1 ENS Live Breaking News

నేతకారుల జీవితాలలో వెలుగులు రావాలి..

చేనేతకారుల జీవితాలలో వెలుగులు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హోటల్ గ్రాండ్ లో మూడు రోజుల చేనేత ప్రదర్శనను నాబార్డు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కారుల నెలసరి ఆదాయం పెరగాలని అన్నారు. జిల్లాలో చేనేత కారులు, చేనేత పరిశ్రమ వివరాలు పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్రాండింగ్, మార్కెటింగుకు  చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ రంగంలో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు సంభందించి ఎక్కువ ప్రదర్శనలు జరగాలని తద్వారా ఎక్కువ అవకాశాలు రావడానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేత కారులు స్వయం సమృద్ది సాధించాలని ఆయన అన్నారు. అందుకు అందరూ సమష్టిగా పనిచేద్దామని కోరారు. 
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జన్నావర్ మాట్లాడుతూ వ్యవసాయేతర రంగంలో చేనేత పెద్ద రంగంగా ఉందన్నారు. చేనేత కుటీర పరిశ్రమగా అదనపు ప్రక్రియగా ఎక్కువగా చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగానికి 1982  నుండి నాబార్డు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. చేనేత ఒక స్థాయికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. చేనేత రంగానికి అవసరమైన నైపుణ్యం అభివృద్ధికి సంఘాలు చాలా చేస్తున్నాయని ఆయన తెలియజేస్తూ బ్రాండింగ్ కు సహాయం చేస్తామని పేర్కొన్నారు. వెబ్ సైట్ తయారు చేస్తామని దానిని ఒక విక్రయ సదుపాయంగా వినియోగించు కావాలని సూచించారు. చేనేత రంగానికి లాభదాయకతకు నాబార్డు ప్రయత్నం చేస్తోందని, పొందూరుకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో వినియోగం ఉందని, జాతీయ అంత్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనాలని ఆయన సూచించారు.

అప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా అవసరమగు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ చౌసాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అందరికీ తెలియాలని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఉండేదని ఈ ఏడాది నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకు సిజిఎం నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో పొందూరులో 11 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జన్మ దినోత్సవంలో భాగంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి బి. శాంతి శ్రీ,  నాబార్డు డిజిఎం ప్రసాద్, డిసిసిబి ముఖ్య కార్యనర్వహణాధికారి డి. సత్యనారాయణ, రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు, ఆర్ట్స్, బెజ్జిపురం యూత్ క్లబ్, సిఎవిఎస్ స్వచ్చంధ సంస్థల డైరెక్టర్ లు నూక సన్యాసి రావు, ఎం.ప్రసాద రావు, పడాల భూదేవి., సురంగి మోహన రావు,  గీతా శ్రీకాంత్, దుప్పల వెంకట రావు, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన చెనేతకారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-08 10:27:58

అల్లూరి.. అన్యధా భావించకండి..

అవును.. కేంద్రమంత్రి అయితే మాత్రం ఏమున్నది గర్వకారణం.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్పా.. భరత భూమిలో తెలుగుజాతీ జీవితాంతం గుర్తుంచుకునే వీరుడికోసం ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి ఒక్కప్రకటన కూడా చేయని పర్యటన.. సభ్యసమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లో తెలియని దుస్థితి.. అల్లూరి అన్యధా భావించకండి.. నాటి నుంచి నేటి వరకూ మీ విషయంలో ఇదే నిర్లక్ష్యం మరోసారి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ విషయంలోనూ రుజువైంది. బహుసా మీ విగ్రహం పార్లమెంటులో పెట్టమని అడుతారనో.. లేదంటే మీకు భారత రత్న అడుగుతారనో.. అదీకాదనుకుంటే కేంద్రం తరపునైనా ఈ ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయమంటారని, నాటి మీవీరోచిత చరిత్ర బాహ్య ప్రపంచానికి వాస్తవాలతో తెలియజమని ఇబ్బంది పెడతారనో తెలీదు కానీ.. అందరిలానే మిమ్మల్ని చూడటానికి వచ్చిన మంత్రి వర్యులు దండేసి దండంపెట్టి ఇంతకంటే ఏం చేయగలమని మౌనంగానే వెళ్లిపోయారు. 75ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో తప్పుని తప్పుగా ఎవరూ వేలెత్తి చూపకూడదు. అలా చూపించడమూ భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీ తప్పు.. నేతల ప్రసంగాలకు మీ వీరోచిత చరిత్రకావాలి.. వారి గెలుపునకు మీరు త్యధించిన త్యాగం కావాలి.. వారి ప్రసంగాలకు మీరే ఒక వేదిక కావాలి కానీ.. మీకోసం మాత్రం ఏ ఒక్క నేత ముందుకి వచ్చి.. ఇదిగో భరతమాత ముద్దుబిడ్డకోసం, స్వాతంత్ర్య సమరయోధుడి కోసం మా ప్రభుత్వం లో ఈ పనిచేశామని చెప్పే దైర్యమున్న నేతలు లేకపోయారంటే పరిస్థితి ఎలా వుందో మీరే అర్ధం చేసుకోండి. ప్రపంచ దేశాలకు అల్లూరి వీరోచిత పోరాటం ఒక ఆదర్శం, ఆయన చరిత్ర ఒక సందేశం, కానీ భారతదేశంలో మాత్రం అది చదువుకోవడానికే మిగిలి వున్నట్టుగానే మారిపోయింది. మీరు పుట్టి.. మాకోసం ఈ పుణ్యభూమిలో ప్రాణాలను వదిలిన మీ త్యాగాన్ని పట్టించుకోని మమ్మల్ని.. ఎప్పటి లాగానే మీరు మీ సమాధి నుంచే చూస్తూ ఉండిపోండి.. మీపేరుతో చట్టసభల్లో ప్రసంగాలు ఇచ్చేసమయంలో మీ కోసం తలచుకున్నపుడు నా భారతీయులు నన్ను తలచుకుంటున్నారని కాస్త మాత్రమే సంబరపడండి.. అంతకు మించి ఏమీ ఊహించుకోకండి.. అసలేమీ ఉండదని మంచి మనసుతో అర్ధం చేసుకోండి. మన్యంలో మహోదయం స్రుష్టించిన మన్యవీరా, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజా మా చేతకాని తనాన్ని చూసి అన్యదా భావించవద్దు..బాధపడవద్దు.. జోహార్ అల్లూరి, జోహార్..!

Krishnadevipeta

2021-08-08 09:55:22

లక్ష్యానికి మించి కోవిడ్ వేక్సినేషన్..

దేశంలో జూలై నాటికి లక్ష్యానికి మించి కోవిడ్ వాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఉదయం  చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం లో జరుగుచున్న వాక్సినేషన్ పక్రియను ఆమె పరిశీలించారు.  జిల్లా కలక్టరు ఎ.మల్లిఖార్టున జిల్లాలో వాక్సినేషన్ ప్రకియ, వివరాలను మంత్రికి  తెలియజేసారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగిందని, వారిలో 1కోటి 74లక్షల మందికి మొదటిడోసు మిగిలినవారికి రెండు డోసులు వేయడమైనదని, జిల్లాలో 22 లక్షల మందికి వాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటి డోసు, 5 లక్షల మందికి రెండు డోసులు వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు.  ఈ సంధర్బంగా కేంద్ర ఆర్దికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమం  ప్రణాళిక ప్రకారం జరుగుతుందన్నారు. దీనివలన క్రమపద్దతి ఏర్పడుతుందని, ప్రజలలో నమ్మకం కలుగుతుందన్నారు.తద్వారా ఆర్థికాభివృద్దికి తోడ్పడుతుందన్నారు . వాక్సినేషన్ కు అయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నదని తెలిపారు. రానున్న రెండు నెలలలో వాక్సిన్ల సరఫరా పెరుగుతుందని, దానికొరకు దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు,  విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.  మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీసులకు, పారామిలటరీ, సైన్యానికి అందించామని, తరువాత 65 సంవత్సరములు, దీర్ఝకాల వ్యాదిగ్రస్తులకు, తదుపరి 45 సంవత్సరాలు దాటిన వారికి అందజేసారని ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి శతశాతంతోపాటు 18 సంవత్సరాలు నిండిన గర్బిణీలకు, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఉపాద్యాయలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వాక్సిన్ అందిస్తామన్నారు.  వాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేయుటంద్వారా  పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, రాజ్యసభసభ్యులు జి.వి.ఎల్. నరశింగరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ అధికారులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-08-08 07:26:50

హోం మంత్రికి మేకతోటిని కలిసిన కలెక్టర్..

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలిశారు. కలెక్టర్ తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ  మార్గాని భరత్ రామ్ ,జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,రాజమహేంద్రవరం కమిషనర్ అభిషిక్త్ కిషోర్,  సబ్ కలెక్టర్ ఇలాక్కియా, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రుడా) చైర్మన్ ఎం.షర్మిలా రెడ్డి తదితరులు ఉన్నారు.

Rajahmundry

2021-08-08 07:21:05

అప్పన్నకు కేజి చందనం సమర్ఫణ..

విశాఖలోని శివాజీ పాలెంకు చెందిన కె. ఉమామహేశ్వరరావు కుటుంబం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామివారికి  కేజీ చందనం సమర్పించింది. ఈమేరకు ఆదివారం తనపేరుతో అరకేజీ చందనం (రూ.10,116)  తన కుమార్తె కె. వైజయంతి పేరుమీద అరకేజీ చందనం (రూ.10,116)  సమర్పించారు. వారికి స్వామివారి ప్రసాదంగా రెండు చందనపు చెక్కలను ఏఈఏ రాఘవకుమార్  అందించారు. అనంతరం దాతలకు దేవలాయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా లేదా డైరెక్టుగా వచ్చి స్వామివారికి  అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించవచ్చని ఏఈఓ తెలియజేశారు. ఆన్ లైన్ ద్వారా సమర్పించే భక్తులకు, పోస్టల్ లో ప్రసాదం పంపిస్తున్నామన్నారు. ఈ అవవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-08-08 04:24:14

త్వరతగతిన నిర్మాణాలు జరగాలి..

జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు, దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు స్త్రీ నిధి, డీఆర్డీఏ, మెప్మా ద్వారా  అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించి వారు త్వరగా గృహాలు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జగనన్న కాలనీల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డీఆర్డీఏ, మెప్మా, స్త్రీ నిధి ద్వారా ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులకు కొంత మేర ఆర్ధిక సహాయాన్ని అందించగల్గితే వారు తమ ఇళ్ళను వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, ఒంటరి మహిళ, వితంతువులు మరియు దివ్యాంగులు ఎంత మంది స్వయం సహాయక సభ్యులుగా ఉన్నారో ముందుగా గుర్తించాలన్నారు. ఒక వేళ స్వయంసహాయక సభ్యులు కానీ పక్షంలో వారిని గ్రూపులో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, ఎల్డీఎం రాంబాబు, ఎస్టీ కార్పోరేషన్ ఈడీ దుర్గాబాయి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-07 15:49:53

పేదల కష్టాలను సీఎం మనసుతో చూస్తున్నారు..

పేద‌ల క‌ష్టాల‌ను క‌ళ్ల‌తోనే కాకుండా మ‌న‌సుతో చూసి బ‌ల‌హీన వ‌ర్గాల అభున్న‌తికి కృషిచేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే నేత‌న్న‌ల సంక్షేమం కోసం ప్ర‌త్యేకంగా వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నార‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ అన్నారు. శ‌నివారం ఉద‌యం కాకినాడ‌లోని గాంధీన‌గ‌ర్ మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. తొలుత మ‌హాత్ముని చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించిన అనంత‌రం మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. చేనేత వారోత్స‌వాల (ఆగ‌స్టు 7-14)తో పాటు ఆప్కో చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న (ఆగ‌స్టు 7-18)ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ముర‌మండ, పులుగుర్త‌, ప‌స‌ల‌పూడి, గొల్ల‌ప్రోలు, పెద్దాపురం త‌దిత‌ర చేనేత స‌హ‌కార సంఘాలు ప్ర‌ద‌ర్శించిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించి, వాటి విశిష్ట‌త వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ విశిష్ట క‌ళా నైపుణ్యం, మాన‌వ‌జాతి సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప‌జేసే చేనేత రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తోంద‌ని, వైఎస్సార్ నేత‌న్న నేస్తం ప‌థకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తోందంటే నేత‌న్న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న చిత్త‌శుద్ధిని అర్థంచేసుకోవ‌చ్చన్నారు. యాంత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఉపాధి దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో నేత‌న్న‌ల సుస్థిర జీవ‌నోపాధికి ఈ ప‌థ‌కం ఓ దివిటీలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి నిజ‌మైన నేత‌న్న నేస్త‌మ‌ని, జిల్లా చేనేత రంగ కార్మికులు దేశానికే ఆద‌ర్శ‌వంతంగా నిలవాలని.. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ నేతృత్వంలో కీల‌క ప్రాజెక్టుల‌తో చేనేత రంగ అభివృద్ధి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలోనూ నేత‌న్న‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఉప్పాడ‌, మోరి, అంగ‌ర త‌దిత‌ర ప్రాంతాల చేనేత క‌ళ‌కు ఎంతో గుర్తింపు ల‌భించింద‌న్నారు. మ‌నం ఎద‌గాలంటే ప్ర‌పంచాన్ని ఎర‌గాల‌ని.. ప్ర‌పంచాన్ని ఎర‌గాలంటే విద్య కావాల‌ని.. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యారంగ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, మ‌న‌బ‌డి నాడు-నేడు వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌న్నారు. పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు మంత్రి వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. 

చేనేత రంగ అభివృద్ధికి కృషి: క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌:
భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా  స్వ‌దేశీ ఉద్య‌మం 1905, ఆగ‌స్టు 7న ప్రారంభ‌మైన చారిత్ర‌క ఘ‌ట్టానికి గుర్తుగా ఏటా ఆగ‌స్టు 7న మ‌నం జాతీయ చేనేత దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా పథకాలు  అమ‌లుచేస్తోంద‌ని.. వైఎస్సార్ నేత‌న్న నేస్తం ద్వారా జిల్లాలో 2019-20లో 6,964 మందికి రూ.16,71,36,000; 2020-21లో 7,817 మందికి రూ.18,76,08,000 మేర ల‌బ్ధిచేకూరిన‌ట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలకే వెళ్తోంద‌న్నారు. అదే విధంగా ఈ నెల 10వ తేదీన మూడో విడ‌త‌గా ప‌థ‌కం ద్వారా 6,919 మందికి రూ.16,60,56,000 మేర ల‌బ్ధి చేకూర‌నున్న‌ట్లు వివ‌రించారు. బ‌య‌ట అధిక వ‌డ్డీల భారం నుంచి త‌ప్పించేందుకు వీలుగా పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కాన్ని కూడా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. వైఎస్సార్ నేతన్న‌నేస్తం ప‌థ‌కం చేనేత కుటుంబాల అభివృద్ధికి, జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల‌ను ప్రోత్స‌హించేందుకు, స‌హ‌కార సంఘాల‌కు మార్కెటింగ్ ప్ర‌యోజ‌నాల‌ను అందుబాటులో ఉంచేందుకు, ఈ రంగం ఆవ‌శ్య‌క‌త‌, విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌త్యేక వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రామ‌చంద్రాపురం, రాయ‌వ‌రం మండ‌లాల‌కు చెందిన వీర‌సూర్యం, వీర‌భ‌ద్ర‌రావు నేత‌న్న‌ల‌ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ త‌దిత‌రులు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ రెండో డిప్యూటీ మేయ‌ర్ చోడిప‌ల్లి వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, స్థానిక కార్పొరేట‌ర్ గోడి స‌త్య‌వ‌తి; జిల్లా చేనేత‌, జౌళి శాఖ స‌హాయ సంచాల‌కులు ఎన్‌.ఎస్‌.కృపావ‌రం, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-07 15:43:31

పారిశుధ్య సిబ్బందికి డ్రైరేషన్ కిట్లు..

కోవిడ్ క‌ష్ట‌కాలంలో కాకినాడ జీజీహెచ్‌లో సేవ‌లందిస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌, పారిశుద్ధ్య సిబ్బందికి అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఏర్పాటు చేసిన నిత్యావ‌స‌ర స‌రుకుల (డ్రై రేష‌న్‌) కిట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పంపిణీ చేశారు.. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స‌భ్యులు వైకుంఠేశ్వ‌ర దాస స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. ప‌ది మంది జీజీహెచ్ సిబ్బందికి స‌రుకుల‌ కిట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో జీజీహెచ్ పారిశుద్ధ్య‌, భ‌ద్ర‌త త‌దిత‌ర విభాగాల‌కు చెందిన సిబ్బందికి బియ్యం, గోధుమ‌పిండి, కందిప‌ప్పు, వంట‌నూనె, శ‌న‌గ‌లు, పంచ‌దార వంటి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కిట్ల‌ను అందిస్తున్న అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు త‌మ‌వంతు స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం 500 మంది జీజీహెచ్ సిబ్బందికి ఈ వ‌స్తువుల కిట్ల‌ను అంద‌జేసిన‌ట్లు అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స‌భ్యులు వైకుంఠేశ్వ‌ర దాస తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించిన దాతలకు అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ప్రెసిడెంట్ డా. నిష్క్రించిన భక్తదాస ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల‌కు మూడువేల డ్రై రేష‌న్ కిట్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఫౌండేష‌న్ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు స‌హ‌క‌రించాల‌నుకునే దాత‌లు 8096211108 నంబ‌రులో సంప్ర‌దించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి; ఆర్ఎంవోలు డా. ఇ.గిరిధ‌ర్‌, డా. అనిత‌; అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ కాకినాడ మేనేజ‌ర్ టి.మ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-07 15:41:55

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి..

75వ స్వాతంత్య్ర దినోత్సవ   వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను కోరారు. శనివారం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 15వ తేదీన స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహించేందుకు చేపట్ట వలసిన ఏర్పాట్లపై సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకోనున్న 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తోందని, జిల్లా స్థాయి ఉత్సవాలలో కూడా  ఈ మహోత్సవ్ సందర్భంగా జారీ చేసిన లోగోను అన్ని శాఖల స్టాళ్లు, శకటాలు, ఫలకాల పై విస్తృతంగా ప్రదర్శించాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం డిజిగ్నేట్ చేసిన మంత్రివర్యులు ముఖ్య అతిధిగా ఈ వేడుకలు జరుగుతాయని,  వేడులను కోవిడ్-19 పరమైన అన్ని ప్రామాణిక జాగ్రత్తలతో నిర్వహించాలని ఆదేశించారు. స్వాతంత్య్య దినోత్సవ వేడుకల కొరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను సిద్దం చేసి, పతాక వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ పాస్ట్ కవాతు, బాండ్  తదితర సాంప్రదాయ అంశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన  పోలీస్ శాఖను కోరారు.  అలాగే వేడుకలు జరిగే వేదిక ప్రాంగణంలోను, బయట  ట్రాఫిక్ నియంత్రించి అవరోధాలు లేకుండా చూడాలని సూచించారు. ముఖ్య అతిధి ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగ సందేశాన్ని జిల్లాలో అమలౌతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో సిద్దం చేయాలని సమాచారశాఖ డిప్యూటీ డైరక్టర్ ను ఆదేశించారు.    వేడుకల సమయంలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సమాచారశాఖ డిఈఈని  ఆదేశించారు. వేడుకలకు హాజరైయ్యే స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులకు  ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్య మర్యాదలు పాటించాలని, కోవిడ్ దృష్ట్యా సురక్షితమైన ప్యాక్డ్ ఫుడ్ ను మాత్రమే అందించాలని కాకినాడ ఆర్డిఓ కు సూచించారు.  వర్షాకాలం దృష్ట్యా రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  వేడుకల ప్రాంగణంలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని సిద్దంగా ఉంచాలని జిల్లా అగ్నిమాపక అధికారిని, ఫస్ట్ ఎయిడ్ పోస్ట్, ఆంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని  ఆదేశించారు.   వేడులక ప్రాంగణంలో పారిశుభ్రత, ప్రజలకు త్రాగునీటి సరఫరా అంశాల ఏర్పాట్లను కాకినాడ మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.  వివిధ అభివృద్ది, సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లు వాటి పథకాల సమాచారంతో ఆకర్షనీయమైన శకటాలను ప్రదర్శించాలని, అలాగే ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  స్వాతంత్య్రదినోత్సవ  వేడుకల సందర్భంగా పాఠశాలు, కళాశాలల విద్యార్థులతో దేశ భక్తి పూరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని డిఈఓ, ఉన్నత విద్య అధికారులను ఆదేశించారు.  వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని వేడుకలలో  సత్కరించేందుకు ఆయా శాఖాధిపతులు ఈ నెల 10వ తేదీ లోపున ప్రతిపాదనలు అందజేయాలని కోరారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన బ్యాంకర్లు, సచివాలయాల  ఫంక్షనరీలని కూడా ప్రశంసా పురస్కారల కొరకు ప్రతిపాదించాలన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో 75వ స్వాతంత్య్రదినోత్సవ  వేడుకలను దేశ భక్తి, జాతీయతా భావనలు వెల్లివిరిసేలా శోభాయమానంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులందరినీ కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి, ఎపిఎస్పి 3వ బెటాలియన్ కమాండెంట్ సుమీత్ గరుడ్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఎన్.సి.సి. గ్రూప్ కమాండెంట్ కల్నల్ ఏకె రుషి, కాకినాడ ఆర్డిఓ ఎజి చిన్నికృష్ణ, సమాచార శాఖ డిడి బి.పూర్ణచంద్రరావు, డిఈఓ ఎస్.అబ్రహాం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-07 15:37:34

శ్రీకూర్మంను సందర్శించిన కేంద్ర మంత్రి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని  సందర్శించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ శనివారం సాయంత్రం సందర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి తో పాటు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ , పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు మాధవ్,  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పి అమిత్ బర్థార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాంషు కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Srikurmam

2021-08-07 15:34:05

వ్యర్ధాలను వెంటవెంటనే తొలగించండి..

విశాఖ మహానగరంలో రోడ్లు, కాలువలు శుభ్రం చేసిన వ్యర్ధాలను వెంటవెంటనే డంపింగ్ యార్డు కు తరలించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె నాలుగవ జోన్ 36 వ వార్డు రంగిరీజు వీధి, జాలారి పేట, ఎవిఎన్ కాలేజి తదితర ప్రాంతాలలో పర్యటించారు. జాలరిపేట నుండి ఎవిఎన్ కాలేజి రోడ్డులో స్వీపింగ్ సరిగా చేయలేదని, కాలువలు శుభ్రపరచి వ్యర్ధాలను పోగులుగా ఉండడం గమనించి శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పోగులను వెంటవెంటనే తొలగించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ, మలేరియా పై సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతుందా అని ఆరాతీయగా, ప్రతీ రోజూ పారిశుధ్య సిబ్బంది చెత్త తీసుకుంటున్నారని, మలేరియా విభాగం వారు వారంలో 2 రోజులు మలేరియాపై అవగాహన కల్పిస్తున్నారని స్థానికులు కమిషనర్ కు వివరించారు. వార్డులో మలేరియా, డెంగ్యూ కేసులు ఎన్ని ఉన్నాయని, కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను, మలేరియా సిబ్బందిని ఆదేశించారు. ఇపిడిసిఎల్ వారు విధ్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లు కొమ్మలను తొలగించి వ్యర్ధాలను అక్కడే వదిలేస్తున్నారని, వ్యర్ధాలను వెంటనే తొలగించనందుకు ఇపిడిసిఎల్ వారి నుండి అపరాధ రుసుం వసూలు చేసి, వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పుడే తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త గురుంచి వారికి అవగాహన కల్పించి, చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని తెలియజేయాలన్నారు.  బీచ్ రోడ్డులో వాకర్స్ చేతిలొని పెంపుడు కుక్కలను రోడ్లపై మలమూత్రం చేయంచడం గమనించి వారిని మందలించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వీరయ్య, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-07 15:32:23

20% కిట్లు మాత్రమే రావాల్సివుంది..

శ్రీకాకుళం జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు జిల్లాకు 20 శాతం మాతమే రావాల్సి ఉన్నదని ఎస్ఎస్ఎ పిఓ డా. తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పిల్లలను బడిలో చేర్చే సమయంలో పేద కుటుంబాలు పడుతున్న కష్టాలు నుండి విముక్తి కలిగించడంతో పాటు పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లను గణనీయంగా తగ్గిస్తూ బాలల బంగారు భవిష్యత్ కు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు వివరించారు.   జగనన్న విద్యా కానుక పథకం ప్రతి విద్యార్థికి అందజేయబడిన కిట్లులో 8 వస్తువులు అందించబడుతున్నవని, మూడు జతల ఏక రూప దస్తులు (యూనిఫారంలు) ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, ఒక సెట్ పాఠ్యపుస్తకములు, నోట్ పుస్తకములు, ఒక పాఠశాల బ్యాగ్ మరియు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు కూడా అందజేయబడినవని ఆయన పేర్కొన్నారు.  ఈ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా లో 1 నుండి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2 లక్షల 71 వేల 559 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతున్నదని, వారిలో ఒక లక్ష 34 వేల 533 మంది బాలురు, ఒక లక్ష 37 వేల 026 మంది బాలికలకు లబ్ది చేకూరుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.  ఇంకా రావలసిన వస్తువులు ఈ నెల 12వ తేదీ నాటికి వస్తాయని ఆ ప్రకటనలో తెలియజేశారు.

Srikakulam

2021-08-07 15:27:41

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు..

విశాఖ జిల్లాలో ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాలకు చెందిన అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్లు మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ ఎ. మ‌ల్లిఖార్జున సంబంధింత అధికారుల‌ను ఆదేశించారు.  జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ స‌మావేశం శ‌నివారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఆయ‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. దీనిలో భాగంగా ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో. నెం.142లో పేర్కొన్న నిబంధ‌న‌లు, అర్హత‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ముందుగా ఆన్‌లైన్ ప్ర‌క్రియ ద్వారా స్వీక‌రించిన ద‌ర‌ఖాస్తులు, ప‌రిశీల‌న ప్ర‌క్రియ గురించి స‌మాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాల‌కులు వి. మ‌ణిరామ్‌ క‌మిటీకి వివ‌రించారు. కొంత‌మంది అర్హ‌త క‌లిగిన‌ప్ప‌టికీ సంబంధిత ప‌త్రాలు ఆన్‌లైన్లో స‌మ‌ర్పించ‌లేద‌ని క‌మిటీకి తెలిపారు. దీనిపై స్పందించిన క‌లెక్ట‌ర్‌, క‌మిటీ ఛైర్మ‌న్ వారంద‌రికీ త‌గిన స‌మ‌యం ఇచ్చి సంబంధిత ధృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించుకోమ‌ని చెప్పాల‌ని స‌మాచార శాఖ అధికారుల‌కు సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్‌, క‌మిటీ ఛైర్మ‌న్ ఎ. మ‌ల్లిఖార్జున మాట్లాడుతూ తొలి రెండు జాబితాల్లో క‌లిపి మొత్తం 474 మంది అక్రిడిటేష‌న్ల‌కు అర్హ‌త సాధించార‌ని పేర్కొన్నారు. రెండు ద‌ఫాల్లో కలిపి ప‌త్రికా రంగానికి సంబంధించి 291 మందికి, ఎల‌క్ట్రానిక్ మీడియాకు సంబంధించి 183 మందికి అక్రిడిటేష‌న్ల మంజూరు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. మిగిలిన వారు నిర్ణీత గ‌డువులోకా సంబంధిత ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. త‌దుపరి స‌మావేశం ఆగ‌స్టు 20వ తేదీన నిర్వ‌హించ‌నున్నామ‌ని ఈ లోగా అర్హ‌త ఉండి కూడా సరైన ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించని వారు నిర్ణీత గ‌డువులోగా సంబంధిత ప‌త్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. వారి ద‌ర‌ఖాస్తులు ప‌రిశీలించి త‌దుపరి స‌మావేశంలోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని స‌మాచార శాఖ ఉప సంచాల‌కుల‌కు సూచించారు. స‌మావేశంలో అక్రిడిటేష‌న్ క‌మిటీ మెంబ‌ర్ క‌న్వీన‌ర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాల‌కులు వి. మ‌ణిరామ్‌, స‌భ్యులైన డీఎం&హెచ్‌వో పి.ఎస్. సూర్య‌నారాయ‌ణ‌, హౌసింగ్ పీడీ శ్రీ‌నివాస‌రావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజన‌ల్ మేనేజ‌ర్ బి. అప్ప‌ల‌నాయుడు, అసిస్టెంట్ లేబ‌ర్ కమిష‌న‌ర్ సునీత‌, ఏసీటీవో పి. శ్వేత, స‌మాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇంజినీర్ ఇంద్రావ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-07 15:26:07

సీఎంను అభినందించిన ఎంపీడీవోలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని జిల్లా ఎంపీడీవోల సంఘం అభినందించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో దీర్ఘకాలికంగా ప్రమోషన్లపై ఉన్న పరిస్థితిని తొలగిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా, ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని, సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందేలా కృషిచేస్తామని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. 
గ్రూప్-1 ద్వారా నియమితులైన ఎంపీడీవోలు, గడిచిన 25 సంవత్సరాల నుంచి ఒక్క పదోన్నతికి నోచుకోకుండా పడుతున్న మనోవేదనను అర్థం చేసుకుని, పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను వన్ టైం సెటిల్మెంట్ (One Time Measure) విధానం ద్వారా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి,  పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లకు జిల్లా ఎంపిడీవోల సంఘం ధన్యవాదాలను తెలియజేసింది.

ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ద్వారా పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి, ఎంపిడీవో మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన వేలాది మంది పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు మెరుగుపడటం పట్ల ఎంపిడీవోలు, పంచాయితీ రాజ్ ఉద్యోగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేసారు. దీని ద్వారా జిల్లా పరిషత్ సిఈఓ, డిప్యూటీ సిఈఓ, డివిజనల్ అభివృధ్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్ట్ లు రెగ్యులర్ బేసిస్ లో భర్తీ కానున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి,  పంచాయతీ రాజ్ మంత్రి, జిల్లా మంత్రులకు ప్రత్యేక  ఎంపీడీఓల సంఘం తెలియ జేసింది. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు యం.రోజారాణి, రాష్ట్ర సంఘం సభ్యులు హేమసుందర్, కిరణ్ కుమార్, విద్యాసాగర్ , వెంకటరమణ మరియు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Srikakulam

2021-08-07 15:21:31

పొందూరు ఖ్యాతి మరింత పెంచాలి..

పొందూరు ఖ్యాతి మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పొందూరులో చేనేత దినోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర  ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను సీతారామన్ పరిశీలించారు. 50 నేత విధానాన్ని పరిశీలించారు. ఖాదీ వడికే విధానం, చరఖాలను ఏర్పాటు చేశారు.  ఖాదీ భవనం శిథలావస్థలో ఉండటం వలన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటి మొక్కల ప్రశస్తిని తెలిపారు. మహాత్మ గాంధి పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని అన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఖాదికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖాదీ బాగుపడాలనీ పిఎం చాలా పథకాలు ప్రకటించారను ఆమె అన్నారు. పిఎం జాతీయ చేనేత దినోత్సవంను జరుపుకునే ఏర్పాట్లు చేశారనీ అన్నారు. 2014 సంవత్సరంలో రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18 వేల కోట్లకు పెరిగిందని ఆమె వివారించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేదని ఆమె పేర్కొంటూ మెగా హండ్లుమ్ క్లస్టర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో మంగళగిరిలో ఒక క్లస్టర్ వచ్చిందని, పొందూరులో సంఖ్య తక్కువగా ఉండటంతో  క్లస్టర్ ఏర్పడలేదని గ్రహించామని చెప్పారు. పొందూరు లో క్లస్టర్ ఏర్పాటుకు టెక్స్ టైల్ మంత్రి తో మాట్లదాడుతామని మంత్రి తెలిపారు. ముద్ర లోన్ ల ద్వారా అనే రంగాలకు రుణాలు ఇవ్వవచ్చనీ, ప్రతి బ్యాంకు బ్రాంచ్ ద్వారా స్టాండ్ అప్ లోన్ ఇవ్వాలని ఆమె వివరించారు. 5 మంది  చేనేత కారులు పొందూరు లో ఉన్నారనీ వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా ప్రోత్సహించాలని ఆదేశించారు. పొందూరు మరియు చుట్టు ప్రక్కల అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారని వారికి నాబార్డు బ్యాంకు, లీడ్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.  మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. బ్యాంకుల ద్వారా ఎంత మంది కార్మికలకు రుణాలు ఇచ్చారో బ్యాంకులు మరోసారి ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పెట్టాలని కోరారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తేదీ నాటికి 50 శాతం రుణాలు పెంచాలనీ బ్యాంకులను ఆదేశించారు. జేమ్ - ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు అమ్మకాలకు మంచి ప్లాట్ ఫారం అని దానిలో పొందూరు ఖాదీ నీ చేర్చాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు. పొందూరు పేరెన్నిక గల ప్రదేశం అని, అందరికి మనసులో పొందూరు ఉందని అన్నారు. పొందూరు గ్రామంలో గడపడం ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసారు. ప్రదర్శనలను పరిశీలించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ  పొందూరు ఖద్దరు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్య్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. సూర్యోదయం నుండి శ్రమించే శ్రామికులు ఉన్నారని ఆయన పేర్కొంటూ చేనేత, ఖాదీనీ ప్రోత్సహించాలని కోరారు.  రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నూలు పోగుతో సాంస్కృతిక బంధం ఉందన్నారు. గాంధీజీ తన కుమారుడిని పొందూరు పంపించి నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రతిభా పాటిల్ కూడా ఇక్కడి వస్త్రాలను ధరించేవారు. బిల్ క్లింటన్ సైతం ఖాదీ వస్త్రాలు చూసి మురిసి పోయారని చెప్పారు. నేతన్నకు ఆదాయం లేక, తగిన వసతి లేక నిరాశ నిస్పృహలకు లోను అవుతున్నారని చెప్పారు. ఖాదీనీ నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి చెదలు పట్టినట్లే అని ఆయన వివరించారు. ఖాదీ ఫర్ నేషన్ , ఖాదీ ఫర్ ఫేషన్ గా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. నేతన్నలకు ఆర్థిక సహాయంను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఖాదీ అభివృద్ధి సంస్థకు వై.యస్. ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందించామని తెలిపారు. 

ఖాదీ అభివృద్ధికి సహకరించాలని, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సామర్థ్యం పెంపు చేయాలని, ఆధునాతన పరికరాలు అందజేయాలని కోరారు. పొందూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పొందూరు ఖాదీ ఒక సాంప్రదాయం, సంస్కృతి అన్నారు. జియోగ్రాఫికల్ ఐడెన్ ఐడెంటిటి కల్పించాలన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమం ఆధారంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాదీ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఆర్థిక సహాయక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయం విధానం ద్వారా పారదర్శకంగా సామాజిక ఆడిట్ సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మార్పు రాగలదని భావిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పార్లమెంట్ సభ్యులు జి.వి.ఎల్. నరసింహా రావు,  బెల్లం చంద్రశేఖర రావు, శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశ్ కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఆర్. శ్రీరాములు నాయుడు, వివిధ బ్యాంకుల సిఎండిలు తదితరులు పాల్గొన్నారు.


Srikakulam

2021-08-07 14:35:25