్బిఐ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోందని చెప్పారు. త్వరలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని ఎస్బిఐ శాఖల్లో శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎస్బిఐ శాఖల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత విధానం చేపట్టనున్నట్లు తపొదన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హాజరైన  శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ   సహాయ సంచాలకులు లోచర్ల  రమేష్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్న స్టేట్ బ్యాంక్ ను అభినందించారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకువచ్చి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషదాయకం అన్నారు. జిల్లాలో 11 శాతం మాత్రమే అటవీ  ప్రాంతం కలిగి ఉండడం వల్ల జిల్లాలో కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయన్నారు. శ్రీకాకుళంని సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు, గ్రీన్ సిటీ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 అనంతరం టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ క్రీడా విభాగంలో  బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు బ్యాంకర్లు,వాకర్స్ సంయుక్తంగా విక్టరీ చూపిస్తూ జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.100 ఏళ్ల చరిత్రలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన హర్యానా బిడ్డ ,ఇండియన్ ఆర్మీ ఉద్యోగి నీరజ్ చోప్రాకు అభినందించారు.  ఈ కార్యక్రమంలో ఎస్బిఐ స్టాఫ్ యూనియన్, జోనల్ సెక్రటరీలు వెంకటరమణ, ఆఫిసర్స్ సెక్రటరీ వి.ఎస్.ఎన్ సాహు, జర్నలిస్టుల ఐక్యవేదిక ప్రతినిధులు శాసపు జోగి నాయుడు, కొంఖ్యాన వేణుగోపాల్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కె.వి.ఆర్.మూర్తి, పి.జి.గుప్తా, ఎం.మల్లిబాబు, ఆర్ట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అడపా మోహన్ రాజ్ , పలువురు బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:29:54

స్థానిక వస్త్రాలు బ్రాండింగ్ చేసి ఖ్యాతి గడిద్దాం..

శ్రీకాకుళంజిల్లాలో తయారు అవుతున్న వస్త్రాలకు బ్రాండింగ్ చేద్దామని,  తద్వారా ఖ్యాతి గడిద్దామని జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో ఉన్న చేనేత సహకార సంఘాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆది వారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన డిజైన్లు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపు నిచ్చారు. మార్కెటింగ్ పై అధిక దృష్టి సారించాలని, బ్రాండింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బ్రాండ్ కచ్చితంగా ఉండాలని తద్వారా వస్త్ర వ్యాపారం వికసిస్తుందని తెలిపారు. బ్రాండ్ ఉన్న వస్తువుల పట్ల ప్రజలు మొగ్గు చూపడం జరుగుతుందని గ్రహించాలని సూచించారు. బ్రాండ్ పై పేటెంట్ తీసుకుందామని చెప్పారు. మార్కెటింగ్ కు పక్కాగా బిజినెస్ ప్లాన్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక వెబ్ పోర్టల్ లో పెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని ఆయన అన్నారు. జిల్లాలోనే ముందుగా గిరాకీ ప్రారంభించాలని ఆయన సూచించారు. జిల్లాలో  రెడీ మేడ్ దుస్తుల తయారు  చేయటం జరగాలని ఆయన అన్నారు. చేనేటకారులు స్వయం సమృద్ది సాధించే దిశగా అడుగులు పడాలని ఆయన పేర్కొన్నారు. అందుకు గల ప్రతి అవకాశాన్ని సద్వనియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సూచించిన విధంగా చేనేతకారుల సంఖ్య కనీసం 50 శాతం పెరగాలని అందుకు అవసరమగు శిక్షణా కార్యక్రమాలు, ముడిసరుకు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ జి. రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎస్ కె అబ్దుల్ రశీద్, చేనేత సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:29:03

నేతకారుల జీవితాలలో వెలుగులు రావాలి..

చేనేతకారుల జీవితాలలో వెలుగులు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హోటల్ గ్రాండ్ లో మూడు రోజుల చేనేత ప్రదర్శనను నాబార్డు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కారుల నెలసరి ఆదాయం పెరగాలని అన్నారు. జిల్లాలో చేనేత కారులు, చేనేత పరిశ్రమ వివరాలు పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్రాండింగ్, మార్కెటింగుకు  చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ రంగంలో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు సంభందించి ఎక్కువ ప్రదర్శనలు జరగాలని తద్వారా ఎక్కువ అవకాశాలు రావడానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేత కారులు స్వయం సమృద్ది సాధించాలని ఆయన అన్నారు. అందుకు అందరూ సమష్టిగా పనిచేద్దామని కోరారు. 
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రంగంలో చేనేత పెద్ద రంగంగా ఉందన్నారు. చేనేత కుటీర పరిశ్రమగా అదనపు ప్రక్రియగా ఎక్కువగా చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగానికి 1982  నుండి నాబార్డు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. చేనేత ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. చేనేత రంగానికి అవసరమైన నైపుణ్యం అభివృద్ధికి సంఘాలు చాలా చేస్తున్నాయని ఆయన తెలియజేస్తూ బ్రాండింగ్ కు సహాయం చేస్తామని పేర్కొన్నారు. వెబ్ సైట్ తయారు చేస్తామని దానిని ఒక విక్రయ సదుపాయంగా వినియోగించు కావాలని సూచించారు. చేనేత రంగానికి లాభదాయకతకు నాబార్డు ప్రయత్నం చేస్తోందని, పొందూరుకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో వినియోగం ఉందని, జాతీయ అంత్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనాలని ఆయన సూచించారు.

అప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా అవసరమగు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ చౌసాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అందరికీ తెలియాలని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఉండేదని ఈ ఏడాది నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకు సిజిఎం నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో పొందూరులో 11 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జన్మ దినోత్సవంలో భాగంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ,  నాబార్డు డిజిఎం ప్రసాద్, డిసిసిబి ముఖ్య కార్యనర్వహణాధికారి డి. సత్యనారాయణ, రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు, ఆర్ట్స్, బెజ్జిపురం యూత్ క్లబ్, సిఎవిఎస్ స్వచ్చంధ సంస్థల డైరెక్టర్ లు నూక సన్యాసి రావు, ఎం.ప్రసాద రావు, పడాల భూదేవి., సురంగి మోహన రావు,  గీతా శ్రీకాంత్, దుప్పల వెంకట రావు, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన చెనేతకారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:27:58

అల్లూరి.. అన్యధా భావించకండి..

అవును.. కేంద్రమంత్రి అయితే మాత్రం ఏమున్నది గర్వకారణం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్పా.. భరత భూమిలో తెలుగుజాతీ జీవితాంతం గుర్తుంచుకునే వీరుడికోసం ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి ఒక్కప్రకటన కూడా చేయని పర్యటన.. సభ్యసమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లో తెలియని దుస్థితి.. అల్లూరి అన్యధా భావించకండి.. నాటి నుంచి నేటి వరకూ మీ విషయంలో ఇదే నిర్లక్ష్యం మరోసారి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ విషయంలోనూ రుజువైంది. బహుసా మీ విగ్రహం పార్లమెంటులో పెట్టమని అడుతారనో.. లేదంటే మీకు భారత రత్న అడుగుతారనో.. అదీకాదనుకుంటే కేంద్రం తరపునైనా ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయమంటారని, నాటి మీవీరోచిత చరిత్ర బాహ్య ప్రపంచానికి వాస్తవాలతో తెలియజమని ఇబ్బంది పెడతారనో తెలీదు కానీ.. అందరిలానే మిమ్మల్ని చూడటానికి వచ్చిన మంత్రి వర్యులు దండేసి దండంపెట్టి ఇంతకంటే ఏం చేయగలమని మౌనంగానే వెళ్లిపోయారు. 75ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో తప్పుని తప్పుగా ఎవరూ వేలెత్తి చూపకూడదు. అలా చూపించడమూ భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీ తప్పు.. నేతల ప్రసంగాలకు మీ వీరోచిత చరిత్రకావాలి.. వారి గెలుపునకు మీరు త్యధించిన త్యాగం కావాలి.. వారి ప్రసంగాలకు మీరే ఒక వేదిక కావాలి కానీ.. మీకోసం మాత్రం ఏ ఒక్క నేత ముందుకి వచ్చి.. ఇదిగో భరతమాత ముద్దుబిడ్డకోసం, స్వాతంత్ర్య సమరయోధుడి కోసం మా ప్రభుత్వం లో ఈ పనిచేశామని చెప్పే దైర్యమున్న నేతలు లేకపోయారంటే పరిస్థితి ఎలా వుందో మీరే అర్ధం చేసుకోండి. ప్రపంచ దేశాలకు అల్లూరి వీరోచిత పోరాటం ఒక ఆదర్శం, ఆయన చరిత్ర ఒక సందేశం, కానీ భారతదేశంలో మాత్రం అది చదువుకోవడానికే మిగిలి వున్నట్టుగానే మారిపోయింది. మీరు పుట్టి.. మాకోసం ఈ పుణ్యభూమిలో ప్రాణాలను వదిలిన మీ త్యాగాన్ని పట్టించుకోని మమ్మల్ని.. ఎప్పటి లాగానే మీరు మీ సమాధి నుంచే చూస్తూ ఉండిపోండి.. మీపేరుతో చట్టసభల్లో ప్రసంగాలు ఇచ్చేసమయంలో మీ కోసం తలచుకున్నపుడు నా భారతీయులు నన్ను తలచుకుంటున్నారని కాస్త మాత్రమే సంబరపడండి.. అంతకు మించి ఏమీ ఊహించుకోకండి.. అసలేమీ ఉండదని మంచి మనసుతో అర్ధం చేసుకోండి. మన్యంలో మహోదయం స్రుష్టించిన మన్యవీరా, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజా మా చేతకాని తనాన్ని చూసి అన్యదా భావించవద్దు..బాధపడవద్దు.. జోహార్ అల్లూరి, జోహార్..!

Krishnadevipeta

2021-08-08 09:55:22

లక్ష్యానికి మించి కోవిడ్ వేక్సినేషన్..

దేశంలో జూలై నాటికి లక్ష్యానికి మించి కోవిడ్ వాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఉదయం  చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం లో జరుగుచున్న వాక్సినేషన్ పక్రియను ఆమె పరిశీలించారు.  జిల్లా కలక్టరు ఎ.మల్లిఖార్టున జిల్లాలో వాక్సినేషన్ ప్రకియ, వివరాలను మంత్రికి  తెలియజేసారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగిందని, వారిలో 1కోటి 74లక్షల మందికి మొదటిడోసు మిగిలినవారికి రెండు డోసులు వేయడమైనదని, జిల్లాలో 22 లక్షల మందికి వాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటి డోసు, 5 లక్షల మందికి రెండు డోసులు వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు.  ఈ సంధర్బంగా కేంద్ర ఆర్దికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమం  ప్రణాళిక ప్రకారం జరుగుతుందన్నారు. దీనివలన క్రమపద్దతి ఏర్పడుతుందని, ప్రజలలో నమ్మకం కలుగుతుందన్నారు.తద్వారా ఆర్థికాభివృద్దికి తోడ్పడుతుందన్నారు . వాక్సినేషన్ కు అయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నదని తెలిపారు. రానున్న రెండు నెలలలో వాక్సిన్ల సరఫరా పెరుగుతుందని, దానికొరకు దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు,  విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.  మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీసులకు, పారామిలటరీ, సైన్యానికి అందించామని, తరువాత 65 సంవత్సరములు, దీర్ఝకాల వ్యాదిగ్రస్తులకు, తదుపరి 45 సంవత్సరాలు దాటిన వారికి అందజేసారని ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి శతశాతంతోపాటు 18 సంవత్సరాలు నిండిన గర్బిణీలకు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఉపాద్యాయలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వాక్సిన్ అందిస్తామన్నారు.  వాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేయుటంద్వారా  పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, రాజ్యసభసభ్యులు జి.వి.ఎల్. నరశింగరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ అధికారులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-08-08 07:26:50

హోం మంత్రికి మేకతోటిని కలిసిన కలెక్టర్..

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలిశారు. కలెక్టర్ తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ  మార్గాని భరత్ రామ్ ,జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  సబ్ కలెక్టర్ ఇలాక్కియా, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రుడా) చైర్మన్ ఎం.షర్మిలా రెడ్డి తదితరులు ఉన్నారు.

Rajahmundry

2021-08-08 07:21:05

అప్పన్నకు కేజి చందనం సమర్ఫణ..

విశాఖలోని శివాజీ పాలెంకు చెందిన కె. ఉమామహేశ్వరరావు కుటుంబం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారికి  కేజీ చందనం సమర్పించింది. ఈమేరకు ఆదివారం తనపేరుతో అరకేజీ చందనం (రూ.10,116)  తన కుమార్తె కె. వైజయంతి పేరుమీద అరకేజీ చందనం (రూ.10,116)  సమర్పించారు. వారికి స్వామివారి ప్రసాదంగా రెండు చందనపు చెక్కలను ఏఈఏ రాఘవకుమార్  అందించారు. అనంతరం దాతలకు దేవలాయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా లేదా డైరెక్టుగా వచ్చి స్వామివారికి  అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించవచ్చని ఏఈఓ తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా సమర్పించే భక్తులకు, పోస్టల్ లో ప్రసాదం పంపిస్తున్నామన్నారు. ఈ అవవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-08-08 04:24:14

త్వరతగతిన నిర్మాణాలు జరగాలి..

జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు, దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు స్త్రీ నిధి, డీఆర్డీఏ, మెప్మా ద్వారా  అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించి వారు త్వరగా గృహాలు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డీఆర్డీఏ, మెప్మా, స్త్రీ నిధి ద్వారా ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులకు కొంత మేర ఆర్ధిక సహాయాన్ని అందించగల్గితే వారు తమ ఇళ్ళను వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులు ఎంత మంది స్వయం సహాయక సభ్యులుగా ఉన్నారో ముందుగా గుర్తించాలన్నారు. ఒక వేళ స్వయంసహాయక సభ్యులు కానీ పక్షంలో వారిని గ్రూపులో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, ఎల్డీఎం రాంబాబు, ఎస్టీ కార్పోరేషన్ ఈడీ దుర్గాబాయి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-07 15:49:53

పేదల కష్టాలను సీఎం మనసుతో చూస్తున్నారు..

పేద‌ల క‌ష్టాల‌ను క‌ళ్ల‌తోనే కాకుండా మ‌న‌సుతో చూసి బ‌ల‌హీన వ‌ర్గాల అభున్న‌తికి కృషిచేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే నేత‌న్న‌ల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ అన్నారు. శ‌నివారం ఉద‌యం కాకినాడ‌లోని గాంధీన‌గ‌ర్ మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. తొలుత మ‌హాత్ముని చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించిన అనంత‌రం మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. చేనేత వారోత్స‌వాల (ఆగ‌స్టు 7-14)తో పాటు ఆప్కో చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న (ఆగ‌స్టు 7-18)ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ముర‌మండ, పులుగుర్త‌, ప‌స‌ల‌పూడి, గొల్ల‌ప్రోలు, పెద్దాపురం త‌దిత‌ర చేనేత స‌హ‌కార సంఘాలు ప్ర‌ద‌ర్శించిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించి, వాటి విశిష్ట‌త వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ విశిష్ట క‌ళా నైపుణ్యం, మాన‌వ‌జాతి సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప‌జేసే చేనేత రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తోంద‌ని, వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తోందంటే నేత‌న్న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధిని అర్థంచేసుకోవ‌చ్చన్నారు. యాంత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఉపాధి దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో నేత‌న్న‌ల సుస్థిర జీవ‌నోపాధికి ఈ ప‌థ‌కం ఓ దివిటీలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి నిజ‌మైన నేత‌న్న నేస్త‌మ‌ని, జిల్లా చేనేత రంగ కార్మికులు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలవాలని.. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ నేతృత్వంలో కీల‌క ప్రాజెక్టుల‌తో చేనేత రంగ అభివృద్ధి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలోనూ నేత‌న్న‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఉప్పాడ‌, మోరి, అంగ‌ర త‌దిత‌ర ప్రాంతాల చేనేత క‌ళ‌కు ఎంతో గుర్తింపు ల‌భించింద‌న్నారు. మ‌నం ఎద‌గాలంటే ప్ర‌పంచాన్ని ఎర‌గాల‌ని.. ప్ర‌పంచాన్ని ఎర‌గాలంటే విద్య కావాల‌ని.. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యారంగ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, మ‌న‌బ‌డి నాడు-నేడు వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు మంత్రి వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. 

చేనేత రంగ అభివృద్ధికి కృషి: క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌:
భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  స్వ‌దేశీ ఉద్య‌మం 1905, ఆగ‌స్టు 7న ప్రారంభ‌మైన చారిత్ర‌క ఘ‌ట్టానికి గుర్తుగా ఏటా ఆగ‌స్టు 7న మ‌నం జాతీయ చేనేత దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా పథకాలు  అమ‌లుచేస్తోంద‌ని.. వైఎస్సార్ నేత‌న్న నేస్తం ద్వారా జిల్లాలో 2019-20లో 6,964 మందికి రూ.16,71,36,000; 2020-21లో 7,817 మందికి రూ.18,76,08,000 మేర ల‌బ్ధిచేకూరిన‌ట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలకే వెళ్తోంద‌న్నారు. అదే విధంగా ఈ నెల 10వ తేదీన మూడో విడ‌త‌గా ప‌థ‌కం ద్వారా 6,919 మందికి రూ.16,60,56,000 మేర ల‌బ్ధి చేకూర‌నున్న‌ట్లు వివ‌రించారు. బ‌య‌ట అధిక వ‌డ్డీల భారం నుంచి త‌ప్పించేందుకు వీలుగా పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కాన్ని కూడా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. వైఎస్సార్ నేతన్న‌నేస్తం ప‌థ‌కం చేనేత కుటుంబాల అభివృద్ధికి, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల‌ను ప్రోత్స‌హించేందుకు, స‌హ‌కార సంఘాల‌కు మార్కెటింగ్ ప్ర‌యోజ‌నాల‌ను అందుబాటులో ఉంచేందుకు, ఈ రంగం ఆవ‌శ్య‌క‌త‌, విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌త్యేక వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రామ‌చంద్రాపురం, రాయ‌వ‌రం మండ‌లాల‌కు చెందిన వీర‌సూర్యం, వీర‌భ‌ద్ర‌రావు నేత‌న్న‌ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ త‌దిత‌రులు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ రెండో డిప్యూటీ మేయ‌ర్ చోడిప‌ల్లి వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, స్థానిక కార్పొరేట‌ర్ గోడి స‌త్య‌వ‌తి; జిల్లా చేనేత‌, జౌళి శాఖ స‌హాయ సంచాల‌కులు ఎన్‌.ఎస్‌.కృపావ‌రం, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-07 15:43:31